దేవరాపల్లి: తారువలో తనపై ఎదురు తిరిగిన ఎవరినీ వదిలి పెట్టేదిలేదని.. ఖబడ్దార్ అంటూ రెచ్చకొట్టేలా బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ప్రసంగించారు. దేవరాపల్లిలో నియోజకవర్గ స్థాయి ప్రచార సభను ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఊరూరా తిప్పి గుడ్డలిప్పి కొడతానన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతుండగా జనం బయటకు వెళ్లి పోవడం ప్రారంభించారు. సీఎం రమేష్ ప్రసంగిస్తుండగా సభాప్రాంగణం సగానికిపైగా ఖాళీ అయిపోయింది.