
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం(నేడు) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గురు, శుక్రవారాల్లో ఆయన ఢిల్లీలోనే ఉంటారు. గురువారం ఉదయం 10:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు.
అక్కడ 1 జన్పథ్ నివాసంలో రాత్రికి బస చేస్తారు. శుక్రవారం ఉదయం విజ్ఞాన్ భవన్లో వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించింది.