గుంతకల్లు: ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడిన టీడీపీ గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరాంను అనర్హుడిగా ప్రకటించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయ్కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం గుంతకల్లులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ ఏప్రిల్ 29న గుత్తి మండలం బాచూపల్లి జరిగిన ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించారన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.వెంకటరామిరెడ్డి, ఆయన బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డితో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ‘మేము తలచుకుంటే ఏమైనా చేస్తాం..మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు’ అంటూ బెదిరించారని గుర్తు చేశారు. వీరి ఆగడాలతో గుంతకల్లు నియోజకవర్గ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. సీఎం,ఎమ్మెల్యేలనే భయపడిస్తున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయగా, వారిపై కేసు నమోదు చేసిన అనంతరం తీసుకున్న చర్యల గురించి తక్షణమే తెలియజేయాలని కలెక్టర్ను కమిషన్ ఆదేశించినట్లు తెలిపారు. క్రిమినల్ మనస్తత్వం ఉన్న గుమ్మనూరు జయరాంకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దశరథ్రెడ్డి, నూర్నిజామి, ఫ్లయింగ్మబు, ఖలీల్, వలీ తదితరులు పాల్గొన్నారు.
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Published Tue, May 7 2024 4:20 AM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- ఛాయాచిత్రం
- రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం
- ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
- బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
- 'పాలిటెక్నిక్' లో నవోదయం
- శ్రీటీఎంటీ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్గా బుమ్రా
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
- కొత్త రికార్డు స్థాయిని తాకి, వెనక్కి..
Advertisement