టీడీపీ విష ప్రచారం | Posting the same message with multiple names on social media | Sakshi
Sakshi News home page

టీడీపీ విష ప్రచారం

Sep 21 2024 3:37 AM | Updated on Sep 21 2024 8:27 AM

Posting the same message with multiple names on social media

సోషల్‌ మీడియాలో పలువురి పేర్లతో ఒకే మెసేజ్‌ పోస్ట్‌  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీని రాజ­కీయంగా దెబ్బ తీయాలనే దురుద్దేశంతో తిరుమల శ్రీవారి పవిత్రతను మంటగ­లు­పుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తుల మనోభావాలతో చెలగాట­మాడుతూ.. పనిగట్టుకుని టీడీపీ విష ప్రచారం చేస్తోందని సోషల్‌ మీడియా సాక్షిగా బట్టబయలైంది. ‘సుమారు రెండు మూడేళ్ల నుంచి తిరుపతి లడ్డూ తిన్న ప్రతిసారి అమ్మ అనారోగ్యం పాలవుతోంది. 

ఎక్కువగా తిరుపతి లడ్డూ తినొద్దని మాకు చెబుతోంది. ప్రతి చోటా పరిశుభ్రంగా లేదంటూ వందల సార్లు ఆమె ఫిర్యాదులు చేస్తుండటంతో ఆమెకు మతి స్థిమితం బాగోలేదని మేం అనుకున్నాం. ఇప్పుడు లడ్డూపై వచ్చిన వివాదాన్ని బట్టి చూస్తే.. తిరుపతి లడ్డూ విషయంలో మా అమ్మ చెప్పింది నిజమే అన్పిస్తోంది’ అనే అర్థం వచ్చేలా ఇంగ్లిష్‌లో ఒకే రకమైన పోస్టును దేశవ్యాప్తంగా వందల మంది ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement