న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా తమ ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్లను తమిళనాడులోని ఫాక్స్కాన్ ప్లాంటులో ప్రారంభించింది. భారత్లో తయారవుతున్న ఐఫోన్ మోడల్స్లో ఇది అయిదోది. ‘2020లో ఐఫోన్ 11, 2019లో ఐఫోన్ 7.. ఎక్స్ఆర్, 2018లో ఐఫోన్ 6ఎస్, 2017లో ఐఫోన్ ఎస్ఈ. దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ వ్యవస్థను నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తీరుకు ఇదే నిదర్శనం‘ అంటూ కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ .. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్లో ఫాక్సా్కన్ గత కొన్ని నెలలుగా ఐఫోన్ 11ని అసెంబుల్ చేస్తోందని, గత నెల నుంచి ఇవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ ఎక్స్ఆర్ ఫోన్లను కూడా ఫాక్స్కాన్ తయారు చేస్తుండగా, విస్ట్రాన్ సంస్థ ఐఫోన్ 7 స్మార్ట్ఫోన్లను తయారు చేస్తోందని వివరించాయి.
Breadcrumb
Related News by category
-
నూటికి తొంభై మార్కులు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారం! నా పేరు డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ. నేను పుట్టి పెరిగింది హిందూపురంలో. గత ఇరవై ఏళ్ళుగా అమెరికాలో, గత పదేళ్ళుగా టెక్సాస్లోని డాలస్ నగరంలో ఉంటున్నాం. వృత్తి రీత్యా అమెరికా ప్రభుత్వ వైద్యునిగా పని చేస్తున్నాను. నేను పుట్టి బుద్ధెరిగాక పట్టుకున్న మొదటి జెండా అన్నగారి ‘తెలుగుదేశం’ జెండానే! మా నాన్న హిందూపురంలో తెలుగుదేశం పార్టీ కోసం షామియానా వేసి, మైకుసెట్టు పెట్టి చేసిన ప్రచారం ఇంకా గుర్తుంది. అలాగే నేటికీ నలభై ఏళ్ళుగా గుండెల నిండా నింపుకున్న అభిమానంతో మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిని కూడా! గత జనవరిలో నేను అనంతపురం వచ్చాను. అంతకు ముందు నేను పనిచేసిన పాతూరు ప్రభుత్వాసుపత్రిని సి.డి. ఆసుపత్రి అనేవారు. నేను పనిచేసినప్పుడు కానీ,గత రెండేళ్ళ వరకూ కానీ అది ఒక పాడుపడిన వందేళ్ళ నాటి పెంకుటిల్లులాంటి భవనంలో ఉండేది. రెండేళ్ళ క్రితం కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందించిన ఒక నూతన భవనంలో నడుస్తోంది. ఐదారు మంది డాక్టర్లు, పాతికమంది వరకూ ఇతర ఉద్యోగులతో మంచి వైద్యకేంద్రంగా రూపొందింది. ఆ ఆసుపత్రిని ఇలా చూడడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. మరో ముఖ్యమైన అంశం ప్రభుత్వ విద్య. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినవాళ్ళం... ఏదో కొంత మంది మాత్రమే ఉన్న కొద్ది వనరులను ఉపయోగించుకొని జీవితంలో ఓ స్థాయికి చేరాము. అలా సార్వజనీనమైన అవకాశాలను అందిపుచ్చుకొని అందరూ అదే రకమైన విజయాన్ని అందుకోలేక పోయారు. అలాంటిది, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు జరుగుతున్న విద్యాబోధన, తెలుగుతో పాటు ఆంగ్లమాధ్యమంలో చదివించడం, చిన్న తనం నుంచే డిజిటల్ మీడియాతో వాళ్ళకు విద్యను బోధించడం చాలాచోట్ల చూసి ఆశ్చర్యపోయాను. అలాగే నీటైన యూనిఫాం, బ్యాగులు, పుస్తకాలు, కాళ్లకు షూస్తో సహా వాళ్లకు అందించి పిల్లలలో ఆ వయస్సు నుంచే ఒక ఆత్మ విశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంచి వారి వ్యక్తిత్వానికి మంచి పునాదులు పడేలా చేసింది. అభివృద్ధి అనేదానికి – పెద్ద నగరాల్లో ఓ పెద్ద ఐకియా స్టోర్, ఎంజాయ్ చేయడానికి పబ్బులు, పెద్ద పెద్ద బిల్డింగులు, విశాలమైన రోడ్లు – ఇవి మాత్రమే సూచికలు కాకూడదు. అభివృద్ధికి ఒక సూచిక ఏమిటంటే దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజలు ఎంతవరకూ బాగుపడ్డారు? అది గత ఐదేళ్ళలో చూసుకుంటే సగటు ఆటోరిక్షా నడిపే కార్మికుడు, అరటికాయలు అమ్మి పొట్టపోసుకునే కార్మికురాలు, రోడ్డుసైడు మెకానిక్కు, ఒక సన్నకారు రైతు – వీళ్ళకు కనీస భరోసా లభిస్తోంది. ‘మా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది, మాకు రోగమొస్తే ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రాల్లో కనీస వైద్యం అందుతుంది, నాకు క్యాన్సర్ వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం దొరుకుతుంది’ అన్న భరోసా గత ఐదేళ్ళలో దొరికింది. మొన్ననే ధర్మవరంలో జిలేబీలు అమ్ముకునే కార్మికురాలి కూతురుకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడింది. దీనిపై నేనొక చిన్న ట్వీట్ పెడితే, సీఎంవోలో డా.హరికృష్ణారెడ్డి గారు స్పందించి రూ.20 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు నాకు తెలిసే ఉన్నాయి.2019 మేలో జగన్మోహన్రెడ్డి ఎన్నికలలో ఘన విజయం సాధించినప్పుడు నేను సామాజిక మాధ్యమాల్లో ‘మీ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యాలుగా ‘‘విద్య’ – ‘వైద్యా’లను ఎన్నుకొని, వాటి రూపురేఖల్ని సమూలంగా మారుస్తూ ప్రజలకు అందుబాటులోనికి తేవాలని’ కోరాను. ఈనాడు ప్రభుత్వం ఆ ముఖ్యమైన రెండు విషయాల్లోనూ చాలా సమర్థంగా పనిచేసిందని ప్రత్యక్షంగా గమనించాను. ‘పల్లెటూళ్ళే పట్టుగొమ్మలని’ మహాత్మాగాంధీ గారన్నారు. పల్లెల్లో అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న దరిద్రనారాయణుడికి చేసే సేవే నిజమైన సేవ అని ఆయన భావించారు. అలా ప్రస్తుత ప్రభుత్వంలో సామాన్యుడికి కనీస అవసరాలైనా తీరుతున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేదేమిటంటే – నేనేదైతే ప్రభుత్వ ప్రాధమ్యాలుగా ఉండాలని, ప్రజలకు మెరుగ్గా సేవ చేయాలని భావించానో అవి నెరవేరాయి. నాకు తెలిసిన కొద్దిమందికి కూడా ఎంతో కొంత మేలు జరిగింది కాబట్టే ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఏతావతా, చెప్పొచ్చేదేమిటంటే – అటూ ఇటూ జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నా, విద్య–వైద్య పరంగా స్థూలంగా నేను ఈ ప్రభుత్వానికి వందకు 80–90 మార్కులు వేయ గలుగుతాను.ధన్యవాదాలు, జైహింద్.డా‘‘ ఇస్మాయిల్ పెనుకొండ వ్యాసకర్త అమెరికాలో వైద్యుడు -
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతున్నారు. కోట్లాది కార్మికులకు పనిలేదు. ఉద్యోగాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. బీజేపీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. మతం మనిషికి తిండి పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాంటి పార్టీతో చంద్రబాబు అంటకాగు తున్నారు. దేశంలో తమ పేరు మీద సాగుభూమి లేనివారు ఎందరో! ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణా ళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే!18వ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు విడతలుగా జరుగుతున్నాయి. తిరిగి మళ్లీ మూడోసారి అధికారంలోనికి రావడానికి మోదీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఉత్తరప్రదేశ్ మీద అయితే వాళ్లు ఎక్కువ ఆధారపడి ఉన్నారో అక్కడ సామాజిక రాజకీయ చైతన్యం పెల్లుబికింది. ముఖ్యంగా ముస్లింలలో ఎంతో మార్పు రావడం వల్లే రాయబరేలీలో రాహుల్ గాంధీ నిలబడటానికి పూనుకున్నారు. మతోన్మాద దాడులు, మహిళా సాధికారతను పునాదులతో తొలిచే భావజాలం, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీ విధానాలు లౌకికవాదులను, ఓబీసీలను, దళితులను, స్త్రీలను ఆలో చింపజేస్తున్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు ద్వారా జమ్మూ కశ్మీర్ శాసనసభను రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టిన ఉదంతాన్ని ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గించి, జీఎస్టీ ద్వారా కేంద్రీకృత ఆర్థిక పెత్తనాన్ని పెంచి, రాష్ట్రాల ఉనికిని నామమాత్రం చేయా లని చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కలిగిన భాష, సంస్కృతి, విద్య, విద్యుత్, మానవ వనరులపై కూడా కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చేయాలనే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్యవంతంగా ఆలోచిస్తు న్నాయి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన పత్రికల మీద చేస్తున్న దాడి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా జరగలేదని జర్నలిస్టు మేధావులు వాపోతున్నారు.ఏప్రిల్ చివరి వారంలో వచ్చిన ‘గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్’ ప్రకారం, భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతు న్నారు. అత్యధిక స్త్రీలు రక్తలేమితో ఇబ్బంది పడుతున్నారు. కోట్లాది మంది కార్మికులకు పనిలేదు. భారతదేశం మొత్తం వలసలతో అన్నా ర్తులై పొట్ట చేత పట్టుకుని నగర శివారుల్లోని మురికివాడలలో జీవిస్తు న్నారు. నిజానికి పంజాబ్ రైతులు చేసిన రైతు ఉద్యమ ప్రభావం భారతదేశం మొత్తం మీద ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా హోరా హోరీ రైతు ఉద్యమాన్ని నడిపింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టా లను రద్దు చేయాలనే డిమాండ్పై రాజీలేని పోరాటం చేసింది.ముఖ్యంగా అడవుల నరికివేత వల్ల, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల దేశంలో తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుటెండల్లో ప్రజలు ఆహారం కోసం పని చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. మతం మనిషికి అన్నం పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా గ్రామాలలో మంచి నీళ్ళు దొరకడం లేదు. మద్యాన్ని అందించటంలో సఫలమైన ప్రభు త్వాలు, మంచినీళ్లు అందించడంలో విఫలమయ్యాయి.ఇకపోతే దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేస్తోంది. ఉద్యో గాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. కాగా ఎన్నికల నేపథ్యంలో నిరు ద్యోగం ప్రధాన అంశంగా చర్చకొస్తోంది. ప్రతిపక్ష నేతలు నిరుద్యోగ సమస్యపై నిలదీస్తుండగా అధికార బీజేపీ నేతలు సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలు, బీజేపీ మేనిఫెస్టో యువతకు భరోసా కల్పించలేదు. పైగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇకపోతే ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణాళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో కోట్లాది మందికి సాగుభూమి సెంటు కూడా లేదు. ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ఇంటి స్థలం లేదు. మంచినీళ్ల వసతి లేదు. చనిపోతే పాతిపెట్టడానికి శ్మశానం లేదు. దేశంలోని సుమారు 7 లక్షల గ్రామాల్లో అంటరానితనం కొనసాగు తూనే వుంది. భారతదేశంలో దళితులు ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం లేక పేదరికంలో, అస్పృశ్యతలో, అవిద్యలో మగ్గిపోతున్నారు. బీటెక్లు, ఎంటెక్లు, బీఏలు, ఎంఏలు చదివినా నిరుద్యోగు లుగా, ఉపాధి హామీ కూలీలుగా జీవిస్తున్నారు. ఈ రోజున దళిత వాడల్లో విద్యార్థులు, స్త్రీలు నిరాశా నిస్పృహలలో జీవిస్తున్నారు. వారి కుటుంబానికి తలా రెండెకరాల భూమి ఇవ్వటం ద్వారా ఆర్థిక సాధికారతను కల్గిస్తాం అని ఏ ప్రభుత్వమూ చెప్పటం లేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు అంబేడ్కర్ ఆలోచనకు భిన్నంగా ఉన్నాయి.భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే. ఇప్పుడు ఎన్నికల్లో ప్రకటించిన ఏ మేనిఫెస్టోలో కూడా భూమి పంపకం గురించి రాయక పోవటం, అస్పృశ్యతా నివా రణ ఒక ఎన్నికల ఎజెండాగా లేకపోవటం, కుల నిర్మూలన కార్యక్రమం ఎవరి లక్ష్యంగా లేకపోవటాన్ని దళిత మేధావులు, ఆలోచనాపరులు అర్థం చేసుకుంటున్నారు. రాజ్యాధికారమే వీటన్ని టికీ పరిష్కారం అని ఆలోచిస్తున్నారు. నిజానికి ప్రసిద్ధమైన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీల్లో, వైద్య విశ్వవిద్యాలయాల్లో, అన్ని కళా శాలల్లో దళిత విద్యార్థులు ఎంతో వివక్షకు గురి అవుతున్నారు.మోదీ ఇంత తిరోగమన చర్యలతో ముందుకు వెళ్తుంటే, నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమిలో చేరటం ఆయనకున్న దళిత వ్యతిరేకతనూ, హిందూ మతోన్మాద భావజాలాన్నీ, కులాధి పత్య వైఖరినీ, మైనారిటీల పట్ల ద్వేషాన్నీ తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకూ, మోదీకీ మధ్య భావజాలంలో, దళితులు, స్త్రీల పట్ల వ్యతిరేకతలో ఏ విధమైన తేడాలేదు అని అర్థం అవుతోంది. ముఖ్యంగా మోదీ యూనివర్సిటీల్లో జీవపరిణామ, మానవ పరిణామ చారిత్రక సిద్ధాంతాల బోధనకు భిన్నంగా మతవాద భావజాలాన్ని ప్రోత్సహించటం లౌకిక భావజాల వ్యాప్తికి గొడ్డలి పెట్టు అవుతుంది.ఇకపోతే అంబేడ్కర్ భావజాల ప్రచారంలో తమిళనాడు ముందుంది. తమిళనాడులోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభంలో అంబేడ్కర్ జీవిత పోరాటం గురించి ఐదు నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అక్కడి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదేశించారు. అంబేడ్కర్ ఆ రాజ్యాంగం ద్వారానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులు ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారని గ్రహించాలి.అంబేడ్కర్ రాజ్యాంగం భారతదేశ పునర్ నిర్మాణానికి ఆయువు పోసింది. ఏ దేశంలో స్త్రీ వ్యక్తిత్వంతో జీవిస్తుందో, ఏ దేశంలోకుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుందో, ఏ దేశంలో స్త్రీ ఉత్పత్తి శక్తి దేశ సౌభాగ్యానికి ఊపిరి పోస్తుందో ఆ దేశం ఆర్థిక సంపదవున్న ప్రపంచ పంక్తిలో నిలబడగలుగుతుంది. నిజానికి అంబేడ్కర్ అడుగు అడుగులో స్త్రీ సమానత్వం కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం, వారి విద్యాభ్యాసం కోసం, వారి సాధికారిత కోసం, వారి భావ చైతన్యం కోసం, వారి రాజకీయ హక్కుల కోసం పోరాడారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా రాజీనామా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హిందూ కోడ్ బిల్లును సాధించారు. ఈనాడు ప్రభుత్వాలు స్త్రీ సాధికారితను నిలబెట్టాలి అంటే నిరుద్యోగులయిన స్త్రీలకు ఉద్యోగ వసతి కల్పించాలి. విధవరాండ్రకు నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వ గలిగిన స్థాయికి రావాలి. ప్రతి దళిత స్త్రీకి రెండు ఎకరాల భూమి ఇచ్చి భారతదేశంలో వ్యవసాయ విస్తృతికి కృషి చేయాలి. ఇంటింటికీ మంచినీటి వసతి, విద్యుత్ వసతి కల్పించి, ఆరోగ్య సంరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించి స్త్రీ శారీరక మానసిక శక్తిని పెంచి దేశ సౌభాగ్యానికి బాటలు వేయాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ఆదర్శనీయం... ఆచరణీయం
‘అనుచిత ఉచితాలకు నేడో రేపో భారీ మూల్యం చెల్లించడం ఖాయం’ అంటారు అమెరికన్ రచయిత విల్లీమన్. ఎన్నికల సమయంలో ఆ యా రాజకీయ పార్టీలు ఉచితాలతో కూడిన హామీలిస్తున్నాయి. అయితే పేదవారి కనీస అవసరాలు తీర్చే సముచిత ఉచితాలు కొంతకాలం అవస రమే. కానీ కేవలం అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే అనుచిత ఉచితాల పట్ల ప్రజలు ఆకర్షితులైతే ఆర్థిక సంక్షోభ సునామీలో కొట్టుకు పోవడం ఖాయం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సముచిత ఉచితాలతో గరిష్ఠ స్థాయిలో సంక్షేమ పథకాల రూపంలో ఏటా సుమారు రూ. 80 వేల కోట్లు వ్యయం చేసినప్పటికీ... కొందరు కోరుకున్నట్లుగా రాష్ట్రం శ్రీలంక కాలేదు.అధికార దాహార్తితో అల్లాడుతున్న చంద్రబాబు వచ్చే ఎన్ని కల్లో ఎలాగైనా గెలవాలనే కోరికతో అనేక అనుచిత ఉచితాలు ప్రకటించారు. జగన్ ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూ చంద్రబాబు ఇచ్చిన అనుచిత ఉచితాలను అమలు చేయడానికి యేటా మరో రూ.70 వేల కోట్ల ఖర్చవుతుంది. అంటే వీటివల్ల రాష్ట్ర ఖజానాపై సుమారు రూ. లక్షా 50 వేల కోట్ల భారం పడుతుంది. నిజానికి రాష్ట్రానికి పన్ను, పన్నేతర ఆదాయాలు, కేంద్ర గ్రాంట్లు అన్నీ కలిపితే ఏడాదికి వస్తోంది సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు. దీనిలో ఉచితాలకు లక్షా 50 వేల కోట్ల రూపాయలు పోతే మిగిలేది రూ. 50 వేల కోట్లు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు ఏడాదికి సుమారు రూ.70 వేల కోట్లు అవసరమవుతాయి. ఇవి కాక వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, వైద్యం లాంటి 21 శాఖలకు సుమారు లక్షా 30 వేల కోట్లు కేటా యించాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ ఎకౌంట్లో సుమారు 56 వేల కోట్ల రూపాయల ద్రవ్య లోటు చూపించారు. చంద్రబాబు అనుచిత పథకాలను కూడా అమలు చేయాల్సి వస్తే ఈ లోటు లక్షా 26 వేల కోట్లకు పెరుగుతుంది. ఇదే జరిగితే ఈ లోటు రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం ఖాయం.మేనిఫోస్టోలకు మాతృక 1848లో లండన్లో కార్ల్మార్క్స్– ఫ్రెడెరిక్ ఏంగెల్స్ ప్రచురించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. అట్టడుగు శ్రామిక , పేద వర్గాలకు సంపద పంచడం, ఆర్థిక అసమానతలు తగ్గించడం ఈ మేనిఫెస్టోలోని అంశాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ చేసింది ఇదే. ముందు వారి ఆర్థిక అవస రాలు తీర్చడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అందజేశారు. దీనిలో సుమారు రూ. 2.70 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా అందజేశారు. మోదీ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా ఈ పద్ధతి ద్వారా దేశ వ్యాప్తంగా సుమారు రూ. 22 లక్షల కోట్లు బదిలీ చేయగా దానిలో పదో వంతు పైనే ఏపీలో పంపిణీ జరగడం విశేషం. ఇలా ఇవ్వడం వల్ల ఈ నాలుగు లక్షల కోట్ల రూపాయలు నేరుగా స్థాని కంగా ఖర్చు చేయడంతో వస్తు, సేవలకు గిరాకీ ఏర్పడింది. ఫలితంగా ఉత్పత్తి, ఉపాధి పెరిగింది. ప్రతి లావాదేవీలోనూ కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల రూపంలో రాబడి పెరిగింది. ఇదే మొత్తం బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల చేతికి వెళితే దానిలో అత్యధికం నల్లధనంగా మారేది. పేదలను ఆర్థికంగా ఆదుకున్న జగన్ తర్వాత వారి సంపదను పెంచారు. సుమారు 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళ స్థలాలు, లక్షన్నర గృహాలు ఉచితంగా అందజేశారు. పేదలకు ఇచ్చిన ఒక్కో ఇళ్ళ స్థలం విలువ కనీసం మూడు లక్షలు, ఇంటి విలువ పది లక్షల రూపాయల చొప్పున లెక్కిస్తే వాటి మొత్తం విలువ సుమారు పది లక్షల కోట్ల రూపాయలు. అంటే రాష్ట్ర బడ్జెట్ కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. దేశంలో మరే రాష్ట్రం పేదల కోసం ఇటువంటి ఆలోచన చేయలేదు, ఇంత సంపద సమకూర్చలేదు.రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదంటూ విపక్షాలు, వారి అనుకూల మీడియా విషప్రచారం చేశాయి. 2023–24లో దేశ జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం కాగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 16.5 శాతం. దేశంలో ఎక్కువగా వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. 2018–19లో స్థూల జాతీయోత్పత్తి విలువ రూ. 8.73 లక్షల కోట్లు కాగా అది 2023–24 నాటికి రూ. 16 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రూ. 1,54,031 నుంచి రూ. 2. 60 లక్షలకు పెరిగింది. ఈ ఐదేళ్ళలో 122 భారీ పరిశ్రమలు, 5 లక్షల చిన్న తరహా పరి శ్రమలు వచ్చాయి. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా గత నాలుగేళ్లుగా సుమారు రూ. 75 లక్షల కోట్ల రూపాయల మౌలిక వసతుల పనులు జరుగుతుంటే వాటిలో ఏపీలోనే సుమారు రూ. 6 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి. దేశ ఎగుమతుల్లో 10.42 శాతం ఏపీ నౌకాశ్రయాల నుంచే జరుగుతున్నాయి. సామాజిక రంగ వ్యయం, ఫుడ్ ప్రాసెసింగ్, కోక్, పొగాకు, మత్స్య ఉత్పత్తులు, పండ్ల తోటల విస్తీర్ణం, పౌల్ట్రీ , ప్రభుత్వ ఆస్పత్రుల సంఖ్య , సినిమా హాళ్ళు, ఇంజనీరింగ్ టాలెంట్ తదితర రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశంలో అతి తక్కువ నిరుద్యోగం (4.2 శాతం) ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. కాని రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవంటూ ప్రచారం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. దానికి ఉదాహరణ రాష్ట్రంలో పెరిగిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలే. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2019లో రాష్ట్రంలో 44,85,974 పీఎఫ్ ఖాతాలుంటే అవి 2024 నాటికి 60,73,000కు పెరిగాయి. రాష్ట్రంలో గత మూడేళ్ళుగా కొత్తగా 18 లక్షల ఆదాయ పన్ను చెల్లింపుదారులు చేరారు. ఇదో జాతీయ రికార్డు.దేశంలో అత్యధిక సంఖ్యలో ఏడు వందలకు పైగా పౌర సేవలందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 12 కోట్ల పౌర సేవా అర్జీలను పరిష్కరించి జాతీయ రికార్డు నెలకొల్పింది. నిజానికి ఈ ఐదేళ్ళలో అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. జగన్ ప్రభుత్వం మేనిఫోస్టోను పవిత్ర గ్రంథంగా భావించి త్రికరణ శుద్ధిగా అమలు చేసిందనడంలో సందేహం లేదు. గతంలో పసుపు– కుంకుమ వంటి తాయిలాలను తిరస్కరించిన రాష్ట్ర ఓటర్లు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం– జనసేన కూటమి అనుచిత ఉచితాల వలకు చిక్కే అవకాశం కనిపించడం లేదు.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్మొబైల్: 89859 41411 -
అందరివాడికే అందలం
తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్ అడిగిన తీరు ఎన్నడూ కననిదీ, విననిదీ. బహుశా దేశంలోనే ఏ నాయకుడు కూడా ఇంత ఆత్మవిశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. అన్ని వర్గాల ప్రజలూ వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులే అన్నది ఈ విశ్వాసానికి కారణం. దానికి రుజువే ఎన్నికల ప్రచారంలో ఆయనకు లభిస్తున్న అమితమైన ఆదరణ! ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మరోసారి ఆయన్ని అధికార పీఠం ఎక్కించడానికి ‘సిద్ధం’గా ఉన్నారని దీన్నిబట్టి అర్థమవుతోంది.‘కాణి’ ముత్యాలు ఇంటికే – మళ్లీ పట్టం జగన్కే!ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోమారు విస్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వనున్నారు. ఇది తెలుసుకోవడానికి ‘సర్వేశ్వరులను’ అడగనవసరం లేదు. గతంలో సర్వేలన్నీ సుప్రసిద్ధ మీడియా సంస్థలు నిర్వహించేవి. ఇప్పుడు ఎవరికి నచ్చిన విధంగా వారు సర్వేలు చేయించుకుంటూ ‘స్వింగ్’ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి ఇటు వైసీపీ, అటు కూటమి ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపిక, ప్రజాస్పందన నిశితంగా పరిశీలిస్తే, తీర్పు ఎలా ఉండబోతోందో మనకే అర్థమవుతుంది.జగన్ అన్ని పార్టీల కంటే ముందుగానే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, జనసేన అవగాహన కుదుర్చుకున్నా, చివరి వరకూ బీజేపీ జత కడుతుందో లేదో తెలియని సందిగ్ధం. అందుకే చాలాచోట్ల ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేసుకున్నారు. తీరా బీజేపీ వచ్చి చేరాక, మళ్ళీ అభ్యర్థుల ప్రకటనలో కుస్తీ పట్టాల్సి వచ్చింది. ఆశించిన స్థాయిలో కాక అతి తక్కువ సీట్లు జనసేన తీసుకోవడం, బీజేపీ పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా సిసలైన బీజేపీ వారికి టికెట్లు దక్కకపోవడం వంటివి లుకలుకలకు కారణమయ్యాయి. పేరుకే మూడు పార్టీల జెండాలు. జన శ్రేణులు మాత్రం కలిసి పనిచేసే పరిస్థితి చాలా చోట్ల లేకుండా పోయింది.పోనీ నిలబెట్టిన టీడీపీ అభ్యర్థుల్లో ఆణిముత్యాల లాంటి వారు ఉన్నారా అంటే, అబ్బే! చాలావరకు కాణి ముత్యాలే! ఇంచుమించు చంద్రబాబు మహా దోపిడీలో భాగస్వాములు లేదా ఆ దోపిడీ నుంచి స్ఫూర్తి పొందినవారే. ఇటు బెజవాడ దుర్గమ్మ, అటు విశాఖ కనకమహాలక్ష్మి, ఆ పక్క అనకాపల్లి నూకాలమ్మ సాక్షిగా వీరంతా కాణి ముత్యాలు. ఇలాంటివాళ్లే చంద్రబాబుకు కావాలి. టిప్పర్ డ్రైవర్లు, కమతగాళ్లు అంటే ఆయనకు అసహ్యం. ఈ బాపతు కాణి ముత్యాల్ని జనం ఆదరించరని చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే వీళ్ళు ఎక్కువగా ‘బ్యాక్ డోర్ పాలిటిక్స్’ నడుపుతుంటారు.ఇక ప్రచార తీరు పరిశీలిస్తే, తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్ అడిగిన తీరు... బహుశా దేశంలోనే ఏ నాయకుడు ఇంత ఆత్మ విశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. ఆయన ప్రచారాస్త్రాలు కూడా విలక్షణంగా ఉన్నాయని చెప్పాలి. ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా విమర్శలకే పరిమితమయ్యారు తప్ప స్థాయి మరచి తిట్లులంకించుకోలేదు, హుందాతనాన్ని కోల్పోలేదు. మరి కూటమి విషయానికొస్తే– వెకిలితనం, బూతు పురాణం, కొట్టండి, చంపండి, నరకండి అని జనాల్ని ప్రేరేపించటం సభ్య సమాజాన్ని విస్తుపరిచాయి. జగన్పై విసిరిన రాయి దాడిని ఖండించాల్సింది పోయి ‘గులక రాయి’ అని వెకిలితనాన్ని ప్రదర్శించటం, వలంటరీ వ్యవస్థను కట్టడి చేయడం, పండు టాకుల, పుండు రెక్కలపై ఆక్రోశం వెలిబుచ్చి వాళ్ళ చావుకి కారణం కావడం, లేని భూయాజమాన్య హక్కు చట్టంపై దుష్ప్రచారానికి పూనుకోవడం వంటివి అన్నీ బూమరాంగ్ ఆయ్యాయి. అయితే జగన్ పని అయిపోయింది, ఇక తామే అధికారంలోకి వస్తున్నామనే ఫేక్ సర్వేలలో మాత్రం ముందున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 13 లక్షలు. ఇందులో అర్బన్ ఓటర్లు కేవలం 87 లక్షలు. జగన్కు పెట్టని కోటల వంటి గ్రామీణ ఓటర్ల సంఖ్య 3 కోట్ల 20 లక్షలు. అందులో సంక్షేమ పథకాల లబ్ధిదారులే అధికం. ఇక కులాల ప్రాతిపదికగా చూస్తే... ఎస్సీలు 35 లక్షల 46 వేల 748, ఎస్టీలు 25 లక్షల 85 వేల 726, ముస్లింలు 23 లక్షల 84 వేల 449, బీసీ యాదవులు 25 లక్షలు, మత్స్యకారులు 15 లక్షల 74 వేల 868, గౌడలు 19 లక్షల 78 వేల 866,చంద్రబాబు చేత తీవ్ర అవమానాలకు గురైన రజకులు, నాయీ బ్రాహ్మణులు 8 లక్షల 41 వేల 400+ 4 లక్షల 15 వేల 520, బ్రాహ్మణులు 7 లక్షల 4 వేల 165. క్రైస్తవులు 3 లక్షల 15 వేల 320... ఈ సామాజిక వర్గాలలో అత్యధికులు జగన్ వైపే ఉన్నారు. అధిక శాతం ఉన్న మరొక వర్గం, గోదావరి జిల్లాల్లో నిర్ణయాత్మక శక్తి అని చెబుతున్న కాపులు, రాయలసీమలోని బలిజలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతాల్లో ప్రధానంగా, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు, ఒంటరులు మొత్తం 52 లక్షల 97 వేల 748 మంది. వీరిలో జనసేన వైపు ఆశగా చూసి భంగపడిన వారు, చంద్రబాబు సామాజిక వర్గంతో దశాబ్దాల వ్యతిరేకత ఉన్నవారు, వైసీపీలోని కాపు నాయకుల వెంట ఉన్నవారు... ఇలా భిన్నాభిప్రాయాలతో అటూ ఇటూ ఉంటారు. ఇక రెడ్డి వర్గంలోని 26 లక్షల 748 మందిలో అధికులు జగన్ వైపు ఉండగా, కమ్మ వర్గంలోని 26 లక్షల 46 వేల 748 మందిలో అత్యధికులు చంద్రబాబు వైపు ఉంటారు. ఇతర బీసీలు, 13 లక్షల పైచిలుకు ఉన్న వైశ్యులు ఆయా ప్రాంతాల పార్టీ అభ్యర్థుల ప్రాతిపదికన రెండు వైపులా చీలతారు. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో అధిక శాతం వైసీపీ వైపే ఉన్నారు. గెలుపును నిర్ణయించే మరో శక్తి, నారీ శక్తి. అలాంటి మహిళలు జగన్ వైపే ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. దీనిని బట్టి, ‘మళ్లీ పట్టం జగన్కే – కాణి ముత్యాలు ఇంటికే!’_వ్యాసకర్త పూర్వ సంపాదకుడు- పి. విజయబాబుముస్లింలు బీజేపీని ఓడించాలి – వైసీపీని గెలిపించాలి!ప్రధాని నరేంద్ర మోదీజీ, బీజేపీల నాయకత్వంలో పదేళ్ళుగా కేంద్రంలో అధికా రంలో వున్న ఎన్డీయే ప్రభుత్వం దేశ సంపదను అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెడు తున్నది. ఒకవైపు భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానంటూనే మరోవైపు దేశ ప్రజల్ని పేదరికం లోనికి నెట్టి వేస్తున్నది. దేశ ప్రజలంటే 80 శాతం హిందువులు, 14 శాతం ముస్లింలు, 6 శాతం క్రైస్తవులు, సిక్కులు, తదిత రులు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన హ్యాపీనెస్ రిపోర్టులో భారతదేశం 126వ స్థానంలో వుంది. భారత ప్రజలు సంతోషంగా లేరు. అణిచివేతకు గురవుతున్న ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే ముస్లిం, ఐదుగురు హిందువులు. దీని అర్థం ఏమంటే మోదీ పాలనకు ప్రధాన బాధితులు హిందువులు. ఈ వాస్తవాన్ని కప్పి పుచ్చడానికి, హిందూ–ముస్లింల మధ్య తగువుపెట్టి ఎన్నికల్ని ఒక మత యుద్ధంగా మార్చడానికిస్వయంగా మోదీజీ నడుం బిగించారు. 2019 లోక్ సభ ఎన్నికల్ని ఆ పార్టీ 1761 నాటి పానిపట్టుయుద్ధంతో పోల్చేది. ఆ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ దుర్రానీ చేతుల్లో పీష్వా బాలాజీ బాజీరావు ఓడిపోవడంతో హిందువులు 250 ఏళ్లు అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేసి, మళ్ళీ అలాంటి దుఃస్థితి వస్తుందని భయపెట్టింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని ఔరంగజేబ్, శివాజీ మహారాజ్ల మధ్య పోరాటంగా ప్రచారం చేసింది. గతేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టిప్పూ సుల్తాన్కు ఓటేస్తారా? రాణి అబ్బక్కకు ఓటేస్తారా? అని అడిగింది.వివిధ రాష్ట్రాలు విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి హిందూ సమా జంలోని కింది కులాలకు కేటాయిస్తామని బీజేపీ చెపుతున్నది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని విస్తారంగా ప్రచారం చేశారు. ఆ రెండు రాష్ట్రాల ప్రజలూ ఈ మాటల్ని నమ్మలేదు. మత ప్రాతి పదికన రిజర్వేషన్లను బీజేపీ ఆమోదించదని మరో బూటకపు ప్రచారాన్ని ప్రధాని సాగిస్తున్నారు. నిజానికి మత ప్రాతిపదికనే కులాలుంటాయి. భారత రాజ్యాంగం కొన్ని సమూహాలకు ఇచ్చిన రిజర్వేషన్లు వాస్తవా నికి మత రిజర్వేషన్లే. మాల సామాజిక వర్గానికిచెందిన ఒక వ్యక్తి తాను హిందువుననిగానీ, సిక్కును అనిగానీ ప్రకటించుకుంటేనే ఎస్సీ రిజర్వేషను పొందు తాడు. క్రైస్తవుడినని ప్రకటించుకుంటే బీసీ రిజర్వేషను పొందుతాడు. ఏమిటి దీనర్థం? బీజేపీ ముస్లిం రిజర్వేషన్గా ప్రచారం చేస్తున్నది కూడా నిజానికి ముస్లిం రిజర్వేషన్ కాదు. ముస్లిం సమాజంలో ఓసీలుగా పరిగణించే సయ్యద్, పఠాన్, మొఘల్, బేగ్లకు బీసీ రిజర్వేషన్ వర్తించదు. మహా అయితే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన సమూహాల (ఇడబ్ల్యూఎస్) కోటాలో లబ్ధి పొందవచ్చు. ముస్లింలను సాంస్కృతిక రంగంలో వివక్షకు గురి చేయడం, ఆర్థిక రంగంలో అతి క్రూరంగా బుల్ డోజర్లతో కూల్చి వేయడం బీజేపీ విధానంగా మారింది. ఏపీలో ప్రధాన పోటీదారులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ మొదటి నుండీ మత సామరస్యవాదుల నేల, సామ్యవాదుల భూమి. మతవిద్వేషాన్ని రగిల్చితే తప్ప రాజకీయ మనుగడ సాగించలేని బీజేపీ ఈ నేల మీద తనంత తానుగా మొలకెత్తలేని విత్తనం. 2019 ఎన్నికల్లో విడిగా పోటీచేస్తే బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడ రాలేదు. లోక్ సభ, అసెంబ్లీల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. జాతీయ స్థాయిలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మాత్రమే. ఏపీ ముస్లింలు ఈసారి ఒక లెక్క ప్రకారం కాంగ్రెస్కు మద్దతు పలకాలి. అయితే, కర్ణాటక, తెలంగాణాల్లా ఏపీలో కాంగ్రెస్ నిర్మాణం బలంగా లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎంచుకున్న ప్రాధాన్య తల్ని ఆ పార్టీ ఏపీ నాయకులు పట్టించుకుంటున్నట్టు లేదు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బీజేపీని ఓడించాలనే పట్టుదల వున్నట్టు లేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిని గెలిపించాలా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించాలా? అనేది ఏపీ ముస్లింల ముందున్న ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసమో, మరో కారణాలతోనో వైసీపీ జగన్ ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న ఎన్డీయేతో సఖ్యంగా వున్నారు. ఇప్పుడు ఆయనే ఏపీ నేల మీద బీజేపీని ఎదుర్కోవాల్సిన స్థితిలో పడ్డారు. ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసేలోగా బీజేపీ, జగన్ల మధ్య పోరు మరింత వుధృతం అవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్సా? వైఎస్సార్ కాంగ్రెస్సా? అనే ప్రశ్న మళ్ళా ముస్లింల ముందుకు వచ్చి నిలిచింది. ఇది రాజకీయ సమస్య మాత్రమే కాదు. ఒక విధంగా నైతిక సమస్య కూడా. ఆంధ్రప్రదేశ్ భౌతిక రాజకీయ సమీకరణలు, కాంగ్రెస్ ఏపీ యూనిట్ వాస్తవిక బలాబలాలు, పనితీరుల్ని పరిగణన లోనికి తీసుకుంటే ముస్లింలు వైసీపీకి మద్దతు ఇవ్వడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. అది అవసరం కూడా. ఇటీవల విజయవాడలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (ముస్లిం జేఏసీ), ముస్లిం ఆలోచనాపరుల వేదిక(ఎంటీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ముస్లిం ఉలేమాలు, ఆలోచనాపరులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ప్రొఫె షనల్స్తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. -వ్యాసకర్త ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటీఎఫ్) కన్వీనర్-ఏఎం ఖాన్యజ్దానీ డానీ -
వారికి ‘విధ్వంసం’గా కనిపిస్తున్నది ఏమిటి?
రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్ళ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నది అని చూసినప్పుడు ఈ ఐదేళ్ళలో ఆసక్తికరమైన పరిణామ క్రమం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సభల్లో ‘రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నది అందులో నేను అర్జునుణ్ణి’ అంటుంటారు. ఏదో ఒక ప్రతీకగా అన్నట్టుగా ఇది ఉన్నప్పటికీ, ఈ మాట వెనుక ఎంతో లోతైన విషయం ఉంది.అందులో పైకి కనిపించని రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక, సామాజిక శాస్త్రముంది. దాని లోతులు-లూయిస్ టెల్లిన్ రాసిన ఆక్సిఫర్డ్ యూనివర్సిటి ప్రెస్ ప్రచురణ ‘రీ మ్యాపింగ్ ఇండియా: న్యూ స్టేట్స్ అండ్ దెయిర్ పొలిటికల్ ఆరిజన్స్’ గ్రంధం చూసినప్పుడు, మనకు అర్ధం అవుతుంది. అందులో ముందుమాటలోనే ఆమె- ‘రాష్ట్రాల సరిహద్దులు మన జీవితాల్లోని రాజకీయ, ఆర్ధిక అంశాల విషయంలో ఏ వర్గాల మధ్య పరస్పరం పోటీఉంది? ఏవి ఎవరి చేజారిపోతున్నాయి.. అనేది నిర్ధారిస్తుంది’ అంటారు.ఇటువంటి ‘ఇరు వర్గాల మధ్య పరస్పరం పోటీ’ గురించే,కొంతకాలంగా సీఎం జగన్ కూడా మాట్లాడుతున్నారు. ఆయన పరిపాలనలో సంక్షేమం అమలుకు ‘ఆన్ లైన్’ సాంకేతికతను, యుద్దభూమిలో ‘డాలు’ మాదిరిగా వాడుతూ విమర్శకుల దాడి తనను తాకకుండా చూసుకున్నారు. దాంతో ఒకప్పుడు ఆ ‘టెక్నాలజీ’ గురించే 24X7 మాట్లాడిన వారికి ఇప్పుడు దాన్ని తప్పుపట్టడానికి నోరు పెగలడం లేదు. ప్రతిపక్షవర్గాలకు ఇటువంటి నిస్సహాయతలో నుంచి వచ్చిందే ‘విధ్వంసం’ వంటి ఏకవాక్య వ్యాఖ్య. వాళ్ళు అ మాటకు వివరం ఏమిటో ఇంకా చెప్పలేదు.అయితే, జగన్ దాన్ని-‘పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం’ అంటారు. రాజనీతి శాస్త్రంలో ఈ ‘పరస్పర పోటీ’సూత్రాన్ని ప్రతిపాదిస్తున్న ఈ రచయిత్రి ప్రస్తుతం లండన్ కింగ్స్ కాలేజిలో ‘ఇండియా ఇనిస్టిట్యూట్’తో పాటుగా ‘కేంబ్రిడ్జి’ ‘లండన్ స్కూల్ ఆఫ్ఎకనామిక్స్’ వంటి ప్రపంచ ప్రసిద్ద యూనివర్సిటిల్లో బోధిస్తున్నారు. ఈమె గతంలో బీబీసీ సౌత్ ఆసియా అనలిస్ట్ గాపనిచేసారు. ఈమె ఈ రచన 2014లోమన రాష్ట్ర విభజన నాటికివెలువడింది. ఉత్తరాదిలో ‘ఇండియా రీమ్యాపింగ్’కు దారితీసిన పరిస్థితులే దక్షణాదిలో మన వద్ద కూడా స్థూలంగా అవే చారిత్రిక, రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక, సామాజిక పరిస్థితులు కారణం కావడం ఈ రచనలో చూస్తాము.ఇప్పుడు ఏమైంది 2000లో కొత్తగా ఉత్తరాఖండ్, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటుతో- ‘రీ మ్యాపింగ్ ఇండియా’వర్తమాన రాజకీయ నిర్ణయంగా ‘అకడమిక్’ చర్చగా మారి తెరమీదికి వచ్చింది. ఏమైంది, పదేళ్లకు ఇక్కడా అదే ‘సీన్ రిపీట్’ అయింది. అప్పుడు ఏమి జరగాలి? ‘రీ మ్యాపింగ్ ఆంధ్రప్రదేశ్’ మొదలవ్వాలి. ఎందుకంటే, ‘సరిహద్దులు మన జీవితాల్లోని రాజకీయ, ఆర్ధిక అంశాల విషయంలోవర్గాల మధ్య పోటీకి కారణం అవుతాయి’ అనేది సూత్రం అయినప్పుడు, నాయకుడు దాన్ని విధిగా ‘అడ్రెస్’ చేయాలి. అయితే నాయకుడు అక్కడ ఉత్పన్నం అయ్యే సవాళ్ళను ఎదుర్కోవాలి, అందుకు అతడు ధైర్యస్తుడై ఉండాలి.ఆ పనే జగన్ చేశాడు. ఆయన 13 జిల్లాలను 26 చేసి ఆ పని పూర్తిచేసాడు. రేపు చిన్నవో పెద్దవో సమస్యలు వస్తే వాటిని కూడా పరిష్కరిస్తాడు. ఒకప్పటి విజయనగరం జిల్లాలోని పార్వతీపురంను కొత్త జిల్లా చేయడానికి ఒడిస్సా సరిహద్దున ఉన్న 22 కొటియా గ్రామాల వివాదం ఒకటి చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. దాని పరిష్కారం కోసం నవంబర్ 2021లో మన ముఖ్యమంత్రి జగన్.. ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలిసి రెండు రాష్ట్రాల మధ్య ‘పెండింగ్’ ఉన్న సరిహద్దు గ్రామాలు, నదీజలాల అంశాలు గురించి మాట్లాడాక, ఏప్రిల్ 2022న కొత్త జిల్లాలను ప్రకటించారు. తన మొదటి ‘టర్మ్’లోనే ఇటువంటి ‘రీ మ్యాపింగ్’ కసరత్తు తర్వాత ఈ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళబోతున్నది. ఔఏప్రిల్ మూడో తేదీన ‘నవ్యాంధ్ర పదేళ్ళ ప్రస్థానం’ అంశంపై బీబీసీ తెలుగు విజయవాడలో చర్చావేదిక ఏర్పాటుచేసి, నన్ను కూడా పిలవడంతో వెళ్ళాను. అన్ని పార్టీల ప్రతినిధులు సీనియర్ జర్నలిస్టులు వచ్చారు. సమన్వయకర్త చర్చ నాతోనే ప్రారంభిస్తూ ‘మీరీమధ్య తరుచూ ఇక్కడి అభివృద్దిపై వ్యాసాలు రాస్తున్నారు కదా, ‘డాట్స్’ ను కలిపి చూడాలి అంటారు. నవ్యాంధ్ర ఈ పదేళ్ళలో ఏమైనా ముందుకు వెళ్ళిందా? లేక వెనక్కి వెళ్ళిందా? మీరు ఏమనుకుంటున్నారు?’ అని అడిగారు.నేను చెప్పాను.. ‘వైఎస్సార్ కాలంలో మన్మోహన్ సింగ్ ఏపీలో తరచూ ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ ‘ఏపీ మోడల్’ వంటి వ్యాఖ్యలు చేసేవారు. విభజన తర్వాత, అదే ఇక్కడ మరింత మెరుగైన రీతిలో కొనసాగుతూ, దాంతోపాటుగా-‘కోర్స్ కరక్షన్’ కూడా జరుగుతోందని చెప్పాను. ప్రస్థానం అనగానే అది ముందుకే వెళ్ళాలి అనుకుంటాం. అన్నిసార్లు అది అలాగే ఉండనక్కరలేదు. ఉన్నచోటే కొన్నాళ్ళు ఆగి, ప్రజల అవసరాలు చూస్తూ.. రేపు మనం వెళ్ళవలసిన మార్గాన్ని ముందుగా సరిచేసుకోవడం కూడా ఉంటుంది. అది ఆగిపోవడం కాదు, అది వెళ్ళాల్సిన మార్గంలో ఉన్న వ్యత్యాసాల ఎత్తుపల్లాలు సరిచేయడం అవుతుంది.కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం సరిహద్దులు (బోర్డర్స్) గురించిన స్పృహ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ ఉండడం అనేది, ఎవ్వరు పెద్దగా గుర్తించలేదు గానీ అది అసాధారణమైన అంశం. అది ఉన్నప్పుడే- ‘రీ మ్యాపింగ్’ సాధ్యం అవుతుంది. మన సమాజంలో ‘బోర్డర్స్’లో ఉండేది ఎవరు? ఒక ఊళ్ళో ఊరి చివర ఉండేది ఎవరు? ఇటువంటి చివరి సమాజాల కోసం, ఈ ప్రభుత్వం కొత్త జిల్లాల కేంద్రాలను వీరి సమీపానికి చేర్చింది. కొందరు ఉంటారు, వారు ‘బోర్డర్స్’ను మరోలా చూస్తారు. వారు భద్రమైన నియోజకవర్గాల కోసం ‘బోర్డర్స్’కు వెళ్లి ఆ ప్రాంతం ఎదగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని, దశాబ్దాలుగా ఆ ప్రజలమీద పడి బ్రతికేస్తుంటారు.ఉత్తరాంధ్ర ప్రముఖ కధకుడు అట్టాడ అప్పల నాయుడు 2007లో ‘షా’ అనే కథ రాసారు. ఇరిగేషన్ కాంట్రాక్టులు చేయడానికి కోస్తా నుంచి శ్రీకాకుళం వచ్చిన చౌదరి స్థానిక సంస్థల రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాడు. దాని గురించి ఒక రాత్రి మందు పార్టీ వద్ద కొందరు రాజకీయ స్పృహ ఉన్న స్థానికులు మాట్లాడుకోవడం ఈ కథ. అయితే, ఇప్పుడు అది కథ కాదు. సరిహద్దుల్లో పరిష్కారం మొదలయింది. అదే ఇప్పుడు కొందరికి విధ్వంసంగా కనిపిస్తున్నది. రచయిత: అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత జాన్ సన్ చోరగుడి
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటు హక్కు వినియోగించుకున్న నారా ఫ్యామిలీ
ప్రజలంతా మనసాక్షితో ఓటు వేయాలి - అనిల్ కుమార్
భారత న్యూయార్క్ కాన్సులేట్ ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది!
పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడులు
అవ్వ ప్రేమ కు పేర్ని నాని ఫిదా
ఓటు వేసిన సీఎం జగన్ కుమార్తెలు
శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
Virat Kohli: నన్నే ఏడిపిస్తావా?.. ప్రతీకారం తీర్చుకున్న కోహ్లి!
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
Photos
View allVideo
View allతప్పక చదవండి
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- శ్రీనగర్లో రికార్డులను అధిగమించనున్న ఓటింగ్ శాతం?
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్!
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement