దుర్గమ్మ సేవలో చాగంటి కోటేశ్వరరావు | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సేవలో చాగంటి కోటేశ్వరరావు

Published Sun, May 26 2024 7:00 AM

-

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన వారికి ఆలయ ఈఓ కె.ఎస్‌.రామరావు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఈఓ రామరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో పాటు శ్రీకనకదుర్గ వైభవం పుస్తకాన్ని అందజేశారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారితో పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని చాగంటి కోటేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement