![స్టేట్ క్వాలిటీ అండ్ కంట్రోల్ అధికారుల తనిఖీ](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/16/15cvm42-320015_mr-1718479766-0.jpg.webp?itok=nh0go7jU)
రోలుగుంట: మండలంలోని నాయుడుపాలెం పాఠశాలను శనివారం స్టేట్ క్వాలిటీ అండ్ కంట్రోల్ అధికారులు తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని స్టేట్ అబ్జర్వర్ ఇస్మాయిల్ తెలిపారు. అనంతరం రోలుగుంట హైస్కూల్లో పాఠశాలలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న పాఠ్య పుస్తకాలు, స్టూడెంట్ కిట్లను తనిఖీ చేసిన ఇస్మాయిల్, సీఎంవో శకుంతల సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల ప్రారంభం రోజునే పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్న ఎంఈవోలు జాన్ ప్రసాద్, జగ్గారావును అభినందించారు.