పార్టీ విజయానికి సైనికుల్లా పనిచేయాలి | Sakshi
Sakshi News home page

పార్టీ విజయానికి సైనికుల్లా పనిచేయాలి

Published Tue, Apr 23 2024 8:35 AM

వైఎస్సార్‌ సీపీలో చేరిన వారితో రాజ్యసభ సభ్యుడు 
మోపిదేవి వెంకట రమణారావు  - Sakshi

రేపల్లె రూరల్‌ : వైఎస్సార్‌ సీపీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. రేపల్లె మండలం మోళ్లగుంట గ్రామానికి చెందిన 50 టీడీపీ కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు సోమవారం వైఎస్సార్‌ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. రేపల్లె పట్టణంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీలో నాయకులకు, కార్యకర్తలకు సముచితస్థానం కల్పించడం జరుగుతుందన్నారు. పార్టీలో చేరిన వారిలో కొక్కిలిగడ్డ విష్ణు, మోపిదేవి చందు, కొక్కిలిగడ్డ జనార్ధన్‌, శివనాగరాజు, కర్రి సాంబశివరావు, కర్రి ప్రసాద్‌, కర్రి రాంబాబు, శేరు శ్రీనివాసరావు, పీతా లక్ష్మణరావులతో పాటు మరికొన్ని కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు పీతా వెంకటేశ్వరరావు, నాయకులు కొక్కిలిగడ్డ నాంచారయ్య, చెన్ను లక్ష్మణరావు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీలో 50 టీడీపీ కుటుంబాల చేరిక పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు

Advertisement
Advertisement