కుల్కచర్ల: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని విశ్వహిందూ పరిషత్ మాజీ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ నేత ఘణపురం వెంకటయ్య పేర్కొన్నారు. వెంటనే అతినిపై చర్యలు తీసుకొని అరెస్టు చేయాలన్నారు. మంగళవారం కుల్కచర్ల మండలం ఘణపూర్ గ్రామంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాస్టర్ల మాటలకు ప్రభావితమై శ్రీరాముడిపై అనుచిత వాఖ్యలు చేయడం సరికాదని, వెకిలిగా మాట్లాడటం సబబుకాదన్నారు. ఇలాంటి ఇబ్బందికర వాఖ్యలను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. హిందూ మతంపై వాఖ్యలు చేయడం పట్ల 100కోట్ల మందిని అవమానపరచడమేనన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన అద్దంకి దయాకర్పై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థా ప్రముఖ్ రాజేశ్వర్, చీరుపు శ్రీనివాస్, వార్ల ఆంజనేయులు, రాములు, ఆంజనేయులు, లక్ష్మయ్య, హన్మంతు, వార్ల భీమయ్య, మహేశ్ కుమార్, వెంకటేశ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విశ్వహిందూ పరిషత్ మాజీ
జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య