smart phone
-
ఫోన్ సరిగ్గా ఛార్జింగ్ పెట్టడం తెలుసా..?
స్మార్ట్ఫోన్ను సరిగ్గా ఛార్జింగ్ చేయడం తెలుసా అంటే మీరేంమంటారు.. ‘ఇదేం ప్రశ్న..? సాధారణంగా ఛార్జింగ్ కేబుల్తో ఛార్జ్ పెడితే సరి’ అనుకుంటారు కదా. కానీ సరైన సమయంలో, సరైన విధంగా స్మార్ట్ఫోన్కు ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫోన్కు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఎలాంటి అంశాలు గమనించాలో తెలుసుకుందాం.ఇతర ఛార్జర్లను ఉపయోగించడంప్రతిఫోన్కు ప్రత్యేకంగా కంపెనీ ఛార్జర్ తయారు చేస్తుంది. ప్రతిసారి ఆ ఛార్జర్తోనే ఛార్జ్ చేయాలి. లేదంటే ఫోన్ పాడవుతుంది. పొంతన లేని ఛార్జర్లు కరెంట్ వోల్టేజ్ను కొన్నిసార్లు అధికంగా, ఇంకొన్నిసార్లు తక్కువగా సరఫరా చేస్తాయి. ఇది బ్యాటరీని దెబ్బతీస్తుంది. కాబట్టి సర్టిఫైడ్ ఛార్జర్లను వినియోగించాలి.రాత్రంతా ఛార్జింగ్చాలామందికి లేట్నైట్ వరకు ఫోన్ ఉపయోగించి ఛార్జ్ చేసి పడుకోవడం అలవాటు. రాత్రంతా కరెంట్ సరఫరా అవ్వడంతో ఓవర్ ఛార్జింగ్ అవుతుంది. దాంతో బ్యాటరీ బల్జ్ అయ్యేందుకు దారితీస్తుంది.ఛార్జింగ్ చేస్తూ ఫోన్ వాడడంఛార్జింగ్ చేసినప్పుడు ఎట్టిపరిస్థితిలో ఫోన్ వాడకూడదు. తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తే ఛార్జింగ్ రిమూవ్ చేసి వాడుకోవాలి. ఇది చాలా సాధారణ విషయంగా కనిపించినా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.సాఫ్ట్వేర్ అప్డేట్లను విస్మరించడంఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసు అందిస్తున్న కంపెనీలు, మొబైల్ తయారీ కంపెనీ నిత్యం వాటి సాఫ్ట్వేర్లో అప్డేట్లను అందిస్తాయి. క్రమం తప్పకుండా వాటిని అప్డేట్ చేసుకోవాలి. బ్యాటరీ, ఛార్జింగ్ సమస్యలకు సంబంధించిన అప్డేట్లను కంపెనీ అందిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి.0% నుంచి 100% వరకుఫోన్ వాడుతున్నప్పుడు మొత్తం ఛార్జింగ్ అయిపోయేంత వరకు చూడకుండా సుమారు 40 శాతం బ్యాటరీ ఉన్నప్పుడే ఛార్జ్ పెట్టాలి. తరచుగా 0% నుంచి 100% వరకు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది.చలి, వేడికి దగ్గరగా..విపరీతమైన వేడి, చలి రెండూ ఫోన్ బ్యాటరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఫోన్ను నేరుగా వేడి ప్రదేశంలో ఛార్జ్ చేయడం లేదా ఎండలో వదిలివేయడం చేయకూడదు. అదేవిధంగా, చాలా చల్లని వాతావరణంలో ఛార్జింగ్ చేయడం కూడా బ్యాటరీకి హాని కలిగిస్తుంది.దెబ్బతిన్న కేబుల్తో ఛార్జింగ్పగిలిన లేదా దెబ్బతిన్న, అతుకులున్న ఛార్జింగ్ కేబుల్స్ వాడకూడదు. ఇవి అస్థిరమైన ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతాయి. కొన్నిసార్లు అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి.ఇదీ చదవండి: టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!ఛార్జింగ్ పోర్ట్ను శుభ్రం చేయకపోవడంఫోన్ ఛార్జింగ్ పోర్ట్లో దుమ్ము పేరుకుపోతూంటుంది. ఇది పేలవమైన కనెక్షన్, ఛార్జింగ్ సమస్యలకు దారితీస్తుంది. మృదువైన బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి పోర్ట్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. -
మహిళ ప్యాంట్ జేబులో పేలిన స్మార్ట్ఫోన్: ఒక్కసారిగా మంటలు
బ్రెజిల్లోని అనపోలిస్లోని ఒక సూపర్ మార్కెట్ లో ఒక మహిళ జేబులో ఉన్నట్టుండి సెల్ఫోన్ పేలిపోయింది. ఈ షాకింగ్ ఘటన సీసీటీవీలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెల్ ఫోన్లు అసలెందుకు పేలతాయి?షాపింగ్ మాల్ భర్తతో కలిసి షాపింగ్లో సందడి ఉంది ఒక మహిళ. ఇంతలో ప్రమాద ఎలాంటి సంకేతాలు లేకుండానే ఒక్కసారిగా జేబులోని ఫోన్ ద్వారా మంటలంటుకున్నాయి. వెనుక జేబులో ఉన్న ఫోన్ పేలిపోవడంతో, పొగ, మంటలు వ్యాపించాయి. చుట్టు పక్కల వారు భయంతో పరుగులుతీశారు. దీంతో పక్కనే ఉన్న భర్త పోన్ తీసి బైట పడేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. View this post on Instagram A post shared by JahTop (@jahtop_)ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు ఎవరు? అనే వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే పేలిన ఫోన్ మోటరాలా కంపెనీదని తేలింది. పేలుడుకు కారణమేమిటి?ఎలక్ట్రికల్ ఇంజనీర్ క్లెబర్ డా సిల్వీరా మోరీరా లిథియం-అయాన్ బ్యాటరీలు పెద్ద మొత్తంలో శక్తిని నిల్వ చేస్తాయని, కొన్ని పరిస్థితులలో అవి వేడెక్కడంపల్ల ఒక్కోసారి పేలతాయని నిపుణులు తెలిపారు. ఫోన్ పేలుళ్లకు నిపుణులు చెబుతున్న అనేక సాధారణ కారణాలుబ్యాటరీ పాడైపోవడం, ఒత్తిడి : ఫోన్ మీద కూర్చోవడం లేదా దానిపై ఒత్తిడి తీసుకు రావడం వల్ల, పేలవచ్చు. షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు.డూప్లికేట్ ఛార్జర్లు: చౌకైన లేదా నకిలీ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గులతో, బ్యాటరీ దెబ్బతింటుంది.బాగా వేడెక్కడం: ఫోన్ను ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉంచడం లేదా వేడి వాతావరణంలో ఛార్జ్ చేయడం వల్ల పేలిపోవచ్చు.ఛార్జింగ్లో ఉండగా వాడకం: గేమ్లు ఆడటం, వీడియోలు చూడటం లేదా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగించడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. ఫలితంగా మంటలు వ్యాపించవచ్చు.పేలుడుపై కంపెనీ స్పందనపేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు మోటరోలా రంగంలోకి దిగింది. బాధితురాలితో మాట్లాడినట్టు కంపెనీ ధృవీకరించింది. తమ ఉత్పత్తులన్నీ కఠినమైన పరీక్షల ద్వారా మార్కెట్కు వెడతాయని, భద్రత పట్ల నిబద్ధతగా వ్యవహరిస్తామంటూ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక విశ్లేషణ చేస్తున్నట్టు తెలిపింది. -
2025లో బెస్ట్ స్మార్ట్ఫోన్స్: రూ.10 వేలకంటే తక్కువే..
ఇండియన్ మార్కెట్లో ప్రతి నెలా కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ రేటున్న మొబైల్స్ ఉన్నాయి. తక్కువ ధరకు లభించే మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఈ కథనంలో రూ. 10వేలు ధర వద్ద అందుబాటులో ఉన్న బెస్ట్ మొబైల్స్ గురించి చూసేద్దాం.మోటో జీ45 5జీ (Moto G45 5G)మార్కెట్లో సరసమైన మొబైల్ ఫోన్ల జాబితాలో మోటో కంపెనీకిని చెందిన 'జీ45 5జీ' ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 10,000. ఇది 4 జీబీ. 8 జీబీ ర్యామ్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఎందుకుని వేరియంట్ను బట్టి ధరలు మారుతాయి. ఈ స్మార్ట్ఫోన్ 6.45 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే పొందుతుంది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ (Infinix Hot 50 5G)ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ అనేది 1600 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్తో 6.7 ఇంచెస్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే పొందుతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ పొందుతుంది. ఇది 4జీబీ, 8జీబీ ర్యామ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 5,000 mAh బ్యాటరీ కలిగి 18 W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో కాల్స్ చేయడానికి 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కూడా పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ.9,499.రియల్మీ సీ63 (Realme C63)రియల్మీ సీ63 ధర రూ. 8,999 మాత్రమే. ఇది 6.67 ఇంచెస్ హెచ్డీ ప్లస్ స్క్రీన్, 120 Hz వరకు డైనమిక్ రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్నెస్ వంటివి పొందుతుంది. ఈ మొబైల్ 64 జీబీ, 128 జీబీ ర్యామ్ ఆప్షన్ పొందుతుంది. ఇది 5000 mAh బ్యాటరీ కలిగి 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్కు సపోర్ట్ చేస్తుంది.ఇదీ చదవండి: సరికొత్త స్మార్ట్ గ్లాస్: చూడటానికే కాదు.. వినడానికి కూడా!వివో టీ3 లైట్ (Vivo T3 Lite)తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ స్మార్ట్ఫోన్లలో.. వివో టీ3 లైట్ ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 10,000. ఇది 6.65 ఇంచెస్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే, 840 నిట్స్ బ్రైట్నెస్ పొందుతుంది. ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 మిమీ జాక్ కూడా పొందుతుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. కెమెరా సెటప్ కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.రెడ్మీ 13 సీ 5జీ (Redmi 13C 5G)మార్కెట్లో 'రెడ్మీ 13 సీ 5జీ' ధర రూ. 7,199. ఇది 6.74 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేను 600 x 720 పిక్సెల్ల రిజల్యూషన్తో 90Hz రిఫ్రెష్ రేట్.. 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ద్వారా శక్తిని పొందే ఈ ఫోన్ 8 జీబీ, 6 జీబీ ర్యామ్ ఆప్షన్స్ పొందుతుంది. అంతే కాకుండా ఈ ఫోన్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, మరొక 2 మెగా పిక్సెల్ లెన్స్తో ట్రిపుల్ కెమెరా సెటప్ పొందుతుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ వంటి వాటి కోసం ఈ స్మార్ట్ఫోన్ 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.Note: మొబైల్ ధరలు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్, ర్యామ్ వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధరలలో కొంత వ్యత్యాసం కనిపించే అవకాశం ఉంటుంది. -
త్వరలో స్మార్ట్ ఫోన్ అంతం!! తర్వాత రాబోయేది ఇదే..
విశ్వవ్యాప్త సాంకేతికతను అంగీకరించడంలో మనిషి ఎప్పుడూ ముందుంటాడు. దానిని అంతే వేగంగా ఒడిసిపట్టుకుని అంగీకరిస్తుంటాడు కూడా. అయితే దశాబ్దాలపాటు మనందరి జీవితంలో భాగమైన మొబైల్ ఫోన్.. త్వరలో అంతం కానుందా?. అన్నింటికీ నెక్స్ట్(అడ్వాన్స్డ్) లెవల్ కోరుకునే మనిషికి వాటి స్థానంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులోకి రాబోతోంది?..మనిషి జీవితంలో మొబైల్ ఫోన్లు(Mobile Phones) రాక ఒక క్రమపద్ధతిలో జరిగింది. కమ్యూనికేషన్లో భాగంగా.. రాతి కాలం నుంచి నేటి ఏఐ ఏజ్ దాకా రకరకాల మార్గాలను మనిషి అనుసరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో పొగతో సిగ్నల్స్ ఇవ్వడం దగ్గరి నుంచి.. పావురాల సందేశం, డ్రమ్ములు వాయించడం, బూరలు ఊదడం లాంటి ద్వారా సమాచారాన్ని ఇచ్చుపుచ్చుకునేవాడు. కొన్ని ఏండ్లకు అది రాతపూర్వకం రూపంలోకి మారిపోయింది. ఆపై.. ఆధునిక యుగానికి వచ్చేసరికి టెలిగ్రఫీ, టెలిఫోనీ, రేడియో కమ్యూనికేషన్, టెలివిజన్, మొబైల్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్-ఈమెయిల్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా.. ఆపై మోడ్రన్ కమ్యూనికేషన్(Modern Communication)లో భాగంగా ఏఐ బేస్డ్ టూల్స్ ఉపయోగం పెరిగిపోవడం చూస్తున్నాం. అయితే.. ఇన్నేసి మార్పులు వచ్చినా దశాబ్దాల తరబడి మొబైల్ ఫోన్ల డామినేషన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాలక్రమంలో మనిషికి ఫోన్ ఒక అవసరంగా మారిపోయిందది. మరి అలాంటిదానికి అసలు ‘అంతం’ ఉంటుందా?అమెరికా వ్యాపారవేత్త, ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు, ప్రస్తుత మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్(Mark Zuckerberg) సెల్ఫోన్ స్థానంలో తర్వాతి టెక్నాలజీ ఏంటో అంచనా వేస్తున్నారు. సెల్ఫోన్ల అంతం త్వరలోనే ఉండబోతోందని, వాటి స్థానాన్ని స్మార్ట్ గ్లాసెస్ ఆక్రమించబోతున్నాయని అంచనా వేస్తున్నారు.రాబోయే రోజుల్లో వేరబుల్ టెక్నాలజీ(ఒంటికి ధరించే వెసులుబాటు ఉన్న సాంకేతికత) అనేది మనిషి జీవితంలో భాగం కానుంది. సంప్రదాయ ఫోన్ల కంటే స్మార్ట్ గ్లాసెస్ను ఎక్కువగా వినియోగిస్తాడు. వీటిని వాడడం చాలా సులువనే అంచనాకి మనిషి త్వరగానే వస్తాడు. అవుట్డేటెడ్ విషయాలను పక్కన పెట్టడం, ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నప్పుడు మనమూ అంగీకరించడం సర్వసాధారణంగా జరిగేదే. నా దృష్టిలో రాబోయే రోజుల్లో తమ చుట్టుపక్కల వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేందుకు స్మార్ట్ గ్లాసెస్(Smart Glasses)లాంటివి ఎక్కువగా వాడుకలోకి వస్తుంది. ఆ సంఖ్య ఫోన్ల కంటే కచ్చితంగా ఎక్కువగా ఉంటాయి’’ అని జుకర్బర్గ్ అభిప్రాయపడ్డారు.అలాగే 2030 నాటికి సెల్ఫోన్ల వాడకం బాగా తగ్గిపోతుందని.. దానికి బదులు స్మార్ట్గ్లాసెస్ తరహా టెక్నాలజీ వాడుకలో ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే వేరబుల్ టెక్నాలజీ ఖరీదుతో కూడుకున్న వ్యవహారమని.. అలాగని దానిని అందరికీ అందుబాటులోకి తేవడం అసాధ్యమేమీ కాదని, అంచలంచెలుగా అది జరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. స్మార్ట్ఫోన్లతోపాటు వాటికి అనువైన స్మార్ట్ యాక్ససరీస్కు మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఉంటోంది. తాజా సర్వేల ప్రకారం.. గత ఐదేళ్లుగా స్మార్ట్ వేరబుల్స్ వినియోగం పెరుగుతూ వస్తోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్ కంపెనీలు సైతం సరికొత్త ఫీచర్స్తో స్మార్ట్ వేరబుల్స్ను విడుదల చేస్తున్నాయి. అందునా స్మార్ట్గ్లాసెస్ వినియోగమూ పెరిగింది కూడా. రేబాన్ మెటా, ఎక్స్ రియల్ ఏ2, వచుర్ ప్రో ఎక్స్ఆర్, సోలోస్ ఎయిర్గో విజన్, అమెజాన్ ఎకో ఫఫ్రేమ్స్, లూసిడ్ తదితర బ్రాండ్లు మార్కెట్లోకి అందుబాటులోకి ఉన్నాయి. యాపిల్ కంపెనీ యాపిల్ విజన్ ప్రో పేరిట మార్కెట్కు తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. మరికొన్ని కంపెనీలు కూడా ఇంకా ఈ లిస్ట్లో ఉన్నాయి.ఇదీ చదవండి: జుకర్బర్గ్ చేతికి అత్యంత అరుదైన వాచ్!! -
మార్కెట్లోకి షావొమీ రెడ్మీ-14సీ 5జీ.. బడ్జెట్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల దిగ్గజ కంపెనీ షావొమీ (Xiaomi) సరికొత్త 5జీ ఫోన్ను విడుదల చేయనుంది. రెడ్మీ -14సీ 5జీ (Redmi 14C 5G) పేరుతో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ స్మార్ట్ఫోన్ భారతీయ వినియోగదారుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ తయారు చేశామని కంపెనీ ప్రతినిధి సందీప్ శర్మ తెలిపారుహైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సరికొత్త స్మార్ట్ఫోన్ ఫీచర్లను వివరించారు. భారత్లో 5జీ స్మార్ట్ఫోన్ల వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ కేవలం 16 శాతం మంది వినియోగదారులు మాత్రమే 5జీ ఫోన్లు కలిగి ఉన్నారని.. మరింత మంది అత్యధిక వేగంతో పని చేసే 5జీ ఫోన్లను అందుబాటులోకి తెచ్చే క్రమంలో భాగా షావొమీ రెడ్మీ-14సీని అందుబాటులోకి తెచ్చిందని ఆయన వివరించారు. స్టార్లైట్ బ్లూ, స్టార్డస్ట్ పర్పుల్, స్టార్గేజ్ బ్లాక్ పేరుతో ప్రత్యేకంగా డిజైన్తో కూడిన మూడు రంగుల్లో ఈ స్మార్ట్ఫోన్ లభిస్తుందని తెలిపారు.నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ డిజైన్..రెడ్మీ - 14సీ 5జీలో స్మార్ట్ఫోన్లో అత్యాధునిక స్నాప్డ్రాగన్ 4జెన్-2 ప్రాసెసర్ను ఉపయోగించారు. నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ (Processor) అర్కిటెక్చర్ కారణంగా సెకనుకు 2.5 జీబీబీఎస్ల వేగాన్ని అందుకోగలగడం దీని ప్రత్యేకత. 5జీ వేగాలను అందుకునేందుకు వీలుగా ఎక్స్-61 మోడెమ్ను ఏర్పాటు చేశారు. స్క్రీన్ సైజ్ 6.88 అంగుళాల హెచ్డీ (HD) డిస్ప్లే కాగా.. రెఫ్రెష్ రేటు 120 హెర్ట్ట్జ్. అలాగే డాట్ డ్రాప్ డిస్ప్లే కలిగి ఉండి.. గరిష్టంగా 600 నిట్స్ ప్రకాశాన్ని ఇస్తుంది.ఇక స్టోరేజీ విషయానికి వస్తే 12 జీబీల ర్యామ్ (RAM) (6జీబీ + అవసరమైతే మరో 6 జీబీ) కలిగి ఉంటుంది. 128 జీబీల రామ్ సొంతం. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా ఒక టెరాబైట్ వరకూ స్టోరేజీని పెంచుకోవచ్చు. 50 ఎంపీల ఏఐ-డ్యుయల్ కెమెరా వ్యవస్థతోపాటు 8 ఎంపీల సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షావొమీ హైపర్ ఓఎస్పై పని చేస్తుంది.ధర.. అందుబాటులోకి ఎప్పుడు?రెడ్మీ 14సీ 5జీ ఈ నెల 10వ తేదీ నుంచి షావోమీ స్టోర్లతోపాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్లలోనూ అందుబాటులోకి రానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ కలిగగిన ప్రాథమిక మోడల్ ధర రూ.9999లు కాగా.. స్టోరేజీ 128 జీబీ, మెమరీ నాలుగు జీబీలుండే ఫోన్ ధర రూ.10,999లు.. 6 జీబీ మెమరీ, 128 జీబీ స్టోరేజీ ఉన్న ఫోన్ ధర రూ.11,999లు అని సందీప్ శర్మ తెలిపారు. -
కొత్త సంవత్సరంలో లేటెస్ట్ ఐఫోన్.. బంపర్ డిస్కౌంట్
కొత్త సంవత్సరంలో ఐఫోన్ (iPhone) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీ డీల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఫ్లి ప్కార్ట్ (Flipkart) ఐఫోన్ 15 (iPhone 15)పై గొప్ప డీల్ని తీసుకొచ్చింది. ఈ డీల్ని సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.ఇలా చేస్తే రూ.50,999కే ఐఫోన్ 15యాపిల్ (Apple) అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 15 అసలు ధర 128జీబీ వేరియంట్కు రూ.69,900 లుగా ఉంది. ఇదే ఐఫోన్ 15 గ్రీన్ కలర్ వేరియంట్ ఫ్లిప్కార్ట్లో రూ. 57,999 ధరతో లిస్ట్ అయింది. అన్ని ఇతర కలర్ వేరియంట్లు రూ. 58,999 వద్ద ఉన్నాయి.అయితే మీరు ఈ ఫోన్ను రూ.50,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్ టీజర్ చిత్రం ప్రకారం.. ఐఫోన్ 15పై రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాత ఫోన్ ఉన్నట్లయితే ఆ ఫోన్ ద్వారా రూ. 6000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఆఫర్ల తర్వాత, ఫోన్ ప్రభావవంతమైన ధర రూ. 50,999. అయితే ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ ఫోన్ పరిస్థితి, బ్రాండ్, మోడల్పై ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 15 స్పెక్స్ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేతో వస్తుంది. ఫోన్లో యాపిల్ బయోనిక్ ఎ16 (Bionic A16) చిప్సెట్ ఉంటుంది. ఇది 5-కోర్ జీపీయూతో వస్తుంది. ఫోన్లో డైనమిక్ నాచ్ కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే.. యూఎస్బీ టైప్-సి పోర్ట్ వస్తుంది. ఛార్జింగ్ కేబుల్ ఫోన్ బాక్స్లోనే వస్తుంది. -
వివో ఎక్స్200 సిరీస్.. ఇలాంటి కెమెరా తొలిసారి
మొబైల్స్ తయారీ సంస్థ వివో తాజాగా భారత్లో ఎక్స్200 సిరీస్ విడుదల చేసింది. వీటిలో వివో ఎక్స్200 ప్రో, వివో ఎక్స్200 ఉన్నాయి. భారత్లో తొలిసారిగా 200 మెగాపిక్సెల్ జైస్ అపోక్రోమాటిక్ టెలిఫోటో కెమెరా, 6,000 ఎంఏహెచ్ సెమీ–సాలిడ్ సేŠట్ట్ బ్యాటరీని వివో ఎక్స్200 ప్రో మోడల్కు పొందుపరిచారు.6.78 అంగుళాల ఆమర్ గ్లాస్ డిస్ప్లేతో తయారైంది. 50 ఎంపీ జైస్ ట్రూ కలర్ మెయిన్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సైతం జోడించారు. ఎక్స్200 మోడల్ 6.67 అంగుళాల షాట్ ఆల్ఫా గ్లాస్ డిస్ప్లేతో రూపుదిద్దుకుంది. 50 ఎంపీ వీసీఎస్ ట్రూ కలర్ మెయిన్ కెమెరా, 50 ఎంపీ జైస్ టెలిఫోటో కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు ఉంది.ఫన్టచ్ ఓఎస్ 15, జెమినై అసిస్టెంట్, ఏఐ ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, వివో ఏఐ లైవ్ కాల్ ట్రాన్స్లేషన్ వంటి హంగులు ఉన్నాయి. ఎక్స్200 ప్రారంభ ధర రూ.65,999 కాగా, ఎక్స్200 ప్రో ధర రూ.94,999 ఉంది. -
8 గంటలు ఫోన్ లేకుండా.. రూ.లక్ష బహుమతి
ప్రస్తుత రోజులలో స్మార్ట్ ఫోన్కు మనుషులు ఎంతలా బానిసలయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ లేకుండా నిమిషం ఉండాలన్న కష్టమే. కానీ చైనాలో ఒక మహిళ ఎనిమిది గంటల పాటు మొబైల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉండే పోటీలో విజేతగా నిలిచి 10,000 యువాన్లను (రూ.1,16,000) గెలుచుకుంది.స్థానిక జిము న్యూస్ రిపోర్ట్ ప్రకారం, పోటీ నవంబర్ 29న చాంగ్కింగ్ మునిసిపాలిటీలోని ఒక షాపింగ్ సెంటర్లో జరిగింది. 100 మంది దరఖాస్తుదారుల నుండి ఎంపిక చేసిన పది మంది ఈ పోటీలో పాల్గొన్నారు. వీరు తమకు కేటాయించిన బెడ్పై ఎనిమిది గంటలు గడపవలసి ఉంటుంది. పోటీకి ముందు, వారి నుంచి మొబైల్ ఫోన్లను తీసేసుకున్నారు. ఐప్యాడ్లు, ల్యాప్టాప్లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా వాడటానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులతో కాలింగ్ సౌకర్యం మాత్రమే పాత మొబైల్ ఫోన్ ఉపయోగించవచ్చు.పోటీ జరుగుతున్నంత సేపూ బెడ్ మీదే ఉండాలి. టాయిలెట్ కు వెళ్లొచ్చు. పానీయాలు, భోజనం అక్కడికే అందించారు. పోటీదారులు నిద్రలోకి జారుకోకూడదు. ఎటువంటి ఆందోళనను ప్రదర్శించకూడదు. ఇందుకోసం వారి నిద్ర, ఆందోళన స్థాయిలను పర్యవేక్షించడానికి వారి చేతి మణికట్టుకు పట్టీలను అమర్చారు. చాలా మంది పోటీదారులు పుస్తకాలు చదవడం ద్వారానో లేదా కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం ద్వారానో సమయాన్ని గడిపారు. చివరికి, డాంగ్ అనే మహిళ 100కి 88.99 స్కోర్ను సాధించి ఛాంపియన్గా నిలిచారు. -
మరో సంచలనానికి సిద్దమవుతున్న జియో.. త్వరలో 5జీ స్మార్ట్ఫోన్
అక్టోబర్ నెలలో రిలయన్స్ జియో అతి తక్కువ ధర వద్ద రెండు 4జీ మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే బాటలో చౌకైన 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకురావడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ యోచిస్తున్నట్లు సమాచారం.భారతదేశపు అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో.. సరసమైన 5జీ స్మార్ట్ఫోన్ను తయారు చేయడానికి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చురర్ (OEMs), యూఎస్ చిప్మేకర్ క్వాల్కామ్తో జత కట్టనుంది. ఈ విషయాన్ని జియో వైస్ ప్రెసిడెంట్ సునీల్ దత్ వెల్లడించారు.రిలయన్స్ జియో అన్ని స్మార్ట్ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. పరికరాల తయారీదారులు & బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోంది. 5జీ స్మార్ట్ఫోన్ నెట్వర్క్ను మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. వినియోగదారులకు సరసమైన పరికరాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని సునీల్ దత్ పేర్కొన్నారు.భారతదేశ టెలికామ్ ల్యాండ్స్కేప్ను విప్లవాత్మకంగా మార్చిన చరిత్ర జియోకు ఉంది. 2016లో సంస్థ జియో ఫోన్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 999 మాత్రమే, నెలకు రూ. 123తో ప్రారంభమయ్యే సరసమైన రీఛార్జ్లను అందించింది. కాబట్టి ఇది మార్కెట్లో 10 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.ఇక రాబోయే జియో 5జీ స్మార్ట్ఫోన్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. అయితే ఇది మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది. దీని ధర ఎంత ఉండొచ్చు? అనే చాలా వివరాలు రాబోయే రోజుల్లో అధికారికంగా వెల్లడవుతాయి. -
టాలీవుడ్ స్టార్ నటుడు.. ఇప్పటికీ రూ.2 వేల ఫోన్తోనే!
టాలీవుడ్లో విలక్షణ నటుడు ఎవరంటే టక్కున ఆయన పేరు గుర్తుకొస్తుంది. అతను మరెవరో కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. తనదైన నటనతో అలరించే పోసాని కృష్ణమురళి. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన హావభావాలు, నటన చూస్తే చాలు చిరకాలంగా గుర్తుండిపోతాయి. అయితే సినీ ప్రియుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో చూసేద్దామా?ప్రస్తుతం కాలమంతా డిజిటల్ యుగం. చేతిలో ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచమంతా తిరిగేసి రావొచ్చు. ప్రస్తుతం ఆలాంటి యుగమే నడుస్తోంది. ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండటం అంతా ఈజీ కాదు. కానీ అలా ఉండి చూపించారాయన. ఇప్పటికీ ఉంటున్నారు కూడా. తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్పనటుడుగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి. ఇప్పటికీ ఆయన వాడుతున్న నోకియా ఫోన్ విలువ కేవలం రెండువేల రూపాయలే. ఈ కాలంలో ఇంత సింపుల్గా జీవించడమంటే మామూలు విషయం కాదు.సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పోసాని కేవలం నోకియా ఫోన్కే పరిమితం కావడం చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తాను టీవీలో వార్తలు, సినిమాలు, సీరియల్స్ చూస్తానని అంటున్నారు. కానీ వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి గురించి తనకు తెలియదని పోసాని అన్నారు. ఈ నోకియా ఫోన్ రిలీజైనప్పుడు కొన్నదేనని ఆయన వెల్లడించారు. ఏదేమైనా ఈ డిజిటల్ యుగంలో నోకియా ఫోన్ వాడటం అంటే గొప్పవిషయం మాత్రమే కాదు.. తప్పకుండా అభినందించాల్సిందే.పోసాని కృష్ణమురళి ఇంటర్నెట్ లేని పాత “నోకియా “ కీప్యాడ్ ఫోన్ వాడతారు.. వాట్సప్ అంటే ఏంటో తెలీదట.. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ గురించి తెలీనే తెలియదట 🙏🙏 pic.twitter.com/JsW6R4g4LW— ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) November 19, 2024 -
జాగ్రఫీ బోధించే గ్లోబ్..!
పెద్దలకు, పిల్లలకు నచ్చే ఆట బొమ్మలు చాలా అరుదు. అలాంటి వాటిలో ఈ ఆర్బూట్ ఎర్త్ ఒకటి. ఇదొక గ్లోబ్ బొమ్మ మాత్రమే కాదు, వర్చువల్ వరల్డ్ జాగ్రఫీ టీచర్ కూడా! ఈ గ్లోబ్ను ఐప్యాడ్కు లేదా స్మార్ట్ఫోన్కు కనెక్ట్ చేసుకుని వాడాలి. ఈ బొమ్మ ప్యాకేజీ బాక్స్లో మొత్తం పది అంగుళాల ఇంటరాక్టివ్ ఏఆర్ వరల్డ్ గ్లోబ్, పాస్పోర్ట్, వివిధ స్టాంప్స్, దేశాల జెండాలు, జంతువుల స్టిక్కర్లలతో పాటు ఒక హెల్ప్ గైడ్ ఉంటుంది. గ్లోబ్ను యాప్ ద్వారా ఐప్యాడ్ లేదా స్మార్ట్ఫోన్కు కనెక్ట్ చేసుకొని, ప్రపంచంలోని ఏ ప్రాంతాన్నయినా ఎంచుకుంటే, అప్పుడు అది పూర్తి యానిమేషన్ చిత్రాలతో ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలన్నింటినీ చూపిస్తుంది. ఇందులో జాగ్రఫీకి సంబంధించిన చిన్న చిన్న టాస్క్లు కూడా ఉంటాయి. వాటిని ఈ గ్లోబ్తో పాటు ఇచ్చే స్టాంపులు, స్టిక్కర్లతో పూర్తి చేయవచ్చు. ప్రపంచంలోని ఏ దేశాన్ని అయినా ఇట్టే గుర్తుపట్టేలా చిన్నారులకు నేర్పిస్తుంది ఈ గ్లోబ్. మూడు నుంచి ఐదేళ్ల వయసు గల పిల్లలకు ఇదొక మంచి బహుమతి. దీని ధర రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంటుంది. వివిధ ఆన్లైన్ స్టోర్స్లలో దొరుకుతుంది. (చదవండి: ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్తో అవాంఛిత రోమాలకు చెక్..!) -
కొత్త ఆండ్రాయిడ్15లో అబ్బురపరిచే ఫీచర్లు
సరికొత్త గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 అందుబాటులోకి వచ్చేసింది. స్మార్ట్ఫోన్లను మరింత మెరుగ్గా చేసేందుకు ఇందులో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. వీటిలో అబ్బురపరిచే కొన్ని ఫీచర్లను ఇక్కడ తెలుసుకుందాం..ప్రైవేట్ స్పేస్ప్రైవేట్ స్పేస్ అనేది వర్చువల్ లాకర్. వ్యక్తిగతమైన, గోప్యమైన యాప్లను ఇక్కడ ఉంచవచ్చు. ఈ యాప్లను మీరు మాత్రమే యాక్సెస్ చేయగలిగేలా భద్రతను ఇస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఫోన్ ఇచ్చే పేరెంట్స్కు ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, షాపింగ్ వంటి యాప్లు ఇక్కడ సురక్షితంగా ఉంటాయి.చార్జింగ్ లిమిట్ ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గిపోతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆండ్రాయిడ్ 15లో 80% లిమిట్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా బ్యాటరీ తొందరగా దెబ్బతినకుండా నివారించుకోవచ్చు.థెఫ్ట్ ప్రొటెక్షన్ఆండ్రాయిడ్ 15లో తీసుకొచ్చిన థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ అసాధారణ చర్యలతో మీ ఫోన్ను ఎవరైనా చోరీ చేయడానికి ప్రయత్నించి ఉంటే తెలియజేస్తుంది. ఒక వేళ మీ ఫోన్ చోరీకి గురైతే మీ డేటాను రక్షించడానికి, ఫ్యాక్టరీ రీసెట్ చేయకుండా ఇది ఆటోమేటిక్గా లాక్ చేస్తుంది. మీ ఫోన్ నంబర్ని ఉపయోగించి వేరొక ఫోన్ నుంచి మీ ఫోన్ను లాక్ చేయవచ్చు.అడాప్టివ్ వైబ్రేషన్కొందరికి రింగ్ టోన్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఫోన్ను వైబ్రేషన్ లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకుంటారు. మీటింగ్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. అయితే దీని వల్ల కొన్నిసార్లు కాల్స్ వచ్చినప్పుడు గుర్తించలేం. దీని పరిష్కారం కోసమే ఆండ్రాయిడ్ 15లో అడాప్టివ్ వైబ్రేషన్ ఫీచర్ ఇచ్చారు. సందర్భానికి అనుగుణంగా దానంతట అదే వైబ్రేషన్ను అడ్జెస్ట్ చేస్తుంది.యాప్ పెయిర్స్తరచూ స్ప్లిట్ స్క్రీన్ ఉపయోగించేవారి కోసమే ఈ ఫీచర్. ఏవైనా రెండు యాప్లను జతగా వినియోగించేవారు వాటిని సేవ్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. వీటిని హెమ్ స్క్రీన్పై షార్ట్కట్స్గా సేవ్ చేసుకోవచ్చు.యాప్ ఆర్కైవింగ్ఫోన్లో స్టోరేజ్ అయిపోయినప్పుడు పాత యాప్లను వదిలించుకోవాలి. అయితే యాప్ను అన్ఇన్స్టాల్ చేయడం వలన దాని డేటా మొత్తం పోతుంది. మళ్లీ ఇన్స్టాల్ చేస్తే మొదటి నుండి సెటప్ చేయాలి. దీన్ని పరిష్కరించడానికి గూగుల్ గతంలో ప్లేస్టోర్కి యాప్ ఆర్కైవింగ్ని జోడించింది. ఇప్పుడిదే ఫీచర్ను ఆండ్రాయిడ్ 15తో ఇన్బిల్ట్గా తీసుకొచ్చింది. తొలగించిన యాప్ను మళ్లీ ఇన్స్టాల్ చేసినప్పడు పాత డేటా అలాగే ఉంటుంది.శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్శాటిలైట్ ద్వారా ఎస్ఎంస్లు పంపించే ఈ సరికొత్త ఫీచర్ను ఆండ్రాయిడ్ 15లో ప్రకటించినప్పటికీ ప్రస్తుతానికి దీన్ని ఉపయోగించలేం. క్యారియర్లు ఈ సర్వీస్కు ధర నిర్ణయించే పనిలో ఉన్నాయి. దీని కోసం కొంత కాలం వేచి ఉండవలసి ఉంటుంది. -
ఖరీదైన గూగుల్ పిక్సెల్ ఫోన్ సగం ధరకే!
ఖరీదైన స్మార్ట్ఫోన్ను భారీ తగ్గింపుతో కొనాలనుకుంటే ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం బిగ్ దీవాళి సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ కంపెనీకి చెందిన పిక్సెల్ 8 (Google Pixel 8) ఫోన్పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.గూగుల్ పిక్సెల్ 8 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 82,999 కాగా ఫ్లిప్కార్ట్ సేల్లో ఈ ఫోన్ను రూ. 42,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలా గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ను రూ. 36,499కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు ఈ ఫోన్పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. మీ పాత ఫోన్ ఇస్తే దాని కండిషన్ ఆధారంగా రూ. 42,500 వరకు తగ్గింపు పొందొచ్చు.గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు ఈ ఫోన్లో 6.2 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే అందించారు. 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో ఫుల్హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. Titan M2 సెక్యూరిటీ చిప్తో వచ్చిన ఈ ఫోన్లో ప్రాసెసర్ కోసం T3 చిప్సెట్ ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్స్, 12 మెగాపిక్సెల్స్ డ్యూయల్ రియిర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 10.5 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ సంగతికొస్తే ఈ ఫోన్లో 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేసే 4575 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. -
‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లు ఎందుకు?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఫీచర్ ఫోన్లకు ఆదరణ మాత్రం తగ్గడంలేదు. అయితే వివిధ కారణాలతో చాలామంది ఇంకా ఫీచర్ ఫోన్లవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రాథమిక కమ్యునికేషన్ కోసం ఈ ఫీచర్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు.స్మార్ట్ఫోన్లతో పోలిస్తే బ్యాటరీ లైఫ్ అధికంగా ఉంటుంది.కేవలం కాల్స్, టెక్ట్స్ మెసేజ్లు చేయడానికి వీలుగా దీన్ని అధికంగా వాడుతున్నారు.కొన్ని ఆఫీసుల్లో వివిధ కారణాల వల్ల స్మార్ట్ఫోన్లను అనుమతించడం లేదు. దాంతో చాలామంది ఉద్యోగులు తప్పక ఈ ఫీచర్ ఫోన్ను కొనుగోలు చేస్తున్నారు.స్మార్ట్ఫోన్ ఉన్నా కూడా నిత్యం దూర ప్రయాణాలు చేసేవారు బ్యాకప్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు.ఫోన్లకు సంబంధించి సింప్లిసిటీని ఇష్టపడేవారు వీటిని కొనుగోలు చేస్తున్నారు.ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఫీచర్ ఫోన్లను తీసుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు ఫోన్ కావాలని మారాం చేసి తీసుకుని కిందపడేసినా పెద్దగా నష్టం ఉండదు.వృద్ధులు, కంటి చూపు సరిగా లేనివారు ఈ ఫీచర్ ఫోన్లను సులువుగా వినియోగించవచ్చు.ఆర్థిక స్థోమత సరిగాలేని వారు ఈ ఫీచర్ ఫోన్లను ఎంచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ఫోన్ మార్కెట్ 2018-2030 మధ్య కాలంలో ఏటా 3.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. భారత్లో 2023 రెండో త్రైమాసికం లెక్కల ప్రకారం అంతకుముందు ఏడాది అదే త్రైమాసికంతో పోలిస్తే తొమ్మిది శాతం ఈ ఫోన్ల అమ్మకాలు పెరిగాయి.ఇదీ చదవండి: ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలంఇటీవల రిలయన్స్ జియో కంపెనీ 4జీ నెట్వర్క్ సదుపాయం కలిగిన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 సమావేశంలో భాగంగా ఈ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి ధర రూ.1,099గా నిర్ణయించారు. అయితే రిటైలరనుబట్టి ఈ ధరలో మార్పులుంటాయని గమనించాలి. -
ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. కేంద్రం హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. కోట్ల మంది యూజర్లు గూగుల్ యాజమాన్యంలోని ఓఎస్ మీద ఆధారపడుతున్నారు. శాంసంగ్ గెలాక్సీ, గూగుల్ పిక్సెల్, వన్ ప్లస్, వివో వంటి చాలా కంపెనీలు తమ స్మార్ట్ఫోన్ సిరీస్లలో ఆండ్రాయిడ్ ఓఎస్ను అమలు చేస్తున్నాయి.స్మార్ట్ఫోన్ల వినియోగం భారీగా పెరగడంతో బ్యాంకింగ్, లొకేషన్ వంటి ఇతర సమాచారాల కోసం దీని మీదనే ఆధారపడుతున్నారు. ఇవన్నీ స్మార్ట్ఫోన్లోనే నిక్షిప్తమై ఉంటాయి. ఈ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి గూగుల్ ఎప్పటికప్పుడు ఓఎస్ను అప్డేట్ చేస్తూ ఉంటుంది. కానీ యూజర్లు ఓఎస్ను అప్డేట్ చేయకుండా అలాగే వినియోగిస్తూ ఉంటారు. అప్డేట్ చేయకుండా ఉపయోగించడం వల్ల స్మార్ట్ఫోన్లోని సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్స్ 12, 12ఎల్, 13, 14 యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఓఎస్లో అనేక లోపాలున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది. ఓఎస్ అప్డేట్ చేయకపోవడం వల్ల మోసగాళ్ళు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేను విశ్వసిస్తున్నాను.. భారత్ సాధిస్తుందిCERT-In ప్రకారం.. ఫ్రేమ్వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్లు, కెర్నల్, ఆర్మ్ కాంపోనెంట్, ఇమాజినేషన్ టెక్నాలజీస్ కాంపోనెంట్స్, యూనిసో కాంపోనెంట్లు, క్వాల్కామ్ కాంపోనెంట్లు, క్వాల్కామ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్లలో లోపాలున్నాయని తెలుస్తోంది. కాబట్టి ఓఎస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. లేకుండా మీ సమాచారం మొత్తాన్ని ఇతరులు హ్యాక్ చేసి తెలుసుకోగలరు. -
స్మార్ట్ఫోన్ యూజర్లకు ఊరట: బ్రెయిన్ కేన్సర్తో సంబంధం లేదు!
స్మార్ట్ఫోన్ వాడకంతో బ్రెయిన్ కేన్సర్ వస్తుందని ఇప్పటిదాకా చాలా భయపడ్డాం. సెల్ఫోన్ రేడియేషన్ దుష్ర్పభావానికి సంబంధించి పలువురు నిపుణులు హెచ్చరించారు కూడా. అయితే తాజా అధ్యయనం మాత్రం స్మార్ట్ఫోన్లకు, బ్రెయిన్ కేన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడినా, ముఖ్యంగా పడుకునేటపుడు దిండుకింద మొబైల్ పెట్టుకుని పడుకున్నా, పసిపిల్లలకు దగ్గరగా ఉంచి, రేడియేషన్ ప్రభావం ఉంటుందిని, తీవ్రమైన ప్రమాదకరమైన జబ్బులొస్తాయనే ఆందోళన ఇప్పటివరకు ఉండేది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ వినియోగానికి, మెదడు కేన్సర్ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడింది. వైర్లెస్ టెక్నాలజీ వినియోగంలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, మెదడు కేన్సర్లో పెరుగుదల లేదని మంగళవారం ప్రచురించిన ఒక రివ్యూలో తెలిపింది. సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులకు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్లను ఉపయోగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రచురితమైన అనేక రీసెర్చ్ పేపర్లను సైతం అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించినట్లు అధ్యయనం పేర్కొంది. కాగా డబ్ల్యూహెచ్ఓ , ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్లు ఉపయోగించే రేడియేషన్ నుంచి వచ్చే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు ఖచ్చితమైన ఆధారాలు లేవని గతంలో చెప్పాయి, అయితే మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చాయి. ఈ నేపత్యంలో తాజా స్టడీ ఆసక్తికరంగా మారింది. -
మనలాగే.. ఐస్మార్ట్ దర్పణం!
ముఖంపై ముడతలు, నల్ల మచ్చలను గుర్తిస్తుంది ఇంట్లో ఉండి కూడా మన చర్మం గురించి తెలుసుకోవచ్చు ప్రస్తుతం నగరంలో పెరుగుతున్న స్మార్ట్ మిర్రర్స్ వాడకం బ్యూటీ పార్లర్లలో అధునాతన మిర్రర్స్ వినియోగంచర్మ సౌందర్య సాధానాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోతోంది. ఒకప్పుడు అమ్మాయిలకు మాత్రమే.. కానీ నేడు పురుషులు కూడా అందం కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో సౌందర్య సాధానాల వాడకం విపరీతంగా పెరిగింది. 2023లో వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.135 కోట్లు. 2026 నాటికి రూ.230 కోట్లకు ఎగబాకనున్నదని నిపుణుల అంచనా. నగరాల్లో కాలుష్యం, ఎండ, దుమ్ము కారణంగా అనేక చర్మ సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి రక్షణకు చాలామంది మార్కెట్లో దొరికిన అనేక రకాల క్రీములు, జెల్స్, పౌడర్లు, సోప్లు, ఫేస్ వాష్లు వాడేస్తున్నారు. ఎలాంటి చర్మానికి ఎలాంటి సాధనాలు వాడాలనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు. మరి మన చర్మం తత్వం ఎలా ఉందో తెలుసుకోవడం ఎలా..? అందుకే మన లాంటి వారి కోసమే నేనున్నా అంటూ వచ్చేసింది స్మార్ట్ మిర్రర్. ఇది మన చర్మ సమస్యలను ఇట్టే చెప్పేస్తుంది.. సాధారణ అద్దంలో చూసుకుంటే మన ముఖం ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ స్మార్ట్ మిర్రర్లో మాత్రం మన ముఖంలో ఉన్న లోపాలన్నీ కనిపిస్తాయన్న మాట. కళ్ల కింద నలుపు, నల్ల మచ్చలు, రంధ్రాలు, ముడతలు, గీతలు, మన చర్మం స్వభావం వంటి విషయాలు వెంటనే చెప్పేస్తుంది. మన ముఖంలో ఉన్న సమస్యలను కచ్చితత్వంతో పసిగట్టి మనకు విశ్లేషణ అందిస్తుంది. దీన్నిబట్టి మనం ఎలాంటి చికిత్స తీసుకోవాలనే అంచనాకు రావొచ్చు. ఇటీవల పలు బ్యూటీ పార్లర్స్లో కూడా దీని వాడకం విరివిగా పెరిగిపోయింది. సొంతంగానూ వాడుకోవచ్చు.. చాలా కంపెనీలు స్మార్ట్ మిర్రర్స్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ట్యాబ్ పరిమాణంలో ఉండే ఈ స్మార్ట్ మిర్రర్ దాదాపు రెండున్నర కేజీల బరువు ఉంటుంది. దీనికి ఒక హెచ్డీ కెమెరా ఉంటుంది. దీని ముందు ముఖం పెట్టగానే కొన్ని ఫొటోలు తీస్తుంది. ఆ ఫొటోలను విశ్లేషించి మన చర్మం తత్వాన్ని చెప్పేస్తుంది. స్మార్ట్ ఫోన్ మాదిరిగానే మన వెంటే తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా వాడుకోవచ్చు. దీని ద్వారా మన చర్మంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయనే విషయాలను గుర్తించి, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాస్త జాగ్రత్త మరీ.. ఏదైనా పరికరంలో కెమెరాలు ఉన్నాయంటే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని వాడనప్పుడు మూసేసి ఉంచడం మంచిది. కాకపోతే కొన్ని స్మార్ట్ మిర్రర్స్ వాడకంలో లేనప్పుడు ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది. దీంతో కాస్త వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉంటుంది. మనం స్మార్ట్ మిర్రర్గా వాడనప్పుడు కెమెరాలు క్లోజ్ అయిపోయి.. సాధారణ అద్దంలాగే వాడుకోవచ్చు. హైటెక్ మిర్రర్ కూడా.. ఇంట్లోనే కాకుండా బ్యూటీ పార్లర్స్లో కూడా ఎక్కువగా స్కిన్ అనలైజర్లను ఇటీవల వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ మిర్రర్ ఇచి్చన ఇన్పుట్స్ ఆధారంగా శరీర తత్వానికి తగ్గట్టు సౌందర్యసాధనాలను వాడుతున్నారు. ఎలాంటి మేకప్ వేస్తే వారి చర్మానికి సూట్ అవుతుందనే విషయంపై ఓ అవగాహనకు వచి్చ, వారికి అలాంటి ఉత్పత్తులనే వాడుతున్నారు.పూర్తిస్థాయి పరిష్కారం కాదు.. స్మార్ట్ మిర్రర్స్ ద్వారా ఆయిల్ స్కిన్, పొడి చర్మమా అని చర్మం తత్వం గురించి తెలుస్తుంది. స్కిన్ ఏజింగ్ ప్రాసెస్ మాత్రమే తెలుపుతుంది. ఎండ లేదా కాలుష్యానికి ఎంతగా ప్రభావితమైందో అర్థం అవుతుంది. వీటి ద్వారా చర్మాన్ని ఎలా కాపాడుకోవాలనే అంచనాకు రావొచ్చు. అయితే చర్మ సంబంధిత వ్యాధుల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వదు. వ్యాధి నిర్ధారణ విషయంలో స్మార్ట్ మిర్రర్స్ను నమ్ముకోవద్దు. అలాంటప్పుడు డెర్మటాలజిస్టును కలిసి చికిత్స తీసుకోవాలి. సొంత వైద్యం చేసుకుంటే మరిన్ని సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. – డాక్టర్ గంగా హరీశ్, డెర్మటాలజిస్టు, ఆర్టీసీ క్రాస్రోడ్స్ -
స్మార్ట్ఫోన్ మార్కెట్ జోరు
దేశీయంగా స్మార్ట్ఫోన్ల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 3.2 శాతం వృద్ధి చెందింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదిక ప్రకారం 3.9 కోట్ల స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ (రిటైలర్లకు తయారీ సంస్థలు సరఫరా చేసే ఫోన్ల సంఖ్య) నమోదైంది. ఇందులో 16.5 శాతం మార్కెట్ వాటాతో చైనా కంపెనీ వివో అగ్రస్థానంలో ఉండగా, 13.5 శాతం వాటాతో అదే దేశానికి చెందిన షావోమి రెండో స్థానంలో నిలిచింది. కొరియన్ సంస్థ శాంసంగ్ అమ్మకాలు 15.4 శాతం క్షీణించడంతో 12.9 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు, మార్కెట్ వాటాపరంగా యాపిల్ 6.7 శాతం వాటాతో ఆరో స్థానంలో ఉన్నప్పటికీ సూపర్ ప్రీమియం సెగ్మెంట్లో (రూ.67,000 పైగా రేటు ఉండే ఫోన్లు) మాత్రం 83 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.నివేదికలోని మరిన్ని విశేషాలు..ఫ్లాగ్షిప్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోతో పాటు వై సిరీస్, మిడ్–ప్రీమియం వి సిరీస్ల్లో వివిధ ధరల శ్రేణిలో ఫోన్లను ఆవిష్కరించిన వివో వరుసగా రెండో త్రైమాసికంలోనూ అగ్రస్థానంలో నిలిచింది.ఎంట్రీ ప్రీమియం సెగ్మెంట్ (రూ.16,000 నుంచి రూ.33,500 వరకు ధర ఉండేవి) వాటా 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. ఈ సెగ్మెంట్ మెరుగైన వృద్ధి కనపర్చగలదని అంచనాలు ఉన్నాయి. చౌక 5జీ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరిస్తున్నప్పటికీ 100 డాలర్ల లోపు (సుమారు రూ.8,400) ధర ఉండే ఎంట్రీ లెవెల్ ఫోన్ల అమ్మకాలకు ఈ ఏడాది సవాళ్లు ఎదురుకావచ్చు. జెన్ఏఐ స్మార్ట్ఫోన్లకు ప్రచారం మరింత పెరగవచ్చు.క్యూ2లో 2.7 కోట్ల 5జీ స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ నమోదైంది. 5జీ స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ వార్షికంగా 49 శాతం నుంచి 77 శాతానికి పెరిగింది. ఇందులోనూ రూ.8,000 నుంచి రూ.16,700 వరకు ధర ఉండే మాస్ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల షిప్మెంట్ 2.5 రెట్లు పెరిగింది. ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!ప్రీమియం సెగ్మెంట్లో (రూ.50,000 నుంచి రూ.67,000 వరకు ధర శ్రేణి) యాపిల్ మార్కెట్ వాటా 61 శాతానికి, శాంసంగ్ వాటా 24 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు 6.9 కోట్లుగా నమోదయ్యాయి. -
ఆ సెగ్మెంట్లో మోస్ట్ పాపులర్ స్మార్ట్ ఫోన్లు ఇవే..?
భారత్లో ఎక్కువగా రూ.10 వేలు నుంచి రూ.20 వేల ధర ఉన్న మొబైల్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఉందని ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కపూర్ తెలిపారు. గత రెండేళ్లుగా మొబైల్ మార్కెట్లోని స్తబ్దత తొలగిపోయిందన్నారు. 5జీ ట్రెండ్ కొనసాగుతుండడంతో చాలా మంది కస్టమర్లు అందుకు అనువుగా ఉంటే ఫోన్లను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..‘భారత మార్కెట్లో రూ.10,000-రూ.20,000 మధ్య ధర కలిగిన స్మార్ట్ఫోన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే మొత్తం అమ్మకాలు 40% పైగా పెరిగాయి. ఇటీవలి కాలంలో 5జీ ఫోన్లకు డిమాండ్ అధికమైంది. గతంలో రూ.10,000 లోపు ఫోన్లకు ఎక్కువ మార్కెట్ ఉండేది. 5జీ రావడంతో రూ.10,000 కంటే అధిక ధర మొబైళ్లకు డిమాండ్ పెరిగింది. గత రెండేళ్లుగా మార్కెట్లో ఉన్న స్తబ్దత తొలగిపోయింది. ఫీచర్లు అప్గ్రేడ్ చేయడం, తాజా ట్రెండ్కు తగిన లేటెస్ట్ టెక్నాలజీ అందించడం ద్వారా వీటికి మరింత గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘బహిరంగ విచారణ జరగాలి’ -
ప్రపంచంలో పలుచని స్మార్ట్ఫోన్
మొబైల్స్ తయారీ దిగ్గజం మోటరోలా భారత్లో ఎడ్జ్ 50 స్మార్ట్ఫోన్ విడుదల చేసింది. మిలిటరీ గ్రేడ్ ధ్రువీకరణతో ప్రపంచంలో అతి పలుచని స్మార్ట్ఫోన్ ఇదేనని కంపెనీ వెల్లడించింది. 7.79 మిల్లీమీటర్ల మందంతో దీన్ని తయారుచేశారు.ఇందులో ఆన్డ్రాయిడ్ 14 ఓఎస్, 6.67 అంగుళాల ఓలెడ్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్–5, క్వాల్కామ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ మెమరీ, 50 ఎంపీ మెయిన్ సెన్సార్, 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10 ఎంపీ టెలిఫోటో, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు. డాల్బీ అట్మోస్ సౌండ్, 68 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ చార్జింగ్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి హంగులు ఉన్నాయి. మార్కెట్లో దీని ధర రూ.27,999గా ఉంది.ఇదీ చదవండి: భవిష్యత్తులో డిమాండ్ ఏర్పడే విభాగం..! -
రూ.14 వేలకే కర్వ్డ్ డిస్ప్లే ఫోన్
దేశీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ లావా బ్లేజ్ సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. కంపెనీ కొత్త బ్లేజ్-ఎక్స్ (Blaze X) స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఇది కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది.ఈ స్మార్ట్ఫోన్ స్టార్లైట్ పర్పుల్, టైటానియం గ్రే అనే రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కొత్త బ్లేజ్-ఎక్స్ స్మార్ట్ఫోన్ను లావా ఈ-స్టోర్, అమెజాన్ ఇండియా స్టోర్లో జూలై 20 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ చవకైన సరికొత్త స్మార్ట్ఫోన్ రూ. 13,999 ప్రారంభ ధరకు (బ్యాంకు ఆఫర్లతో సహా) లభిస్తుంది.స్పెసిఫికేషన్లుపంచ్-హోల్ డిజైన్తో 6.67-అంగుళాల 120 హెర్ట్జ్ డిస్ప్లే64MP+2MP రియర్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాMediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్33W ఫాస్ట్ ఛార్జింగ్తో 5000mAh బ్యాటరీ -
కొత్త బ్రాండ్ స్మార్ట్ఫోన్ వచ్చేసింది.. వాచ్, బడ్స్ కూడా..
లండన్కు చెందిన టెక్నాలజీ సంస్థ ‘నథింగ్’ సబ్-బ్రాండ్ అయిన సీఎంఎఫ్ మూడు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. సీఎంఎఫ్ ఫోన్ 1, సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 , సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఈ సీఎంఎఫ్ బ్రాండ్ కొత్త ఉత్పత్తులు జూలై 12 నుంచి భారత్లో విక్రయానికి రానున్నాయి. సీఎంఎఫ్ అధికారిక వెబ్సైట్ (cmf.tech) నుంచి, దారి రిటైల్ భాగస్వాముల ద్వారా జూలై 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.సీఎంఎఫ్ ఫోన్ 1 వివరాలు⇒ 6/8GB ర్యామ్, 128GB స్టోరేజీ, ⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్⇒ 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్తో 6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే⇒ 50 MP రియర్ కెమెరా, 16 MP సెల్ఫీ కెమెరా⇒ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 mAh బ్యాటరీ⇒ ఛార్జర్ను రూ. 799కి విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.⇒ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 15,999 ⇒ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999.⇒ మొదటిరోజు సేల్లో రెండు మోడళ్లపై రూ. 1,000 తగ్గింపు. ⇒ ఫ్లిప్కార్ట్లో ఫోన్ కొంటే సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 లేదా CMF బడ్స్ ప్రో 2పై రూ.1,000 తగ్గింపు⇒ బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ రంగులలో లభించే బ్యాక్ కేస్ల ధర రూ.1499 యాక్సెసరీస్లో స్టాండ్ రూ. 799, లాన్యార్డ్ ధర రూ. 799, కార్డ్ కేస్ రూ. 799కి లభిస్తుంది.సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 వివరాలు⇒ 1.32- అంగుళాల అమోల్డ్ ఎల్లప్పుడూ ఆన్ డిస్ప్లే⇒ 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్⇒ హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్, ఒత్తిడి స్థాయిల నిరంతర పర్యవేక్షణ⇒ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్⇒ మార్చుకోగలిగిన బెజెల్ డిజైన్⇒ బ్లూటూత్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్, నోటిఫికేషన్స్, రిమోట్ కెమెరా కంట్రోల్ ⇒ స్టాండర్డ్ మోడల్ ధర రూ. 4,999⇒ వేగన్ లెదర్ రూ.5,499⇒ డార్క్ గ్రే, యాష్ గ్రే, బ్లూ, ఆరెంజ్ రంగుల్లో లభ్యం.⇒ బెజెల్, స్ట్రాప్ సెట్ను అదనంగా రూ. 749కి కొనుగోలు చేయవచ్చు.సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2 వివరాలు⇒ 50 dB హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్⇒ మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం డ్యూయల్ డ్రైవర్లు⇒ ఎల్డీఏసీ టెక్నాలజీ సపోర్ట్⇒ Hi-Res ఆడియో వైర్లెస్⇒ 43 గంటల బ్యాటరీ లైఫ్⇒ స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్⇒ బ్లాక్, వైట్, బ్లూ, ఆరెంజ్ రంగులలో లభ్యం.⇒ ధర రూ. 4,299. -
మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?
దేశీయ మార్కెట్లో మోటోరోలా కంపెనీ తన 'ఎడ్జ్ 50 ఫ్యూజన్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త ఫోన్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారతీయ విపహ్లవు లాంచ్ అయిన కొత్త మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ప్రారంభ ధర రూ. 22999 (8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్), 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24999. ఈ మొబైల్ మే 22 నుంచి మోటోరోలా.ఇన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటిలో ప్రముఖ రిటైల్ స్టోర్లో కూడా విక్రయానికి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలతో రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు.మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ వేగన్ లెదర్ ముగింపుతో హాట్ పింక్,మార్ష్మల్లౌ బ్లూ కలర్వేస్లో మాత్రమే కాకుండా.. పాలీమిథైల్ మెథాక్రిలేట్ (PMMA) ముగింపుతో ఫారెస్ట్ బ్లూ కలర్ ఎంపికలో కూడా అందుబాటులో ఉంటుంది.లేటెస్ట్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7 ఇంచెస్ ఫుల్ HD+ (1,0800x2,400 పిక్సెల్లు) pOLED కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. ఇది క్వాల్కామ్ 4ఎన్ఎం స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్తో పని చేస్తుంది. ఈ మొబైల్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 68 వాట్ టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం ఐపీ68 రేటింగ్ పొందుతుంది.కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై-6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. బయోమెట్రిక్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి. -
బ్యాటరీ కనిపించకుండా ఫోన్ల తయారీ.. ఎందుకో తెలుసా..
నిత్యం మార్పు చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్ఫోన్ జీవితంలో భాగమైంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లేకుండా ఉండలేకపోతున్నారు. కీప్యాడ్ ఫీచర్తో ప్రారంభమైన ఫోన్ల తయారీలో రోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టచ్మొబైల్, మడతపెట్టే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలా వస్తున్న మార్పులో భాగంగా మొబైల్ బ్యాటరీలు కనిపించడంలేదు. మొబైళ్లు వచ్చిన చాలాకాలంపాటు రిమువెబుల్ బ్యాటరీలు చూసి ఉంటారు. కొన్నిసార్లు ఫోన్ ఉన్నట్టుండి హ్యాంగ్ అయితే బ్యాటరీ తీసి, మళ్లీ పెట్టి ఫోన్ స్విచ్ఆన్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు మార్కెట్లో వస్తున్న మొబైళ్లలో రిమువెబుల్ బ్యాటరీలు రావడం లేదు. కంపెనీలు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ 2007లో తన మొదటి ఐఫోన్ను లాంచ్ చేసింది. అందులో మొట్టమొదటగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ టెక్నాలజీని వినియోగించారు. అప్పటి వరకు చాలా కంపెనీలు రిమువెబుల్ బ్యాటరీలతో మొబైళ్లను తయారుచేయడం, జనాలు దానికి బాగా అలవాటుపడడంతో ఐఫోన్పై కొంతమందిలో విముఖత వచ్చింది. కానీ ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు అదే ధోరణి పాటిస్తున్నాయి. అలా క్లోజ్డ్ బ్యాటరీలతో మొబైళ్లను తయారు చేయడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రీమియం డిజైన్ స్మార్ట్ఫోన్లో చాలా కీలకపాత్ర పోషించేది దాని డిజైన్. రిమువెబుల్ బ్యాటరీలతో ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పటికీ వాటి డిజైన్ మీద చాల ప్రభావం చూపిస్తాయి. ఫోన్ను మరింత స్లిమ్గా తయారుచేయాడానికి, మొబైల్ కవర్ను గ్లాస్ / మెటల్తో తయారు చేయడానికి ఈ క్లోజ్డ్ బ్యాటరీ విధానాన్ని ఎంచుకున్నారు. వాటర్, డస్ట్ ప్రూఫ్ ఫోన్ పొరపాటున నీటిలో పడిపోవడం లేదా వర్షంలో తడవడం వంటివి నిత్యం జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఫోన్ వెనకాల కవర్ ఓపెన్ చేసుకునేలా ఉంటే దానిలోకి నీరు, దుమ్ము వంటివి చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోన్లో ఎలాంటి గ్యాప్లు లేకుండా అంతర్గత సీలింగ్ బలంగా ఉంటే నీరు లోపలికి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఫోన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా ఉంటాయి. ఇదీ చదవండి: మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే.. అదనపు ఫీచర్లు ఫోన్ల తయారీ కంపెనీలు నిత్యం ఏదో కొత్త ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేస్తూంటారు. అందులో భాగంగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ ఉన్న ఫోన్లు డ్యుయెల్కెమెరాలు, స్టీరియో స్పీకర్లు, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఇంప్లిమెంట్ చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. -
టెక్ టాక్: ఇన్స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్.. మీకొసమే..!
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీలో కూడా వినూత్న మార్పులు చోటుచూసుకుంటున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్ మన దగ్గరకు వస్తున్నాయి. వాటిలో రెగ్యులర్గా వాడే వస్తువులైనా ఉండొచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామైనా ఉండొచ్చు. ఫీచర్కి తగ్గట్టుగా సరికొత్త టెక్నాలజీ పరికరాలు ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. మరవేంటో చూద్దాం. ఇన్స్టాలో 15 నిమిషాల ఎడిట్ ఫీచర్! మెసేజ్లను పంపిన తరువాత పదిహేను నిమిషాల వరకు ఎడిట్ చేయవచ్చని ప్రకటించింది ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్. పదిహేను నిమిషాల ఈ ఎడిట్ విండో వాట్సాప్లాంటి ఇతర మెసేజింగ్ ప్లాట్ఫామ్లాగే ఉంటుంది. సరిగ్గా అనిపించని మెసేజ్లను సరిచేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. యూజర్లు ఒకే సందేశాన్ని పలుమార్లు ఎడిట్ చేయవచ్చు. ఒకసారి ఎడిట్ చేసిన తరువాత మెసేజ్ ఎడిట్ చేయబడిందనే విషయం హైలెట్ అవుతుంది. యాపిల్ న్యూ మ్యాక్బుక్ ఎయిర్ సైజ్ : 13.30 అంగుళాలు రిజల్యూషన్ : 2560్ఠ1600 పిక్సెల్స్ బరువు (కేజీ) : 1.29 మెటీరియల్ : అల్యూమినియం స్టోరేజ్ : 256జీబి కలర్ : గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే గెలాక్సీ ఎఫ్ 15 లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎఫ్15 గురించి ప్రకటించింది శాంసంగ్. 4/6 జీబి ఆఫ్ ర్యామ్, 128 జీబి ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్తో కూడిన రెండు మెమోరీ వేరియంట్స్తో వస్తోంది. కొన్ని వివరాలు.. డిస్ప్లే : 6.5 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 90 హెచ్ ప్రైమరీ కెమెరా : 50 ఎంపీ బ్యాటరీ : 6,000 ఎఏహెచ్ కలర్స్ : యాష్ బ్లాక్, జాజ్ గ్రీన్, వయోలెట్ ఇవి చదవండి: వరల్డ్ బెస్ట్ లిస్ట్లో భారత ఫిల్టర్ కాఫీ -
రూ.31వేల ఈ లేటెస్ట్ 5జీ ఫోన్ ఇప్పుడు రూ.23వేలే..!
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్లతో కస్టమర్లలో మంచి ఆదరణ పొందిన శాంసంగ్ కంపెనీకి చెందిన ప్రముఖ 5జీ మోడల్ ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఇప్పుడు భారీ డిస్కౌంట్తో రూ.22,999 లకే అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్ రూ.30,999 ప్రారంభ ధరతో గతేడాది లాంచ్ అయింది. రూ. 3,000 తగ్గింపు తాజగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 ఫోన్పై రూ. 3,000 తగ్గింపు లభించింది. దీంతో 6GB+128GB మోడల్ వేరియంట్ రూ.22,999లకే అందుబాటులోకి వచ్చింది. 8GB +128GB వేరియంట్ దాని అసలు ధర రూ. 27,499లకు బదులుగా రూ. 24,499లకే లభిస్తోంది. మరోవైపు 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ. 26,499లకే అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్ ఇండియా వెబ్సైట్తోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5G ఫీచర్లు FHD+ రిజల్యూషన్తో 6.6-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 1080 SoC 8GB వరకూ ర్యామ్, 256GB ఆన్బోర్డ్ స్టోరేజ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 mAh బ్యాటరీ OISతో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ 5MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 13MP సెల్ఫీ కెమెరా స్టీరియో స్పీకర్లు 5G, Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, GPS కనెక్టివిటీ కోసం USB టైప్-సి పోర్ట్ -
భారీగా పెరగనున్న స్మార్ట్ఫోన్ ధరలు - కారణం ఇదే..
2024 జూన్ నుంచి స్మార్ట్ఫోన్ ధరలు భారీగా పెరిగే సూచనలున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలకంటే సుమారు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెమొరీ చిప్ల ధరలు పెరగడంతో వచ్చే త్రైమాసికం నుంచి స్మార్ట్ఫోన్ ధరలు పెరగనున్నట్లు సమాచారం. మార్కెట్ పరిశోధన సంస్థ ట్రెండ్ఫోర్స్ DRAM (మెమరీ చిప్స్) ధరలలో పెరుగుదల ఉందని సూచించింది. ఎందుకంటే శాంసంగ్, మైక్రాన్ కంపెనీలు మార్చి నుంచి ధరల పెరుగుదలను అమలు చేసే అవకాశం ఉంది. ఆ ప్రభావం స్మార్ట్ఫోన్లపై కూడా ఉంటుందని ట్రెండ్ఫోర్స్ తెలిపింది. స్మార్ట్ఫోన్, పర్సనల్ కంప్యూటర్ల వినియోగం భారీగా పెరగడం వల్ల ఏఐ, అధిక పనితీరు కలిగిన మెమొరీ చిప్ల డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో కంపెనీలు చిప్ల ధరలను పెంచనున్నాయి. ఇది మాత్రమే కాకుండా.. చైనీస్ కరెన్సీ యువాన్ బలపడటం వల్ల, అక్కడ నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాల ఖర్చు కూడా భారీగానే ఉన్న కారణంగా ధరలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ఆ కంపెనీ ఉద్యోగుల జాబ్స్ పోయినట్టేనా? సీఈఓ ఏమన్నారంటే.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారించింది. ఇది స్మార్ట్ఫోన్ పరిశ్రమకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం బడ్జెట్ను పెంచింది. అయినప్పటికీ ఇప్పటికే తయారై సరఫరాకు సిద్దమైన ఫోన్స్ ధరలు 3 నుంచి 8 శాతం, కొత్తగా తయారవుతున్న ఫోన్ల మీద 5 నుంచి 10 శాతం ధరలు పెరగవచ్చని, డిమాండ్ను బట్టి ధరలు 10 నుంచి 15 శాతం పెరగవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. స్మార్ట్ఫోన్ కొనుగోలు దారులకు శుభవార్త!
పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర వసూలు చేస్తున్న ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తూ అధికారికంగా ఉత్వరులు జారీ చేసింది. భారత్లో ఆయా స్మార్ట్ఫోన్ కంపెనీలు స్థానికంగా ఫోన్లను తయారు చేయాలంటే.. అందుకు అవసరమయ్యే విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అలా దిగుమతి చేసుకున్నందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి 15 శాతం ఇంపోర్ట్ డ్యూటీని చెల్లించాలి. అయితే, తాజాగా ఈ ఇంపోర్ట్ డ్యూటీని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఇంకా, ఎల్సీడీ ప్యానెల్ల డిస్ప్లే, అసెంబ్లీ భాగాలపై దిగుమతి సుంకాలు 10శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా యాపిల్, శాంసంగ్ కంపెనీలు ఎగుమతులు పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా స్మార్ట్ఫోన్ తయారీ మార్కెట్లో కీలక పాత్రపోషిస్తున్న చైనా, వియాత్నాం వంటి దేశాలతో భారత్ పోటీపడేందుకు అవకాశంగా మారుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక దిగుమతి సుంకం తగ్గింపుతో భారత్లో స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొబైల్ విడి భాగాలపై మొబైల్ తయారీ పరిశ్రమలో భారత్ను అగ్రగామిగా నిలిచేందుకు కేంద్రం మొబైల్ ఫోన్ విడి భాగాలపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించింది. సిమ్ సాకెట్, బ్యాటరీ కవర్, మెయిన్ కవర్, స్క్రూలు, జీఎస్ఎం, యాంటెన్నా వంటి మెకానికల్, ప్లాస్టిక్ ఇన్పుట్ భాగాలతో పాటు ఇతర మొబైల్ ఫోన్ విడి భాగాలపై దిగుమతి సుంకం తగ్గనుంది. -
రోడ్లపై ‘స్మార్ట్ఫోన్ జాంబీ’లున్నాయి జాగ్రత్త..!
అతి ఎప్పుడూ నష్టమే.. అవసరానికి వాడుకోవాల్సిన వస్తువుని కాలక్షేపానికి వాడుకోవడం మొదలెడితే వ్యసనం కాక మరేమవుతుంది..! అదే జరుగుతోందిప్పుడు. స్మార్ట్ఫోన్ వాడుతున్న ప్రతి ముగ్గురిలోనూ ఇద్దరు దానికి బానిసలైపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ అలవాటు వారి భౌతిక, మానసిక ఆరోగ్యాలను దెబ్బతీస్తోందనీ, పరిస్థితి చాలా తీవ్రంగా ఉందనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫోన్, ట్యాబ్లాంటి తెరల వాడకాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోవాలంటున్నారు. అన్నం తినేటప్పుడు, చదువుకునేటప్పుడు, ఆఖరికి పడుకున్నా చేతిలో ఫోను ఉండాల్సిందే. రోడ్డు మీద నడుస్తున్నా, కారు నడుపుతున్నా మరోపక్క ఫోనూ పనిచేయాల్సిందే. సవ్యసాచిలా రెండు పనులూ ఒకేసారి చేస్తున్నామనుకుంటున్నారు కానీ జరుగుతున్న నష్టాన్ని గుర్తించడం లేదు. తాజాగా రోడ్లపై ఫోన్ వినియోగిస్తున్నవారిని ‘జాంబీ’లుగా అభివర్ణిస్తూ బెంగళూరు పోలీసులు ఏకంగా హోర్డింగ్లు తయారుచేయించారు. ‘స్మార్ట్పోన్ జాంబీలున్నాయి జాగ్రత్త’ అని ఓ సైన్బోర్డ్లో రాశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. This signboard in BLR singlehandedly attacked our entire generation pic.twitter.com/iN2OsuGBE5 — Prakriti (@prakritea17) January 19, 2024 ఈ స్పష్టమైన హెచ్చరికతో ఉన్న సైన్బోర్డ్ డిజిటల్ డిస్ట్రాక్షన్ ప్రభావం ప్రజలపై ఏమేరకు ప్రభావం చూపుతుందో తెలియజేస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ‘ఫోన్లు డౌన్, హెడ్స్ అప్..' అని కామెంట్ చేశారు. ఇదీ చదవండి: ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే.. కొన్ని సర్వేల ప్రకారం.. వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోను వాడుతున్న సగటు భారతీయుడు రోజుకు 70 సార్లు ఫోను తీసి చూస్తున్నాడట. అంటే గంటకు మూడుసార్లు. తీసిన ప్రతిసారీ మూడు నిమిషాలు చూసినా రోజుకి మూడున్నర గంటలపైనే. ఆన్లైన్లో అపరిచితులతో ప్రైవేటు సంభాషణలు జరిపినట్లు వెల్లడించిన భారతీయ చిన్నారులు ప్రపంచ సగటు కన్నా 11 శాతం ఎక్కువ. పదిహేనేళ్లలోపు పిల్లల్లో స్మార్ట్ఫోన్ వినియోగం ప్రపంచ సరాసరి 76 శాతం కాగా, మనదేశంలో 83. సైబర్ బెదిరింపులూ దుర్భాషలపై తల్లిదండ్రుల ఆందోళన ప్రపంచ సగటు 57 శాతం కాగా భారత సగటు 47. ఇంత తీవ్రమైన అంశాల్నీ పట్టించుకోని నిర్లక్ష్యం ఏ పరిణామాలకు దారితీస్తుందోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. -
సులభంగా ఓపీ రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: డిజిటల్ వైద్య సేవలు అందించడంలో ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వండిజిటల్ విధానంతో అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలనూ సులభతరం చేస్తోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓపీ రిజిస్ట్రేషన్ను తేలికగా పూర్తి చేస్తోంది. ఈ విధానంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఏపీలోని 909 ప్రభుత్వాస్పత్రుల్లో స్కాన్ అండ్ షేర్ విధానంలో ఓపీ రిజిస్ట్రేషన్ అమలు చేస్తోంది. ఇలా గడిచిన 4 నెలల్లో 23.80 లక్షల ఓపీలు నమోదయ్యాయి.55.04 లక్షలతో యూపీ తొలి స్థానంలో, 24.67 లక్షలతో కర్ణాటక రెండో స్థానంలో ఉన్నాయి. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే ఓపీ కౌంటర్లో వివరాలు నమోదు చేసుకోవాలి. రోగి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవి పూర్తయిన తర్వాత రోగి ఏ సమస్యతో వైద్య సేవలు పొందాలనుకుంటున్నారో తెలుసుకుని, ఆ విభాగానికి రిఫర్ చేస్తూ టోకెన్ ఇస్తారు. దీనికి 5–10 నిమిషాలు పడుతుంది. పెద్దాస్పత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంవల్ల రోగులు ఓపీ రిజిస్ట్రేషన్ కోసం చాలా సమయం క్యూలో వేచి ఉండాల్సి వస్తుంది. అదే క్యూఆర్ కోడ్తో త్వరగా అయిపోతుంది. రోగి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్కు వెళ్లి స్మార్ట్ ఫోన్ ద్వారా కోడ్ స్కాన్ చేసి, టోకెన్ను తీసుకుని డాక్టర్ను సంప్రదించవచ్చు. క్యూలో వేచి ఉండటం, ఇతర అగచాట్లు తప్పుతాయి. ఇలా చేసుకోవాలి.. ► స్మార్ట్ ఫోన్ నుంచి ఆస్పత్రిలో ప్రదర్శించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే యూఆర్ఎల్ కోడ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే..ఆభా,ఆరోగ్యసేతు, వంటి యాప్లు కనిపిస్తాయి ► ఆ యాప్లు ఫోన్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి ► ఆయుష్మాన్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ఆభా) 14 అంకెల గుర్తింపు/ఆభాలో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్/మెయిల్ ఐడీ ద్వారా యాప్లో రిజిస్టర్ అవ్వాలి ► యాప్లోకి లాగిన్ అయితే ఆభా వివరాలు వస్తాయి. వీటిని ఆస్పత్రితో షేర్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఓ నంబర్ వస్తుంది. ఈ టోకెన్కు అరగంట వ్యాలిడిటీ ఉంటుంది. టోకెన్ నంబర్ వచ్చాక ఆస్పత్రిలోని కౌంటర్కు వెళ్లి ఆభా నంబర్, ఫోన్ నంబర్ చెప్పి, ఏ స్పెషాలిటీలో ఓపీ అవసరమో చెబితే సిబ్బంది ఓపీ స్లిప్ ఇస్తారు. దీన్ని తీసుకుని డాక్టర్ను సంప్రదించవచ్చు. -
కృత్రిమ మేధతో నవ ప్రపంచం?
స్మార్ట్ ఫోన్ల రాకతోనే జనం వాస్తవ ప్రపంచానికి దూరమయ్యారని ఒక విమర్శ. అలాంటిది జనరేటివ్ ఏఐ మనదాకా వస్తే? అప్పుడు వర్చువల్ ప్రపంచంలో మరింత కూరుకుపోతామా? మన చాలా పనులను ఏఐ చేయడం మొదలుపెడితే, మన చేతికి బోలెడు సమయం చిక్కుతుంది. అప్పుడు మనం తోటలో తిరుగుతూనో, వ్యాయామం చేస్తూనో గడపవచ్చు. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గిపోతుంది. పిల్లల శక్తిసామర్థ్యాలకు తగ్గట్టుగా రోబోలు చదువులు చెబుతాయి. కానీ ఎప్పుడో మొదలైన డిజిటల్ విప్లవ ఫలాలు ఇప్పటికీ అందరికీ చేరనేలేదు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీ కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా మారుతుందా అన్నది ప్రశ్న! ఒక సగటు భారతీయుడు ఏడాదికి 2,300 గంటల సమయం స్మార్ట్ ఫోన్ మీద గడిపే స్తున్నాడని ఒక అంచనా. 580 గంటలు ఓటీటీ(ఓవర్ ద టాప్) ప్లాట్ ఫామ్లలో కంటెంట్ను వెతుక్కుని వాటిని చూసేందుకు ఉపయోగి స్తున్నారు. సోషల్ మీడియాలోనూ దాదాపు ఇదే రకమైన ధోరణి కనిపి స్తోంది. సైబర్ మీడియా రీసెర్చ్ ద్వారా మేము జరిపిన అధ్యయనంలో ఈ పోకడలు వెల్లడయ్యాయి. కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగ దారుల తీరుతెన్నులను పరిశీలించేందుకు మేము ఈ సర్వేల్లాంటివి చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్లు, టెక్నాలజీలతో మన జీవితాలు ఎంతగా పెన వేసుకుపోయాయో సూచిస్తాయి ఈ సర్వే విశేషాలు. చేతిలో కావాల్సినంత సమయం 2024 అంటే ఈ ఏడాది ఇప్పటివరకూ చెప్పుకున్న అంశాలన్నింటిలోనూ విప్లవాత్మక మార్పులు వస్తే? జరగబోయేది ఇదే. అంతా జనరేటివ్ ఏఐ పుణ్యం! 2023లో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ), మరీ ముఖ్యంగా జనరేటివ్ ఏఐ అనేది ప్రపంచం మొత్తాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసింది. టెక్నాలజీ ధోరణులను నిత్యం పరిశీలించే విశ్లేషకుడిగా 2024లో ఈ ఏఐ విషయంలో ఏం జరగబోతోందన్నది నాకెంతో ఉత్సుకత రేకెత్తించే అంశం. అయితే ఒక్కటైతే నిజం. ఈ ఏడాది కృత్రిమ మేధ విస్తృత స్థాయికి చేరుతుందన్నది నా నమ్మకం. జనరేటివ్ ఏఐ అనేది మన చిన్న చిన్న పనులను ఇట్టే చేసేస్తుంది. టెక్ట్స్ జనరేట్ చేయడం, చిత్రాలు, మోడల్స్ను సిద్ధం చేయడం వంటి చాలా పనులను ఆటోమేట్ చేయనుంది. భవిష్యత్తులో ఏం జరుగు తుందన్నది ఒకసారి చూస్తే... ఏఐ, జనరేటివ్ ఏఐ నైపుణ్యాలు కలిగిన వారు మిగిలిన వారికంటే మెరుగైన స్థితిలో ఉంటారు. దీనివల్ల 2024 లోనే కాదు... ఆపై కూడా మన చేతుల్లో బోలెడంత సమయం మిగిలి పోనుంది. ఈ మార్పు పుణ్యమా అని ఉత్పాదకత పెరుగుతుంది. కాసేపు ప్రకృతి ఒడిలో సేద తీరడం మొదలుకొని మన ఫిట్నెస్ గోల్స్ను సాధించుకునేందుకు ప్రయత్నించడం, లేదా తోటపని చేసు కోగలగడం ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుందో ఆలోచించండి. విద్యార్థుల నేస్తం మనుషులు సర్వవ్యాప్తమైన ఏఐ, జనరేటివ్ ఏఐలతో కలిసి జీవించడం అలవాటు అవుతున్న తరుణంలో జనరేషన్ ఆల్ఫా పరిస్థితి ఏమిటి? 2010, అటుపై పుట్టినవాళ్లను జనరేషన్ ఆల్ఫా అంటున్నాం. వీరు కృత్రిమ మేధకు స్థానికుల కింద లెక్క. వీరికి ఏఐ అనేది మునుపటి తరానికి స్మార్ట్ ఫోన్ మాదిరిగా మారి ఉంటుంది. మనతో మాట్లాడగలిగే ఆటబొమ్మలు ఇప్పుడు బోలెడు అందుబాటులోకి వచ్చే శాయి. భావోద్వేగాలను పలికించగల, ఏఐ భాగస్వామి అని పిలు స్తున్న తెలివైన రోబోలు పిల్లలకు వారి శక్తిసామర్థ్యాలకు తగ్గట్టు చదువులు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. వారితోపాటు తాము ఎదిగేందుకు రోబోలు ప్రయత్నిస్తున్నాయి. పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు జనరేటివ్ ఏఐ ఓ కొత్త ప్రపంచాన్ని వారి కళ్లముందు ఆవిష్కరించనుంది. భవిష్యత్తులో పిల్లల భుజాలపై పుస్తకాల సంచి బరువు ఉండకపోవచ్చు. ఇంటరాక్టివ్ సిము లేషన్ ్స, అడాప్టివ్ టెక్ట్స్ బుక్స్, ఏఐ మెంటర్స్... విద్యార్థుల అవస రాలు, ఆశయాలకు అనుగుణంగా బోధించడం మొదలవుతుంది. ఇప్పటిమాదిరిగా బట్టీపట్టే విషయం గత చరిత్ర కానుంది. పిల్లలు గొలుసులన్నీ తెంచుకుని, పిచ్చి పోటీని వదిలించుకుని తమకు నచ్చిన అంశాన్ని చదవుకునే వీలు ఏర్పడుతుంది. ప్రతి దశలోనూ కృత్రిమ మేధ వారికి తోడుగా నిలుస్తుంది. కృత్రిమ మేధ ప్రపంచంలో ఉపా ధ్యాయుల పాత్ర కూడా గణ నీయంగా మారనుంది. సృజనాత్మకత, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా విద్యార్థులు చేసే ప్రయత్నాలకు సహాయం అందించే వారిగా వీళ్లు మారిపోతారు. ఇలాంటి వాతా వరణంలో పెరిగి పెద్దయిన పిల్లలు ఏఐ ఆధారిత టూల్స్, లాంగ్వేజ్ మోడళ్ల సాయంతో భాషా భేదాలను అధిగమిస్తారు. అంతరాలు తగ్గేనా? కృత్రిమ మేధ కచ్చితంగా ఓ అందమైన, సానుకూల భవి ష్యత్తును చూపుతున్నప్పటికీ దీనికి ఇంకో కోణమూ ఉంది. ఇప్పటికే ఉన్న డిజిటల్ అంతరం మరింత పెరుగుతుందా? ఫలితంగా ఏఐ లాంటి అత్యాధునిక టెక్నాలజీ ఫలాలు కేవలం కొందరికి మాత్రమే పరిమితమవుతాయా అన్నది ఇంకో ప్రశ్న. ఎప్పుడో దశాబ్దాల క్రితం మొదలైన డిజిటల్ విప్లవ ఫలాలు ఇప్పటికీ అందరికీ చేరనేలేదు. డిజిటల్ డివైడ్ అని పిలుస్తున్న ఈ అంతరమే పూర్తిగా పూడని నేపథ్యంలో కృత్రిమ మేధ వంటి అత్యాధునిక టెక్నాలజీ కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనం కలిగించేదిగా మారితే ఎలా అన్నది అందోళన కలిగించే అంశం. ఇక మనుషుల మధ్య సంపర్కం ఇంతకుముందులానే ఉంటుందా? మానవ సంబంధాలు మునుపటి మాదిరిగానే కొనసాగుతాయా? ఈ నేపథ్యంలో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా వాడుకోవడం చాలా అవసరమవుతుంది. ప్రైవసీ, వివక్ష, విశ్వసనీయత వంటి విషయాల్లోనూ ప్రశ్నలు మిగిలే ఉంటాయి. ఒక్కటైతే వాస్తవం. ప్రపంచగతిని మార్చేసే శక్తి ఏఐ సొంతం. సమర్థత అనేది అన్ని రంగాల్లోనూ పెరిగిపోయేందుకు ఇది కారణమవుతుంది. ఈ తరం పిల్లలు ఏఐ నేతృత్వంలోని ప్రపంచంలో ఎదుగుతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచంతో మరింత సృజనాత్మకంగా మసలుకునేందుకు వీరికి అవకాశాలు ఎక్కువ. వ్యాసకర్త సైబర్ మీడియా రీసెర్చ్(సీఎంఆర్)లో ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విభాగాధిపతి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
స్మార్ట్ ఫోన్లా ట్యాబ్లను వాడలేరు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు టెక్నాలజీ విద్యను చేరువ చేస్తూ ఉచితంగా అందించిన బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్ల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ ఐటీ సెల్ డిజిటల్ ఇనీషియేటివ్స్ రాష్ట్ర నోడల్ అధికారి సీహెచ్వీఎస్ రమేష్కుమార్ చెప్పారు. గురువారం గుంటూరులో ట్యాబ్ల యాక్టివేషన్పై ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రమేష్కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లను స్మార్ట్ఫోన్లా ఉపయోగించేందుకు ఆస్కారం లేదని, ప్రీ లోడెడ్ యాప్స్ను గూగుల్ సంస్థ ద్వారా బ్లాక్ చేయించినట్లు తెలిపారు. బైజూస్ కంటెంట్తో కూడిన యాప్తో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన స్విఫ్ట్చాట్, ఈ–పాఠశాల, డ్యూలింగో, డిక్షనరీ యాప్లు మినహా మరే ఇతర యాప్లు ట్యాబ్లు ఉండవని స్పష్టం చేశారు. ఇంటర్నెట్తో పనిలేకుండా బైజూస్ కంటెంట్ను విద్యార్థులు చూడవచ్చని.. మిగిలిన 4 యాప్స్ను చూడాలంటే పాఠశాలల్లోని వైఫై ద్వారా కనెక్ట్ కావాలని చెప్పారు. సిమ్కార్డ్ స్లాట్ను బ్లాక్ చేశామని, 256 జీవీ సామర్ధ్యం కలిగిన ఎస్డీ కార్డు ద్వారా 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్లో అన్ని పాఠ్యాంశాలను లోడ్ చేశామని తెలిపారు. డ్యూలింగో యాప్ ద్వారా విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకోవచ్చన్నారు. స్విఫ్ట్ చాట్ యాప్ ద్వారా విద్యార్థి ఏ సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాన్నైనా తెలుసుకోవచ్చని.. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు.. ట్యాబ్లలో ఇన్బిల్ట్గా ఉన్న మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా విద్యార్థుల ట్యాబ్లను ఐటీ సెల్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రమేష్కుమార్ చెప్పారు. ట్యాబ్లలో ఆధునిక భద్రతా వ్యవస్థ ఇమిడి ఉందన్నారు. ఈ ట్యాబ్లను విద్యార్థులు, ఉపాధ్యాయులు మినహా ఇతరులెవ్వరూ వినియోగించేందుకు అవకాశం లేదన్నారు. బ్లాక్ చేసిన యాప్లను అన్లాక్ చేసేందుకు సెల్ఫోన్ షాపులవాళ్లు, ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలకు ప్రభుత్వం సమాచారం చేరవేసిందని తెలిపారు. విద్యార్థులు ట్యాబ్లలో ఏ సబ్జెక్టు ఎంతసేపు చూశారనే సమాచారం కూడా నమోదవుతుందని వివరించారు. సర్వీస్ సెంటర్ల ద్వారా ఉచిత సేవలు ట్యాబ్లలో ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే.. ఆ సంస్థ సర్వీసు సెంటర్ల ద్వారా ఉచిత సేవలు పొందవచ్చని రమేష్కుమార్ చెప్పారు. పని చేయని ట్యాబ్ను సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్కు అందిస్తే, వాళ్లు ఆన్లైన్లో నమోదు చేసి టోకెన్ ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం ఆ ట్యాబ్ను సర్వీసు కేంద్రానికి పంపించి.. బాగు చేయించి మూడు రోజుల వ్యవధిలో తిరిగి అందజేస్తారని చెప్పారు. ట్యాబ్ కింద పడినా పాడవకుండా సురక్షితమైన కవర్ కేస్తో పాటు స్క్రీన్ గార్డు, చార్జర్, ఇయర్ ఫోన్ అందిస్తున్నట్లు చెప్పారు. -
ఆన్లైన్ గేమ్స్తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!?
మహబూబాబాద్: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ ఫోన్ల కారణంగా పిల్లలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటే.. యువకులు, ఆపై పడిన వారు పెడదారి పడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్లో అనేక క్రీడలకు సంబంధించి బెట్టింగ్లకు పాల్ప డడం, రుణాలు తీసుకోవడం, ఆఫర్ల పేరుతో మోసపోతూ దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ, లూడో, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్తో పాటు అనేక రకాల ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. కొంత మంది తేరుకొని వీటికి దూరమవుతుంటే చాలా మంది తమ ఆస్తులను విక్రయించుకునే దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులకు తెలియకుండా వాహనాలు, ఆభరణాలు కూడా తనఖాలు పెట్టి జూదం ఆడుతున్నారు. నర్సంపేట పట్టణంలోని ఓ బ్యాంకు అధికారి కొద్ది రోజుల క్రితం బ్యాంకుకు సంబంధించిన డబ్బులతో ఆన్లైన్ గేమ్స్ ఆడి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో చివరకు జైలు పాలయ్యాడు. ఇలా పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎంతో మంది యువకులు మోసపోతున్నారు. అవగాహన లేక అవస్థలు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత నిత్యం స్మార్ట్ ఫోన్లతో గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు. ఫలితంగా ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, యువతకు అవగాహన లేకపోవడంతోనే ఆన్లైన్ గేమ్స్ ఆడి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆన్లైన్ గేమ్స్పై యువతకు అవగాహన కల్పించి ఆయా కుటుంబాలను శోకసంద్రం నుంచి రక్షించాలని పలువురు పేర్కొంటున్నారు. ఆన్లైన్ గేమ్స్తో ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి, ధనిక వర్గాలకు చెందిన యువతతో పాటు మధ్య వయసు కలిగిన వారు కూడా ఆన్లైన్ ఉచ్చులో పడుతున్నారు. కష్ట పడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఆన్లైన్ క్రీడల్లో పాల్గొంటున్నారు. తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ పొందాలనే ఆశతో ఆన్లైన్ జూదం వైపు మరలుతూ చివరకు అప్పులపాలై క్షణికావేశంలో బలవన్మరణలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాలు కన్నీటిసంద్రంలో మునుగుతున్నాయి. ఘటనలు..! నెక్కొండ మండలం అప్పల్రావుపేటకు చెందిన బాషబోయిన ఉదయ్(20) ఈ ఏడాది జూన్ 24న అర్ధరాత్రి ఆన్లైన్ గేమ్ ఆడాడు. కాగా, ఉదయ్ మొబైల్ ఫోన్కు తల్లి స్వప్న పేరిట బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉంది. ధాన్యం అమ్మిన డబ్బులు రూ.50 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో అదే రోజు ఉదయం జమ అయ్యాయి. రాత్రి ఒంటరిగా ఉన్న ఉదయ్(రమ్మీ) ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా రూ.46 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడిన ఉదయ్.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సంపేట పట్టణంలోని మాధన్నపేట రోడ్డులో ఉంటున్న మిట్టపల్లి సాయిబాబా, మమత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి కుమారుడు ప్రశాంత్ నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సుజాత అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందింది. సాయిబాబా దర్జీ(టైలర్) పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్ ఆన్లైన్ గేమ్తో మోసపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ నవంబర్ 22న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవి కూడా చదవండి: మృతదేహాల కలకలం! అసలేం జరుగుతుంది? -
డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే..
అన్నం తినకుండా మారాం చేస్తున్నారనో.. అల్లరి ఆపడం కోసమో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతికి ఫోన్ ఇస్తుంటారు. తొలుత సరదాగా ప్రారంభమైనప్పటికీ.. క్రమేపీ వారికి అదో వ్యసనంగా మారుతోంది. దీంతో.. రోజులో ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నెల 20న తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని కోరింది. డిసెంబర్ 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తమ కుటుంబాలతో సరదాగా గడపాలని, పిల్లలు వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలని ప్రజలను కోరింది. కంపెనీ చేసిన ఓ సర్వేలో.. 77 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు వివో తెలిపింది. తల్లిదండ్రులకు సైతం ఫోన్ వ్యసనంగా మారిందని పేర్కొంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య అంతరాలు ఏర్పడితే భవిష్యత్తులో సమాజానికి నష్టం కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కొన్ని సర్వేల ప్రకారం.. 42 శాతం మంది 12 ఏళ్ల లోపు వయసు పిల్లలు రోజులో రెండు నుంచి నాలుగు గంటలపాటు ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. 12 ఏళ్ల కంటే పైబడిన పిల్లలు రోజులో 47 శాతం సమయం ఫోన్ చూస్తున్నారు. 69 శాతం పిల్లలకు సొంత ఫోన్లు, ట్యాబ్లు ఉన్నాయట. 12 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు పిల్లలకు ఎలాంటి షరతులు లేకుండా ఇంటర్నెట్ యాక్సెస్ పొందుతున్నారని సర్వేల్లో వెల్లడైంది. 74 శాతం మంది పిల్లలు యూట్యూబ్ చూసేందుకు ఫోన్ వాడుతుంటే, 12 ఏళ్ల పైబడినవారు గేమింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తేలింది. ఇదీ చదవండి: ‘కంపెనీని టేకోవర్ చేసే ప్రతిపాదన లేదు’ -
స్మార్ట్ఫోన్లో వేల కొద్ది బాక్టీరియా.. ఇలా క్లీన్ చేసుకోండి
నిత్యం మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్.. ఎన్నో వేల బ్యాక్టీరియా, వైరస్లకి ఆలవాలమనే సంగతి తెలిసిందే! దాన్ని పర్ఫెక్ట్గా శానిటైజ్ చేయాలంటే.. ఇలాంటి స్టెరిలైజర్ డిసిన్ఫెక్షన్ బాక్స్ ఉండాల్సిందే. ఇందులో 3 నిమిషాలు పెట్టి.. ఆన్ బటన్ నొక్కితే చాలు. 99.99 శాతం క్రిములు నాశనం అవుతాయి. ఫోన్ నీట్గా మారిపోతుంది. ఇక ఈ బాక్స్లో బండి తాళాలు, ఇంటి తాళాలు, మాస్కులతో పాటు.. కళ్లజోడు, బ్లూటూత్, పెన్నులు, నగలు వంటివెన్నో శుభ్రం చేసుకోవచ్చు. ఈ బాక్స్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, వైర్లెస్ మెషిన్లా వాడుకోవచ్చు. భలే ఉంది కదూ! -
అక్టోబర్ నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎందుకంటే!
ఆధునిక కాలంలో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ యాప్ ఆధునిక అవసరాలను అనుకూలంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఇందులో వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ.. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో బహుశా కొన్ని పాత మొబైల్స్లో వాట్సాప్ యాప్ పనిచేయక పోవచ్చు. ఈ కథనంలో ఏ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023 అక్టోబర్ 24 తరువాత ఆండ్రాయిడ్ OS వెర్షన్ 4.1, అంతకంటే అంతకు ముందు వెర్షన్లతో కూడిన ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. ఈ జాబితాలో ఏకంగా 20 కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లు ఉండటం గమనార్హం. సోనీ ఎక్స్పీరియా జెడ్ ఎల్జీ ఆప్టిమస్ జీ ప్రో శాంసంగ్ గ్యాలక్సీ ఎస్2 శాంసంగ్ గ్యాలక్సీ నెక్సస్ హెచ్టీసీ సెన్సేషన్ మోటోరోలా డ్రోయిడ్ రేజర్ (Motorola Droid Razr) సోనీ ఎక్స్పీరియా ఎస్2 మోటోరోలా జూమ్ శాంసంగ్ గ్యాలక్సీ టాబ్ 10.1 ఆసుస్ ఈ ప్యాడ్ ట్రాన్స్ఫార్మర్ (Asus Eee Pad Transformer) ఏసర్ ఐకానియా ట్యాబ్ ఏ5003 శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ హెచ్టీసీ డిజైర్ హెచ్డీ ఎల్జీ ఆప్టిమస్ 2ఎక్స్ సోనీ ఎరిక్సన్ ఎక్స్పీరియా Arc3 నెక్సస్ 7 (ఆండ్రాయిడ్ 4.2కి అప్గ్రేడబుల్) శాంసంగ్ గ్యాలక్సీ నోట్ 2 హెచ్టీసీ వన్ ఇదీ చదవండి: వందే భారత్లో 6 నెలలు అవన్నీ బ్యాన్.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం! ఈ జాబితాలోని మొబైల్స్ అన్నీ దాదాపు పాత మోడల్స్. కావున ఇవి చాలా తక్కువమంది వద్ద మాత్రమే ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే వాట్సాప్ వినియోగిస్తున్న వారు దీన్ని అప్డేట్ చేసుకోవాలి, లేకుంటే వాట్సాప్ ఆపరేటింగ్ సిస్టం ఆగిపోతుంది. మీ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ OS వెర్షన్ చెక్ చేయడం ఎలా? మీ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ OS వెర్షన్ 4.1 లేదా అంతకంటే పాత మొబైల్ అవునా కాదా అని చెక్ చేయాలంటే మీ మొబైల్లో సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి, అబౌట్ ఫోన్ (About Phone) క్లిక్ చేసి అందులో సాఫ్ట్వేర్ వివరాలు చూడవచ్చు. దీన్ని బట్టి మీ మొబైల్ వాట్సాప్ వినియోగానికి ఉపయోగపడుతుందా.. లేదా అనేది తెలిసిపోతుంది. -
చిన్నపిల్లలకు స్మార్ట్ఫోన్ ఇస్తున్నారా? టీనేజ్లో డిప్రెషన్తో..
ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవదంటే అతిశయోక్తికాదు. లేచినప్పటి నుంచి నిద్రకు ఉపక్రమించే వరకు పక్కన స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. సగం పనులు దీనితోనే అవున్నాయంటే మాటలు కాదు. ఒక వైపు స్మార్ట్ ఫోన్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతకుమించి సమస్యలూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఫోన్ పెను ప్రభావం చూపుతోంది. జీవనశైలే మారిపోయింది ప్రస్తుతం 99 శాతం మంది చేతుల్లో స్మార్ట్ఫోన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ ఫోన్ల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 1995 తర్వాత పుట్టిన పిల్లలు తమ కౌమారమంతా స్మార్ట్ఫోన్తోనే గడుపుతున్న మొదటి తరమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్లు వచ్చాక మనిషి జీవన శైలే మారియిందని పేర్కొంటున్నాయి. 1995 తర్వాత పుట్టిన పిల్లలు ఎక్కువ సమయం ఆన్లైన్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. కబుర్లు, సరదాలు, ఆట పాటలూ అన్నీ అందులోనే. పుస్తకాలు చదవడం, నిద్రపోవడం, స్నేహితులతో గడపడం, శారీరక ఆటలకు కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. ఈ జీవన శైలి వలన పిల్లల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులూ హెచ్చరిస్తున్నారు. ముందు తరాలవారితో పోల్చుకుంటే జీవన నైపుణ్యాల్లో ఇప్పటి పిల్లలు వెనకబడిపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. వీటికి అదనంగా ఒంటరితనంతోపాటు ఇతర మానసిక సమస్యలూ ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు తేల్చాయి. స్మార్ట్ ఫోన్లు పిల్లలు, టీనేజర్ల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపి సృజనాత్మకతను చంపేస్తున్నాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. అమెరికా సైకాలజీ ప్రొఫెసర్ జీన్ అధ్యయనమూ ఇదే విషయాన్ని మరింత విడమరిచి చెప్పింది. టీనేజర్లు తీవ్ర నిరాశలోకి.. టీనేజర్ల ఆరోగ్యం, ప్రవనర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్, ఐజెన్ కన్సెల్టింగ్ వైద్యురాలు జీన్ త్వెంగే అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలిసి 13 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పది లక్షలకుపైగా పిల్లపై పరిశోధనలు చేశారు. టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుపుతన్నారనేది మానసిక ఆరోగ్య కోణంలో ఓ ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. ఆమె 2011 నుంచి ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు బాగా పెరగడం గుర్తించినట్టు చెప్పారు. జీవితం వృథా అనే భావనకు చాలామంది వస్తున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలని, ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేర పెరిగాయని వివరించారు. తమను తాము గాయపరుచుకునేంతగా అవి విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికల్లో ఈ ప్రమాదకర ధరోణి రెండు మూడింతలు పెరిగిందని పేర్కొన్నారు. కొన్నేళ్లలోనే టీనేజర్ల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని జీన్ తన అధ్యయనంలో వివరించారు. ఫోన్ వ్యసనంలా.. మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లుకుపైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారట. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే భావనలో ఉంటున్నారట. ఇదొక వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడేం చేయాలి? ► రోజుకు రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం డిజిటల్ మీడియాకు కేటాయించడం మంచిది. ఇది మానసిక ఆరోగ్యానికి ఆనందానికి దోహదపడుతుంది. ► అయితే డిజిటల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా విచారానికి కారణమవుతుంది. ► మన సమయం మన చేతిలోనే ఉంటుంది. ఉండాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ► స్నేహితులతో టచ్లో ఉండేందుకు మాత్రమే సోషల్ మీడియాను వాడాలి. ఒకవేళ పిల్లలకు ఫోన్ చాలా అవసరమని భావిస్తే ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫోన్ మాత్రమే ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు చిన్న పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వకూడదు. అది వారికి అలవాటు చేయడం వల్ల వారి పెరుగుదలతోపాటు మెదడుపై ప్రభావం చూపుతోంది. మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పెద్దలు కూడా అవసరానికి మించి స్మార్ట్ఫోన్లు వాడకూడదు. దీనివల్ల మతిమరుపు నిద్రలేమి సమస్యలకు లోనవుతారు. మీపిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చినట్లు అనుమానం ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. -
పిల్లలు అడిగనవన్నీ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ట్రాప్లో పడ్డట్లే!
ఈ మధ్యకాలంలో సెల్ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా రెండేళ్ల లోపు చిన్నారులు కూడా ఫోన్లో బొమ్మలు చూస్తూ గంటల తరబడి గడిపేస్తున్నారు. భోజనం తినాలన్నా, నిద్ర పోవాలన్నా ఫోన్ పక్కన ఉండాల్సిందే అనేంతలా అలవాటుపడుతున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల చేతిలో ఫోన్ పెడితే అన్నం తినిపించడం సులువు అని ఈజీగా మొబైల్ అలవాటు చేస్తున్నారు. ఇది చిన్నారుల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది మానసికంగా, శారీరకంగా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 1. మీ పిల్లల స్నేహితులందరికీ సెల్ ఫోన్ ఉందని, మీ బిడ్డకు కూడా సెల్ ఫోన్ కొనిచ్చారా? 2.మీ పిల్లలు హోంవర్క్ పుస్తకం మర్చిపోతే మీరు స్కూల్ కు వెళ్లి ఇచ్చి వస్తున్నారా? 3.మీ పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కు కావాల్సిన మెటీరియల్ కోసం మీరు షాపుల చుట్టూ తిరుగుతున్నారా? 4.మీ బిడ్డను చాలా యాక్టివిటీస్ లో చేర్పించడం వల్ల అసలు ఖాళీ సమయమే ఉండటం లేదా? 5. మీరు పికప్ చేసుకోవడానికి వెళ్లేందుకు కాస్తంత లేటయితే వెంటనే మీకు మెసేజ్ వస్తుందా? వీటిలో ఏ ఒక్కటి చేస్తున్నా.. మీరు పేరెంట్ ట్రాప్లో చిక్కుకున్నట్లే. పిల్లలు కష్టపడకూడదని చాలామంది పేరెంట్స్ పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేస్తుంటారు. అలాగే వాళ్ల ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చేస్తుంటారు. ఫ్రెండ్స్ తో, టీచర్స్ తో వారికి ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులే పరిష్కరిస్తుంటారు. దీనివల్ల పిల్లలు తమకు సొంతంగా సమస్యలను పరిష్కరించుకొని, స్కిల్స్ సాధించుకునే అవకాశాన్ని కోల్పోతారు. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కోసం ఇతరులవైపు చూసే, ఇతరులపై ఆధారపడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యే ప్రవర్తననే parenttrap(పేరెంట్ ట్రాప్)అంటారు. కంట్రోల్ ట్రాప్(Control Trap): తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా నియంత్రించడం, వాళ్లు ఏం చేస్తున్నారో, సోషల్ మీడియా వాడకం వరకు ప్రతీది నిర్దేశించినప్పుడు ఇది జరుగుతంది. పిల్లల భద్రత, శ్రేయస్సు కోసం కొంత నియంత్రణ అవసరం. అయితే అతిగా నియంత్రించడం వల్ల పిల్లల్లో ఆందోళన, స్వీయగౌరవ సమస్యలు ఏర్పడతాయి. క్రిటిసిజమ్ ట్రాప్(Criticism Trap): కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం విమర్శిస్తుంటారు, నిరంతరం వారిలో తప్పులను వెతుకుతుంటారు. ఇది వారి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కంపారిజన్ ట్రాప్(Comparison Trap): చాలామంది పేరెంట్స్ పిల్లలను తోబుట్టువులతోనూ, తోటివారితోనూ పోల్చుతుంటారు. నిరంతరం ఇతరులతో పోల్చడం వారి ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. గివింగ్ ట్రాప్(Giving Trap): ఇతర పిల్లలకు ఉన్నవి తమకు లేవని పిల్లలు బాధపడకూడదని తల్లిదండ్రులు భావిస్తారు. అందువల్ల వారు అడగకుండానే అన్నీ తెచ్చి పెడతారు. దీనివల్ల పిల్లలకు అవసరంలేని వస్తువులను ఇచ్చే ఉచ్చులో పడతారు. గిల్ట్ ట్రాప్(Guilt Trap): పిల్లల అసంతృప్తికి తాము కారణం కాకూడదని పేరెంట్స్ భావిస్తారు. తమ బిడ్డ కలత చెందడానికి కారణం తామేనని తల్లిదండ్రులు భావించి అపరాధ భావనకు లోనవుతారు. దాన్ని అధిగమించేందుకు పిల్లలు కోరినవీ, కోరనివీ కొనిచ్చి తమ భారం దింపుకుంటారు. హర్రీడ్ ట్రాప్(Hurried Trap): తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తమ శక్తిమేరకు ప్రతిదీ చేయాలని కోరుకుంటారు. దీనివల్ల పిల్లల అవసరాలు వెంటనే తీరతాయని భావిస్తుంటారు. తక్షణ తృప్తి (#instantgratification)కి అలవాటు పడతారు. అలా తక్షణ తృప్తి దొరకనప్పుడు తీవ్రంగా నిరాశ చెందుతారు, విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. పర్మీసివ్ ట్రాప్(Permissive Trap): కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేసినా ఏమీ అనరు, ఏం చేయాలనుకున్నా అనుమతిస్తారు. పిల్లలతో సంఘర్షణ నివారించడానికి ఇది సులువైన మార్గంగా భావిస్తారు. కానీ దీనివల్ల పిల్లల్లో స్వీయ క్రమశిక్షణ లోపిస్తుంది, విచ్చలవిడితనానికి దారితీయవచ్చు. ప్రెజర్ ట్రాప్(Pressure Trap): తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను పంచుకోవడం గర్వంగా భావిస్తారు. పోటీలో పిల్లలు ముందుంటే సంతోషిస్తారు, ఏమాత్రం వెనుకంజ వేసినా ఆందోళన పడుతుంటారు. ముందుకు దూసుకుపోవాలని పిల్లలను ఒత్తిడి చేస్తారు. రెస్క్యూ ట్రాప్(Rescue Trap): తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలను చూసి బాధపడతారు. వాటినుంచి బయట పడేయడం ద్వారా వారిని ‘రక్షించాలని’ భావిస్తారు, బయటపడేస్తారు. పర్యవసానంగా కొన్ని పనులు జరగాలంటే వేచి ఉండటం ( delayed gratification) అవసరమనే విషయం పిల్లలకు ఎప్పటికీ అర్థం కాదు. అలాగే తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే అవకాశం ఉండదు. పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే... పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే ఎప్పటికప్పుడు తమ ప్రవర్తనను గమనించుకుంటూ, అంచనా వేసుకుంటూ, అవసరమైనమేరకు మార్చుకునేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. ► ప్రతి బిడ్డ ప్రత్యేకమని, ఎవరి ప్రత్యేక సామర్థ్యాలు వారికి ఉంటాయని గుర్తించాలి. ► బిడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పోల్చకూడదు. ► సరిహద్దులను నిర్ణయించి స్థిరంగా అమలు చేయాలి. వాటి పరిధిలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛనివ్వాలి. ► కష్టమైన అంశాలపై మాట్లాడటానికి, అవసరమైనప్పుడు కష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ► విమర్శించడం కంటే నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించడంపై దృష్టి పెట్టాలి. ► పిల్లల బలాలను, విజయాలను, సానుకూల ప్రవర్తనలను ప్రశంసించాలి. ► పిల్లలు తమ పనులు తాము చేసుకునేలా ప్రోత్సహించండి. ► తమకు కావాల్సినవి తాము కష్టపడి సాధించుకోవడం నేర్పించండి. ► తమ సమస్యలు తామే పరిష్కరించుకునేందుకు ప్రోత్సహించండి. -డా. మీ నవీన్ నడిమింటి(9703706660), ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో మత్స్య సంపదను వేటాడే వేళ గంగపుత్రులు ఆపదలో చిక్కుకుంటే.. రక్షించేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ఇస్రో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెల్ సిగ్నల్ అందకపోయినా.. రక్షణ పరిధిలోకి తీరం నుంచి సముద్రంలో 12 నాటికల్ మైళ్ల వరకు రాష్ట్ర పరిధిలో ఉండగా.. 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు దేశీయ జలాలు. 200 నాటికల్ మైళ్ల దూరం దాటితే అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లు తీరం నుంచి 4 నాటికల్ మైళ్ల వరకు వెళ్తుంటాయి. మోటరైజ్డ్ బోట్లు 12 నాటికల్ మైళ్ల వరకు, మెకనైజ్డ్ బోట్లు 12 నుంచి 200 నాటికల్ మైళ్ల వరకు వెళ్లి వేట సాగిస్తుంటాయి. రాష్ట్రంలో 1,610 మెకనైజ్డ్, 22 వేల మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లు ఉన్నాయి. వీటిపై ఆధారపడి 1.60 లక్షల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఇప్పటివరకు వేట సాగించే మత్స్యకారులకు ఇన్కాయిస్ సంస్థ శాటిలైట్ ద్వారా సముద్రంలో మత్స్య సంపద ఎక్కువగా ఉండే ప్రదేశాలను (పీఎఫ్జెడ్–పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్) గుర్తించి బోట్లలో అమర్చే ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఏఐఎస్), మత్స్య శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్స్ ద్వారా 12 నాటికల్ మైళ్ల పైబడి దూరం వెళ్లే మెకనైజ్డ్ బోట్లకు సమాచారం అందిస్తున్నాయి. ఈ సమాచారం సంప్రదాయ, మోటరైజ్డ్ బోట్లకు అందించే అవకాశం లేదు. పైగా ఇది 2–3 రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. మరో వైపు ఏదైనా ఆపదలో ఉంటే తమ క్షేమ సమాచారం మొబైల్స్కు ఉండే సిగ్నల్స్పై ఆధారపడి ఉంటుంది. సిగ్నల్ మిస్ అయితే తీరానికి కమ్యూనికేషన్ పూర్తిగా తెగిపోతుంది. ఈ పరిస్థితికి ఇక చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. 100 శాతం సబ్సిడీపై.. కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్పాండర్)ను 12 నాటికల్ మైళ్లకు పైబడి దూరం వెళ్లే మరబోట్లు, మెకనైజ్డ్ బోట్లకు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.36,400 విలువైన ఈ పరికరాన్ని 100 శాతం సబ్సిడీతో అమర్చనున్నారు. తీరంలో గస్తీ కోసం అభివృద్ధి చేసిన ఐఆర్ఎన్ఎస్ (నావిక్), జీపీఎస్ శాటిలైట్స్తో ఈ డివైస్ అనుసంధానమై పనిచేస్తుంది. బోట్లలోని మత్స్యకారుల వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే చాలు సిగ్నల్తో సంబంధం లేకుండా రెండువైపులా సమాచారాన్ని పరస్పరం పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. సమయం వృథా కాకుండా.. మరోవైపు ఇన్కాయిస్ సంస్థ అందించే పీఎఫ్జెడ్ సమాచారాన్ని కచ్చితమైన లొకేషన్స్తో బోట్లలోని మత్స్యకారులకు పంపడం వలన వారు క్షణాల్లో అక్కడకు చేరుకొని వేట సాగించడం ద్వారా సమయం, ఆయిల్ ఆదా అవుతుంది. పట్టుబడిన మత్స్యసంపదను ఏ సమయంలో ఏ రేవుకు తీసుకొస్తే మంచి రేటు వస్తుందో కూడా ఈ డివైస్ ద్వారా సమాచారం పంపిస్తారు. దీంతో తీరానికి చేరుకున్న తర్వాత తగిన ధర లేక మత్స్యకారులు నష్టపోయే పరిస్థితి ఉండదు. అయితే ఈ డివైస్ పనిచేయాలన్నా, సిగ్నల్తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా.. సంబంధిత బోట్లలో రీ జనరేట్ చేసుకునే పవర్ సిస్టమ్ అవసరం ఉంటుంది. వైపరీత్యాల వేళ అప్రమత్తం చేయొచ్చు తుపాను హెచ్చరికలు, అకాల వర్షాలు, ఈదురు గాలులకు సంబంధించిన సమాచారాన్ని ఈ డివైస్ ద్వారా లోతు జలాల్లో వేట సాగించే అన్నిరకాల బోట్లకు క్షణాల్లో పంపించి వారిని అప్రమత్తం చేయవచ్చు. లోతు జలాల్లో ఉన్నవారిని సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకునేలా హెచ్చరికలు జారీ చేయొచ్చు. ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే ఈ డివైస్ ద్వారా సమాచారం పంపితే శాటిలైట్ ద్వారా గ్రౌండ్ స్టేషన్కు చేరుతుంది. అక్కడ నుంచి క్షణాల్లో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేçస్తున్న మోనిటరింగ్ స్టేషన్స్తోపాటు కోస్ట్ గార్డు, మెరైన్, నేవీ విభాగాలతోపాటు సమీపంలో ఉండే కమర్షియల్ వెసల్స్కు కూడా సమాచారం అందిస్తారు. తద్వారా క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ప్రాణాలతో రక్షించే అవకాశం ఉంటుంది. దశల వారీగా అమర్చుతాం కమ్యూనికేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్ (ట్రాన్స్పాండర్)ను లోతు జలాల్లో మత్స్య వేట సాగించే బోట్లకు దశల వారీగా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తొలి దశలో 4,484 బోట్లలో అమర్చనున్నాం. అక్టోబర్ నాటికి వీటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. – వీవీ రావు, జేడీ, మత్స్య శాఖ (సముద్ర విభాగం) -
స్మార్ట్ఫోన్ కోసం తాను చనిపోలేదు..! బ్రతికే ఉన్నాడు..!!
మహబూబ్నగర్: తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్ ఇప్పించడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఖమ్మంపాడులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గోవిందమ్మ, మునెప్ప దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడైన పరశురాముడు(20) చదువుకోలేదు. దీంతో రైతు కూలీగా పని చేసేవాడు. తన తోటి స్నేహితులతో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, తనకు ఇప్పించాలని తల్లిదండ్రులను కోరాడు. ఇప్పుడు అవసరం లేదని మందలించారు. దీంతో మనస్తాపం చెంది గురువారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు యువకుడిని గద్వాల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శుక్రవారం కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఇద్దరికి అవయవదానం.. తాను మరణిస్తూ మరో ఇద్దరికి ప్రాణదాతగా నిలిచాడు పరశురాముడు. తల్లిదండ్రులు ఆస్పత్రిలోనే తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. కళ్లు శుక్లాలను వైద్యులు సేకరించారు. అదేవిధంగా కిడ్నీల టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపించారు. అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబసభ్యులను అక్కడి వైద్యులు, గ్రామస్తులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే మరో పక్క అభినందించారు. తల్లిదండ్రల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివానందంగౌడ్ తెలిపారు. -
సారీ... మీ పేరు మరచిపోయాను!
ఢిల్లీకి చెందిన 22 సంవత్సరాల శ్రుతి అగర్వాల్ ఒకప్పుడు సినిమా చూస్తే.. ఆ సినిమా గురించి ఆర్డర్ తప్పకుండా సీన్ బై సీన్ చెప్పేది. ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన సినిమా అయినా సరే ఈరోజే చూసినంత ఫ్రెష్గా చెప్పేది. అలాంటి శ్రుతికి రెండు వారాల క్రితం చూసిన సినిమా కథ కూడా గుర్తుండడం లేదు అనేది ఒక విషయం అయితే కొత్త వారి పేర్లు త్వరగా మరచిపోవడం మరో విషయం. తనకు మతిమరుపు దగ్గరవుతుంది అని చెప్పడానికి ఈ రెండే కాదు ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.శృతికి ఎలాంటి దురలవాట్లు లేవు. వేళకు నిద్ర పోతుంది. సరిౖయెన ఆహారం తీసుకుంటుంది. మరి ఎందుకు తన జ్ఞాపకశక్తి బలహీనం అవుతోంది? తనను తాను విశ్లేషించుకునే సమయంలో ఎప్పుడో స్కూల్ రోజుల్లో చదువుకున్న ‘యూజ్ ఇట్ ఆర్ లూస్ ఇట్’ అనే సామెత గుర్తుకువచ్చింది. అందులోనే తన సమస్యకు సగం పరిష్కారం కనిపించింది. స్కూల్, కాలేజీ రోజుల్లో ఏదైనా లెక్క చేయాలంటే మనసులో క్యాలిక్యులేట్ చేసుకోవడమో, కాగితం మీద చేయడమో జరిగేది. ఇప్పుడు మనసుతో పనిలేదు. చిన్నాచితకా లెక్కలకైనా స్మార్ట్ఫోన్లోని క్యాలిక్యులేటర్పై అతిగా ఆధారపడుతుంది. ఒక శుభకార్యం లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఆ తేదీని మదిలో ముద్రించుకునేది.. ఇప్పుడు సెల్ఫోన్లోని రిమైండర్కు పని చెబుతోంది. తన మెదడును సరిగా ఉపయోగించుకోకపోవడం వల్లే తనకు మతిమరపు దగ్గరవుతోందని గ్రహించిందామె. తనకు ఇప్పుడు కావాల్సింది బ్రెయిన్కు ఎక్సర్సైజ్ అనే విషయం అర్థమైంది. దీని గురించిన సమాచార శోధనలో తనను ఆకట్టుకున్నది.... పురాతనమైన మెమోరైజేషన్ స్ట్రాటజీ... మెథడ్ ఆఫ్ లోకి. మెమోరీ కోచ్, అథ్లెట్ బోరిస్ నికోలాయ్ వందల పేర్లను కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో గుర్తు పెట్టుకొని చెబుతాడు. నికోలాయ్ నెదర్లాండ్స్కు చెందిన న్యూరోసైంటిస్ట్ మార్టిన్ డ్రెస్లర్తో కలిసి ఒక అధ్యయనం నిర్వహించాడు. అందులో భాగంగా 20 ఏళ్ల వయసు ఉన్న 51 మందిని మూడు గ్రూప్లుగా విభజించారు. మొదటి గ్రూప్ చేత ‘మెథడ్ ఆఫ్ లోకి’ ప్రాక్టిస్ చేయించారు. రెండోగ్రూప్ చేత షార్ట్టర్మ్ మెమొరీ గేమ్స్ ఆడించారు. మూడో గ్రూప్కు మాత్రం ఎలాంటి కార్యక్రమం ఇవ్వలేదు. ఆరువారాల తరువాత... మొదటి గ్రూప్ మెమొరీ పవర్ పెరిగింది. రెండు, మూడు గ్రూప్లలో పెద్దగా మార్పు కనిపించలేదు. పురాతనమైన ‘మెథడ్ ఆఫ్ లోకి’ ప్రాధాన్యత కోల్పోలేదు అని చెప్పడానికి ఇదొక బలమైన ఉదాహరణ. అందుకే యూత్ దీనిపై ఆసక్తి కనబరుస్తోంది. ‘ మెథడ్ ఆఫ్ లోకి’ని మెమొరీ జర్నీ, మెమొరీ ప్యాలెస్... మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. ‘లోకి’ అనేది ‘లోకస్’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం... ప్రదేశం. సమాచారాన్ని మనసులోని ఊహాజనిత ప్రదేశాల్లో స్థిరపరుచుకోవడమే ‘మెథడ్ ఆఫ్ లోకి’ టెక్నిక్.ఉదాహరణకు...717, 919, 862, 9199.. లను గుర్తు పెట్టుకోవాలనుకుంటే మనసులో సుపరిచితమైన ప్రదేశాన్ని ఆవిష్కరించుకోవాలి. సపోజ్ మన ఇల్లు. ఆ ఇంట్లో కిచెన్కు ఒక సంఖ్య, డోర్కు ఒక సంఖ్య, విండోకు ఒక సంఖ్య ఇచ్చుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే... ‘మెథడ్ ఆఫ్ లోకి’ని ప్రాక్టీస్ చేసినా, రకరకాల మెమోరీ గేమ్స్ ఆడినా, జ్ఞాపకశక్తికి సంబంధించిన అద్భుతమైన పుస్తకాలు చదివినా... శక్తిహీనత ప్రమాదం నుంచి బయటపడి జ్ఞాపకశక్తిని పదిలపరుచుకునే ప్రయత్నమే అవుతుంది. మంచిదే కదా! బిల్గేట్స్ నుంచి యూత్ వరకు... కోచీ(కేరళ)కు చెందిన 24 సంవత్సరాల కైష తన జ్ఞాపకశక్తి బలహీనం అవుతున్న సమయంలో చదివిన పుస్తకం ‘మూన్వాకింగ్ విత్ ఐన్స్టీన్: ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ రిమెంబరింగ్ ఎవ్రీ థింగ్’ ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. జాషువా ఫోయర్ ఎంతో పరిశోధించి, విశ్లేషించి రాసిన ఈ పుస్తకానికి యువతలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. బిల్గేట్స్కు బాగా నచ్చిన పుస్తకం ఇది. 320 పేజీల ‘మూన్వాకింగ్ విత్ ఐన్స్టీన్’ లో ఫోయర్ రకరకాల నిమానిక్ టూల్స్ (జ్ఞాపక శక్తికి ఉపకరించేవి) నుంచి ఇంగ్లాండ్కు చెందిన విద్యావేత్త టోనీ బుజాన్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ వరకు ఎన్నో అంశాలు ప్రస్తావించాడు. (చదవండి: ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!) -
హాట్ డీల్: రూ.12 వేలకే లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ఫోన్!
తక్కువ ధరకు కొత్త బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఓ అద్భుతమైన డీల్ ఉంది. ప్రముఖ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) స్మార్ట్ ఫోన్ అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్లు ఇవీ... ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్ ఫోన్పై 29 శాతం భారీ తగ్గింపు అందిస్తోంది. ఏడాది క్రితం లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ వాస్తవ ధర రూ.16,999 కాగా ఫ్లిప్కార్ట్లో రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంకు డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే మరింపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఏకంగా రూ.11,450 వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్, అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డును వినియోగిస్తే 5 శాతం తగ్గింపు అదనంగా లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫీచర్స్ 6.6 అంగులాల డిస్ప్లే. ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ ట్రిపుల్ రియర్ కెమెరా, 50 ఎంపీ మెయిన్ సెన్సర్, 5 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇదీ చదవండి: కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్లు -
కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్స్ తయారీ సంస్థ మోటరోలా కొత్తగా మోటో జీ32 ఫోన్లో రెండు రంగుల్లో కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. రోజ్ గోల్డ్, శాటిన్ మెరూన్ వీటిలో ఉన్నాయి. దీనితో జీ32 మొత్తం నాలుగు వేరియంట్స్లో లభిస్తున్నట్లవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే శాటిన్ సిల్వర్, మినరల్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. గత సంవత్సరం 4జీబీ+ 64జీబీ మోడల్ విడుదలకాగా ఈ సంవత్సరం ప్రారంభంలో 8జీబీ + 128జీబీ వెర్షన్ లాంచ్ అయింది. జీ32 ధర రూ. 11,999 గా ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్స్ టర్బోపవర్ చార్జర్, 50 ఎంపీ క్వాడ్ ఫంక్షన్ కెమెరా, స్నాప్డ్రాగన్ 680 ఆక్టా–కోర్ ప్రాసెసర్, 6.5 అంగుళాల డిస్ప్లే తదితర ఫీచర్స్ ఉన్నాయి. -
సెల్ఫోన్ నిజామాబాద్లో పోయింది.. దుబాయ్లో దొరికింది!
మన జీవితంలో భాగంగా మారి పోయిన స్మార్ట్ ఫోన్ పోగొట్టుకుంటే మనం మొత్తం కోల్పోయినట్లే ఫీలవుతాం. అంతలా మనతో పాటే కలిసిపోయింది స్మార్ట్ ఫోన్. అటువంటి ఫోన్ను పోగొట్టుకుంటే మనశ్శాంతి కూడా ఉండదు.. ఫోన్ కనపడకపోయేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అవుతుంది. వందలాది కాంటాక్ట్ నంబర్లు, ముఖ్యమైన ఫొటోలు.. ముఖ్యమైన డేటా అంతా కూడా అందులోనే ఉండటంతో ప్రపంచమే ఆగిపోయినట్లు ఉంటుంది. అయితే ఇలా ఒక వ్యక్తి సెల్ఫోన్ను పోగొట్టుకున్నా తిరిగి దాన్ని సంపాదించుకుని ఊపిరి పీల్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో బాన్సువాడకు చెందిన వ్యక్తి తన సెల్ఫోన్ను పోగొట్టుకున్నాడు. ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. ఫోన్ ఎక్కడిపోయిందో అనే విషయాన్ని గుర్తుకుతెచ్చుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో పోయిందనే విషయాన్ని గ్రహించిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ ద్వారా ఆ ఫోన్ దుబాయ్లో ఉందని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్లో సెల్ఫోన్ పోతే అది దుబాయ్లో ఉందని కనుక్కోవడం వెనుక నూతన టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. అంతే ఆ సెల్ఫోన్ను దుబాయ్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఆ తర్వాత సదరు బాధితునికి డీఎస్సీ జైపాల్రెడ్డి.. ఆ సెల్ఫోన్ను అప్పగించారు. -
ఆన్లైన్ గేమ్లతో ఆనందం ఆవిరి.!
విశాఖ విద్య: ‘పెదవాల్తేరుకు చెందిన అవినాష్ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. రాత్రి వేళ నిద్రలో కూడా వింత వింత శబ్దాలు చేస్తున్నాడు. బాలుడి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు ఏమైందోననే ఆందోళనతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. రెండు పర్యాయాల పరిశీలన అనంతరం బాలుడి అసలు సమస్యను వైద్యులు గుర్తించారు. గంటల తరబడి సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్లు ఆడడం వల్ల అబ్బాయి మొదడుపై ప్రభావం చూపిందని తేచ్చిచెప్పారు. స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంచి, కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు’. విశాఖ నగరంలోని ఒక్క అవినాషే కాదు.. వందలాది మంది విద్యార్థులు, యువత ఆన్లైన్ గేమ్లతో రేయింబవళ్లు కాలక్షేపం చేస్తూ మానసిక ఆనందానికి దూరమైపోతున్నారు. స్మార్ట్ ఫోన్తో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగం బాగా పెరిగింది. పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సిందే. దీంతో స్మార్టు ఫోన్లు వినియోగం తప్పనిసరైంది. అయితే స్మార్ట్ ఫోన్తో ఎంతటి లాభం ఉందో, అదే స్థాయిలో నష్టాన్ని చేకూరిస్తోంది. బెట్టింగ్కు బలైపోతున్న యువత గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. విశాఖ కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్ మాఫియాను పోలీసులు సైతం గుర్తించారు. వివిధ యాప్స్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ పేకాటకు అన్ని వర్గాల వారు బానిసలైపోతున్నారు. దీంతో పాటు డ్రీమ్ యాప్ ద్వారా క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ ఆటలు ఉన్నాయి. గేమ్లో కొంత మందిని ఎంపిక చేసుకుని బెట్టింగ్ పెడతారు. వారు బాగా ఆడినట్లైతే వచ్చే పాయింట్లు బట్టి గెలుపును నిర్ధారిస్తారు. ప్రైజ్ మనీగా రూ.10 నుంచి రూ.లక్ష వరకు ఉండడంతో ఎక్కువ మంది ఈ గేమ్లోనే మునిగి తేలుతూ డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, సమయం వృథా చేస్తూ వాటికి బానిసలైపోతున్నారు. పబ్జీతో మొద్దుబారుతున్న మెదడు కొన్నేళ్లు బ్యాన్ చేసిన పబ్జీగేమ్ మళ్లీ సరికొత్త గా స్మార్ట్ఫోన్లోకి వచ్చి చేరింది. పబ్జీతో పాటు, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ఆన్లైన్ ఆటలు ఎక్కువ మంది ఆడుతున్నారు. వీటిని నలుగురు కలసి ఒకేసారి ఆడవచ్చు. వేర్వేరు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా సరే నలుగురు మాట్లాడుకుంటూ గేమ్లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఎక్కువగా పాఠశాల, కాలేజీ స్థాయి విద్యార్థులు పబ్జీ గేమ్లకు బానిసలవుతున్నారు. ఆన్లైన్ గేమ్లతో ప్రమాదం పిల్లలు, అందులోనూ చదువుకునే వారు ఆన్లైన్ గేమ్లు ఆడటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఆన్లైన్ గేమ్ల వల్ల మానసిక ఆనందం కోల్పోతారు. మొదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శారీరకంగా అలసట కలిగే ఆటలు ఆడుకోవాలి. పుస్తక పఠనం మంచి పద్ధతి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమైనదే. – డాక్టర్ రమేష్బాబు, మానసిక వైద్య నిపుణులు, విశాఖపట్నం తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి ఏదో కాలక్షేపం కోసమని కొద్దిసేపు ఆన్లైన్ గేమ్ ఆడితే పరవాలేదు. కానీ అదే పనిగా గంటల తరబడి స్మార్ట్ఫోన్కు అతుక్కుపోతుంటే, ఓ కంట కనిపెట్టాల్సిందే. ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లాడి ఆనందం కోసమని స్మార్ట్ఫోన్ ఇచ్చేసి, వదిలేయకూడదు. వారితో రోజులో కొద్దిసేపు అయినా గడిపి, కబుర్లతో కాలక్షేపం చేయాలి. – డాక్టర్ జి.సీతారాం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు -
అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే..
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) కొత్త రంగులో వస్తోంది. లైమ్ కలర్ వేరియంట్ మే 16 నుంచి భారత్లో అమ్మకానికి వస్తోంది. గెలాక్సీ ప్రస్తుతం ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగులలో అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! ధర, ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కొత్త లైమ్ కలర్ వేరియంట్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 8/128 జీబీ ధర రూ. 74,999 కాగా 8/256 జీబీ వేరియంట్ ధర రూ. 79,999. ఈ కొత్త కలర్ వేరియంట్ ఆన్లైన్, ఆఫ్లైన్లో ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. గెలాక్సీ ఎస్23 కొనేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ సీడీ లేదా బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకునే వారు నెలకు కేవలం రూ. 3,125 ఈఎంఐతో గెలాక్సీ ఎస్23 ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. అదనంగా ప్రస్తుత ఫ్లాగ్షిప్ ఫోన్ యజమానులు రూ.8,000 అప్గ్రేడ్ బోనస్ ప్రయోజనాన్ని పొందవచ్చు . దీన్న 24 నెలల బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ లేదా హెచ్డీఎఫ్సీ సీడీ పేపర్ ఫైనాన్స్తో కలపవచ్చు. అప్గ్రేడ్ బోనస్ను రూ.5 వేల బ్యాంక్ క్యాష్బ్యాక్తో కలపడం మరో ఆప్షన్. దీని వల్ల 8/128 జీబీ వేరియంట్ రూ. 61,999లకు, 8/256 జీబీ మోడల్ ధర రూ.66,999లకు తగ్గుతుంది. ఈ ఆఫర్లో భాగంగా హెచ్డీఎఫ్సీతో 9 నెలల నో కాస్ట్ ఈఎంఐని కూడా ఎంచుకోవచ్చు. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గేమ్ మోడ్లో సూపర్ స్మూత్ 6.1 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50 MP వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా 3,900mAh బ్యాటరీ, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ 8జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ గర్ల్ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
మార్కెట్లో విడుదలైన కొత్త స్మార్ట్ఫోన్ - మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్..
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ పోకో (Poco) భారతీయ మార్కెట్లో ఎఫ్ సిరీస్లో తన పవర్ఫుల్ మొబైల్ను 'ఎఫ్5 5జీ' లాంచ్ చేసింది. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అవి 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ. 29,999, రూ. 33,999. ఇవి మే 16 నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం. మార్కెట్లో విడుదలైన కొత్త పోకో ఎఫ్5 5జీ కార్బన్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, స్నో స్ట్రామ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి, 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఈ లేటెస్ట్ మొబైల్ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అవి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు సపోర్ట్ చేసే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. (ఇదీ చదవండి: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!) కొత్త పోకో ఎఫ్5 మొబైల్లో 5,000mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ టర్బో ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం 0 నుంచి 100 శాతానికి ఛార్జ్ కావడానికి కేవలం 45 నిముషాలు మాత్రమే పడుతుంది. అదే సమయంలో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉంటాయి. హీట్ కంట్రోల్ అయ్యేలా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, 14 లేయర్స్ గ్రాఫైట్ సిస్టమ్ ఈ మొబైల్లో ఉంటాయి. -
ఆధునిక ఫీచర్లతో విడుదలవుతున్న కొత్త స్మార్ట్ ఫోన్ ఇదే
-
రీల్స్ చూస్తూ స్నాక్స్ తింటూ.. ఈ కోతిచేష్టలు మామూలుగా లేవు
-
వివో నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది - వివరాలు
రోజు రోజుకి మార్కెట్లో కొత్త మొబైల్ ఫోన్స్ విడుదలవుతుండటంతో వినియోగదారులు కూడా కొత్త ఉత్పత్తులను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వివో కంపెనీ ఎక్స్ ఫ్లిప్ ఫోల్డబుల్ అనే స్మార్ట్ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా శాంసంగ్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ తరహా మొబైల్స్ లాంచ్ చేశాయి. కాగా ఈ విభాగంలో వివో కూడా చేరనుంది. ఇందులో భాగంగా కంపెనీ విడుదలకానున్న కొత్త మొబైల్ మోడల్ నెంబర్ కూడా (V2256A) తెలిపింది. దీన్ని బట్టి చూస్తే ఇది త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న వివో ఎక్స్ ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ 12జిబి ర్యామ్, 50MP సోనీ IMX8606 ప్రైమరీ కెమెరా వంటి వాటితోపాటు 6.8 ఇంచెస్ 120Hz మెయిన్ డిస్ప్లే, పైన చిన్న సెకండరీ డిస్ప్లేను పొందుతుంది. మొత్తం మీద ఇది కొనుగోలుదారులను ఆకర్శించే విధంగా తయారైవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: వేల కోట్ల కంపెనీకి బాస్ 'జయంతి చౌహాన్' గురించి ఆసక్తికర విషయాలు) వివో ఎక్స్ ఫ్లిప్ అనేది చైనీస్ ఉత్పత్తి అయినప్పటికీ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్లో 1,695 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్లో 4,338 పాయింట్లను స్కోర్ చేసింది. ఇది ఆధునిక ఫీచర్స్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ మొబైల్ ఫోన్ ధరలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ దీని ధర సుమారు రూ. 79,990 వరకు ఉంటుందని అంచనా, ఇది ఏప్రిల్ 17న విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
ఒక ఫోన్ కొంటే రెండు బీర్లు ఫ్రీ.. అరెస్ట్
క్రైమ్: స్మార్ట్ఫోన్ కొంటే బీర్లు ఫ్రీ అని అనౌన్స్ చేశాడు. ఊరంతా పోస్టర్లు అంటించి.. పాంప్లెట్స్ పంచాడు. ఆ ప్రకటనతో ఒక్కసారిగా ఆ సెల్ఫోన్ దుకాణం ముందు జనం ఎగబడ్డారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో పాటు అక్కడ రచ్చ రచ్చ చేశారు. ఇది కాస్త పోలీసుల దాకా చేరింది. రంగ ప్రవేశం చేసి ఆ బంపరాఫర్ ప్రకటించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. యూపీ భదోహిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చౌరీ రోడ్లో రాజేశ్ మౌర్య అనే వ్యక్తి సెల్ఫోన్ల షాప్ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తన దుకాణంలో మార్చి 3 నుంచి 7వ తేదీల మధ్య సెల్ఫోన్ కొంటే రెండు బీర్ క్యాన్లు ఇస్తానని ప్రకటించాడు. సెంటర్లలో పోస్టర్లు అతికించి, పాంప్లెట్స్ పంచాడు. దీంతో కస్టమర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. ట్రాఫిక్కు విఘాతం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టారు. ఐపీసీ సెక్షన్ 151 (ప్రజాశాంతికి విఘాతం కలిగించడం) నేరం కింద మౌర్యను అరెస్ట్ చేసి, దుకాణాన్ని సీల్ చేశారు. -
వన్ ప్లస్ 11 కాన్సెప్ట్ ఫోన్ ఫస్ట్ లుక్.. లిక్విడ్ కూలింగ్ ఫీచర్ అదుర్స్!
చాలా రోజులుగా ఊరిస్తున్న వన్ ప్లస్ 11 (OnePlus 11) కాన్సెప్ట్ స్మార్ట్ఫోన్ స్టన్నింగ్ ఫీచర్స్ను తాజాగా ఆవిష్కరించింది. గతంలో ఎప్పుడూ చూడని ఓ సరికొత్త ఫీచర్ను ఇందులో తీసుకొచ్చింది. అదే యాక్టివ్ క్రియోఫ్లక్స్ కూలింగ్ సొల్యూషన్. ఈ యాక్టివ్ క్రియోఫ్లక్స్ అనేది సాధారణంగా డెస్క్టాప్ కంప్యూటర్లలో ఉండే క్లోజ్డ్-లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్కి మరో పేరు. కానీ దీన్ని స్మార్ట్ఫోన్కు అనువుగా రూపొందించారు. ఫోన్ మధ్యలో ఒక సిరామిక్ పైజోఎలెక్ట్రిక్ మైక్రోపంప్ ఉంటుంది. ఇది చిన్నచిన్న గొట్టాల ద్వారా కూలింగ్ ద్రవాన్ని ఫోన్ అంతటికీ పంపుతుంది. ఇది రేడియేటర్గా పనిచేసి ఫోన్ హీట్ను గ్రహించి చల్లబరుస్తుంది. ఈ యాక్టివ్ క్రయోఫ్లక్స్ కూలింగ్ సిస్టమ్ ఫోన్ ఉష్ణోగ్రతలను 2.1 డిగ్రీల వరకు తగ్గించగలదని వన్ ప్లస్ పేర్కొంది. ఇది ఛార్జింగ్ సమయంలోనే ఉష్ణోగ్రతను 1.6 డిగ్రీలకు తగ్గిస్తుంది. దీంతో ఛార్జింగ్ సమయం కూడా ఆదా అవుతుంది. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) ఇక మిగిలినవి ఫోన్ డిజైన్ ఇతర ఆకృతులకు సంబంధించినవి. ఫోన్ వెనుక కవర్ కోసం వంపు తిరిగిన, పారదర్శక గాజును ఉపయోగించారు. దీంతో వెనుకవైపు కూలింగ్ ద్రవం ప్రవహించే ప్రకాశవంతమైన గొట్టాలను చూడవచ్చు. అలాగే కెమెరా చుట్టూ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే వన్ ప్లస్ ఈ కాన్సెప్ట్ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని ఎప్పుడు మొదటు పెడుతుందో స్పష్టత లేదు. ఇలాగే 2020లో వన్ప్లస్ ఆసక్తికరమైన సెల్ఫ్-టింటింగ్ కెమెరా కవర్ క్లాస్ను ఆవిష్కరించింది. కానీ వాటిని ఉత్పత్తి చేయలేదు. -
లైక్,షేర్.. చీటింగ్
విజయవాడ స్పోర్ట్స్: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని యువత విలవిల్లాడుతున్నది. అత్యాశకు పోయి రూ.లక్షలకు లక్షలు సమర్పించుకుంటుంది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిత్యం ఈ తరహా ఘటనలు ఎక్కడో ఓచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయవాడ సీతారామపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వర్క్ ఫ్రం హోంలో భాగంగా ప్రస్తుతం సీతారామపురంలోని తన ఇంటి నుంచే పనిచేస్తున్నది. ఈ నెల ఐదో తేదీన తన వాట్సాప్కు వచ్చిన మెసేజ్కు ఆకర్షితురాలై వెంటనే మెసేజ్లోని వెబ్సైట్ను క్లిక్ చేసింది. వెబ్సైట్లోకి వెళ్లి వివరాలను చెక్ చేసుకుంటుండగానే సదరు కంపెనీ నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ‘ఇన్స్టా గ్రాం, యూ ట్యూబ్, ఫేస్బుక్లో వచ్చే వీడియోలు చూసి లైక్, షేర్ చేస్తే డబ్బులు చెల్లిస్తామని, ఇంట్లో కూర్చునే నెలకు లక్షలు సంపాదించవచ్చు అని ఫోన్లో చెప్పిన వ్యక్తి మాటలను నమ్మింది. యువతికి టాస్క్లు మొదలయ్యాయి. ఆ రోజు తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కాసేపు విరామం ఇచ్చి ఈజీగా వచ్చే డబ్బుల కోసం తాపత్రయపడి కష్టపడి కొత్త పని టాస్క్లు పూర్తి చేసింది. వెంటనే ఆమె బ్యాంక్ ఖాతాలో రూ.1,200 జమయ్యాయి. దీంతో అదే పనిగా మరుసటి రోజు టాస్క్లు పూర్తి చేయడంతో మళ్లీ రూ. 2 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. యువతి బానిసత్వాన్ని గ్రహించిన సైబర్ నేరగాళ్లు ఆమెను అప్పుడే అసలైన ముగ్గులోకి దించారు. ‘రూ.5 వేలు డిపాజిట్ చేసే కొన్ని పేరున్న కంపెనీల టాస్క్లు ఇస్తాం, ఆ కంపెనీ ప్రొడక్టస్కు రేటింగ్ ఇవ్వాలంతే.. ఇది సింపుల్ టాస్క్.. ఎక్కువ లాభాలొస్తాయి..!’ అని నమ్మించారు. రూ.5 వేలు డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేసి వెబ్సైట్ వాలెట్ చెక్ చేసుకుంది. అందులో రూ.10 వేలు జమకావడంతో ఆనందంతో విత్డ్రా చేసుకుందామని విఫలయత్నం చేసింది. వెంటనే కంపెనీ ప్రతినిధులను ఫోన్లో సంప్రదించింది. రూ. ఏడు వేలు డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేస్తే మీ వాలెట్లో ఉన్న రూ.10 వేలు తీసుకొవచ్చని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఆ విధంగానూ చేసినా డబ్బు రాలేదు. బాధితురాలు డబ్బులు డిపాజిట్ చేస్తూనే ఉంది.. తీసుకోవడానికి వీలు లేని డబ్బులు వాలెట్లో పెరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా ఆ యువతి కేవలం 10 రోజుల్లో 14 లక్షల 13 వేల 900 రూపాయలను చెల్లించిన తరువాత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో విసురుతున్న వలలో నిరుద్యోగులతో సహా ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు పడుతుండడం గమనార్హం. ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల కేంద్రంగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఘటనలు ఈ ఆన్లైన్ మోసాల బాధితులు రోజురోజుకీ పెరుగుతున్నారు. నిత్యం స్మార్ట్ ఫోన్కే అంకితమవుతున్న వ్యక్తులు ఈ సైబర్ ఉచ్చులో పడుతున్నారు. ఈ ఏడాది జనవరి మూడో తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఈ తరహా ఘటనలపై సైబర్ పోలీస్ స్టేషన్లో 19 కేసులు నమోదయ్యాయి అప్రమత్తంగా ఉండండి.. స్మార్ట్ ఫోన్ వినియోగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. సులువుగా డబ్బులు వస్తాయని నమ్మి మోసపోవద్దు. ఈ తరహా ఘటనల్లో సైబర్ నేరగాళ్లు ప్రత్యేకంగా రూపొందించుకున్న ప్రోగ్రామింగ్ ద్వారానే వెబ్ లింక్స్ను తయారు చేస్తారు. డబ్బులు చెల్లింపులు యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ తదితర పద్ధతుల ద్వారా సేకరిస్తారు. నేరగాళ్ల కదలికలపై నిఘా ఉంచాం. బాధితులకు న్యాయం చేస్తాం. – టి.కె.రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా -
అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!
అతిగా ఫోన్ వాడకం ఓ మహిళను వీల్చైర్కు పరిమితం చేసింది. యూకేకి చెందిన 29 ఏళ్ల ఫెనెల్లా ఫాక్స్ వర్టిగో అనే వ్యాధి బారినపడింది. తాను సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ 14 గంటల పాటు నిరంతరంగా ఫోన్ వాడానని ది మిర్రర్ వార్తా సంస్థకు ఆమె వివరించింది. ఐప్యాడ్, ఐఫోన్లలో గంటలకొద్దీ గడపడం తనకు భారీ చేటును కలిగించిందని, వెర్టిగో వ్యాధితో మంచానికి, వీల్చైర్కు పరిమితం కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఫాక్స్ పోర్చుగల్లో ఉన్నప్పుడు తలనొప్పి, మైకం వంటి లక్షణాలు ప్రారంభమయ్యాయి. 2021 నవంబర్ నాటికి అవి తీవ్రమయ్యాయి. ‘నేను నిజంగా సరిగ్గా నడవలేనట్లు అనిపించింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. అప్పటి పరిస్థితి నాకు బాగా గుర్తుంది. కానీ ఎక్కువగా వివరించలేను. ఈ అనర్థాలకు కారణం నా ఫోన్ అని అప్పుడు నాకు తెలియదు. ఇది కోవిడ్ లాంటిదే. నేను వంట చేయలేకపోయాను. ఇంటికి చేరుకోవడానికి వీల్చైర్ కావాల్సివచ్చింది. నా తల్లిదండ్రులు నన్ను చూసుకోవాల్సి వచ్చింది. దాదాపు ఆరు నెలల పాటు ఆ పరిస్థితి అనుభవించాను’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. (ఇదీ చదవండి: Joom: భారత్లోకి మరో ఈ-కామర్స్ దిగ్గజం.. ఎస్ఎంఈలకు సరికొత్త వేదిక) ప్రస్తుతం ఫెనెల్లా ఆరోగ్యం మెరుగుపడిందని, ఇకపై వీల్చైర్ అవసరం ఉండదని ఆమె ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా తెలుస్తోంది. అయితే తన ఫోన్ను ముందులాగే గంటలకొద్దీ ఉపయోగిస్తే మళ్లీ ఆ ఘోర పరిస్థితులు తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదు. -
Lava Blaze 5G: రూ.11 వేలకే 5జీ స్మార్ట్ఫోన్.. ఫీచర్స్ మాత్రం అదుర్స్!
భారతీయ ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ లావా కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. లావా బ్లేజ్ 5జీ (Lava Blaze 5G) సిరీస్లో నూతన వేరియంట్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. 6జీబీ ర్యామ్, 128బీజీ స్టేరేజ్ కెపాసిటీతో వచ్చిన ఈ స్మార్ట్ఫోన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. చవకైన రేంజ్లో లభించే ఈ 5జీ ఫోన్ గురించి లావా కంపెనీ గత ఏడాదిలోనే తెలియజేసింది. లావా బ్లేజ్ 5జీ ఫోన్ ధరను రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.11,499కే ఈ ఫోన్ను అందిస్తోంది. గ్లాస్ బ్లాక్, గ్లాస్ బ్ల్యూ, గ్లాస్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ అలాగే అమెజాన్ ద్వారా వీటిని కొనుగోలు చేయొచ్చు. (ఇదీ చదవండి: టెక్ ప్రపంచంలోనే తొలి ఫోన్,10 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్.. ధర ఎంతంటే!) లావా బ్లేజ్ 5జీ స్పెసిఫికేషన్స్ 90హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో 6.5 అంగులాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ 2.2 గిగాహెడ్జ్ క్లాక్స్పీడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ మెమొరీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ 1 టీబీ వరకు పెంచుకునే ఎక్స్టర్నల్ మెమొరీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అనానమస్ కాల్ రికార్డింగ్ ఫీచర్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ -
బామ్మా జర భద్రం.. ఆ లింక్స్పై క్లిక్ చేస్తే అంతే! ఈ టోల్ ఫ్రీ నంబర్ మీకోసమే!
విచారంగా కూర్చొని ఉన్న వర్ధనమ్మను చూసి ఏమైందని అడిగింది మనవరాలు హారిక. ‘బ్యాంకు ఖాతా నుండి డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. నేను ఆ డబ్బులు డ్రా చేయలేదు. నా దగ్గర డబ్బులు ఉన్నట్టు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. బ్యాంకులో అయితే భద్రంగా ఉంటాయనుకున్నా. ఇప్పుడెలా..’ అంది మనవరాలితో దిగులుగా వర్ధనమ్మ. ‘ఎవరైనా నీకు ఇంతకుముందు ఫోన్ చేశారా..’ అడిగింది హారిక. ‘బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది. అత్యవసరం అని చెబితే, వాళ్లు పంపిన లింక్ ఫామ్లో వివరాలు ఇచ్చాను. అంత కన్నా ఏమీ చేయలేదు’ అంది వర్ధనమ్మ. బామ్మ సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోయిందని అర్ధమై, వెటనే తగిన చర్యలు తీసుకుంది హారిక. ఆ తర్వాత బామ్మకు సైబర్ మోసగాళ్ల గురించి వివరించింది. ఇంట్లో వయసు పైబడిన వారుంటే సైబర్ మోసాగాళ్ల బారిన పడకుండా ఈ విషయాలు తప్పక తెలియజేయాల్సిన అవసరం వారి పిల్లలకు ఉంది. సాధారణంగా జరిగే మోసాల్లో ప్రధానమైంది ఫిషింగ్ సైబర్ నేరగాళ్లు మీ డిజిటల్ సమాచార మొత్తాన్ని పొందడానికి ఆన్లైన్ సేవ లేదా బ్యాంక్ ఏజెంట్ల వంటి విశ్వసనీయ పరిచయాలను పెంచుకుంటారు. కొన్ని ఉదాహరణలు.. సహాయం కోసం రిక్వెస్ట్ అడుగుతారు. మీరు బహుమతిని గెలుచుకున్నారని చూపుతారు. పెన్షన్ ఫండ్ విడుదలకు కెవైసి అవసరం అంటారు. గతంలో తక్కువ ఆదాయపు పన్ను చెల్లించారు, ఇప్పుడు రెట్టింపు ఛార్జ్ పడింది అంటారు. గుర్తింపు చోరీ సైబర్ దాడి చేసే వ్యక్తులు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, చిరునామా, డెబిట్/ క్రెడిట్ కార్డ్ వివరాలు, యుపిఐ, పిన్ నంబర్ మొదలైన వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక లాభాలను పొందడానికి ఈ సమాచారం సేకరిస్తారు. దాడుల్లో రకాలు వీటిలో తరచుగా సీనియర్ డేటింగ్, ప్రిస్క్రిప్షన్ మాత్రలు, యాంటీ ఏజింగ్ ఉత్పత్తులు, పెట్టుబడి లేదా ఛారిటీ స్కామ్లు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి నకిలీ ఆర్థిక సహాయ అభ్యర్థనలకు సంబంధించిన మోసాలు ఉంటాయి. చాలా మంది సీనియర్లు ఇలాంటి మోసాలకు లోనవడానికి పెద్ద కారణం ఒంటరితనం, జ్ఞానం లేకపోవడమే. భద్రతా చిట్కాలు ►తెలియని వారి నుంచి వచ్చే ఇ–మెయిల్లలోని లింక్లపై క్లిక్ చేయవద్దు. మీకు తెలిసిన వ్యక్తుల నుండి వచ్చినవి అయినప్పటికీ, వింత లేదా ఊహించని సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇ–మెయిల్లు, వాట్సప్ సందేశాలు లేదా ఎసెమ్మెస్లు, సోషల్ మీడియా పోస్ట్లు అన్నీ హానికరమైన ఫైల్స్ను కలిగి ఉండే చిన్న లింక్లతో ►పంపినవారు మీకు తెలిసినవారే అని దృఢపరుచుకునేవరకు ఏ లింక్లను ఓపెన్ చేయవద్దు. స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల నుండి ఆ మెసేజ్ వచ్చినట్లు కనిపిస్తే, వారు మీకు ఏదైనా పంపినట్లు నిర్ధారించుకోవడానికి తిరిగి వారినే సంప్రదించండి. ►అనుమానిత ఫోన్ కాల్స్, రోబోకాల్స్ను రిసీవ్ చేసుకోకండి. కాలర్ తాను ‘‘టెక్ సపోర్ట్‘ నుండి మాట్లాడుతున్నట్టు మీతో చెప్పవచ్చు. మీ కంప్యూటర్కు వైరస్ సోకిందని, రిపేర్ ఉందని మీకు తప్పుగా చెప్పవచ్చు. మీరు టాక్స్ డిఫాల్టర్ లేదా పెన్షన్ ప్రాసె సింగ్ లేదా కెవైసీ కోసం అడుగుతున్న బ్యాంక్ అధికారి అని కూడా చెప్పవచ్చు. పెన్షన్ ఫండ్ మొదలైన వాటి ప్రాసెసింగ్ అని చెప్పవచ్చు. ►మీ ఫోన్ లేదా కంప్యూటర్లోని పాప్అప్ విండోలకు ప్రతిస్పందించవద్దు లేదా దానిపై క్లిక్ చేయవద్దు. మీ కంప్యూటర్ లేదా ఫోన్లో ‘అత్యవసర‘ పాప్అప్ విండో కనిపిస్తుంది. మీ డిజిటల్ పరికరానికి రిపేర్ అవసరమని లేదా ఒక ఫోన్ను ఆఫర్లో ‘మరొక ఫోన్ను పొందండి’ అంటూ మీలో ఆశను కలిగిస్తాయి. మీ కంప్యూటర్ సిస్టమ్కి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేయమని అడగవచ్చు. ►అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయడం లేదా తెలియని వాటిని డౌన్లోడ్ చేసే సమయంలో సురక్షిత బ్రౌజింగ్ పద్ధతులను అనుసరించండి. మీకు తెలిసిన సీనియర్స్కి విశ్వసనీయ వెబ్సైట్లను మాత్రమే సందర్శించమని, వారు సురక్షితమైన సైట్లో ఉన్నారని నిర్ధారించుకోవడానికి httpr://(ప్యాడ్ లాక్ సింబల్) కోసం చూడాలని సలహా ఇవ్వండి. ►రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్లు భద్రతా లోపాలను పరిష్కరించగలవు. వారి కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వంటి పరికరాలు, సాఫ్ట్వేర్లను క్రమం తప్పకుండా అప్డేట్ చేయమని సీనియర్లను ప్రోత్సహించండి. ►యాప్స్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి మాత్రమే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ►ప్రత్యేకమైన పాస్వర్డ్లను (ప్రత్యేక అక్షరాలు, పెద్ద అక్షరాలు, సంఖ్యాపరమైనవి) ఉపయోగించమని వృద్ధులను ప్రోత్సహించండి. వారి పుట్టిన తేదీ లేదా చిరునామా వంటి సులభంగా ఊహించదగిన సమాచారాన్ని ఉపయోగించవద్దు. ►తెలియని వ్యక్తులతో మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లతో రిమోట్ స్క్రీన్ షేరింగ్ చేయకండి. ►అన్ని ఇ–మెయిల్స్, సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాల కోసం రెండు కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. మోసపోతే ఏం చేయాలంటే.. ఈ టోల్ ఫ్రీ నంబర్ 1930కి వెంటనే (ఒక గంటలోపు) ఫోన్ చేయండి. దీని ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ 1930 సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. దీనికి బదులుగా మీరు మీ స్థానిక సైబర్ క్రైమ్ పోలీసు అధికారుల వద్ద జరిగిన మోసం చెప్పి కంప్లయింట్ ఇవ్వచ్చు. లేదా httpr://www.cybercrime. gov.in లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. స్మార్ట్ఫోన్ నుండి దూరంగా ఉండాలంటే.. ►మీ స్మార్ట్ఫోన్లో నోటిఫికేషన్లను నిలిపి వేయండి. ►మీ పడకగది, భోజనాల గదిని స్మార్ట్ఫోన్ రహిత జోన్గా మార్చండి. ►మీ స్మార్ట్ఫోన్కు బదులుగా ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్ నుండి సోషల్ మీడియాను యాక్సెస్ చేయండి. ►ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించడం కోసం ఆండ్రాయిడ్లో డిజిటల్ వెల్బీయింగ్ యాప్, ఐఓఎస్లో స్క్రీన్ టైమ్ యాప్ని ఉపయోగించండి. ►ప్రజలు తమ స్క్రీన్ వినియోగ సమయం పెరుగుతోందని భావిస్తే గ్రే స్కేల్ మోడ్ ఫీచర్ని ఉపయోగించండి -
ఐకూ నుంచి స్నాప్డ్రాగన్ 8 ఫోన్
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీ సంస్థ ఐకూ తాజాగా స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్తో పనిచేసే స్మార్ట్ఫోన్ ఐకూ 11ను ఆవిష్కరించింది. దేశీయంగా ఈ తరహా స్మార్ట్ఫోన్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారని సంస్థ తెలిపింది. వేరియంట్ను బట్టి దీని ధర రూ. 59,999 నుంచి రూ. 64,999గా ఉంటుంది. ఆఫర్ ప్రకారం రూ. 51,999 నుంచి రూ. 56,999కే ఈ ఫోన్ను కొనుగోలు చేయొచ్చు. జనవరి 12న ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్ కింద అదనంగా ఐకూ రూ. 1,000 డిస్కౌంటును ప్రకటించింది. జనవరి 13 నుంచి ఐకూ ఈ–స్టోర్, అమెజాన్డాట్ఇన్లో ఇది లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 గి ఫ్లాష్చార్జ్ టెక్నాలజీ, 6.78 అంగుళాల స్క్రీన్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి. 8జీబీ+256జీబీ, 16జీబీ+256జీబీ వేరియంట్లలో ఇది లభిస్తుంది. -
ఫోటోలు కడిగించాలంటే స్టూడియోకి వెళ్లే పనిలేదు..చేతిలో ఈ గాడ్జెట్ ఉంటే చాలు
స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఫొటోగ్రఫీ తేలికైంది. అయితే, స్మార్ట్ఫోన్లో ముచ్చటగా తీసుకున్న ఫొటోలను ముద్రించుకోవాలంటే మాత్రం స్టూడియోలు, కలర్ ల్యాబ్లకు వెళ్లాల్సిందే! అంత శ్రమ లేకుండా సత్వరమే ఫొటోలు ముద్రించగల ఫొటో ప్రింటర్ను కంప్యూటర్ల తయారీ సంస్థ హ్యూలెట్ పాకార్డ్ ‘హెచ్పీ’ అందుబాటులోకి తెచ్చింది. ఇది స్మార్ట్ఫోన్లోని యాప్కు అనుసంధానమై పనిచేస్తుంది. ‘హెచ్పీ స్ప్రాకెట్ స్టూడియో ప్లస్’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఫొటో ప్రింటర్ను ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్ల ద్వారా తేలికగా ఉపయోగించవచ్చు. వాటిలో డౌన్లోడ్ చేసుకున్న యాప్ ద్వారా క్షణాల్లోనే కోరుకున్న ఫొటోలను ముద్రించుకోవచ్చు. ఇందులో 6 “ 4 అంగుళాల సైజులో మాత్రమే ఫొటోలను ముద్రించుకునే అవకాశం ఉంది. దీని ధర 149.99 డాలర్లు (రూ.12,374) మాత్రమే! -
కస్టమర్ కంప్లైంట్.. ఫ్లిప్కార్ట్కు షాకిచ్చిన వినియోగదారుల ఫోరం!
ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్కార్ట్కు వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. ఓ యూజర్ డబ్బులు చెల్లించినా మొబైల్ డెలివరీ చేయనందుకు రూ. 42,000 జరిమానా చెల్లించాలని బెంగళూరు అర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఫ్లిప్కార్ట్కు జరిమానా విధించింది. అందులో కస్టమర్ పేమెంట్ చేసిన రూ. 12,499 లకు 12 శాతం వార్షిక వడ్డీ, రూ. 20,000 జరిమానా, చట్టపరమైన ఖర్చుల కోసం రూ. 10,000 చెల్లించాలని అధికార యంత్రాంగం తెలిపింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని రాజాజీనగర్ ప్రాంతానికి చెందిన ఓ యూజర్ ఫ్లిప్కార్ట్పై ఫిర్యాదు చేశారు. ‘తాను జనవరి 15, 2022న మొబైల్ని బుక్ చేసుకున్నాను. వెబ్సైట్లో పేర్కొన్న విధంగా పూర్తి నగదుని చెల్లించి రోజులు గడుస్తున్నా కంపెనీ తనకు మొబైల్ డెలివరీ చేయలేదు. సర్వీసు విషయంలో ఫ్లిప్కార్ట్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అనైతిక విధానాలను అనుసరిస్తోందని ఫిర్యాదులో ’పేర్కొంది. కస్టమర్ కేర్ సెంటర్కు ఎన్ని సార్లు కాల్ చేసినా ఫలితం లేకపోయేసరికి చివరికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపింది. చదవండి: కస్టమర్లకు గుడ్న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పీఎన్బీ! -
డేంజర్: పొద్దస్తమానం.. ఫోన్లోనే!
మాటలు లేవు.. మాట్లాడుకోవడాలు లేవు.. బంధుమిత్రులు ఇంటికొస్తే పలకరింపులూ లేవు.. తలోక దిక్కున సెల్ఫోన్తో ఎవరి పనిలో వారు బిజీ.. ఆ ఫోన్లతో సోషల్ మీడియా సముద్రంలో ఈదుతుంటాం.. ఏ ఇంటికెళ్లినా ఈ కాలంలో కనిపించే దృశ్యం దాదాపు ఇదే! ఏదో కాలక్షేపానికి కొద్దిసేపు సోషల్ మీడియాను వాడితే తప్పులేదు కానీ.. గంటలు కరిగిపోయే స్థాయిలో దానికి కట్టుబానిసలైతే మాత్రం డేంజర్.. డేంజర్.. డేంజర్!!! టెక్నాలజీ అనేది రెండువైపులా పదునున్న కత్తి అంటారు... ఇదీ చాలా పాతకాలపు సామెతే కానీ, సోషల్ మీడియా ఈ తరానికి ముఖ్యంగా యువతరానికి చేస్తున్న చేటును దృష్టిలో పెట్టుకుంటే దానిని తరచూ గుర్తుచేసుకోవడంలో తప్పేమీ లేదు. ఇందుకు తగ్గట్టుగానే ట్విట్టర్, టిక్టాక్, వాట్సాప్, ఇన్స్టా్రగామ్, స్నాప్చాట్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల లాభనష్టాల గురించి వివరించే అధ్యయనాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లివింగ్ సర్కిల్స్ అనే సంస్థ దేశంలోని 287 జిల్లాల్లో 9–13 ఏళ్ల వయసున్న పిల్లలు గల తల్లిదండ్రులతో, అలాగే 13–17 సంవత్సరాల వయసున్న బాలబాలికలతో ఒక అధ్యయనం నిర్వహించింది. సామాజిక మాధ్యమాల వాడకాన్ని అనుమతించడంపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే సోషల్ మీడియా ఖాతాలను కలిగి ఉండటం దాని వాడకం తీరుతెన్నులపై టీనేజర్లను అడిగి తెలుసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 65 వేల మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. జరుగుతోంది తప్పే.. అధ్యయనంలో పాల్గొన్న తల్లిదండ్రుల్లో 40 శాతం మంది పిల్లలు వీడియో గేమ్లకు, సామాజిక మాధ్యమాలకు బానిసలైనట్లు ఈ సర్వేలో వెల్లడైన భయంకరమైన సత్యం, కాగా, ఇది సరి కాదని వారు కూడా అంగీకరించడం కొసమెరుపు. హైసూ్కల్లో చేరే వయసు కూడా లేని పిల్లలకు స్మార్ట్ఫోన్లు నిత్యం అందుబాటులో ఉన్నాయని 55 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించారు. టీనేజర్ల తల్లిదండ్రుల దగ్గరకు వచ్చే సరికి ఈ సంఖ్య 71 శాతం ఉంది. అయితే, కోవిడ్ కారణంగా విద్యాసంస్థలు సక్రమంగా పని చేయకపోవడం వల్లనే తాము పిల్లలకు స్మార్ట్ఫోన్లు కొనివ్వాల్సి వచి్చందని మెజారిటీ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఈ కారణంగానే పిల్లలు సామాజిక మాధ్యమాలకు పరిచయమయ్యారని, అది కాస్తా వ్యసనంగా మారుతోందన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరిచేందుకు కనీస వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే కావడం. దీనిని కనీసం 15 సంవత్సరాలకు పెంచితే సమస్య కొంతవరకైనా తగ్గుతుందని 68 శాతం మంది తల్లిదండ్రులు తమ ఆవేదన చెప్పుకున్నారు. తమని తాము తక్కువ చేసుకుంటారు.. పిల్లలంటేనే వారికి ఎల్లల్లేని ఆత్మవిశ్వాసం. ప్రపంచంలో దేనినైనా అవలీలగా సాధించగలమన్న నమ్మకం కలిగి ఉంటారు. అయితే, సామాజిక మాధ్యమాల మితిమీరిన వాడకం కారణంగా వీరిలో ఈ లక్షణం క్రమేపీ సన్నగిల్లుతోందని, వారు తమని తాము తక్కువ చేసుకుని చూసుకుంటున్నారని లోకల్ సర్కిల్స్ అధ్యయనం తేలి్చంది. ఆ సర్వే మాత్రమే కాదు ఇప్పటికే జరిగిన పలు శాస్త్రీయ పరిశోధనలు కూడా ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. ప్రతి చిన్న విషయానికీ సోషల్ మీడియాపై ఆధారపడటం వల్ల పిల్లలతోపాటు పెద్దవారిలోనూ కొన్ని శారీరక, మానసిక మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, మనోవ్యాకులత, ప్రతిదానికీ చికాకుపపడటం వంటివి వీటిల్లో కొన్ని. పైగా పిల్లలు ఏ అంశంపైనా సరైన దృష్టిని కేంద్రీకరించలేని పరిస్థితి ఉంటోంది. లోకల్ సర్కిల్స్ అధ్యయనం ప్రకారం 13–17 మధ్య వయసు్కలు రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియాపై ఖర్చు చేస్తున్నారు. నగరాల్లోనైతే 9–13 మధ్య వయస్కులైన పిల్లలు కూడా ఇదే రకంగా ఉన్నట్లు 49 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించారు. మానసిక సమస్య కాదు టీనేజీ లేదా అంతకంటే తక్కువ వయసులో సామాజిక మాధ్యమాలకు అలవాటు పడిపోవడం మానసిక సమస్య కాదన్నది నిపుణుల అభిప్రాయం. కాకపోతే మార్చుకోదగ్గ బిహేవియరల్ డిజార్డర్ అని చెప్పకతప్పదని ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్ ఎంఎస్ రెడ్డి చెప్పారు. టీనేజీ వారైనా, పెద్దలైనా రోజుకు కనీసం 150 సార్లు తమ ఫోన్లు చెక్ చేసుకుంటారని సర్వేలు చెబుతున్నాయి. మరీ ఎక్కువగా ఆధారపడ్డ వారైతే నిత్యం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండటం గ్యారంటీ అంటున్నారు నిపుణులు. సామాజిక మాధ్యమాల వల్ల సమస్యలున్నాయని కోవిడ్కంటే ముందు కూడా చాలా అధ్యయనాలు స్పష్టం చేశాయి. అతి వాడకం వల్ల ఇవి మరిన్ని వ్యవసనాలకు పాల్పడే అవకాశాలూ ఎక్కువని ఈ అధ్యయనాలు తెలిపాయి. పెద్దలకు మాత్రమే పరిమితం కావాల్సిన కంటెంట్ సులువుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటమూ టీనేజీ వారికి అంత మంచిది కాదన్నారు మానసిక నిపుణులు డాక్టర్ వీరేంద్ర. ఇటీవల కాలంలో తమ వద్దకు వచి్చన కేసుల్లో అధికం ఇలాంటివేనని మానసిక నిపుణులు అంటున్నారు. పైగా, సోషల్ మీడియాలో ఎవరు ఎవరన్నది ఏమాత్రం తెలిసే అవకాశం లేదు. ఈ కారణంగా ఆడ పిల్లలు ప్రమాదాల బారిన పడేందుకూ అవకాశాలు పెరిగాయంటూ ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ జాయ్ ఎన్ టిర్కీ సైబర్ క్రైమ్ విభాగానికి సమరి్పంచినలో నివేదికలో వెల్లడించారు. జామా సైకియాట్రీ అధ్యయనం ప్రకారం.. రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి మాధ్యమాల్లో గడపడం టీనేజర్లకు ఏ మాత్రం సరికాదు. అర గంట కంటే ఎక్కువ సమయం గడిపే వారికి అసలు వాడని వారితో పోలి్చనప్పుడు మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. టీవీ, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, మ్యూజిక్ వంటి అన్ని రకాల వినోదాలను పరిగణనలోకి తీసుకుంటే కొంతమంది టీనేజర్లు రోజుకు తొమ్మిది గంటల వరకూ గడుపుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలా గుర్తించండి.. ► సోషల్ మీడియాలో గడిపే సమయం క్రమంగా ఎక్కువవుతుంటే... లైకులు ఎన్ని వచ్చాయి? ఎలాంటి కామెంట్లు వచ్చాయో.. అని మామూలు సమయంలోనూ ఆలోచిస్తూంటే.. ► ఫ్రెండ్స్తో ముచ్చట్లు తగ్గిపోయినా.. ఇతర అలవాట్ల నుంచి దూరంగా తొలగుతున్నా.. స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టాప్ అందుబాటులో లేకపోతే తెగ ఆందోళన చెందుతున్నా.. చదువులు దెబ్బతింటున్నా.. బంధుమిత్రులు, తల్లిదండ్రులు తిడుతున్నా.. నచ్చచెబుతున్నా సోషల్ మీడియాను వదలకుండా ఉంటే.. పైన చెప్పుకున్న విషయాలన్నీ మీకు లేదా మీకు తెలిసిన టీనేజీ వారికి వర్తిస్తున్నాయా? అయితే సామాజిక మాధ్యమం ఉచ్చులో చిక్కినట్లే!!! :::కంచర్ల యాదగిరిరెడ్డి -
కళ్లు చెదిరేలా న్యూ ఇయర్ సేల్, స్మార్ట్ ఫోన్ కొంటే.. స్మార్ట్ వాచ్ ఫ్రీ!
హైదరాబాద్: టాటా గ్రూప్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ కంపెనీ ‘క్రోమా’ క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా ఆఫర్లు ప్రకటించింది. గేమింగ్ ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలపై డీల్స్ను అందిస్తున్నట్లు తెలిపింది. ప్రారంభ ధర రూ.12,999తో 5జీ స్మార్ట్ ఫోన్ పొందవచ్చు. దీనికి అదనంగా రూ.4,999 విలువైన స్మార్ట్వాచ్ను(బ్రాండ్లను బట్టి) ఉచితంగా అందిస్తుంది. పార్టీ స్పీకర్లను రూ.2199 ప్రారంభ ధరతో అందిస్తుంది. సౌండ్బార్లపై 80% వరకు తగ్గింపు లభిస్తుంది. అన్ని క్రోమా స్టోర్లు, క్రోమా ఆన్లైన్ పోర్టల్ కొనుగోలుపై ఈ ఆఫర్లు పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్లు జనవరి రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. -
న్యూ ఇయర్ క్రేజీ ఆఫర్.. అదిరే ఫీచర్లున్న ఈ రెడ్మీ 5జీ స్మార్ట్ఫోన్ ధర తగ్గింపు!
ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ ఇండియా ఇటీవలే రెడ్మీ 11 ప్రైమ్ 5జీ (Redmi 11 Prime 5G) స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదల సంగతి తెలిసిందే. తాజాగా తన కస్టమర్లకు న్యూ ఇయర్ ఆఫర్గా ఈ స్మార్ట్ఫోన్ ధరను తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెండు వేరియంట్లపై రూ.1,000 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం Mi.com, అమెజాన్ (Amazon)లో వెయ్యి రుపాయలు తగ్గింపు ధరతో... 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.14,999 ధరగా ఉంది. అంతకుముందు ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. Redmi Prime 5Gలో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది డిస్ప్లేలో వాటర్డ్రాప్-స్టైల్ డిస్ప్లే నాచ్ను కలిగి ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండగా 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22.5వాట్ ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. పవర్ఫుల్ నైట్ విజన్, పోర్ట్రైట్ మోడ్, మూవీ ఫ్రేమ్, షార్ట్ వీడియో, టైమ్ ల్యాప్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మెడో గ్రీన్, థండర్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ కలర్స్లో లభిస్తుంది. అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్లు ద్వారా ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి ఈ హ్యాండ్సెట్ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1,000 తగ్గింపు ఇస్తుండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ల ద్వారా చేసిన కొనుగోళ్లకు 750 తక్షణ తగ్గింపు అందిస్తోంది. అమెజాన్ నుంచి ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.2,000 నుంచి ప్రారంభం అవుతుంది. -
మొబైల్ ఫోన్ కోసం కన్నతల్లినే దారుణంగా కొట్టిన కసాయి కొడుకు
మొబైల్ ఫోన్ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని చింద్వారాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే... దర్బాయి గ్రామంలోని బద్కుహి చౌకీ ప్రాంతంలో నివశిస్తున్న వినేద్ అనే ప్రబుద్ధుడు తన తల్లిని స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు రూ. 25 వేలు ఇమ్మని అడిగాడు. ఐతే అతడి తల్లి రూ. 15 వేలు మాత్రమే ఇచ్చింది. దీంతో వినోద్ కోపేద్రకంతో కన్నతల్లి అని కూడా లేకుండా కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళను హుటాహుటినా అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. తన కొడుకుకి తన నుంచి తన భర్త నుంచి డబ్బు తీసుకుంటుంటాడని కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్లో ప్రజలు) -
ప్రపంచ జనాభాలో అత్యధికం ‘జూమర్స్’.. ఇంతకూ మీది ఏ తరం?
దొడ్డ శ్రీనివాసరెడ్డి సరదా కోసమైనా, సమాచారం కోసమైనా రేడియోనే దిక్కయిన తరం ఒకటి.. అరచేతిలో స్మార్ట్ ఫోన్తో ప్రపంచాన్నే చుట్టబెడుతున్న తరం మరొకటి..యుద్ధాలు, సంక్షోభాలు, మహమ్మారుల మధ్య భయంగా గడిపిన తరం ఇంకొకటి.. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొన్నది వేరొకటి.. ..దాదాపు ప్రతి తరం ఒక ప్రత్యేకమైన కాలమాన పరిస్థితుల్లో ఎదిగింది. విభిన్నమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను అనుభవించింది. ఈ ప్రతి తరం కూడా నాటి ఆ పరిస్థితులకు ప్రత్యేక గుర్తులే. ఆ గుర్తులకు అనుగుణంగానే ఒక్కో తరానికి ఒక్కో పేరు పెట్టారు. అమెరికాలో మొదలై.. తరాల అంతరాలను గుర్తించి, వాటికి నామకరణం చేయడం అమెరికాలో మొదలైంది. ఒక్కో తరానికి ఉన్న ఒక విలక్షణమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని బూమర్స్, జూమర్స్, మిలీనియల్స్ అంటూ పేర్లను అమెరికా సామాజిక వేత్తలు, మేధావులు, రచయితలు ఖాయం చేశారు. అటుఇటుగా అలాంటి పరిస్థితులే ఉన్న పాశ్చాత్య దేశవాసులు కూడా అవే పేర్లు, వర్గీకరణను వాడకంలోకి తెచ్చారు. మరి ఇంతకీ ఈ తరాలు, వాటి ప్రత్యేకతలు, వాటి కాలమాన పరిస్థితులు ఏమిటి? సైలెంట్ జనరేషన్ (1928–1945): యవ్వనమంతా కష్టాల్లో గడిపి.. ఈ తరం వాళ్లు పసితనంలోనే 1930నాటి మçహా ఆర్థిక సంక్షోభాన్ని చవిచూశారు. యుక్త వయసు వచ్చే నాటికి రెండో ప్రపంచ యుద్ధం పాలినపడ్డారు. జీవితమంతా కష్టాలనోర్చుకొని సాగిన ఈ తరం వారు ఇప్పుడు 77 నుంచి 94 ఏళ్ల మధ్య వయస్కులై ఉంటారు. వయసు మీరిన తర్వాతే ఈ తరం ప్రపంచవ్యాప్తంగా సాగిన అభివృద్ధిని వీక్షించింది. యవ్వనమంతా అష్టకష్టాల్లో, భయంభయంగా గడిపిన ఈ తరానికి సైలెంట్ జనరేషన్ అని పేరు వచ్చింది. బేబీ బూమర్స్ (1946–1964): జనాభాను పెంచి.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదలైంది ఈ తరం. యుద్ధంలో చెల్లాచెదురైన వారంతా మళ్లీ ఏకమై స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో ఒక్కసారిగా ప్రపంచ జనాభా పెరగడం మొదలైంది. అందుకే ఈ తరానికి బేబీ బూమర్స్గా నామకరణం చేశారు. మిగతా తరాలకు రచయితలో, సామాజికవేత్తలో పేర్లు పెడితే.. ఒక్క ఈ తరానికి మాత్రం అధికారికంగా అమెరికా జనాభా వివరాల సేకరణ బ్యూరో ‘బేబీ బూమర్స్’గా నామకరణం చేసింది. ఈ తరం వాళ్లు ప్రస్తుతం 58 నుంచి 76 ఏళ్ల మధ్య వయస్కులై ఉంటారు. ఉద్యోగ విరమణ చేసి మనవళ్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ తరం రాజకీయంగా, సామాజికంగా అనేక మార్పుల్ని చవిచూసింది. చిన్నతనంలో కొరియా యుద్ధం, యవ్వనంలో వియత్నాం యుద్ధం, తర్వాత మొదలైన యుద్ధ వ్యతిరేక, పౌరహక్కుల ఉద్యమాలకు ప్రత్యక్ష సాక్షులు ఈ తరం వారు. అంతరిక్ష రంగంలో మానవుడి తొలి విజయాలకు సాక్షి ఈ తరం. అమెరికా, రష్యా విభేదాలతో రెండుగా చీలిన ప్రపంచంలో వీరు మనుగడ సాగించారు. బ్లాక్ అండ్ వైట్ టీవీతో మొదలై వైఫైదాకా సాగిన సాంకేతిక విప్లవాన్ని ఆస్వాదించిందీ తరం. జనరేషన్ ఎక్స్ (1965–1980): విభిన్నమైన మార్పులు చూసి.. కెనడాకు చెందిన జర్నలిస్టు, రచయిత కాప్లాండ్ రచించిన ‘జనరేషన్ ఎక్స్.. టేల్ ఫర్ యాన్ యాక్సిలరేటెడ్ కల్చర్’అనే నవల ఆధారంగా ఈ తరానికి జనరేషన్ ఎక్స్ అని పేరు పెట్టారు. ప్రపంచం అనూహ్య రీతిలో పరిణామం చెందుతున్న దశలో.. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో మొదలైన ఈ తరంవారు ఇప్పుడు 42 నుంచి 57 ఏళ్ల మధ్య వయసులో ఉన్నారు. కంప్యూటర్ శకానికి ఆద్యులైన ఈ తరంలో ఇంకా అటు వార్తా పత్రికలు, మ్యాగజైన్లు చదివేవారి నుంచి ఇటు స్మార్ట్ ఫోన్లకు అలవాటుపడుతున్న వారిదాకా ఉన్నారు. గత తరాల కంటే ఈ తరం విద్యా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. అలాగే ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ కల్చర్కు సాక్షులు ఈ తరంవారు. స్నేహ హస్తాన్ని చాచి బెర్లిన్ వాల్ను కూల్చివేసిన ఘటన నుంచి విద్వేషం వెర్రితలలు వేసి న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లను కూల్చివేసిన 9/11 ఘటన దాకా ఎన్నో చూసింది ఈ తరం. మిలీనియల్స్ (1981– 1996): సాంకేతిక విప్లవంతో ఎదిగి.. సహస్రాబ్దికి చేరువలో పుట్టిన ఈ తరాన్ని మిలీనియల్స్ అని పిలుస్తున్నారు. మొదట ఈ తరాన్ని జనరేషన్ వై అని పిలిచారు. కానీ అమెరికన్ రచయితలు విలియం స్ట్రాస్, నీల్ హోవే 1980 తర్వాత జన్మించిన వారిని మిలీనియల్స్ అని నామకరణం చేయడంలో ఈ తరానికి ఆ పేరేస్థిరపడింది. ప్రస్తుతం ప్రపంచంలో గత తరాలతో పోలిస్తే అత్యధిక సంఖ్యాకులు మిలీనియల్సే. దాదాపు 180 కోట్ల మంది అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 23 శాతం మంది ఈతరం వారే. ఆసియాలో వీరి సంఖ్య 25 శాతంపైనే ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక శాతం విద్యావంతులు ఈ మిలీనియల్సే. 25 శాతం పైగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నవారే. ఈ తరం వారి ప్రస్తుత వయసు 26 నుంచి 41 సంవత్సరాలు. సాంకేతిక విప్లవంతోపాటు ఎదిగిన ఈ తరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తోంది. రాజకీయాలు మొదలు అన్ని రంగాలను శాసించగల సత్తా ఉన్న తరం ఇది. జనరేషన్ జెడ్ (1997–2012): ఇంటర్నెట్తో ఆడుతూపాడుతూ.. ఇంటర్నెట్ను జూమ్ చేస్తూ ఎదిగిన ఈ తరం వారిని జూమర్స్ అని కూడా పిలుస్తారు. ఈ తరానికి చెందినవారు ప్రస్తుతం పదేళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులు. మిలీనియల్స్ కంటే వీరి సంఖ్య ఎక్కువ. ప్రపంచ జనాభాలో వీరే 26 శాతం ఉన్నారు. 2025 నాటికి ప్రపంచ ఉద్యోగ వర్గంలో 27 శాతం జూమర్సే ఉంటారు. ఇంటర్నెట్ పూర్తిస్థాయిలో వినియోగించిన తొలితరం ఇదే. గూగుల్తోపాటు ఎదుగుతున్న ఈ తరం సమస్త దైనందిన కార్యక్రమాలను స్మార్ట్ఫోన్తో చేసుకుపోతోంది. ప్రపంచాన్నీ స్మార్ట్ఫోన్ నుంచే వీక్షిస్తోందీ తరం. జనరేషన్ ఆల్ఫా (2013 నుంచి మొదలు): మారిన జీవన శైలితో... ఇరవై ఒకటో శతాబ్దంలో పుట్టిన తరం ఇది. గ్రీక్ అక్షరమాలలో తొలి అక్షరమైన ఆల్ఫాను ఈ తరానికి పేరుగా పెట్టారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్–19 ఈ తరంలోనే విశ్వవ్యాప్తమైంది. ఈ కోవిడ్తో మారిన జీవన శైలిని అనుసరించబోతోంది ఆల్ఫా జనరేషన్. ఏటా 25లక్షల మంది ఈ తరానికి తోడవుతున్నారు. 2025 నాటికి వీరి సంఖ్య 200 కోట్లకు చేరబోతోంది. జన జీవితంలో ప్రతి పదిహేను, ఇరవై సంవత్సరాలకోసారి స్పష్టమైన మార్పులు వస్తుంటాయి. ఆ కాలాన్నే తరంగా అభివర్ణిస్తున్నామని ప్రజల జీవన పోకడలను నిరంతరం పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ ఉండే ప్యూ రీసెర్చ్ సెంటర్ చెబుతోంది. తరాలను వర్గీకరించడం, వాటికి పేర్లు పెట్టడం సైన్స్ ఏమీ కాదు. కేవలం ఆ తరం ఆలోచనలు, అభిరుచులను, పోకడలను అంచనా వేయడం కోసం ఒక సాధనం మాత్రమేనని ప్యూ సెంటర్ అభిప్రాయం. అసలు తరాల వర్గీకరణను గత శతాబ్ది మొదట్లోనే జర్మన్ సామాజిక శాస్త్రవేత్త కార్ట్ మన్హెమ్, స్పానిష్ తత్వవేత్త జోస్ ఒర్తెగా మొదలుపెట్టారు. ఇది ఒకే కాలమాన పరిస్థితుల్లో జీవించే వారి మధ్య ఉండే సామీప్యతలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని వారి వాదన. మన దగ్గర తరాల పరిస్థితి ఏమిటి? పాశ్చాత్య దేశాల్లో జరిగిన తరాల వర్గీకరణ వంటిది మన దగ్గర జరగలేదు. గ్లోబలైజేషన్తో ప్రపంచమంతా ఒకేలాంటి పరిస్థితులు ఆవిర్భవించిన నేపథ్యంలో మిలీనియల్స్ నుంచి మనం కూడా పాశ్చాత్య వర్గీకరణను పాటిస్తున్నాం. అయితే విభిన్న పరిస్థితులున్న పాతతరాన్ని అంచనా వేసే ప్రయత్నం భారత్లో పెద్దగా జరగలేదు. కొందరు ఔత్సాహికులు భారతీయుల్ని దేశ విభజన తరం (1944–1963), పరివర్తన తరం (1964–1983) సంస్కరణల తరం (1984 నుంచి మొదలు)గా విభజించి విశ్లేషించే ప్రయత్నం చేశారు. మిలీనియల్స్ను మన దగ్గర సంస్కరణల తరంగా పరిగణించాలని, ఈ కాలంలోనే భారత సమాజం సమూల మార్పులను చవిచూసిందని అంటున్నారు భారతీయ సామాజిక వేత్తలు. రాజీవ్గాంధీ హయాంలో మొదలైన కంప్యూటరీకరణ నుంచి పీవీ నరసింహారావు హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు విపరీతమైన మార్పులకు లోనయ్యాయన్నది వీరి పరిశీలన. -
అంగన్వాడీల్లో ‘స్మార్ట్’ సేవలు
సాక్షి, పుట్టపర్తి: అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో స్మార్ట్ సేవలకు శ్రీకారం చుట్టేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే కార్యకర్తలు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లను అందిస్తున్నారు. త్వరలో అధికారికంగా ఈ సేవలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్మార్ట్ సేవలతో అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పాదర్శక సేవలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లాకు 2,863 స్మార్ట్ఫోన్ల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులకు గానూ 2,824 అంగన్వాడీ కేంద్రాలు (మినీ, మెయిన్) ఉన్నాయి. ఈ కేంద్రాల్లోని అంగన్వాడీ కార్యకర్తల పర్యవేక్షణకు గానూ 39 మంది సూపర్ వైజర్లు ఉన్నారు. అంగన్వాడీ సేవలను విస్తృతం చేయడంలో భాగంగా వీరందరికీ 2,863 స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. విధి నిర్వహణలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న వివిధ రకాల సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఫీడ్ చేసి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. పక్కాగా పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంతో పాటు కోడిగుడ్లు తదితర పౌష్టికాహారాన్ని అందజేస్తారు. వీటి వివరాలను వైఎస్సార్ సంపూర్ణ పోషణ ట్రాక్ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్థిదారుల హాజరు, గృహ సందర్శన కార్యక్రమాల ద్వారా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్ మాత్రల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అదనంగా తీసుకోవాల్సిన ఆహారంపై కూడా చైతన్య పరచాల్సి ఉంటుంది. అలాగే పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాక రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్ల విధానం ఎంతగానో దోహదపడుతుంది. పారదర్శక సేవలు అందుతాయి జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందుతున్నాయి. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రతి రోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతోంది. ఐసీడీఎస్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్ల మంజూరుతో అక్రమాలకు చెక్ పడటంతో పాటు పారదర్శక సేవలు అందుతాయి. – రెడ్డి రమణమ్మ, ఇన్చార్జి పీడీ, ఐసీడీఎస్ (చదవండి: సెల్ఫీల కోసం వచ్చావా.. బాలయ్యా! ) -
జనవరి 1 నుండి స్మార్ట్ ఫోన్ కొనేముందు ఇది చెక్ చేసుకోండి
-
వావ్ అనే లుక్లో వివో వై16.. ఫీచర్లు అదిరే, రూ.10వేల కన్నా తక్కువే!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల బ్రాండ్ వివో కొత్తగా తమ వై–సిరీస్ పోర్ట్ఫోలియోను విస్తరించింది. వై16 ఫోన్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 9,999 (3జీబీ+32 జీబీ) నుంచి రూ. 12,499 (4 జీబీ+64 జీబీ) వరకూ ఉంటుంది. స్టెల్లార్ బ్లాక్, డ్రిజ్లింగ్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. కోటక్, ఐడీఎఫ్సీ, వన్కార్డ్, బీవోబీ, ఫెడరల్, ఏయూ బ్యాంక్ కార్డులతో రూ. 1,000 వరకూ, ఆన్లైన్ కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ డెబిట్/క్రెడిట్ కార్డులపై రూ. 750 మేర క్యాష్బ్యాక్ పొందవచ్చు. 6.51 అంగుళాల స్క్రీన్, ఫింగర్ప్రింట్ స్కానర్, ఫేస్ వేక్ ఫీచర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ కార్డ్ స్లాట్, 13 ఎంపీ మెయిన్.. 2 ఎంపీ మాక్రో కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కమెరా, మీడియాటెక్ పీ35 ఆక్టా కోర్ ప్రాసెసర్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయని సంస్థ తెలిపింది. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
సేల్స్ బీభత్సం, 700 శాతం వృద్ధి..ఏ స్మార్ట్ఫోన్ బ్రాండ్ తెలుసా?
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ బ్రాండ్ ‘ఐక్యూ’ జూన్తో ముగిసిన త్రైమాసికంలో.. భారత్లో వేగంగా వృద్ధి సాధిస్తున్న స్మార్ట్ఫోన్ బ్రాండ్గా నిలిచినట్టు కౌంటర్ పాయింట్ ‘స్మార్ట్ఫోన్ మోడల్ ట్రాకర్’ నివేదికను ప్రకటించింది. జూన్ క్వార్టర్లో ఐక్యూ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాల్లో 700 శాతం వృద్ధిని చూపించింది. అంతేకాదు మార్చి త్రైమాసికం గణాంకాలతో పోల్చి చూసినా ఐక్యూ జూన్ క్వార్టర్లో 135 శాతం వృద్ధిని చూపించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
రియల్ మీ సరికొత్త ఫోన్ సీ30ఎస్ లాంచ్, లోబడ్జెట్ ధర
న్యూఢిల్లీ: రియల్మీ కంపెనీ సీ సిరీస్ నుంచి సీ30ఎస్ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. తక్కువ ధరలోనే ఫింగర్ప్రింట్ అన్లాక్ ఫీచర్తో ఈ ఫోన్ను తీసుకొచ్చింది. యూనిసాక్ ఎస్సీ9863ఏ ఆక్టాకోర్ ప్రాసెసర్తో పనిచేసే ఈ ఫోన్ డిస్ప్లే 6.5 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. వెనుక భాగంలో 8 మెగాపిక్సల్ ఏఐ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రియల్మీ సీ30ఎస్ స్పెసిఫికేషన్స్ 6.5 ఇంచుల HD+ LCD డిస్ప్లేను 60Hz రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ Unisoc SC9863A ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12 బేస్ట్ రియల్మీ యూఐ గో ఎడిషన్తో 64 జీబీదాకా విస్తరించుకును అవకాశం 8 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ ధరలు,లభ్యత 2 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.7,499, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది. స్ట్రిప్ బ్లాక్, స్ట్రిప్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఇది లభ్యం. రియల్మీ సీ30ఎస్ మొబైల్ ఫ్లిప్కార్ట్ బిలియన్ డేస్ సందర్భంగా సెప్టెంబరు 23నుంచి సేల్కు రానుంది. -
ఫ్లిప్కార్ట్ సేల్, గూగుల్పిక్సెల్ ఫోన్పై భారీ తగ్గింపు
సాక్షి,ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. అయితే ముందుగానే నథింగ్ ఫోన్ (1), గూగుల్ పిక్సెల్ 6ఏ వంటి కొన్ని పాపులర్ స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ ప్రకటించింది. డిస్కౌంట్ఆఫర్తో వాస్తవ ధరకంటే చాలా తక్కువకే వీటిని ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లు సుమారు రూ. 30వేల కంటే తక్కువకే అందించనుంది. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 6ఏ కొనుగోలుపై గరిష్టంగా 20వేల రూపాయల వరకు ధర తగ్గనుంది. బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్తో కలిపి ఈ తగ్గింపు ఉండనుంది. మరోవైపు అమెజాన్ తన మెగా సేల్ ఈవెంట్ను సెప్టెంబర్ 23న కూడా నిర్వహించనుంది. గూగుల్ పిక్సెల్ 6ఏ డీల్: రూ. 43,999కి లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 6ఎ, రానున్న సేల్లో రూ.27,699లకే లభిస్తుందని ఫ్లిప్కార్ట్ లిస్టింగ్ చెబుతోంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఐసీఐసీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై ఫ్లిప్కార్ట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్గా రూ. 20వేల వరకు ఆఫర్ చేస్తోంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఫోన్ మోడల్, పరిస్థితిపై ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. గూగుల్ పిక్సెల్ 6ఏ స్పెసిఫికేషన్స్ 6.1అంగుళాల OLED డిస్ప్లే టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్ ఆక్టా-కోర్ Google Tensor SoC కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ 12.2+ 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4,410mAh బ్యాటరీ -
బంపర్ ఆఫర్: మొబైల్ ఫోన్ అలవెన్స్ ఏడాదికి రూ.2 లక్షలు
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఉన్నతస్థాయిలోని (మేనేజ్మెంట్) ఉద్యోగులు ఒక్కొక్కరికి మొబైల్ ఫోన్లు కొనుగోలుకు వీలుగా ఏడాదికి రూ.2 లక్షలను అలవెన్స్గా ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలను ఈ మేరకు సవరించింది. దీని ప్రకారం ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ మొబైల్ ఫోన్ అలవెన్స్కు అర్హులు. సవరించిన నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీలో ఎండీ, సీఈవోకి సహాయం అందించేందుకు ప్రస్తుతం నలుగు రు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. ఇక చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) స్థాయి అధికారికి గతంలో మాదిరే మొబైల్ ఫోన్ అలవెన్స్ కొనసాగనుంది. సీజీఎం రూ.50,000, జీఎం రూ.40,000ను ఫోన్ అలవెన్స్ పొందొచ్చు. -
వార్నింగ్.. ఈ ట్రిక్తో మనల్ని ఈజీగా ట్రాక్ చేస్తారు!
టెక్నాలజీ పుణ్యమా అని ప్రపంచం మొత్తం ప్రజల అరచేతుల్లోకి వచ్చేసింది. ఇక మొబైల్ ఉంటే చాలు ఏదైనా మన ముందుకే వస్తోంది. తినే తిండి నుంచి, షాపింగ్ వరకు ఇంటి నుంచి కదలకుండా ప్రజలు వారి పనులు పూర్తి చేసుకుంటున్నారు. నాణానికి రెండు వైపులు ఉన్నట్లే టెక్నాలజీ వల్ల కూడా లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ వల్ల వ్యక్తులు ఎక్కడ ఉన్నారో ఈజీగా కనిపెట్టవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే సులువుగా ట్రాక్ చేయవచ్చు. దీన్ని ఈ టెక్నాలజీని కొందరు మంచికి మరికొందరు చెడుకి కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. ఇలా ట్రాక్ చేసేయండి! సాధారణంగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏ ప్రదేశాన్నికనుక్కోవాలన్నా అందరి చూపు గూగుల్ మ్యాప్స్ వైపు. అంతేనా ఒకరిని ట్రాకింగ్ చేయాలంటే కూడా అదే దిక్కుగా మారింది. దీని ద్వారా వ్యక్తుల లొకేషన్ను ట్రాక్ చేయవచ్చు. వాళ్లు ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే దానికి ఎదుటివంటి పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు మీకు కావాల్సిన వ్యక్తి లొకేషన్ ను ఎలా ట్రాక్ చేయాలో ఓ లుక్కేద్దాం. ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే వాట్సప్లో లైవ్ లొకేషన్ షేర్ చేస్తే ఒక వ్యక్తి మరో వ్యక్తిని ట్రాక్ చేయవచ్చు. అదే ఐఫోన్, ఐపాడ్ అయితే గూగుల్ మ్యాప్స్ లో ట్రాక్ చేయాలనుకునే ఎదుటి వ్యక్తి జీమెయిల్ ఐడీని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆపై గూగుల్ మ్యాప్స్ లో మీ ప్రొపైల్ ను క్లిక్ చేసి ట్రాక్ చేయాలనుకునే వ్యక్తిని యాడ్ చేయాలి. తర్వాత షేర్ లోకేషన్ బటన్ ను క్లిక్ చేసి ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారు, ఎంతసేపు అనే వివరాలను ఇవ్వాలి. కాంటాక్ట్ నెంబర్లను యాడ్ చేయాలి. ట్రాకింగ్కు రెడీగా ఉన్నప్పుడు మీరు షేరింగ్ బటన్ను క్లిక్ చేస్తే మీరు సెలక్ట్ చేసుకున్న వ్యక్తులు మిమ్మల్ని ట్రాక్ చేయడానికి వీలు కుదురుతుంది. ఇక్కడ వరకు మన అనుమతితోనే జరుగుతుంది. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏంటంటే కొందరు ఈ ట్రిక్ని మంచికి కాకుండా చెడుగా కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే మన ఈమెయిల్కి లేదా ఫోన్కి మెసేజ్ రూపంలో తెలియని వ్యక్తులు లింక్లు పంపితే, వాటిని ఓపన్ చేయకుండా, వెంటనే డెలీట్ చేయడం ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. చదవండి: Anand Mahindra: 'ప్రకృతి అందరి సరదా తీర్చేస్తుంది' కావాలంటే చూడండి.. ఆనంద్ మహీంద్రా వైరల్ వీడియో టెలిగ్రామ్, వాట్సప్లో ఈ ఇన్వెస్ట్మెంట్ సలహాలు విన్నారో.. కొంప కొల్లేరే! -
5జీ అంటే ఏమిటి? దీని గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు!
అవసరాలకు అనుగణంగా టెక్నాలజీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ వస్తుంది. అందులో భాగమే ఈ ఐదవ జనరేషన్ నెట్ వర్క్. గతంలో మొబైల్ నెట్ వర్క్ కోసం 2జీ నెట్ వర్క్ ఉండేది. దానితో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చాలా సమయమే పట్టేది. ఆ తర్వాత ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతూ 3జీ వచ్చింది. ప్రస్తుతం 4జీ నెట్ వర్క్లను వినియోగిస్తున్నాం. ఇందులో 10 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వేగంతో డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే త్వరలో రాబోతున్న 5జీ నెట్ వర్క్ 4జీ కంటే 10రెట్ల వేగంగా పనిచేస్తుంది. దీని వేగం కనీసం 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీ వరకు ఉండనుంది. గరిష్టంగా 10 జీబీపీఎస్ ఉండొచ్చని అంచనా. ఇక 5జీ వేగానికి ఉదాహరణ చెప్పాలంటే 3 గంటల నిడివిగల సినిమాను ఒక్క నిమిషంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాంటి ఫాస్టెస్ట్ నెట్ వర్క్ 5జీ నెట్ వర్క్కు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. 4జీ కంటే 10రెట్ల వేగంతో పనిచేసే 5జీ నెట్ వర్క్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ..ఇతర టెలికాం సంస్థల కంటే ముందుగానే 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని ప్రకటించింది. జియో సైతం ఆగస్ట్ 15కి 5జీ సేవల్ని వినియోగంలోకి తేనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ 5జీ అంటే ఏమిటి. 5జీ అంటే ఏమిటి, 4జీకి.. 5జీకి ఉన్న తేడా ఏంటి? 5జీ అంటే ఫిప్త్ జనరేషన్ నెట్వర్క్. అంతర్జాతీయ ప్రమాణలతో 4జీ కంటే 10రెట్ల వేగంతో అందుబాటులోకి రానున్న వైర్ లెస్ నెట్ వర్క్. 5జీ నెట్ వర్క్ వేగంతో పాటు అసలు నెట్ వర్క్ సరిగ్గా లేని ప్రదేశాల్లో సైతం ఉదాహరణకు గంటల డ్యూరేషన్ ఉన్న సినిమా వీడియోల్ని 1, లేదా 2 నిమిషాల్లో డౌన్ చేసుకోవడం, తక్కువ నెట్ వర్క్లో సైతం ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవ్వడం, వర్క్ ఫ్రం హోం లాంటి పనుల్ని చక్కబెట్టుకోవచ్చు. వీటితో పాటు హై క్వాలిటీ వీడియో గేమ్స్ను ఆడే సౌకర్యం కలగనుంది. 5జీలో రెండు నెట్ వర్క్లు 5జీలో రెండు రకాలైన నెట్వర్క్లున్నాయి. అందులో ఒకటి 'ఎంఎంవేవ్' (mm Wave). నెట్ వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పైన పేర్కొన్న నెట్ వర్క్తో ఆన్లైన్లో మనకు కావాల్సిన పనిని సులభంగా,వేగంగా పూర్తి చేసుకోవచ్చు. 5జీలో రెండో నెట్ వర్క్ 'సబ్-6జీహెచ్జెడ్'..ఈ నెట్ వర్క్ స్లోగా ఉంటుంది. కానీ 4జీతో పోలిస్తే కొంచెం బెటర్, ఇందుకోసం నెట్వర్క్ కవరేజీ బాగుండాలి. వినియోగించేది సబ్-6హెచ్జెడ్ 5జీ నెట్ వర్క్నే 5జీ నెట్ వర్క్లో ఎంఎం వేవ్ కంటే సబ్- 6హెచ్జెడ్ నెట్ వర్క్ స్లోగా ఉంటుంది. అయినా చాలా దేశాలు సబ్ - 6జీ హెచ్ జెడ్ నెట్ వర్క్నే వినియోగిస్తున్నాయి. అందుకు కారణం.. ఖర్చు తక్కువ. నెట్ వర్క్ పోల్స్ను దూరం దూరం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నెట్ వర్క్ 4జీ కంటే ఫాస్ట్గా పనిచేస్తుంది. అంతరాయం ఏర్పడితే ఆ సమస్యని త్వరగా పరిష్కరించుకోవచ్చు. ఎంఎం వేవ్ 5జీ నెట్ వర్క్ విస్తరణ ఖర్చు చాలా ఎక్కువ. వాటి నెట్ నెట్ వర్క్ పోల్స్ దగ్గర దగ్గరగా.. ఉండాలి. లేదంటే నెట్ వర్క్ సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా నెట్ వర్క్ పోల్స్ ను ఏర్పాటు చేయడం కష్ట తరం. అందుకే చాలా దేశాలు ఎంఎం వేవ్ 5జీ నెట్ వర్క్ జోలికి వెళ్లవు. 5జీ బ్యాండ్లు అంటే ఏమిటి? గత కొన్నేళ్లుగా 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేస్తూ స్మార్ట్ఫోన్లు విడుదల అవుతున్నాయి. ఆ ఫోన్ల బ్యాండ్ నెంబర్లను ప్రకటిస్తున్నాయి.లేటెస్ట్గా విడుదలయ్యే కొత్త స్మార్ట్ఫోన్లలో వాటి తయారీ సంస్థలు సైతం 9 లేదా 12 బ్యాండ్లకు సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఈ బ్యాండ్లు ఏమిటి? వాటి ప్రాముఖ్య ఏమిటి? 5జీ నెట్ వర్క్ అనే రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్తో పనిచేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్గా పిలిచే వీటిని చిన్న చిన్న బ్యాండ్స్గా వర్గీకరిస్తారు. అందులో లో బ్యాండ్లు (వైడ్ కవరేజ్,స్లో స్పీడ్) - కవరేజీ ఎక్కువగా ఉండి..స్లోగా ప్రారంభమై..స్పీడ్గా పనిచేస్తుంది. మిడ్ రేంజ్ బ్యాండ్లు, హై రేంజ్ బ్యాండ్లు..లిమిటెడ్ కవరేజ్లో హై స్పీడ్గా కనెక్ట్ అవుతాయి. ఈ 'n78' బ్యాండ్ ఎందుకోసం అయితే ఈ బ్యాండ్ల విషయంలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు అయోమయానికి గురవ్వడం సర్వసాధారణంగా చూస్తుంటాం. అవగాహన లేకపోయినా సరే.. లో బ్యాండ్ ఉన్న ఫోన్ల కంటే హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉన్న ఫోన్లను కొనుగోలు చేస్తే 5జీ నెట్ వర్క్ పనితీరు బాగుంటుందని అనుకుంటాం. వాస్తవానికి అందులో నిజం లేదని టెలికాం నిపుణులు చెబుతున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ కంపెనీలు బ్యాండ్ ఎక్కువ చెప్పారని కాకుండా దేశంలో వినియోగంలోకే వచ్చే 'n78' బ్యాండ్ ఉన్న ఫోన్లను కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. ఎన్ని దేశాల్లో 5జీ అందుబాటులో ఉందో తెలుసా? త్వరలో భారత్లో 5జీ నెట్ వర్క్ సేవలు వినియోగంలోకి రానున్నాయి. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే 5జీ నెట్ వర్క్లను వినియోగిస్తున్నాయి. స్టాటిస్టా లెక్కల ప్రకారం.. చైనాలో 356 నగరాల్లో, అమెరికాలో 296 నగరాల్లో, పిలిపిన్స్లో 98 నగరాల్లో, సౌత్ కొరియా 85 నగరాల్లో, కెనడా 84నగరాల్లో, స్పెయిన్ 71 నగరాల్లో, ఇటలీ 65 నగరాల్లో, జర్మనీ 58 నగరాల్లో, యూకేలో 57 నగరాల్లో, సౌదీ అరేబియాలో 48 నగరాల్లో ఈ 5జీ సేవల్ని వినియోగిస్తున్నారు. -
కొత్త స్మార్ట్ఫోన్లు ఎందుకు పాడవుతాయో తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ఫోన్ల వాడకం కూడా అదే స్థాయిలో ఉంది. ఇటీవల వేల ఖర్చు పెట్టి కొన్న స్మార్ట్ఫోన్లు త్వరగా పాడైపోయిన ఘటనలు మన చుట్టు పక్కలనో లేదా స్నేహితులు, బంధువుల దగ్గరో చూసే ఉంటాం. దీనికి కారణాలు చాలానే ఉన్నా ప్రధానంగా ఉన్నది మాత్రం ఫోన్ బ్యాటరీ పాడైపోవడం. ఈ బ్యాటరీ సమస్య మాత్రం మొబైల్ కంపెనీలకు సవాలుగా మారింది. మనం తెలియకుండా చేసే పనులే మన ఫోన్ని రిపేర్ షాపులో ఉండేలా చేస్తున్నాయి. అవేంటో చూసేద్దాం! రకరకాల ఛార్జర్లను ఉపయోగించడం మొదట్లో ఫోన్ను ఛార్జ్ చేయడానికి కంపెనీ చార్జర్ వాడుతాం. కానీ కొన్ని రోజులకే వేరే వాటిని ఉపయోగిస్తాం. దీనివల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై దుష్ప్రభావం పడుతుంది. పైగా చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం. కంపెనీ చార్జర్ని పక్కన పెడితే అది ఫోన్ బ్యాటరీని లైఫ్టైంని ఇది తగ్గిస్తుంది. ఎలా అంటారా శాంసంగ్(Samsung) స్మార్ట్ఫోన్లు 18W లేదా 25W ఛార్జింగ్ను కలిగి ఉంటాయి. అలానే రియల్మీ( Realme ) స్మార్ట్ఫోన్లో 18W, 33W, 67W సాధారణ ఛార్జింగ్ ఉంటుంది. ఫుల్ చార్జ్ అవసరం లేదు చాలా సార్లు స్మార్ట్ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత కూడా ఛార్జింగ్లోనే ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ పాడైపోయే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగితే, అది మీ ఫోన్ ప్రాసెసర్పై కూడా ప్రభావం చూపుతుంది. అంటే బ్యాటరీతో పాటు ఫోన్ ప్రాసెసర్ కూడా దెబ్బతింటుంది. అందుకే 90 శాతం ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది. జీరో స్థాయి చార్జ్ మంచి కాదు ప్రతిసారీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్న తరువాత చార్జింగ్ ప్రక్రియ మొదలెట్టకూడదు. ఎప్పటికప్పుడు ఫోన్ చార్జింగ్ లెవల్స్ తగ్గకుండా చూసుకోవటం ఉత్తమం. అలాగే వేడి వాతావరణంలో ఫోన్ను ఉంచటం మంచిదికాదు. తరచుగా ఛార్జింగ్ పెట్టకూడదు ఫోన్ని ఛార్జింగ్లో ఉంచిన తర్వాత 90 శాతం వరకు ఛార్జ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే కొంత మంది ఏదో హడావుడిలో పడి 40, 50 ఇలా తక్కు శాతం చార్జ్ అవగానే వాడుతుంటారు. అంతలోనే ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోందని మళ్లీ చార్జ్ చేస్తుంటారు. ఈ ప్రక్రియనే మళ్లీ మళ్లీ పాటిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో, బ్యాటరీ మాత్రమే కాదు ఫోన్ లైఫ్టైం కూడా తగ్గిపోతుంది. పదే పదే ఛార్జింగ్ చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ కెపాసిటీ నిరంతరం తగ్గుతూ ఉంటుంది. చదవండి: Edible Oil Prices: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు! -
మీ ఫోన్ రిపేర్ అయ్యిందా? శాంసంగ్ యూజర్లకు శుభవార్త!
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరుగుతోంది. అందులోని ఫీచర్లు అంతలా ఆకట్టుకుంటోంది. అయితే ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ యూజర్ల పర్సనల్ డేటా (ఫోటోలు, చాట్, వీడియో) ఏదో ఓ రూపంలో అప్పుడప్పుడు బయటపడుతున్నాయి. వీటిలో ప్రధానంగా మన ఫోన్ రిపేర్ అయిన సందర్భాల్లో డేటా తస్కరించడం లాంటి జరుగుతుంటాయి. ఎలా అంటారా ఆ సమయంలో కొన్ని రోజుల పాటు రిపేర్ షాపులో మన ఫోన్ని ఉంచకతప్పదు. అప్పటి నుంచి ఫోన్లోని డేటాకు సంబంధించి ఆందోళనపడడమో, లేదా డేటాను ముందుగానే డిలీట్ చేసి బ్యాకప్ చేసుకోవడం లాంటి పనులు మనకు షరా మామూలే. ఇకపై అలాంటివి ఇబ్బందులు ఎదురుకాకుండా శాంసంగ్ కంపెనీ తమ కస్టమర్ల కోసం కొత్త ఫీచర్ను తీసుకురాబోతోంది. ఈ ఫీచర్ ద్వారా మన డేటా సేఫ్గా ఉంటుంది. దక్షిణ కొరియా శాంసంగ్ తెలిపిన వివరాల ప్రకారం తమ కంపెనీ ఫోన్లలో రిపేర్ మోడ్ పేరుతో అదిరిపోయే ఫీచర్ను ప్రవేశపెడుతోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 (Samsung Galaxy S21) సిరీస్కు ఈ ఫీచర్తో విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే ఇతర మోడళ్లకు కూడా ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఎలా పని చేస్తోంది ఈ ఫీచర్ మొబైల్లోని సెట్టింగ్ యాప్లో “బ్యాటరీ అండ్ డివైస్ కేర్” ఆఫ్షన్కి వెళ్లి రిపేర్ మోడ్ని ఆన్ చేయాలి. దీంతో మీ స్మార్ట్ఫోన్ రీబూట్ అవుతుంది. ఆ తర్వాత, ఫోటోలు, మెసేజ్లు, ఖాతాలు మొదలైన వాటితో సహా మీ వ్యక్తిగత డేటాను ఎవరూ యాక్సెస్ చేయలేరు. వెంటనే ఫోన్లో రిపేర్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. దీని ద్వారా మీ ఫోన్ రిపేర్ చేసే వ్యక్తికి మన డేటా కనిపించకుండా చేస్తుంది. ఆ సమయంలో కేవలం ఫోన్లో డిఫాల్ట్ ఇన్స్టాల్ చేసిన యాప్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫోన్ రిపేర్ పూర్తి కాగానే మనం మళ్లీ మొబైల్ని రీబూట్ చేసి వేలిముద్ర లేదా లాక్ ఆన్ చేయడం ద్వారా రీపేర్ మోడ్ డీయాక్టివేట్ చేయవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి వివరాలను శాంసంగ్ తెలపాల్సి ఉంది. చదవండి: సూపర్ వ్యాన్.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
సెల్ఫీ లవర్స్ కోసం.. అదిరిపోయే ఫీచర్ ఈ స్మార్ట్ఫోన్ సొంతం!
స్మార్ట్ఫోన్లో దాదాపు అందరి చేతుల్లోనూ ఉంటున్నాయి. స్మార్ట్ఫోన్లకు కెమెరాలు తప్పనిసరి హంగు. చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటే జనాలు ఆగుతారా? ఎడాపెడా సెల్ఫీలతో పాటు ప్రయాణాల్లో కనిపించిన దృశ్యాలనల్లా ఫొటోలు తీసేయడం మామూలైపోయింది. వందలాదిగా తీసిన ఫొటోలను ప్రింట్ చేయడం కొంత కష్టమే! ఫొటో ల్యాబ్లకు వెళ్లాలి. స్మార్ట్ఫోన్లో తీసిన ఫొటోలను కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసి, నచ్చిన వాటిని ఎంపిక చేసుకుని ప్రింట్ చేయించుకోవాలి. ఇదంతా కొంత ప్రయాసతో కూడిన ప్రక్రియ. ఇప్పుడంత ప్రయాస అక్కర్లేదు. స్మార్ట్ఫోన్ కెమెరా ప్రింటర్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా జపానీస్ ఫొటోగ్రఫీ బ్రాండ్ ‘ఫుజీ ఫిల్మ్’ స్మార్ట్ఫోన్ల నుంచి ఫొటోలను నేరుగా ప్రింట్ చేసేందుకు అనువైన స్మార్ట్ఫోన్ కెమెరా ప్రింటర్ను ‘ఇన్స్టాక్స్ మినీలింక్ 2’ పేరిట అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ఫోన్తో పాటు ఈ ప్రింటర్ కూడా వెంట ఉంటే, ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు ఫొటోలను ప్రింట్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇది జపాన్తో పాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉంది. చదవండి: అకౌంట్లో డబ్బులు కొట్టేసే యాప్స్: తక్షణమే డిలీట్ చేయండి! -
రియల్మీ కొత్త టాబ్లెట్.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ, ఇంకా బోలెడు ఫీచర్లు!
హైదరాబాద్: రియల్మీ సంస్థ ఒకేసారి పలు నూతన ఉత్పత్తులను దేశీ మార్కెట్లో విడుదల చేసింది. ప్యాడ్ ఎక్స్ పేరుతో ట్యాబ్లెట్ను ప్రవేశపెట్టింది. 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే ఈ ట్యాబ్లెట్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో, 11 అంగుళాల ఫుల్వ్యూ డిస్ప్లే, 8,340 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ డార్ట్ చార్జింగ్తో వస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో వైఫై వెర్షన్ ధర రూ.19,999. ఇదే సామర్థ్యాలతో వైఫై, 5జీ సిమ్ సపోర్టెడ్ ట్యాబ్లెట్ ధర రూ.25,999. ఇందులో 6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.27,999. ఆగస్ట్ 1 నుంచి విక్రయాలు మొదలవుతాయి. అలాగే, రియల్మీ వాచ్3, ఒక ఫ్లాట్ మానిటర్, రియల్మీ బడ్స్ ఎయిర్3 నియో, రియల్మీ బడ్స్ వైర్లెస్ 2ఎస్ ఉత్పత్తులను కూడా సంస్థ విడుదల చేసింది. చదవండి: America Federal Reserve Bank: ప్చ్.. మళ్లీ పెంచారు, ఏడాది చివరికల్లా మరో షాక్! -
వివాదంలో స్మార్ట్ ఫోన్ సంస్థ,'డియర్ నథింగ్'..చూసుకుందాం పదా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వన్ప్లస్ కో- ఫౌండర్ కార్ల్ పీ సొంతంగా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్ ను ప్రారంభించారు. ఈ సంస్థ నుంచి నథింగ్ ఫోన్(1) మంగళవారం భారత్ మార్కెట్లో విడుదలైంది. అయితే ఈ ఫోన్ తయారీ సంస్థపైన దక్షణాదికి చెందిన స్మార్ట్ ఫోన్ లవర్స్, టెక్నాలజీ కంటెంట్ క్రియేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నథింగ్ ఫోన్(1) విడుదలైన కొన్ని గంటల్లోనే ఆఫోన్ విడుదల, ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయనే అంశాలతో సంబంధం లేకుండా డియర్ నథింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అదే సమయంలో కార్ల్ పీ'ని విమర్శిస్తూ హ్యాష్ ట్యాగ్స్తో ట్వీట్ చేస్తున్నారు. డియర్ నథింగ్: అసలు ఏం జరిగింది? ప్రముఖ తెలుగు టెక్ యూట్యూబ్ క్రియేటర్ విడుదలైన ఫోన్(1) గురించి ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ఫోన్ రివ్వ్యూ ఇవ్వాలని ఆ ఫోన్ కంపెనీ పేరుతో ఉన్న బాక్స్ను ఓపెన్ చేసి చూడగా అందులో హాయ్ **** దిస్ డివైజ్ ఈజ్ నాట్ ఫర్ సౌత్ ఇండియన్ పీపుల్ అని ఓ పేపర్లో రాసి ఉంటుంది. అంతే మనదేశానికి చెందిన ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు నథింగ్ ఫోన్ (1) రివ్యూ యూనిట్లు ఇవ్వలేదని విమర్శిస్తూ ఆ వీడియోను తయారు చేశాడు. రివ్వ్యూ యూనిట్లు ఇవ్వాలనేది కంపెనీ బాధ్యత అని గుర్తు చేస్తూ వీడియోను ముగిస్తాడు. అలా నథింగ్ ఫోన్(1)ను విమర్శిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్లు సైతం ఆ ఫోన్పై వీడియోలు చేశారు. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సౌత్కు చెందిన నథింగ్ ఫోన్(1) కొనుగోలు దారులు సైతం.. #డియర్ నథింగ్..పదా చూసుకుందాం, #బాయ్కాట్నథింగ్ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. కాగా, ఈ నథింగ్ ఫోన్ సంస్థ ప్రమోషన్ కోసం క్రియేటర్లకు ఇలా లెటర్ అలా పంపిందా? లేదంటే నార్త్ కంటెంట్ క్రియేటర్లకు రివ్వ్యూ యూనిట్లు పంపి.. తమకు పంపలేదనే కోపంతో దక్షిణాదికి చెందిన టెక్నాలజీ కంటెంట్ క్రియేటర్లు ఇలా వీడియోలు చేశారా అనే అంశం తెలియాల్సి ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Worst case started for u guys #DearNothing pic.twitter.com/9mz106Dw93 — Dilipkumar789 (@ndileepkumar789) July 13, 2022 #DearNothing Telugu,Tamil,kanada, Malayalam these four language people can buy nothing phone but not now.... pic.twitter.com/yGi2GHdawd — m. arunkumar (@arunmallela5) July 13, 2022 #DearNothing #DearNothing dhesa bhasalandhu telugu lessa.......Learn to treat everyone equally...India is not only Hindi country..... pic.twitter.com/SSbBGyMb8D — MR UNIQUE. .. . SHIVA (@ShivaRouthu13) July 13, 2022 Thank You Darlings 😍 #DearNothing - Trending No.1 in India 🇮🇳. pic.twitter.com/4QBhle2Hu1 — Prasadtechintelugu (@iamprasadtech) July 12, 2022 #DearNothing Nothing is just North pan masala phone...🥴 pic.twitter.com/oEBrvYxf2J — Mehabub (@Mehabub94557493) July 13, 2022 -
మొబైల్ వాడొద్దంటే.. ఒడిశా నుంచి ఆంధ్రాకు పారిపోయాడు!
సాక్షి,మందస(శ్రీకాకుళం): మొబైల్ వాడొద్దని తల్లిదండ్రులు చెప్పినందుకు ఓ బాలుడు ఒడిశా నుంచి ఆంధ్రాకు సైకిల్పై పారిపోయి వచ్చేశాడు. ఆ బాలుడు మందస మండలంలోని మఖరజోల గ్రామం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో మందస పోలీసులు గుర్తించారు. మందస ఎస్ఐ వి.సందీప్కుమార్ ఆధ్వర్వంలో బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వివరా లిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రంలో బరంపురానికి చెందిన ఆశి ష్కుమార్ ఆచార్య 9వ తరగతి చదువుతున్నాడు. తరచూ మొబైల్ వినియోగిస్తుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆశిష్ ఇంటి నుంచి పారిపోయి మందస చేరుకున్నాడు. మఖరజోల ప్రాంతంలో పోలీసులు గుర్తించి ఆరా తీసి కౌన్సెలింగ్ ఇవ్వడంతో వివరాలు చెప్పాడు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా తల్లిదండ్రులు ఆనంద్కుమార్, కమలకాంత్మిశ్రో హుటాహుటిన మందస చేరుకున్నారు. ఆశిష్ను శనివారం రాత్రి తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఎస్ఐ సందీప్కుమార్తో పాటు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఛైల్డ్లైన్ సిబ్బంది సునీత, మహిళా పోలీసు హారతి కూడా ఉన్నారు. చదవండి: ఘనంగా పెంపుడు కుక్క బర్త్ డే వేడుక...ఏకంగా 4 వేలమందికి... -
మొదలైన 5జీ మొబైల్ వార్.. రంగంలోకి దిగిన పోకో
మొబైల్ ఫోన్ల మార్కెట్లో మరోసారి వేడి రగులుకుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం పనులు ఊపందుకోవడంతో మార్కెట్లోకి కొత్త మోడళ్లను రిలీజ్ చేయడంపై మొబైల్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా షావోమి సబ్సిడరీ కంపెనీ పోకో సరికొత్త 5జీ ఫోన్ రిలీజ్ చేసింది. 5జీ ఫోన్లకు ఉన్న డిమాండ్ను గుర్తించి పోటీ కంపెనీల కంటే ముందుగా పోకో సంస్థ ఎఫ్4 పేరుతో 5జీ ఫోన్ మార్కెట్లోకి వదిలింది. ఇందులో లేటెస్ట్ స్నాప్డ్రాగన్ చిప్సెట్ను ఉపయోగించడంతో పాటు మరెన్నో అకట్టుకునే ఫీచర్లు పొందుపరిచింది పోకో. ఫీచర్లు - క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ఎసఓసీ చిప్సెట్ - ఆండ్రాయిడ్ 12, ఎంఐయూఊ 13 యూజర్ ఇంటర్ఫేస్ - 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ అమెల్డ్ డిస్ప్లే - 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్జ్ టచ్ సాంప్లింగ్ రేట్ - ట్రిపుల్ రియర్ కెమెరా, 64 మెగా పిక్సెల్ - 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా - డాల్బీ ఆట్మోస్, డాల్బీ విజన్ - కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 - 5 జీ సపోర్ట్ - జైరో స్కోప్, మాగ్నెటో మీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ - 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ధరలు ఇలా పోకో ఎఫ్ 4 5జీ ఫోన్ వివిధ వేయింట్లలో లభిస్తోంది. అన్నింటి కంటే తక్కువగా 6జీబీ ర్యామ్ 126 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999లు ఉండగా హై ఎండ్ మోడల్ 12 జీబీ ర్యామ్ 256 జీమీ స్టోరేజ్తో రూ.33,999 దగ్గర లభిస్తోంది. ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ సేల్కు అందుబాటులో ఉంది. వివిధ బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులతో పాటు ఫ్లిప్కార్ట్ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ల ద్వారా అదనంగా రూ.3000ల వరకు తగ్గింపు పొందవచ్చు. చదవండి: బడ్జెట్ ధరలో అదిరిపోయే స్మార్ట్ ఫోన్, ధర ఎంతంటే!