నేడు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష - | Sakshi
Sakshi News home page

నేడు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష

Published Sun, Jun 16 2024 1:18 AM

-

మహారాణిపేట (విశాఖ): జిల్లాలో యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష జరగనుంది. మొత్తం 9,635 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఆయా కేంద్రాల్లో వసతులు కల్పించి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 మంది రూట్‌ ఆఫీసర్లు, 26 మంది లైజన్‌ ఆఫీసర్లు, 26 సూపర్‌వైజర్లను నియమించారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని డీఆర్వో మోహన్‌ కుమార్‌ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement