సంపత్‌ వినాయగర్‌ హుండీ ఆదాయం రూ.18.28 లక్షలు - | Sakshi
Sakshi News home page

సంపత్‌ వినాయగర్‌ హుండీ ఆదాయం రూ.18.28 లక్షలు

Published Sun, Jun 16 2024 1:16 AM

-

సీతమ్మధార(విశాఖ): ఆశీలమెట్టలోని సంపత్‌ వినాయగర్‌ హుండీల ఆదాయం లెక్కింపు ప్రక్రియ శనివారం దేవదా య శాఖ సహాయ కమిషనర్‌, ఈవో కె.శిరీషా ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం 28 రోజులకు గానూ రూ.18,28,509 వచ్చినట్లు ఈవో తెలిపారు. అలాగే 228 గ్రాముల వెండి, 27 యూఎస్‌ఏ డాలర్లు, 20 సింగపూర్‌ డాలర్లు, 20 థాయ్‌ బాట్‌లు, 6 మలేషియా రింగిట్‌లు వచ్చినట్లు వెల్లడించారు. దేవదాయ శాఖ తనిఖీదారులు జి.వి.రమాబాయి, ఆలయ ఫౌండర్‌ ఫ్యామిలీ మెంబర్‌ టి.చోళన్‌ పర్యవేక్షణలో శివజ్యోతి, వేంకటేశ్వర సేవా సంఘం సభ్యులు లెక్కించారు. ఆలయ సిబ్బంది జి.గోవిందరెడ్డి, డి.ఎస్‌.ప్రసాద్‌, యూనియన్‌ బ్యాంక్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement