iPhone
-
యాపిల్ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్.. కీలక మార్పులు ఇవేనా?
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఎంత గిరాకీ ఉంటుందో తెలుసుకదా. ప్రత్యేకమైన యాపిల్ సాఫ్ట్వేర్ కోసమే చాలామంది వినియోగదారులు కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు డిజైనింగ్, ఆర్ అండ్ డీ(పరిశోధన, అభివృద్ధి) విభాగం నిత్యం అందిస్తున్న అప్డేట్లకు ఫిదా అవుతుంటారు. ఉత్పత్తుల విషయంలో ఇన్నోవేషన్, డిజైనింగ్లో ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాఫ్ట్వేర్ మార్పులకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్ ప్రారంభకానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పులు దాని ఫ్లాగ్షిప్ పరికరాలైన ఐఫోన్, ఐప్యాడ్, మాక్బుక్ల్లో వినియోగదారుల అనుభవాన్ని ఏకీకృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.మార్పులు ఇవేనా..రాబోయే యాపిల్ సాఫ్ట్వేర్లో మార్పులు ఆపరేటింగ్ సిస్టమ్కు ఏకీకృత డిజైన్ను తీసుకువస్తుందని నమ్ముతున్నారు. మాక్ఓఎస్, ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ మధ్య ఫంక్షనల్ అంతరాలను ఈ మార్పులు భర్తీ చేయనున్నాయని కంపెనీ పేర్కొంది. గత ఏడాది లాంచ్ చేసిన యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ సాఫ్ట్వేర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. రీడిజైన్లో భాగంగా కొన్ని ఐకాన్లు, మెనూలు, అప్లికేషన్లు, సిస్టమ్ బటన్లలో కూడా మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది భవిష్యత్తులో మరింత క్రమబద్ధమైన, సహజమైన యూజర్ ఇంటర్ఫేస్ను అందిస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: హోలీ గేట్వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!వ్యూహాత్మక లక్ష్యాలుసంస్థ ఆదాయ వృద్ధి మందకొడిగా ఉన్న నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తిని పునరుద్ధరించేందుకు యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యాపిల్కు ఈ రీడిజైనింగ్ కీలకంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ ప్రాథమిక ఆదాయ వనరుగా ఉన్న ఐఫోన్ అమ్మకాలు గత హాలిడే సీజన్లో భారీగా తగ్గిపోయాయి. అద్భుతమైన ఇంటర్ఫేస్ను ప్రవేశపెట్టడం ద్వారా తిరిగి యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా కంపెనీ చర్యలు చేపట్టింది. టెక్నాలజీ ఆవిష్కరణలో తన స్థానాన్ని అగ్రగామిగా సుస్థిరం చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఐఓఎస్ 19, ఐప్యాడ్ ఓఎస్ 19, మాక్ ఓఎస్ 16ల్లో భాగమైన సాఫ్ట్వేర్ అప్డేట్లను జూన్లో జరిగే యాపిల్ వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో ఆవిష్కరించనున్నారు. -
ఐఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!
భారతదేశంలో ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (మార్చి 7 నుంచి 13 వరకు) ప్రారంభమైంది. ఇందులో భాగంగా లేటెస్ట్ ఐఫోన్ 16, ఐఫోన్ 15 మోడళ్లపై డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. ఈ తగ్గింపులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఐఫోన్ 16 సిరీస్ ఆఫర్లుఐఫోన్ 16 బేస్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,900 నుంచి 68,999 రూపాయలకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ కింద రూ. 4000, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ. 5000 తగ్గింపును పొందవచ్చు. అంటే ఇప్పుడు ఐఫోన్ 16ను రూ. 59,999లకు సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎమ్ఐ కూడా రూ. 10,000 నుంచి ప్రారంభమవుతుంది.కొత్తగా విడుదలైన ఐఫోన్ 16e ధర రూ. 59,900. అయితే ఇది ఇప్పుడు 55,900 రూపాయలకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900 నుంచి రూ. 78,999కు చేరింది. ఐఫోన్ 16 ప్రో రూ. 1,19,900 నుంచి రూ. 1,08,900కు & ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ. 1,44,900 కాగా, సేల్లో భాగంగా రూ. 1,31,900కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, ఇతర ప్రయోజనాలను ఉపయోగించుకుంటే.. వీటి ధరలు మరింత తగ్గుతాయి.ఐఫోన్ 15 సిరీస్ ఆఫర్లుఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14 వరుసగా రూ. 60,999, రూ. 64,999 & రూ. 50,999 ప్రారంభ ధరలకు అందుబాటులో ఉన్నాయి. సాధారణ డిస్కౌంట్లతో పాటు, కొనుగోలుదారులు నో కాస్ట్ ఈఎమ్ఐ ఎంపికలు, స్టాండర్డ్ ఈఎమ్ఐ ఎంపికలు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, కూపన్ ఆధారిత డిస్కౌంట్లను సేల్లో పొందవచ్చు. -
యాపిల్ తయారీ ప్లాంట్ అమెరికాకు తరలింపు
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మెక్సికోలోని సంస్థ తయారీ యూనిట్ను అమెరికాకు తరలించే యోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కుక్ మెక్సికోలో రెండు ప్లాంట్లను నిలిపివేశారని, దానికి బదులుగా అమెరికాలో ఉత్పత్తులను తయారు చేస్తారని అమెరికా గవర్నర్ల సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు. పెరుగుతున్న టారిఫ్ ఒత్తిళ్లు, కొనసాగుతున్న అమెరికా-చైనా వాణిజ్య వివాదానికి ప్రతిస్పందనగా ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కొందరు భావిస్తున్నారు.అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల టిమ్ కుక్ ట్రంప్తో వైట్హౌజ్లో సమావేశమయ్యారు. చైనాలో యాపిల్ తన తయారీ ప్లాంట్ నుంచి భారీగానే వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అందులో కొంతభాగం అమెరికాకూ ఎగుమతి అవుతోంది. అయితే ఇటీవల అమెరికా-చైనాల మధ్య సుంకాల విషయంలో తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో టిమ్ కుక్ ట్రంప్తో భేటీ అయ్యారు. కానీ గతంలో మాదిరి కాకుండా ఈసారి యాపిల్కు ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ట్రంప్ కుక్తో సమావేశమైన మరుసటి రోజే యూఎస్కు తయారీ ప్లాంట్ తరలింపు ప్రకటన చేయడం చర్చనీయాంశం అయింది.అమెరికాలో పెట్టుబడులు..అమెరికాలో వందల మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతానని కుక్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఈ పెట్టుబడి ఉద్యోగాలను సృష్టిస్తుందని, యూఎస్ సరఫరా గొలుసును బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య వల్ల దేశీయ ఉత్పత్తిని పునరుద్ధరించడం, బాహ్య ఆర్థిక ఒత్తిళ్ల నుంచి కీలక పరిశ్రమలను రక్షించవచ్చని చెప్పారు. కంపెనీలు తీసుకునే నిర్ణయాలు తన పరిపాలన విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ధోనీకి రూ.6 కోట్లు, అభిషేక్కు రూ.18 లక్షలు చెల్లింపుయాపిల్పై ప్రభావంట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి యాపిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇది సంస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. తయారీ కార్యకలాపాలను అమెరికాకు తరలించడం ద్వారా దిగుమతి సుంకాల ప్రభావాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇది లాభాల మార్జిన్లు, ధరలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యూహాత్మక మార్పు ఉద్యోగాల కల్పనతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. -
కొత్త ఐఫోన్ 16ఈ: ఇలా చేస్తే రూ.4000 డిస్కౌంట్
యాపిల్ ఇటీవలే తన ఐఫోన్ 16ఈ లాంచ్ చేసింది. కంపెనీ ఫ్రీ ఆర్డర్స్ తీసుకోవడం శుక్రవారం (ఫిబ్రవరి 21) ప్రారంభించింది. కాగా డెలివరీలు 28 నుంచి ఉంటాయని సమాచారం. అయితే ఈ ఫోన్ కొనుగోలుపైన సంస్థ డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.'ఐఫోన్ 16ఈ'ను అమెరికన్ ఎక్స్ప్రెస్, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 4000 తగ్గింపు లభిస్తుంది. ఇక ఎక్స్ఛేంజ్ కింద రూ. 6000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది మీరు ఎక్స్ఛేంజ్ చేసే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.వింటర్ బ్లూ, లేక్ గ్రీన్, నలుపు, తెలుపు రంగులలో లభించే కొత్త ఐఫోన్ 16ఈ 125 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ కెపాసిటీలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 59,900. 256GB & 512GB మోడళ్ల ధరలు వరుసగా రూ. 69,900.. రూ. 89,900గా ఉన్నాయి.ఐఫోన్ 16ఈలో.. వినియోగదారులకు ఇష్టమైన ఐఫోన్ 16 లైనప్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్, టఫ్ బ్యాక్ గ్లాస్తో కూడిన 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్ప్లే పొందుతుంది. సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ అనేది.. స్మార్ట్ఫోన్ గ్లాస్ కంటే పటిష్టంగా ఉండే లేటెస్ట్ ఫార్ములేషన్ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.ఏ18 చిప్ ద్వారా శక్తిని పొందే.. ఐఫోన్ 16ఈ ఫోన్ ఇంటిగ్రేటెడ్ 2x టెలిఫోటో లెన్స్తో 48MP ఫ్యూజన్ కెమెరాను పొందుతుంది. అంతే కాకుండా ఎయిర్పాడ్లు, ఆపిల్ విజన్ ప్రో లేదా సరౌండ్ సౌండ్ సిస్టమ్తో ఇమ్మర్సివ్ లిజనింగ్ కోసం స్పేషియల్ ఆడియోలో వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది. మొత్తం మీద ఈ లేటెస్ట్ ఫోన్ అన్ని విధాలా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
యాపిల్ కొత్త ఫోన్.. 16e: ధర తెలిస్తే కొనేస్తారు!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ఐఫోన్ 16ఈ'ను యాపిల్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఫోన్ 2025లో అత్యంత సరసమైన మోడల్గా ఐఫోన్ 16 లైనప్లోకి చేరింది. వేగవంతమైన పనితీరు కోసం ఇది ఏ18 చిప్ పొందుతుంది.. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది.వింటర్ బ్లూ, లేక్ గ్రీన్, నలుపు, తెలుపు రంగులలో లభించే కొత్త ఐఫోన్ 16ఈ 125 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ కెపాసిటీలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 59,900. ఫ్రీ ఆర్డర్స్ శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి ప్రారంభమవుతాయి. ఆ తరువాత వారంలో సేల్స్ మొదలవుతాయి.ఐఫోన్ 16ఈలో.. వినియోగదారులకు ఇష్టమైన ఐఫోన్ 16 లైనప్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్, టఫ్ బ్యాక్ గ్లాస్తో కూడిన 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్ప్లే పొందుతుంది. సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ అనేది.. స్మార్ట్ఫోన్ గ్లాస్ కంటే పటిష్టంగా ఉండే లేటెస్ట్ ఫార్ములేషన్ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ఎక్స్ యూజర్లకు షాక్!.. భారీగా పెరిగిన ధరలుఏ18 చిప్ ద్వారా శక్తిని పొందే.. ఐఫోన్ 16ఈ ఫోన్ ఇంటిగ్రేటెడ్ 2x టెలిఫోటో లెన్స్తో 48MP ఫ్యూజన్ కెమెరాను పొందుతుంది. అంతే కాకుండా ఎయిర్పాడ్లు, ఆపిల్ విజన్ ప్రో లేదా సరౌండ్ సౌండ్ సిస్టమ్తో ఇమ్మర్సివ్ లిజనింగ్ కోసం స్పేషియల్ ఆడియోలో వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది. మొత్తం మీద ఈ లేటెస్ట్ ఫోన్ అన్ని విధాలా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. -
యాప్ స్టోర్లో టిక్టాక్ పునరుద్ధరణ!
చైనాకు చెందిన బైట్డ్యాన్స్ యాజమాన్యంలోని టిక్టాక్ యాప్ను తన యూఎస్ యాప్ స్టోర్లో పునరుద్ధరిస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. కొంతకాలంగా యాప్పై నిషేధం ఉంది. దాంతో ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు ఈ యాప్ను తొలగించాయి. ఈ యాప్ను హోస్ట్ చేసినందుకు కంపెనీలు జరిమానాలు ఎదుర్కోబోవని తాజాగా అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ హామీ ఇచ్చారు. దాంతో తిరిగి యూఎస్లోని యాప్ స్టోర్లో యాపిల్ దీన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది.అసలు వివాదం ఏమిటి?చైనాకు చెందిన బైట్డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్టాక్ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. టిక్టాక్పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్ తరఫు లాయర్లు కోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది.భద్రతపై ఆందోళనలుఅమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో గత అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది. యూజర్ లొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికన్లు చూసే కంటెంట్ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్టాక్ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: లవర్స్డే రోజున బంగారం గిఫ్ట్ ఇస్తున్నారా? తులం ఎంతంటే..ఈ నేపథ్యంలో బైట్డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్టాక్ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్టాక్ను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించారు. 75 రోజుల పాటు నిషేధం అమలును వాయిదా వేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు టిక్టాక్ తన సేవలను పునరుద్ధరించినట్లు ధ్రువీకరించింది. -
ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే?
ఇండియన్ మార్కెట్లో యాపిల్ (Apple) ఐఫోన్లకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పడు 'ఎస్ఈ 4' ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథంనలో తెలుసుకుందాం.గత రెండేళ్లుగా.. ఇప్పుడు, అప్పుడు అనుకుంటున్న 'ఐఫోన్ ఎస్ఈ 4' (iPhone SE 4) ఈ వారంలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కంపెనీ ఈ ఫోన్ లాంచ్ చేయడానికి ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించడం లేదు. కాబట్టి వారం మధ్యలో ఎప్పుడైనా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.ఐఫోన్ ఎస్ఈ 4 మొబైల్.. యాపిల్ ఇంటెలిజెన్స్, ఫేస్ ఐడి వంటి అనేక ప్రీమియం ఫీచర్స్ పొందనుంది. అయితే దీని డిజైన్.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 14, ఐఫోన్ 16లను గుర్తుకు తెచ్చే విధంగా ఉంటుంది. యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో ఉంటుంది.ఇదీ చదవండి: టెస్లా బాస్ చేతికి టిక్టాక్?: మస్క్ ఏం చెప్పారంటే..ఎస్ఈ 4 మొబైల్ 8 జీబీ ర్యామ్, ఏ18 ప్రాసెసర్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఇది 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగి 60Hz ప్యానెల్ పొందే అవకాశం ఉంది. 48 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటివి ఇందులో ఉండవచ్చు. ఐఫోన్ 14 వంటి బ్యాటరీనే ఎస్ఈ 4లో కూడా ఉండొచ్చు. అయితే కంపెనీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన చాలా వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. Power On: Apple’s new iPhone SE coming this week will kick off one of the most pivotal periods in the iPhone’s nearly two decade history https://t.co/npwXOGgv63— Mark Gurman (@markgurman) February 9, 2025 -
iPhone: నీ దూకుడు.. సాటెవ్వరూ..!
పాత విషయాన్ని ఇప్పుడెందుకు చెబుతున్నారనేగా మీ ప్రశ్న? భారత్లో ఐఫోన్ ‘విలువ’మరింత పెరిగిందని చెప్పేందుకే పాత జ్ఞాపకాన్ని మీ ముందుంచాం. భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అమ్మకాల విలువ పరంగా ఐఫోన్ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు.. విక్రయాల సంఖ్యపరంగా తొలిసారిగా టాప్–5 జాబితాలోకి దూసుకొచి్చంది. భారతీయుల్లో యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్కు ఈ మైలురాళ్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విక్రయాలే కాదు.. ఎగుమతుల పరంగానూ ఐఫోన్ మార్కెట్ కొత్తపుంతలు తొక్కుతోంది. టాప్ సెల్లింగ్ మోడల్గా నిలిచిన యూఎస్, అర్బన్ చైనా, యూకే, ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, జపాన్ సరసన భారత్ చేరింది. యాపిల్కు 5వ అతిపెద్ద మార్కెట్గా నిలిచింది.ఖరీదైనా తగ్గేదేలే..సగటున ఐఫోన్ ధర సామ్సంగ్, వివోతో పోలిస్తే మూడింతలు ఉంటుంది. షావొమీతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ. అయినా మనవాళ్లు తగ్గేదేలే అంటున్నారు. కొత్త సిరీస్ ఎప్పుడొస్తుందా.. ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుందామా అని ఎదురు చూసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. ఐఫోన్ అంటే చాలా మందికి స్టేటస్. అందుకే ఖరీదుకు వెనుకాడడం లేదు. ఈఎంఐ సౌకర్యం ఉందన్న భరోసా ఎలాగూ ఉంది. దేశంలో అమ్ముడవుతున్న ఐఫోన్లలో పెద్ద నగరాల వాటా 40 శాతమే. మిగిలిన 60 శాతం చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలు కైవసం చేసుకున్నాయంటే ఐఫోన్కు ఉన్న క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అమ్మకాల ఆధారంగా సగటు విక్రయ ధర 2024లో రూ. 78,200 ఉంది. 2020లో ఇది రూ. 62,700 నమోదైంది. ఐదేళ్లుగా ఐఫోన్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే 2026లో భారత్లో 1.5 కోట్లకుపైగా ఐఫోన్లు అమ్ముడవుతాయని వివిధ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఐడీసీ ప్రకారం దేశవ్యాప్తంగా 2023లో 90 లక్షల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. 2024లో ఈ సంఖ్య 35 శాతం వృద్ధితో 1.2 కోట్లకు ఎగిసింది. నివేదికలనుబట్టి సంఖ్యలు మారినా.. ఐఫోన్లకు డిమాండ్ ఊహించనంతగా దూసుకెళుతోందన్నది వాస్తవం. యాపిల్ పంట పండింది.. భారత్లో 2024లో అన్ని బ్రాండ్స్ కలిపి 15.3 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించాయి. 2023తో పోలిస్తే విక్రయాలు ఒక శాతం పెరిగాయి. 2024లో అమ్ముడైన మొత్తం స్మార్ట్ఫోన్ల విలువలో యాపిల్ 23 శాతం వాటా సొంతం చేసుకొని తొలి స్థానంలో నిలిచిందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. సంఖ్యాపరంగా 2024 అక్టోబర్–డిసెంబర్లో యాపిల్ 5వ స్థానానికి ఎగిసింది. వార్షిక ప్రాతిపదికన పరిమాణంలో కంపెనీ వాటా 9 నుంచి 11 శాతానికి చేరింది. అయితే 2024లో భారత్లో రూ. 90,680 కోట్ల విలువైన ఐఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని ఐడీసీ అంచనా వేసింది. 2023లో ఇది రూ. 75,255 కోట్లని వెల్లడించింది. ప్రీమియం ఫోన్లవైపు ప్రజలు మళ్లుతుండటం కంపెనీకి కలిసొస్తోంది. దేశంలో రూ. 30,000పైగా ఖరీదు చేసే స్మార్ట్ఫోన్ల విభాగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది.రికార్డుల భారత్.. యాపిల్ ఎగుమతులు భారత్ నుంచి గతేడా ది రూ. లక్ష కోట్ల మార్కును దాటాయి. 2023తో పోలిస్తే ఎగుమతులు 42 శాతం పెరిగి 2024లో రూ. 1.08 లక్షల కోట్లకు చేరాయి. గత సంవత్సరంలో దేశంలో రూ. 1.48 లక్షల కోట్ల విలువైన యాపిల్ ఉత్పత్తులు తయారయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 46 శాతం అధికం కావడం విశేషం. ఇక దేశం నుంచి వివిధ దేశాలకు 2023లో సరఫరా అయిన ఐఫోన్ల విలువ రూ. 76,500 కోట్లు. గతేడాది ఇది రూ. 1,02,000 కోట్లు. మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో భారత వాటా 14 శాతం దాటిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. లేటెస్ట్ మోడళ్లు అయిన ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ సైతం భారత్లో తయారవడం విశేషం. హైదరాబాద్ సమీపంలోని ఫాక్స్కాన్ ప్లాంటులో కొద్ది రోజుల్లో ఎయిర్పాడ్స్ తయారీ ప్రారంభం కానుంది. 2023–24లో యాపిల్ నికరలాభం 23 శాతం దూసుకెళ్లి రూ. 2,745.7 కోట్లు, ఆదాయం 36 శాతం పెరిగి రూ. 67,121 కోట్లుగా నమోదైంది. భారీ అవకాశాలు ఉన్నాయ్..భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్ మోడల్గా ఐఫోన్ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ అత్యధికంగా అమ్ముడై భారత్లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లకు భారత్ రెండవ అతిపెద్ద విపణి. అలాగే పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్ పీసీలకు మూడవ అతిపెద్ద మార్కెట్. ఇక్కడ భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మరిన్ని యాపిల్ స్టోర్లను ప్రారంభిస్తాం. అంతర్జాతీయంగా డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 శాతం పెరిగి 124.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. – టిమ్ కుక్, సీఈవో, యాపిల్ -
భారత్లో ఐఫోన్ టాప్
న్యూఢిల్లీ: ‘భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్ మోడల్గా ఐఫోన్ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది’ అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ శుక్రవారం తెలిపారు. కౌంటర్పాయింట్ రిసర్చ్ ప్రకారం భారత స్మార్ట్ఫోన్ విపణిలో 2024లో విలువ పరంగా 23 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే స్మార్ట్ఫోన్స్ సంఖ్య పరంగా టాప్–5గా నిలిచింది. ‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో గొప్ప ఫలితాలను సాధించాం. ముఖ్యంగా భారత్పై నేను ఆసక్తిగా ఉన్నాను. డిసెంబర్ త్రైమాసికంలో భారత్ రికార్డును నెలకొల్పింది. ఈ త్రైమాసికంలో ఐఫోన్ అత్యధికంగా అమ్ముడైంది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లకు రెండవ అతిపెద్ద, పర్సనల్ కంప్యూటర్స్, టాబ్లెట్ పీసీలకు భారత్ మూడవ అతిపెద్దది మార్కెట్. కాబట్టి ఇక్కడ భారీ మార్కెట్ ఉంది. మరిన్ని యాపిల్ ఔట్లెట్లను ప్రారంభించే యోచనలో ఉన్నాం. యాపిల్ ఇంటెలిజెన్స్ను విస్తరిస్తున్నాం. స్థానికీకరించిన ఇంగ్లీష్ వెర్షన్ను భారత్లో ఏప్రిల్లో విడుదల చేస్తాం’ అని టిమ్ కుక్ వివరించారు. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 % వృద్ధితో 124.3 బిలియన్ డాలర్లు నమోదైందని వెల్లడించారు. లాభం 7 శాతం క్షీణించి 33.91 బిలియన్ డాలర్లకు చేరింది. -
టిక్టాక్ యాప్ ఉన్న ఫోన్ రూ.43 కోట్లు?
భారతదేశంలో టిక్టాక్(TikTok)ను పూర్తిగా నిషేధించినప్పటికీ.. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ చైనా యాప్పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఇటీవల అమెరికా దీనిపై నిషేధం విధించింది. దీంతో చాలామంది యూజర్లు.. ఇకపై టిక్టాక్ ఉండదని, యాప్ అన్ఇన్స్టాల్ చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో మళ్ళీ వారు ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. కాగా ఈ యాప్ ఉన్న ఫోన్ల ధరలు యూఎస్ఏలో భారీగా పెరిగినట్లు కొన్ని సోషల్ మీడియా పోస్టులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. టిక్టాక్ యాప్ ఉన్న 'ఐఫోన్ 15 ప్రో 125 జీబీ' మోడల్ ధర 5 మిలియన్ డాలర్లు (రూ. 43కోట్లు) అని తెలుస్తోంది.నేను టిక్టాక్ తొలగించాను.. ఇప్పుడు దానిని ఇన్స్టాల్ చేయలేకపోతున్నాను. టిక్టాక్ యాప్ ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నవాళ్లు.. ఎవరైనా విక్రయించదలిస్తే.. వారికి 5000 డాలర్లు (రూ. 4.3 లక్షలు) ఇస్తాను అని ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.I deleted TikTok and now I can’t get it back! I will pay someone $5,000 for an iPhone 16 Pro Max with TikTok still installed. DM me.— Terrell from Sales (@Terrell_2_Cold) January 20, 2025సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూస్తుంటే.. అమెరికా ప్రజలు టిక్టాక్కు ఎంతగా అలవాటు పడ్డారో అర్థమవుతోంది. ఈ ఒక్క యాప్ ఉన్న మొబైల్ ఫోన్స్ కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు.ఇదీ చదవండి: ఊహించని రేటుకు చేరిన బంగారం.. అదే బాటలో వెండినిజానికి జనవరి 19న టిక్టాక్ నిషేధం అమల్లోకి వచ్చింది. కానీ 12 గంటల్లోనే ఆ నిషేధం ఎత్తివేశారు. అప్పటికే ఈ యాప్ అన్ఇన్స్టాల్ చేసుకున్నవారు.. మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. ప్రస్తుత యూఎస్ చట్టపరమైన కారణాల కారణంగా డౌన్లోడ్ కావడం లేదు. దీంతో మళ్ళీ టిక్టాక్ పొందటానికి.. యాప్ ఉన్న మొబైల్ ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.This is INSANE! eBay is full of phones with TikTok already downloaded on it selling for thousands!! pic.twitter.com/juxXtINQ9z— Gentry Gevers (@gentrywgevers) January 22, 2025 -
యాపిల్.. ఓలా.. ఉబర్లకు సీసీపీఏ నోటీసులు
సాఫ్ట్వేర్ పనితీరు, ధరల వ్యత్యాసాలపై వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్, ఆన్లైన్ క్యాబ్ సర్వీస్ సంస్థలు ఓలా, ఉబర్కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులపై దోపిడీని ప్రభుత్వం సహించబోదని మంత్రి తెలిపారు.యాపిల్పై ఆరోపణలు..యాపిల్ తాజా సాఫ్ట్వేర్ అప్డేట్ ఐఓఎస్ 18.2.1తో ఐఫోన్ యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఐఫోన్ వినియోగదారుల్లో 60% మంది లేటెస్ట్ సాఫ్ట్వేర్తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇందులో కాల్ వైఫల్యాలు అత్యంత సాధారణ సమస్యగా ఉన్నాయి. బగ్స్, భద్రతా పరమైన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఐఓఎస్ 18.0.1, ఐఓఎస్ 18.2.1తో సహా ఇటీవల ఐఓఎస్ అప్డేట్స్ ఈ సమస్యలకు కారణమని చాలా మంది వినియోగదారులు పేర్కొన్నారు.ఓలా, ఉబర్ సంస్థలు..యూజర్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా విభిన్న ప్రైసింగ్ విధానాలు అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓలా, ఉబర్లకు విడివిడిగా సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. ఇలా విభిన్న ప్రైసింగ్ విధానంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని, వినియోగదారుల హక్కులను నిర్దాక్షిణ్యంగా విస్మరించడమేనని మంత్రి జోషి పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ఈ ఆరోపణలపై ఉబర్ స్పందిస్తూ.. ‘రైడర్ ఫోన్ కంపెనీ ఆధారంగా మేం ధరలను నిర్ణయించం. ఏవైనా అపోహలను తొలగించడం కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపింది. యాపిల్, ఓలా సంస్థలు నోటీసులపై స్పందించలేదు. -
ఫోన్ మోడల్ను బట్టి క్యాబ్ చార్జీలా?
న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాల్లో క్యాబ్ల కోసం ఓలా లేదా ఉబర్లో బుక్ చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందుకోసం స్మార్ట్ఫోన్లో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాబ్ బుకింగ్ కోసం ఉపయోగించిన ఫోన్ మోడల్ను బట్టి చార్జీలు మారుతుంటాయా? మారుతున్నాయనే చెబుతున్నారు. ఖరీదైన ఫోన్ నుంచి బుక్ చేస్తే ఎక్కువ చార్జీ, చౌకరకం ఫోన్ నుంచి బుక్ చేస్తే తక్కువ చార్జీ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంబంధిత యాప్ల్లో ఈ మేరకు మార్పులు చేర్పులు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓలా, ఉబర్ల నిర్వాకంపై చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) స్పందించింది. ఓలా, ఉబర్లకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఫోన్ మోడల్ను బట్టి క్యాబ్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఐఫోన్ నుంచి బుక్ చేస్తే ఒకరకంగా, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ నుంచి బుక్ చేస్తే మరోరకంగా చార్జీలు విధిస్తుండడం నిజమేనా? అని ప్రశ్నించింది. ఒకే రకమైన సేవకు రెండు భిన్నమైన చార్జీలా? అని నిలదీసింది. చార్జీల విధిస్తున్న విధానం ఏమిటో చెప్పాలని పేర్కొంది. వినియోగదారుల నువంచి చార్జీల వసూలులో పూర్తి పారదర్శకత ఉండాలని సీసీపీఏ స్పష్టంచేసింది. ఒకేచోటు నుంచి ఒకే గమ్యస్థానానికి రెండు రకాల ఫోన్ల నుంచి రెండు క్యాబ్లు బుక్ చేస్తే రెండు రకాల చార్జీలు వసూలు చేసినట్లు ఢిల్లీకి ఓ వ్యాపారవేత్త బయటపెట్టడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్లపై విచారణ జరపాలని సీసీపీఏను ఆదేశించారు. -
భారత్లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్లోకి యాపిల్
భారతదేశంలో ఐఫోన్ అమ్మకాలను ప్రారంభించిన తరువాత మొదటిసారి యాపిల్ వాల్యూమ్ పరంగా టాప్ 5 స్మార్ట్ఫోన్ బ్రాండ్ లిస్ట్లోకి చేరింది. 2024 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 10% మార్కెట్ వాటాను సాధించింది. దేశంలో యాపిల్కు పెరుగుతున్న ప్రజాదరణకు ఈ విజయం నిదర్శనమని కంపెనీ తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా ఉంది. ఆ సమయంలో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 58.5% పెరిగాయి.యాపిల్ విజయానికి ప్రధాన కారణాలుమార్కెట్ వాటా వృద్ధి: 2024 పండుగ సీజన్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ 9-10% మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ట్రేడ్-ఇన్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు, 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించింది. దాంతో మార్కెట్ వాటా పెరిగింది.పాపులర్ మోడల్స్: ఐఫోన్ 15, ఐఫోన్ 13 వంటి పాత మోడళ్ల కొనుగోలుకు వినియోగదారులు ఎంతో ఆసక్తి చూపించారు. ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 16 సిరీస్ కూడా కంపెనీ విక్రయాలు పెరిగేందుకు దోహదం చేశాయి.స్థానికంగా తయారీ: దేశీయ తయారీపై యాపిల్ దృష్టి సారించింది. కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగేందుకు ఇది కూడా తోడైంది. ఫాక్స్కాన్, పెగాట్రాన్, టాటా టెక్నాలజీస్ వంటి భాగస్వాముల ద్వారా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ను భారత్లో తయారు చేస్తోంది. దేశీయంగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. దాంతోపాటు భారతీయ వినియోగదారుల్లో సానుకూల బ్రాండ్ ఇమేజ్ను సృష్టిస్తుందని కంపెనీ నమ్ముతుంది.ఆర్థిక కారకాలు: మధ్యతరగతి, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆర్థిక స్వేచ్ఛ వల్ల ప్రీమియం మోడళ్ల కొనుగోళ్లు అధికమవుతున్నాయి. యాపిల్ బ్రాండ్కు ఉన్న విలువ వల్ల ఎక్కువ మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులుభవిష్యత్తు అవకాశాలు2026 నాటికి యాపిల్ మూడో అతిపెద్ద మార్కెట్గా భారత్ అవతరించనుందని, వార్షిక ఐఫోన్ అమ్మకాలు 15 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని అంచనా. దేశీయ తయారీ, సమర్థవంతమైన పంపిణీ, ప్రీమియం ఆఫర్లపై కంపెనీ దృష్టి సారిస్తుండడం వంటి అంశాలు భారత మార్కెట్లో వృద్ధికి దోహదపడుతుంది. -
ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులు
దేశంలో తయారవుతున్న ఐఫోన్(iPhone) ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్లో ఐఫోన్ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.భారతదేశంలో యాపిల్(Apple) ప్రధాన తయారీదారులుగా ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?యాపిల్ 2024లో దేశీయంగా 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.08 లక్షల కోట్లు) ఎగుమతుల మార్కును సాధించింది. భవిష్యత్తులో వీటి విలువ ఏటా 30 బిలియన్ డాలర్లకు చేర్చాలనేలా లక్ష్యం పెట్టుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం ఐఫోన్ ఉత్పత్తి ఎకోసిస్టమ్లో భారతదేశం ఉత్పాదక(Productivity) వాటా ప్రస్తుతం 14%గా ఉందని, దాన్ని భవిష్యత్తులో 26%కి పైగా పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
యాపిల్పై జుకర్బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు
దిగ్గజ పారిశ్రామిక వేత్త, మెటా సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్' (Mark Zuckerberg).. 'జో రోగన్ ఎక్స్పీరియన్స్'లో మాట్లాడుతూ యాపిల్ (Apple)ను విమర్శించారు. గ్లోబల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చినందుకు ఐఫోన్లను ప్రశంసిస్తూనే.. కంపెనీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం లేదని, ఈ విషయంలో యాపిల్ విఫలమైందని అన్నారు.ఐఫోన్ బాగుంది, ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది దగ్గర ఇప్పుడు ఈ ఫోన్ ఉందని చెబుతూనే.. సంస్థ కొంతకాలంగా గొప్పగా ఏమీ కనుగొనలేదని జుకర్బర్గ్ వెల్లడించారు. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ను కనుగొన్నారు. అయితే సంస్థ కేవలం దానిపై 20ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి ఏటా కొత్త వెర్షన్స్ లాంచ్ చేస్తోంది. కానీ అవి పాత వెర్షన్ల కంటే మెరుగ్గా లేదు. ఈ కారణంగానే చాలా తక్కువ మంది మాత్రమే కొత్త ఐఫోన్లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.సంస్థ అందిస్తున్న కొత్త ఐఫోన్ మోడళ్లలో పెద్దగా అప్గ్రేడ్లు లేకపోవడం వల్ల ఫోన్ విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే కంపెనీ కొనుగోలుదారులపై, డెవలపర్లపై ఈ 30 శాతం పన్ను విధిస్తోందని.. ఇలాంటి వాటి వల్లనే యాపిల్ లాభపడుతోందని జుకర్బర్గ్ పేర్కొన్నారు.యాపిల్ ఇతర కంపెనీల పరికరాలను iPhoneలతో సజావుగా ఎలా పని చేయనివ్వదు అనే దాని గురించి జుకర్బర్గ్ కలత చెందారు. దీనికి ఆయన ఎయిర్పాడ్లను ఉదాహరణగా చూపాడు, అదే కనెక్షన్ టెక్నాలజీని ఉపయోగించకుండా ఇతర కంపెనీలను బ్లాక్ చేస్తుందని వివరించారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాతమ రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ కోసం యాపిల్ కనెక్షన్ ప్రోటోకాల్ను ఉపయోగించమని మెటా చేసిన అభ్యర్థనను.. భద్రతా కారణాల వల్ల యాపిల్ తిరస్కరించింది. వినియోగదారు గోప్యత పట్ల నిజమైన ఆందోళన కంటే కూడా వ్యాపార ప్రయోజనాల కారణంగా అభ్యర్థనను తిరస్కరించినట్లు జుకర్బర్గ్ చెప్పారు.యూజర్ల గోప్యత, భద్రతపై యాపిల్ వైఖరిని ఆయన విమర్శించారు. యాపిల్ కనిపెట్టిన కొత్త వాటిలో 'విజన్ ప్రో' ఒకటి మాత్రమే అని నేను అనుకుంటున్నానని.. కంపెనీ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ గురించి జుకర్బర్గ్ ప్రస్తావించారు. ఇది కూడా సరైన అమ్మకాలు పొందలేదని ఆయన అన్నారు. -
ఫోన్ పోయిందా? ఇలా చేస్తే.. కనిపెట్టేయొచ్చు
ప్రస్తుతం చాలామంది యాపిల్ ఐఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ఇవి కొంత ఖరీదైనవే అయినప్పటికీ.. ఆసక్తి కారణంగానో లేదా ఇతర కారణాల వల్ల ఆండ్రాయిన్ ఫోన్ యూజర్స్ కూడా ఐఫోన్లకు మారిపోతున్నారు. అయితే అంత ఖరీదైన ఫోన్లు పొతే? ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీ ఐఫోన్ పోగొట్టుకున్నా.. దొంగతనానికి గురైనా.. ఏ మాత్రం గాబరా పడకుండా? కొన్ని చర్యలు తీసుకుంటే మళ్ళీ పొందే అవకాశం ఉంటుంది.'ఫైండ్ మై' యాప్ ఉపయోగించండిమొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు 'ఫైండ్ మై' యాప్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఐఫోన్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని సెట్ చేసుకోవాలి. ఇది మీ ఫోన్ను ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. అంతే కాకుండా మీ మొబైల్ సైలెంట్ మోడ్లో ఉన్నప్పటికీ.. దగ్గరగా ఉన్నప్పుడు యాప్ ద్వారా సౌండ్ ప్లే చేయవచ్చు.లాస్ట్ మోడ్ను యాక్టివేట్ చేసుకోండిమీ ఫోన్ బయట పోయిందని లేదా దొంగతనానికి గురైంది మీరు విశ్వసిస్తే, లాస్ట్ మోడ్ ఉపయోగించుకోవాలి. దీనికోసం మీరు 'ఫైండ్ మై' యాప్ను ఓపెన్ చేసి లేదా iCloud.comలో సైన్ ఇన్ చేసిన తరువాత.. 'మార్క్ యాజ్ లాస్ట్' లేదా 'లాస్ట్ మోడ్' ఎంచుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత ఏదైనా ఒక సందేశాన్ని లేదా కాంటాక్ట్ వివరాలను పంపించవచ్చు. అప్పుడు మీ ఫోన్ దొరికిన వారు మళ్ళీ మీకు తీసుకు వచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది.మీ డేటాను సంరక్షించుకోవాలిమొబైల్ ఫోన్లో మీ వ్యక్తిగత డేటా ఏదైనా ఉంటే.. దానిని సంరక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఫోన్ డేటాను రిమోట్గా తొలగించడానికి 'ఫైండ్ మై' యాప్ లేదా iCloudని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఇది ట్రాకింగ్ను నిలిపివేస్తుంది, డేటా రికవరీ కూడా సాధ్యం కాదు. మీ అకౌంట్స్ యాక్సిస్ ఇతరుల చేతుల్లోకి పోకుండా ఉండటానికి appleid.apple.comలో మీ Apple ID పాస్వర్డ్ను మార్చుకోవచ్చు.సిమ్ బ్లాక్ చేయాలిమీ ఫోన్ పోయిందని తెలుసుకున్న తరువాత.. మీ సిమ్ కార్డును బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. దీనికోసం మీ సిమ్ కార్డుకు సంబంధించిన సంస్థను సంప్రదించాలి. మీ ఫోన్ పోయిందని సంస్థకు తెలియాజేస్తూ.. సిమ్ కార్డును బ్లాక్ చేయమని చెప్పాలి. అంతే కాకుండా డివైజ్ను కూడా బ్లాక్లిస్ట్ చేయొచ్చు. ఇలా చేస్తే.. ఎవరైనా ఫోన్ దొంగలించి ఉంటే, దానిని ఇతరులకు విక్రయించలేరు.పోలీసులకు తెలియజేయండిమీ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే.. వెంటనే పోలీసులకు తెలియజేయండి. మొబైల్ ఫోన్ IMEI నెంబర్ సాయంతో పోలీసులు పోయిన ఫోన్ను కనుగొనే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మీ ఆధార్పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండిముందుగానే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలిమీరు ఫోన్ కొనుగోలు చేసిన వెంటనే.. ఫైండ్ మై ఫోన్ను ఎనేబుల్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. స్ట్రాంగ్ పాస్కోడ్ లేదా బయోమెట్రిక్ సెట్ చేసుకోవాలి. డేటాను కూడా ఎప్పటికప్పుడు ఐక్లౌడ్ లేదా కంప్యూటర్కు బ్యాకప్ చేయాలి. వీటితో పాటు AirTags వంటి ట్రాకింగ్ యాక్ససరీస్ ఉపయోగించడం కూడా ఉత్తమం. -
యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావా
ప్రపంచ నం.1 సంస్థ యాపిల్(Apple) తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు ఎదుర్కొంది. ఈమేరకు అమెరికా ఫెడరల్ కోర్టులో దావా దాఖలైంది. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ఇతరులతో పంచుకునే అవకాశం ఉందని దావాలో ఆరోపించారు.‘సిరి’ని యాపిల్ స్పైగా మార్చిందని దావాలో తెలిపారు. ఐఫోన్లు(IPhone), ఇతర డివైజ్ల యూజర్లపై సిరి నిఘా పెట్టిందని పేర్కొన్నారు. ఇది వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు, వారి నిబద్ధతకు యాపిల్ ద్రోహం చేయడమేనని దావా పేర్కొంది. ఈ విషయాన్ని యాపిల్ ధ్రువీకరించింది. దావా దాఖలు చేసినవారి వాదనలను ఖండించింది. యూజర్ ప్రైవసీ పట్ల నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. కానీ కేసును పరిష్కరించాలనే ఉద్దేశంతో 95 మిలియన్ డాలర్లు(రూ.814 కోట్లు) చెల్లించడానికి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. ప్రతిపాదిత సెటిల్మెంట్కు సంబంధించిన వ్యాజ్యం ఈ వారం ప్రారంభంలో ఫెడరల్ కోర్టులో దాఖలు చేశారు. అయితే దీన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!అసలేం జరిగిందంటే..2014-22 వరకు యాపిల్ తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి(Siri)’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు వచ్చాయి. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ప్రకటనదారులతో పంచుకునే అవకాశం ఉందనేలా దావాలో ఆరోపించారు. ఈ దావా సమస్య పరిష్కారం అయితే సెప్టెంబర్ 17, 2014 నుంచి 2022 చివరి వరకు యాపిల్ ‘సిరి’ ఎనేబుల్డ్ పరికరాలను కలిగి ఉన్న లేదా కొనుగోలు చేసిన యూఎస్లోని యూజర్లకు ఈ సెటిల్మెంట్ మనీ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. -
యాపిల్ ఐఫోన్ 14, ఎస్ఈ నిలిపివేత..కారణం..
ప్రపంచ నంబర్ 1 కంపెనీ యాపిల్ కొన్ని ఉత్పత్తులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 14, ఐఫోన్ ఎస్ఈ(3వ తరం) ఫోన్లను యూరప్లో నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రామాణికంగా ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉండాలనేలా యూరప్ ప్రభుత్వం(EU) నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని తెలిసింది.యూరప్ ప్రభుత్వం అన్ని మోబైళ్లలో ప్రామాణికంగా యూఎస్బీ టైప్-సీ(Type-C) పోర్ట్తో ఉన్న ఛార్జింగ్ సదుపాయం ఉండాలనేలా నిబంధనలు తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం అధికారికంగా వాడుకలో ఉన్న ఐఫోన్ 14, ఐఫోన్ ఎస్ఈ(3వ తరం) ఫోన్లలో ప్రత్యేకంగా యాపిల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇది యూరప్ నిబంధనలకు విరుద్ధం. దాంతో స్థానికంగా ఈ మోడళ్లను నిలిపేస్తున్నట్లు యాపిల్(Apple) ప్రకటించింది.ఇదీ చదవండి: స్వల్ప స్థాయిలోనే కదలికలుయాపిల్ ఐఫోన్ 14 తర్వాత విడుదల చేసిన మోడళ్లలో టైప్-సీ పోర్ట్ను తీసుకొచ్చింది. దాంతో ఐఫోన్ 15తోపాటు తదుపరి మోడళ్లకు ఈ సమస్య లేదు. ఇప్పటికే ఐఫోన్(IPhone) 14 వాడుతున్నవారికి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా ఈ మోడల్ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి మాత్రం యూరప్లో అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఐఫోన్ 16 మోడల్ను విడుదల చేయడంతో చాలామంది ఈ మోడల్ను కొనుగోలు చేస్తున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. యూరప్కు చెందిన వినియోగదారులకు 2025 ప్రారంభంలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్తో ఐఫోన్ ఎస్ఈ(IPhone SE) మోడల్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. -
నీతా అంబానీ దగ్గర రూ.వందల కోట్ల ఐఫోన్.. నిజమేనా?
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ (Mukesh Ambani) సతీమణి నీతా అంబానీ (Nita Ambani) తరచూ వార్తలలో నిలుస్తుంటారు. ఆడంబరాలకు, విలాసవంతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందిన ఆమె విశేషాలు తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. నీతా అంబానీ ఉపయోగించే ఆడంబరమైన వస్తువులకు సంబంధించి అనేక పుకార్లు షికారు చేస్తుంటాయి. వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ (iPhone) కూడా ఒకటి.ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ అని పిలిచే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐఫోన్ నీతా అంబానీ దగ్గర ఉందన్న పుకార్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ ప్రత్యేక ఫోన్ ధర 48.5 మిలియన్ డాలర్లు (రూ.403 కోట్లకు పైగా). ఖరీదైన ప్లాటినం, 24-క్యారెట్ల బంగారంతో తయారైన ఈ ఫోన్ వెనుక భాగంలో భారీ గులాబీ వజ్రం (Pink Diamond) ఉంది.అయితే ఈ పుకార్లన్నీ అవాస్తవమని కొన్ని సంవత్సరాల క్రితమే రిలయన్స్ వివరణ ఇచ్చింది. కంపెనీలోని సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఇంత ఖరీదైన ఫోన్ నీతా అంబానీ దగ్గర లేదని, ఆమె వాడలేదని ఇండియా టుడే కథనం పేర్కొంది.ఇటీవల ముంబైలో జరిగిన ఎన్ఎంఏసీసీ ఆర్ట్స్ కేఫ్ ప్రారంభోత్సవానికి హాజరైన నీతా అంబానీ ధరించిన డ్రస్ అందరి దృష్టిని ఆకర్షించింది. నీతా ధరించిన వైట్ సిల్క్ టాప్ ధర 1395 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1,18,715కు సమానం. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీరను కూడా నీతా అంబానీ ధరించారు. దీని ధర ఏకంగా రూ. 40 లక్షలు. -
ఫోన్ మారితే ఉబర్ ఛార్జ్ మారుతోంది - ఫోటోలు వైరల్
ఉబర్, ఓలా వంటి క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. ఎక్కడికెళ్లాలన్నా వెహికల్ బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నాము. అయితే క్యాబ్ లేదా ఆటో ఛార్జీలు మాత్రం మనం బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ ఫోన్లను బట్టి మారుతూ ఉంటాయి. ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక ట్వీట్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. రెండు వేరువేరు మొబైల్ ఫోన్లలో రెండు వేర్వేరు ధరలను చూడవచ్చు. నిజానికి పికప్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ రెండూ ఒకటే. చేరుకోవడానికి పట్టే సమయం కూడా ఒకటే. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే.. ఉబెర్ (Uber) ఆటో రైడ్కు రూ.290.79 చూపించింది. యాపిల్ ఐఫోన్లో (Apple iPhone) అదే రైడ్కు రూ.342.47 చూపించింది.దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. నా కుమార్తె ఆండ్రాయిడ్ ఫోన్లో కంటే.. నా యాపిల్ ఐఫోన్లో రైడ్ ధర ఎక్కువగా చూపిస్తోందని 'సుధీర్' అనే ఎక్స్ (Twitter) యూజర్ పేర్కొన్నాడు. బుక్ చేసుకునే టైమ్, దూరం, డిమాండ్ వంటి వాటిని బట్టి ధరలలో మార్పు ఉంటుంది. కానీ బుక్ చేసుకునే మొబైల్ ఫోన్ను బట్టి ఛార్జీలు ఉండవని ఉబర్ వెల్లడించింది.Same pickup point, destination & time but 2 different phones get 2 different rates. It happens with me as I always get higher rates on my Uber as compared to my daughter’s phone. So most of the time, I request her to book my Uber. Does this happen with you also? What is the hack? pic.twitter.com/bFqMT0zZpW— SUDHIR (@seriousfunnyguy) December 23, 2024మొబైల్ ఛార్జ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రేటుగతంలో ఉబర్ క్యాబ్స్ మొబైల్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్, ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపించారు. డెర్నియర్ హ్యూర్ బ్రస్సెల్స్లోని వారి ఆఫీస్ నుంచి సిటీ సెంటర్లోకి వెళ్లడానికి రెండు ఐఫోన్ మొబైల్స్ ద్వారా టాక్సీ బుక్ చేసింది.ఒక ఐఫోన్లో 84 శాతం ఛార్జ్ ఉన్నప్పుడు 16.6 యూరోలు (రూ.1,498), 12 శాతం బ్యాటరీ ఉన్న స్మార్ట్ఫోన్కు 17.56 యూరోలు (రూ.1,585) చూపించింది. మొబైల్ ఛార్జ్లో ఉన్న తేడా ట్రిప్ ఛార్జ్పై ప్రభావం చూపిస్తుందని ఈ విధంగా నిరూపించింది. బ్యాటరీ లెవెల్స్ ఎలా ఉన్నా ధరల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, మొబైల్ ఛార్జ్కి ధరలకు ఎటువంటి సంబంధం లేదని ఉబెర్ తిరస్కరించింది.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతున్నాయ్!ఈ కామర్స్ సైట్లలో..సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. కానీ సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్లోని ఫ్లిప్కార్ట్ యాప్లో ఓ చిన్న క్యాబిన్ సూట్కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.Android vs iOS - different prices on @Flipkart App??same @my_mokobara cabin suitcase costs 4119₹ on FK Android App vs 4799₹ on iOS App.Apple charges 30% commission on subscriptions etc, so different pricing for iOS makes sense there.But for ecommerce? Very shady & unfair. pic.twitter.com/YmIq8nhuXO— Saurabh Sharma (@randomusements) October 30, 2024 -
దేవుడి హుండీలో పడిపోయిన ఐఫోన్
-
అయ్యయ్యో! నా ఐఫోన్ మురుగా..
సేలం(తమిళనాడు): ఆలయ హుండీలో పొరపాటుగా ఏది పడినా అది దేవుడికే సొంతమని పలు సినిమాల్లో సన్నివేశాలు మనం చూసి ఉంటాం. అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులోని తిరుపూర్లో చోటుచేసుకుంది. తిరుపోరూర్లోని మురుగన్ ఆలయానికి గత రెండు నెలల క్రితం చెన్నై అంబత్తూరుకు చెందిన దినేష్ దర్శనానికి వెళ్లాడు. ఆ సమయంలో దినేష్ హుండీలో కానుకలు వేస్తున్న సమయంలో పొరపాటుగా ఆయన చేతిలో ఉన్న ఐఫోన్ కూడా హుండీలో పడిపోయింది. ఈ విషయంగా ఆయన హిందూ దేవదాయ శాఖకు ఫిర్యా దు చేయగా, హుండీ లెక్కింపు సమయంలో తె లుపుతామని నిర్వాహకులు చెప్పి పంపించారు. ఈ స్థితిలో గురువారం ఆలయ హుండీని తెరి చారు. iPhone accidentally fell into the temple's hundi..The temple administration refused to return it the owner, saying it belonged to the temple.pic.twitter.com/4VgfcRk0Ib— Vije (@vijeshetty) December 20, 2024ఈ సందర్భంగా దినేష్కు సమాచారం ఇవ్వడం తన ఫోన్ తీసుకోవచ్చని ఎంతో ఆశగా ఆలయానికి వెళ్లాడు. హుండీ తెరిచిన ఆలయ నిర్వాహకులు దినేష్కు ఐఫోన్ చెందదని, హుండీలో ఏది పడినా మురుగనార్పణమేనని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందాడు. తర్వాత చేసేది లేక తన ఐఫోన్లో సిమ్కార్డును తీసుకుని, స్వామిని దర్శించుకుని నిరాశతో వెళ్లిపోయాడు. Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు -
యాపిల్ సీఈవో దిగిపోయేదెప్పుడు? పెదవి విప్పిన టిమ్ కుక్
లక్షల కోట్ల విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ యాపిల్. ఈ సంస్థకు 13 ఏళ్లుగా అధిపతిగా కొనసాగుతున్నారు టిమ్ కుక్. వయసవుతున్నప్పకీ చలాకీగా ఉండే ఆయన సీఈవోగా కంపెనీని విజయ పథంలో నడిపిస్తున్నారు. అయితే టిక్ కుక్ ఎప్పుడు రిటైర్ అవుతారు అనే ఆసక్తి చాలా మందిలో ఉంది.తన రిటైర్మెంట్ గురించి వైర్డ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుక్ వెల్లడించారు. ఇది తనను చాలా తరచుగా అడిగే ప్రశ్న అని చెప్పారు. యాపిల్ సీఈఓగా తాను ఎంతకాలం కొనసాగాలనుకుంటున్నాననే ప్రశ్నకు సమాధానమిస్తూ "ఈ చోటు (యాపిల్) అంటే ఇష్టం. ఇక్కడ ఉండటం జీవితకాల ప్రత్యేకత" అని బదులిచ్చారు.ఎప్పుడు దిగిపోతానంటే..రిటైర్మెంట్ ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పకుండా.. తాను వైదొలగడానికి సరైన సమయం ఎప్పుడదన్నది యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఓ హింట్ ఇచ్చారు. ‘ఇదీ సమయం అని నా అంతరాత్మ చెప్పే వరకు ఇక్కడ కొనసాగుతా.. తర్వాత ఏం చేయాలన్నది అప్పుడు దృష్టి పెడతా’ అన్నారు.టిమ్ కుక్ యాపిల్తో తన సుదీర్ఘమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. కంపెనీ లేని జీవితాన్ని తాను ఊహించడం అసాధ్యం అని ఒప్పుకున్నారు.యాపిల్ తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి చాలా కాలంగా కేంద్రంగా ఉందని, అది తన గుర్తింపు నుండి విడదీయరాని అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు.యాపిల్తో సుదీర్ఘ ప్రయాణంకంపెనీలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన టిమ్ కుక్ యాపిల్ పట్ల తన ఇష్టం ఎప్పటిలాగే బలంగా ఉంటుదని కుక్ స్పష్టం చేశారు. కుక్ 1998లో యాపిల్లో చేరారు. "నా జీవితం 1998 నుండి ఈ కంపెనీతో ముడిపడి ఉంది" అంటూ యాపిల్తో తన కెరీర్, వ్యక్తిగత ఎదుగుదల ఎంత లోతుగా ముడిపడి ఉందో కుక్ వివరించారు. టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ ఎయిర్పాడ్స్, యాపిల్ వాచ్ వంటి విప్లవాత్మక ఉత్పత్తులను ప్రారంభించింది. -
అధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు
నిత్యం మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ రంగంలో మార్పులొస్తున్నాయి. దాంతో ఇప్పటికే మొబైల్ ఫోన్లు ఉన్నా చాలామంది కొత్త సాంకేతికతకు అప్డేట్ అవుతున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేసిన ఫోన్ల వివరాలను కౌంటర్పాయింట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది.ఇదీ చదవండి: ప్రైవేట్ సంస్థ చేతిలో ‘సిబిల్’.. వ్యవస్థపై ఆందోళనఈ నివేదిక ప్రకారం టాప్ 10 మొబైళ్లు..యాపిల్ ఐఫోన్ 15యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్యాపిల్ ఐఫోన్ 15 ప్రోసామ్సంగ్ గెలాక్సీ ఏ15 4జీసామ్సంగ్ గెలాక్సీ ఏ15 5జీసామ్సంగ్ గెలాక్సీ ఏ05రెడ్మీ 13సీ 4జీసామ్సంగ్ గెలాక్సీ ఏ35ఐఫోన్ 14సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 -
యాపిల్లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!
ప్రపంచ నం.1 కంపెనీగా పేరున్న యాపిల్ ఉద్యోగుల పట్ల కఠిన విధానాలు అమలు చేస్తుందని ఓ ఉద్యోగి ఆరోపించారు. ఉద్యోగుల వ్యక్తిగత ఐప్యాడ్, ఐఫోన్ వంటి పరికరాలతో నిబంధనలకు విరుద్ధంగా తమ కార్యకలాపాలపై రహస్యంగా నిఘా వేస్తోందని తెలిపారు. 2020లో కంపెనీలో చేరిన అమర్ భక్త అనే ఉద్యోగి ఈమేరకు సంస్థపై ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన కాలిఫోర్నియాలో కంపెనీపై కేసు దాఖలు చేశారు.అక్కడ ఉద్యోగం సాఫీగా ఉండదు..‘ఉద్యోగుల గోప్యత హక్కును యాపిల్ హరిస్తోంది. సిబ్బంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా వారిపై ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నిఘా ఉంచుతోంది. దీన్ని ఉద్యోగులు అంగీకరించాలని కంపెనీ ఒత్తిడి చేస్తుంది. యాపిల్ సంస్థలో పని వాతావరణం సాధారణంగా బయట అనుకున్నంత సాఫీగా ఉండదు. అదో జైలు జీవితం లాంటిది. యాపిల్ ఉద్యోగులు కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులను పని కోసం మాత్రమే ఉపయోగించాలి. అలాగని వ్యక్తిగత అవసరాల కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు వాడాలనుకుంటే మాత్రం కంపెనీ ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్తోనే వాటిని వినియోగించాలి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తలు‘వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించే పరికరాల్లో ఈమెయిల్లు, ఫొటోలు, వీడియో.. వంటి ఆప్షన్లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాకు లింక్ చేసిన ప్రతి డేటాను యాక్సెస్ చేసేందుకు యాపిల్కు అనుమతి ఉంటుంది. యాపిల్ ఉద్యోగులు వారి పని పరిస్థితులు, తమ వేతనాల గురించి బయట ఎవరితో మాట్లాడనివ్వకుండా కంపెనీ జాగ్రత్త పడుతోంది. ఉద్యోగులు ఈమేరకు ఏవిధంగానూ స్పందించకుండా ఉండడంతోపాటు రాజకీయ కార్యకలాపాలకు పరిమితం అయ్యేలా కట్టడి చేస్తోంది’ అని అన్నారు.సమాచారం తొలగించమని ఆదేశాలు‘కంపెనీకి సంబంధించి ఉద్యోగులు తమ అనుభవాలను పాడ్క్యాస్ట్లు వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల్లోనూ మాట్లాడకుండా యాపిల్ నిషేధించింది. ఈమేరకు ఏదైనా కార్యకలాపాలు సాగిస్తే వెంటనే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కంపెనీకి సమాచారం వెళ్తుంది’ అని చెప్పారు. ప్రస్తుతం తాను చేసిన పనికి సంబంధించి నిర్దిష్ట సమాచారాన్ని అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి తీసివేయమని కంపెనీ ఆదేశించించినట్లు భక్త పేర్కొన్నారు.ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..యాపిల్ స్పందన ఇదే..యాపిల్ దీనిపై స్పందిస్తూ దావాలోని అంశాలు నిరాధారమైనవని, అవాస్తవాలని కొట్టిపారేసింది. పని ప్రదేశాల పరిస్థితులను చర్చించడానికి ఉద్యోగుల హక్కులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. తమ బృందాలు అభివృద్ధి చేసిన ఆవిష్కరణలను పరిరక్షిస్తూ, ఉత్తమ ఉత్పత్తులు, సేవలను అందించడంపై కంపెనీ దృష్టి సారించిందని స్పష్టం చేసింది. -
వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపు
భారత్లో యాపిల్ సరఫరాదారుగా ఉన్న ఫాక్స్కాన్ తన ఉద్యోగుల నియామక ఏజెంట్లకు ఆదేశాలు జారీచేసింది. కంపెనీ నియామక పద్ధతుల్లో మార్పులు చేసింది. ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వైవాహిక స్థితి, వయసు వంటి వివక్షతతో కూడిన ప్రమాణాలను తొలగించాలని స్పష్టం చేసింది. ఈమేరకు రాయిటర్స్ దర్యాప్తును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్లోని ఐఫోన్ తయారీ ప్లాంట్లో వివాహిత మహిళలను అసెంబ్లింగ్-లైన్ విభాగంలో పని చేసేందుకు ఫాక్స్కాన్ గతంలో మినహాయించినట్లు రాయిటర్స్ దర్యాప్తులో తేలింది. కానీ హై ప్రోడక్టివిటీ అవసరం అయినప్పుడు మాత్రం వివాహత మహిళలపై ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ మేరకు జూన్ 25న రాయిటర్స్ సిద్ధం చేసిన పరిశోధన పత్రాన్ని అనుసరించి కంపెనీ తాజాగా వివక్షతతో కూడిన వివరాలు రిక్రూట్మెంట్ ప్రకటనలో ఉండకూడదని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారిని లింగం, వయసు, వైవాహిక స్థితిని అనుసరించి వేరు చేయడం సరికాదని తెలిపింది. దాంతో సదరు వివరాలు లేకుండానే చెన్నైలో కొన్ని సంస్థలు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: నారాయణ మూర్తిని మించిన సేనాపతిఫాక్స్కాన్ ఏజెన్సీ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం స్మార్ట్ఫోన్ తయారీ యూనిట్లోని మొత్తం అసెంబ్లింగ్ స్థానాలు తెలిపారు. కానీ వయసు, లింగం, వైవాహిక ప్రమాణాల గురించి ప్రస్తావించలేదు. ‘ఎయిర్ కండిషన్డ్ వర్క్ప్లేస్, ఉచిత రవాణా, క్యాంటీన్ సౌకర్యం, ఉచిత హాస్టల్, నెలవారీ జీతం రూ.14,974 లేదా దాదాపు 177 అమెరికన్ డాలర్ల’ వివరాలతో ప్రకటన ఇచ్చారు. -
యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలు
భారత్లో యాపిల్ ఉత్పత్తుల తయారీ భాగస్వామిగా ఉన్న పెగాట్రాన్లో 60 శాతం వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఇటీవల ఈమేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. దాంతో భారత్లో యాపిల్ ఉత్పత్తులు తయారీ చేసే కంపెనీల్లో టాటా గ్రూప్ టాప్లో నిలిచింది.యాపిల్ సంస్థ చైనా భయట ఇతర దేశాల్లో తన ఉత్పత్తిని పెంచేలా ఇండియాలో ఉత్పాదకతను పెంచుతోంది. దానికోసం టాటా గ్రూప్, ఫాక్స్కాన్తోపాటు ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. కానీ కొన్ని చిన్న కంపెనీల్లోని మేజర్వాటాను ఇప్పటికే ఈ సంస్థలు కొనుగోలు చేశాయి. టాటా గ్రూప్ యాపిల్ తయారీదారుగా ఉన్న విస్ట్రన్ కంపెనీను ఇప్పటికే కొనుగోలు చేసింది. తాజాగా పెగాట్రాన్ కంపెనీలో 60 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో స్థానికంగా యాపిల్ ఉత్పత్తులను తయారీని పెంచాలని నిర్ణయించింది.తయారీదారుగా ఉండడం తేలికైన విషయం కాదు..పెగాట్రాన్, టాటా గ్రూప్నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గత ఏడాది కాలంగా ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ‘యాపిల్కు కాంట్రాక్ట్ తయారీదారుగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. తయారీపై మార్జిన్లు కూడా అధికంగానే ఉంటాయి. యాపిల్ ఉత్పత్తుల అధునాతన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కంపెనీలు అత్యున్నత స్థాయితో ఉత్పత్తి చేపట్టాల్సి ఉంటుంది. నిత్యం నాణ్యతను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నందున ఉత్పత్తిలో ఎటువంటి అంతరాయాలు ఉండకూడదు’ అని యాపిల్ ఉత్పత్తుల తయారీ వ్యవస్థలో భాగమైన ఒక ఉన్నత అధికారి తెలిపారు. టాటా గ్రూప్ ఇప్పటికే భారత్లో ఐఫోన్ 16 తయారీని ప్రారంభించింది.ఇదీ చదవండి: ‘సామాన్యుడిపై భారం తగ్గించండి’పెగాట్రాన్ ఉత్పత్తి సామర్థ్యంపెగాట్రాన్ గత సంవత్సరం దేశీయంగా వినియోగిస్తున్న ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 10 శాతం సహకారం అందించింది. ఈ కంపెనీకి తమిళనాడులో తయారీ యూనిట్ ఉంది. ఇందులో దాదాపు 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ యూనిట్ ఏటా ఐదు మిలియన్ల ఐఫోన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. -
యాపిల్ యూజర్లకు కేంద్రం హైరిస్క్ అలర్ట్!
యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న వారికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హైరిస్క్ అలర్ట్లు పంపుతోంది. అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్న ఐఫోన్, మ్యాక్బుక్, యాపిల్ వాచ్లు వంటి ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. దాంతో ఆయా వినియోగదారులకు హైరిస్క్ అలర్టులు పంపుతున్నట్లు స్పష్టం చేసింది.పాత సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న యాపిల్ డివైజ్ల్లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అడ్వైజరీని విడుదల చేసింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు, సైబర్ ఫ్రాడ్కు పాల్పడేవారు వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన డేటాను యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. డేటా మానిప్యులేషన్కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. తాజా సెక్యూరిటీ అప్డేట్లో ఆపిల్ ఈ లోపాలను పరిష్కరించింది. సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి, భద్రతా ఉల్లంఘనల నుంచి రక్షించుకోవడానికి వినియోగదారులు తమ డివైజ్ల్లో తాజా సాఫ్ట్వేర్ వెర్షన్ను అప్డేట్ చేసుకోవాలని CERT-In సిఫార్సు చేసింది.ఇదీ చదవండి: తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!ఐఓఎస్ 18.1 లేదా 17.7.1 కంటే ముందున్న సాఫ్ట్వేర్ వెర్షన్లను వినియోగిస్తున్న యాపిల్ కస్టమర్లు వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది. వాచ్ఓఎస్, టీవీఓఎస్, విజన్ ఓఎస్, సఫారి బ్రౌజర్ వంటి పాత వెర్షన్లపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. కాబట్టి ఆయా వినియోగదారులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. -
ఐఫోన్ ఎగుమతుల్లో భారత్ హవా: ఆరు నెలల్లో..
భారతదేశంలో యాపిల్ ఐఫోన్ల తయారీ చాలా వేగంగా సాగుతోంది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఇండియా నుంచి సుమారు 6 బిలియన్ డాలర్ల (రూ. 50వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 85వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని అంచనా.అమ్మకాల పరంగా యాపిల్ గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయమైన వృద్ధి సాధించవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఉద్యోగులను ఉపయోగించుకుని.. కంపెనీ దేశంలో తన పరిధిని భారీగా విస్తరించడానికి సిద్ధమవుతోంది. అమెరికా.. చైనా దిగుమతులను తగ్గించుకోవడంతో ఐఫోన్ దిగుమతులు భారత్ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా అవతరిస్తుంది.యాపిల్కు ప్రధాన సరఫరాదారులుగా ఉన్న ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్పొరేషన్ రెండూ కూడా టాటా ఎలక్ట్రానిక్స్తో చేతులు కలిపాయి. స్వదేశీ కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ దక్షిణ భారతదేశంలో ఐఫోన్లను అసెంబ్లింగ్ చేస్తోంది. చెన్నై శివార్లలోని ఫాక్స్కాన్ యూనిట్ భారతదేశంలో అగ్ర సరఫరాదారుగా ఉంది. దేశంలో జరుగుతున్న మొత్తం ఐఫోన్ ఎగుమతుల్లో ఇది దాదాపు సగం వాటాను కలిగి ఉంది.గత సంవత్సరం యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'టిమ్ కుక్' ముంబై, న్యూఢిల్లీలోని ఆపిల్ స్టోర్స్ ప్రారంభించారు. దీంతో మన దేశంలో కూడా యాపిల్ విక్రయాలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో యాపిల్ మరింత గొప్ప అమ్మకాలు పొందే అవకాశం ఉంది. 2030 నాటికి భారతదేశ యాపిల్ విక్రయాలు 33 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2.7 లక్షల కోట్లు) చేరుకోవచ్చని బ్లూమ్బెర్గ్ ఇంటెలిజెన్స్ కూడా వెల్లడించారు. -
దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ భారత్లో తయారీ యూనిట్లను పెంచుకునేందుకు సిద్ధంగా ఉంది. కర్ణాటకకు చెందిన ఏక్యూస్ గ్రూప్ యాపిల్ ఉత్పత్తుల తయారీదారుగా ఎదిగేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ట్రయిల్ స్టేజ్ను పూర్తి చేయనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఒకవేళ ఈ ట్రయిల్ స్టేజ్లో యాపిల్ నిబంధనల ప్రకారం ఏక్యూస్ గ్రూప్ ఉత్పత్తులను తయారు చేస్తే, భారత్లో టాటా ఎలక్ట్రానిక్స్ తర్వాతి స్థానం కంపెనీదేనని భావిస్తున్నారు. ఇప్పటికే టాటా ఎలక్ట్రానిక్స్ దేశీయంగా యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది.ఏక్యూస్ గ్రూప్ ప్రస్తుతం ఏరోస్పేస్ విడిభాగాలు, టాయ్స్ తయారీ రంగంలో సేవలందిస్తోంది. ఈ కంపెనీ ట్రయల్ దశను అదిగమిస్తే యాపిల్ ఉత్పత్తుల సరఫరాదారుల జాబితాలో చోటు సంపాదించిన రెండో భారతీయ కంపెనీగా నిలుస్తుంది. మ్యాక్బుక్ పర్సనల్ కంప్యూటర్లు, యాపిల్ వాచ్లు, యాపిల్ ఉత్పత్తుల విడిభాగాలను తయారు చేసే ఏకైక దేశీయ సంస్థగా అవతరించే అవకాశం ఉంది. ఏక్యూస్ ట్రయల్కు సంబంధించి యాపిల్ వాచ్, మ్యాక్బుక్ మెకానికల్ భాగాల ఉత్పత్తిని ప్రారంభించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ ట్రయిల్కు సంబంధించి ఇరు కంపెనీల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి టాటా ఎలక్ట్రానిక్స్ మాత్రమే యాపిల్కు భారతీయ సరఫరాదారుగా వ్యవహరిస్తోంది. ఇది ఐఫోన్లను తయారు చేస్తోంది.ఇదీ చదవండి: త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం!యాపిల్ కంపెనీ భారతదేశంలో 2021లో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. క్రమంగా దేశంలో ఉత్పత్తిని పెంచుతోంది. దేశీయంగా ఐఫోన్ తయారీ విభాగం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.20 లక్షల కోట్లు సమకూర్చింది. ఇందులో రూ.85,000 కోట్ల ఎగుమతులు ఉన్నాయి. దీంతో యాపిల్ గ్లోబల్ సప్లై చెయిన్లో భారతదేశం కీలకంగా మారింది. కంపెనీ మొత్తం ఉత్పత్తిలో 14 శాతం ఇండియాలోనే ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. -
త్వరలో తక్కువ రేటు ఐఫోన్..!
యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. కొత్త సిరీస్, మోడల్ ఐఫోన్ రాగానే కొనేందుకు డబ్బున్నవారు ఎగబడతుంటారు. అయితే ఐఫోన్ అన్నది సామాన్యులకు మాత్రం కలగానే మిగులుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ రేటులో ఐఫోన్ మోడల్ను తీసుకొచ్చేందుకు యాపిల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.అప్డేటెడ్ ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు యాపిల్ సిద్ధమైందని ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్బెర్గ్ న్యూస్ నివేదించింది. ఇది లో-ఎండ్ ఐఫోన్ మోడల్ కానుంది. దీంతోపాటు కొత్త ఐప్యాడ్ ఎయిర్ మోడల్లను కూడా యాపిల్ తయారు చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ కొత్త ఉత్పత్తులు వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కావచ్చని నివేదిక పేర్కొంది.ఐఫోన్ ఎస్ఈని సాధారణంగా ఐఫోన్ సిరీస్లలోకెల్లా చౌకైన మోడల్గా పరిగణిస్తారు. దీని ధరలు 429 డాలర్ల (సుమారు రూ.36 వేలు) నుండి ప్రారంభమవుతాయి. 2022లో 5జీ, వేగవంతమైన A15 బయోనిక్ చిప్ను జోడించిన తర్వాత ఐఫోన్ ఎస్ఈ మోడల్కు ఇది మొదటి అప్డేట్ కానుంది. కొత్త ఐఫోన్ ఎస్ఈ కంపెనీ ఏఐ సాఫ్ట్వేర్, యాపిల్ ఇంటెలిజెన్స్కు సపోర్ట్ చేస్తుందని నివేదిక వెల్లడించింది. మధ్య-శ్రేణి స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న సామ్సంగ్, షావోమీ వంటి బ్రాండ్లతో ఈ మోడల్ ద్వారా యాపిల్ పోటీ పడనుంది. -
ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?
సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. ముందుగా మార్చి 2025 వరకు దీన్ని యాపిల్ ఉత్పత్తుల్లో తీసుకురావాలని సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది. కానీ బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం సంస్థ గతంలో అనుకున్న సమయం కంటే ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.ఐఓఎస్ 18 సిరీస్లో యాపిల్ ఇంటెలిజన్స్ ద్వారా ‘సిరి’లో కొన్ని ఫీచర్లను అప్డేట్ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా మార్చి 2025 నాటికి ఐఓఎస్ 18.4 వెర్షన్లో సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. కానీ అంతకుముందే ఈ ఫీచర్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిసింది. సంస్థ గతంలో ప్రకటించిన విధంగా ఐఓఎస్ 18 సిరీస్ వర్షన్లను ఎప్పుడు అప్డేట్ చేస్తారో తెలిపారు.అక్టోబర్ 2024: ఐఓఎస్ 18.1 ఏఐ ఫీచర్లు ప్రారంభిస్తారు.డిసెంబర్ 2024: ఐఓఎస్ 18.2తో కొన్ని అదనపు ఫీచర్లు ప్రవేశపెడుతారు.జనవరి 2025: ఐఓఎస్ 18.3తో ‘సిరి’ని మరింత మెరుగుపరుస్తారు.మార్చి 2025: ఐఓఎస్ 18.4తో సమగ్ర యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్ను ప్రవేశపెడుతారు.బ్లూమ్బర్గ్ నివేదించిన ప్రకారంగా ముందుగానే యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్ను ఆవిష్కరిస్తే పైన తెలిపిన ఐఓఎస్ వర్షన్ల విడుదల తేదీల్లో మార్పులుండే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: కొత్తగా ఉద్యోగంలో చేరారా..? ఇవి తెలుసుకోండి..యాపిల్ ఇంటెలిజన్స్ ‘సిరి’లో గణనీయ మార్పులు చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందులో ప్రధానంగా సిరి సందర్భోచితంగా వినియోగదారుల అవసరాలు తీర్చనుంది. ఉదాహరణకు మీ స్నేహితుడు మొబైల్లో మీకు తన కొత్త చిరునామాను పంపితే ‘ఈ చిరునామాను తన కాంటాక్ట్ కార్డ్కు యాడ్ చేయమని’ చెబితే సిరి ఆ పని పూర్తి చేస్తుంది. సుదీర్ఘ ఈమెయిళ్లు చదవడం సమయంతో కూడుకున్న వ్యవహారం. సిరి సాయంతో దాని సారాంశాన్ని తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా రిప్లై ఇవ్వొచ్చు. వీటితోపాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ అధికారికంగా ప్రకటించిన తర్వాతే కంపెనీ అందించే ఫీచర్లపై స్పష్టత వస్తుంది. -
యాపిల్ బ్యాటరీ బుల్లెట్ప్రూఫ్!
ప్రపంచ నం.1 కంపెనీగా చలామణి అవుతున్న యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టెక్ పరిశ్రమలో ఈ కంపెనీ గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. యాపిల్ కంపెనీ ఈరోజు (సెప్టెంబర్ 20) ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు ప్రారంభించింది. దాంతో మొబైల్ అవుట్లెట్ల వద్ద భారీగా కస్టమర్లు బారులు తీరారు. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఇటీవల ‘ఇట్స్గ్లోటైమ్’ ట్యాగ్లైన్తో జరిగిన ఈవెంట్లో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. అటువంటి సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్ అతిపెద్ద సంస్థ.కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది.యాపిల్ కో-ఫౌండర్లో ఒకరైన రొనాల్డ్వేన్ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్ విలువ 35 బిలియన్ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు).ఇదీ చదవండి: అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులుప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది.యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి.యాపిల్ మాక్బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్ప్రూఫ్.యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు.స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్ డాలర్(ప్రస్తుతం రూ.83). -
#iPhone16 : ఐఫోన్ 16 కోసం బారులు తీరిన కస్టమర్లు (ఫొటోలు)
-
అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులు
ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్గా యాపిల్కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. యాపిల్ ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 20 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. దాంతో ముంబయిలోని యాపిల్ అవుట్లెట్ ముందు కస్టమర్లు ఉదయం నుంచే బారులు తీరారు. ఎప్పుడెప్పుడు ఐఫోన్ను సొంతం చేసుకోవాలా అని వేచిచూస్తున్నారు. ఈమేరకు ముంబయిలోని యాపిల్ స్టోర్ ముందు వినియోగదారుల రద్దీని తెలియజేస్తూ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఏదో అన్నదానం కోసం వచ్చిన వారిలా గుంపులుగా చేరి స్టోర్లోకి పరుగెత్తుతూ వీడియోలో కనిపించారు. ఇదికాస్తా వైరల్గా మారింది.ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ కోసం ముంబైలోని యాపిల్ స్టోర్కు జనం భారీగా వచ్చారు. ఉదయాన్నే స్టోర్ వద్ద లైన్లో నిల్చున్నారు. pic.twitter.com/hEIPKSoSGT— greatandhra (@greatandhranews) September 20, 2024భారత్లో ఐఫోన్ 16 సిరీస్ ధరలుఐఫోన్ 16128 జీబీ: రూ.79900256 జీబీ: రూ.89900512 జీబీ: రూ.109900ఐఫోన్ 16 ప్లస్128 జీబీ: రూ.89900256 జీబీ: రూ.99900512 జీబీ: రూ.119900ఐఫోన్ 16 ప్రో128 జీబీ: రూ.119900256 జీబీ: రూ.129900512 జీబీ: రూ.1499001 టీబీ: 169900ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్256 జీబీ: రూ.144900512 జీబీ: రూ.1649001 టీబీ: రూ.184900ఇదీ చదవండి: టెలికాం కంపెనీల పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు -
తమన్కి ఏడాదికో ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్న అనుష్క
సినిమా హిట్ అయితే డైరెక్టర్, హీరోకి నిర్మాత కారు లేదా విలువైన వస్తువులు గిఫ్ట్ ఇవ్వడం కామన్. కానీ ఓ హీరోయిన్ ప్రతి ఏడాది మ్యూజిక్ డైరెక్టర్కి బహుమతి ఇవ్వడం అంటే స్పెషలే కదా! స్వీటీ అనుష్క శెట్టి ఇలానే ప్రతి ఏటా మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి గిఫ్ట్ ఇస్తోంది. తాజాగా ఈ విషయాన్ని తమన్ బయటపెట్టాడు.'రాజా సాబ్', 'గేమ్ ఛేంజర్' లాంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండే తమన్.. 'తెలుగు ఇండియన్ ఐడల్' పాటల పోటీకి జడ్జిగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో మాట్లాడుతూ అనుష్కని తెగ పొగిడేశాడు. తనకు 'భాగమతి' షూటింగ్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ ప్రతి ఏడాది ఓ ఐఫోన్ బహుమతిగా ఇస్తుందని చెప్పాడు.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు)'అనుష్క హీరోయిన్ అని కాదు గానీ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆమె మనసు బంగారం, అందం గురించి పక్కనబెడితే ఎంతో మంచి వ్యక్తి. ఇన్సైడ్ బ్యూటిఫుల్. నాకు ఇచ్చిన మాట ప్రకారం అనుష్క నుంచి ప్రతి సెప్టెంబరులో నాకు ఓ ఐఫోన్ గిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు వాడుతున్న ఫోన్ కూడా అదే. 'భాగమతి' షూటింగ్ టైంలో నాకు ఐఫోన్ అంటే ఇష్టమని అనుష్కతో చెప్పాను. మూవీ హిట్ అయితే ఇవ్వాలని అన్నాను. అలా ఐఫోన్ నాకు గిఫ్ట్గా వస్తుంటుంది. యూవీ ఆఫీస్ నుంచి అనుష్క ద్వారా నా దగ్గరకు ఐఫోన్ వస్తుంది. అలానే అనుష్క అంటే నాకు ఇష్టం. తనే నా జీవితం. నేను ఇంతవరకు చూసిన బెస్ట్ హ్యుమన్ అనుష్క' అని తమన్ చెప్పుకొచ్చాడు.చివరగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలో కనిపించిన అనుష్క.. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. మరోవైపు తమన్ చెప్పినట్లు 'భాగమతి 2' కోసం రెడీ అవుతోంది. ఇందుకోసం ఫిట్గా మారే పనిలో ఉంది. అందుకే బయట కనిపించట్లేదు. సరే ఇవన్నీ పక్కనబెడితే అప్పుడెప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏడాది ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వడం విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)#AnushkaShetty is My Life, She is Gold, Very Lovely Human.We are Working on #Bhaagamathie 2 🔥She is Fantastic Character, Beauty is Inside. She is Most Sweetest. Every Year September, I Get an IPhone from Her as She Promised.- @MusicThaman 😍❤️🔥 pic.twitter.com/GhK73j2Z2I— Sweety Cults ❤️ (@AnushkaCults) September 15, 2024 -
ఇప్పటివరకు విడుదలైన అన్ని ఐఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్
ఒక ఫోన్ అంటే ఎంత సైజ్ ఉంటుంది.. 3 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇక ట్యాబ్ అంటే 7 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఏకంగా 6.74 అడుగుల ఫోన్ ఒకటి వెలుగులోకి వచ్చేసింది. అంటే సగటు మనిషి ఎత్తుకంటే ఎక్కువే.బ్రిటీష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైనీ.. ప్రపంచములోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్ రూపొందించారు. దీనికి గిన్నిస్ రికార్డు కూడా దక్కింది. యితడు రూపొందిన ఫోన్ ఐఫోన్ 15 ప్రో మాక్స్. దీని ఎత్తు 6.74 అడుగులు. ఈ ఫోన్ తయారు చేయడానికి మైనీ గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్ 'మాథ్యూ పెర్క్స్'తో జతకట్టాడు.ఇదీ చదవండి: రూ.4.48 లక్షల కోట్లు: సంపాదనలో ఇతడే టాప్ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్ తయారీకి సంబంధించిన వీడియోను కూడా అరుణ్ రూపేష్ మైనీ యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇందులో ఫోన్ తయారు చేయడానికి సంబంధించిన విషయాలను పూర్తిగా చూడవచ్చు. మొత్తానికి భారీ ఐఫోన్ రూపొందించేసారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఈ భారీ ఫోన్ చూసి ఆశ్చర్యపోతున్నారు.This scaled-up version of an iPhone 15 Pro Max was created by @mrwhosetheboss and @DIYPerks 📱 pic.twitter.com/vqhjMqTA0S— Guinness World Records (@GWR) September 6, 2024 -
డిజైన్, టెక్నాలజీలో మహిళలకు అగ్రస్థానం
ఐఫోన్ కాంట్రాక్టు తయారీ సంస్థ ఫాక్స్కాన్ తమ భారత విభాగంలో మహిళలకు ప్రాధాన్యమివ్వడంపై మరింతగా దృష్టి పెడుతోంది. మహిళలను కేవలం అసెంబ్లింగ్ విభాగానికే పరిమితం చేయకుండా డిజైన్, టెక్నాలజీ సంబంధ హోదాల్లో సారథ్యం వహించేలా చర్యలు చేపడుతున్నట్లు ఫాక్స్కాన్ ఛైర్మన్ యంగ్ లియు తెలిపారు.మహిళలు తమ కెరియర్లో పురోగతి సాధించేందుకు కంపెనీ మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు లియు పేర్కొన్నారు. ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. ఫాక్స్కాన్కు సంబంధించి భారత్లో మొత్తం 48,000 మంది ఉద్యోగులు ఉండగా, కొత్తగా రిక్రూట్ చేసుకున్న వారిలో 25 శాతం మంది వివాహిత మహిళలు ఉన్నట్లు లియు వివరించారు. సంస్థ ఇటీవలే చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను ఆవిష్కరించింది.ఇదీ చదవండి: ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!ఫాక్స్కాన్ రూ.25,000 కోట్లతో కర్ణాటకలో మొబైల్ తయారీ ప్లాంటును నిర్మిస్తోంది. దీనితో 40,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ యూనిట్ ఏర్పాటు కోసం తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. -
ఇది టైప్ చేశారంటే అంతే.. ఐఫోన్ క్రాష్!
ఐఫోన్లు, ఐప్యాడ్లలో కొత్త బగ్ ఒకటి బయటపడింది. కొన్ని అక్షరాలను టైప్ చేస్తే ఐఫోన్లు, ఐప్యాడ్లు క్రాష్ అవుతున్నాయి. “”: తర్వాత ఏదైనా అక్షరం టైప్ చేయగానే స్ప్రింగ్బోర్డ్ అని పిలిచే యాపిల్ డివైజ్ ఇంటర్ఫేస్ క్షణంలో క్రాష్ అయ్యి తిరిగి లాక్ స్క్రీన్కి వెళ్తోంది.ఈ విషయాన్ని మొదట ఓ సెక్యూరిటీ రీసెర్చర్ గుర్తించారు. ఆ తర్వాత టెక్ పబ్లికేషన్ ‘టెక్క్రంచ్’ కూడా దీన్ని పరీక్షించింది. సెట్టింగ్స్ యాప్ లేదా యాప్ యాప్ లైబ్రరీలోని సెర్చ్ బార్లో ఈ అక్షరాలను టైప్ చేయగా క్రాష్ అవుతోందని ధ్రువీకరించింది. కొన్ని సందర్భాల్లో డివైజ్ సాధారణ స్థితికి రావడానికి ముందు స్క్రీన్ ఒక సెకను బ్లాక్గా ఫ్లాష్ కావచ్చని పేర్కొంది.అయితే ఈ బగ్ భద్రతా ముప్పు కాదని నిపుణులు చెబుతున్నారు. ఐఓఎస్ సెక్యూరిటీ రీసెర్చర్ అయిన రియాన్ స్టోర్జ్ సమస్యను విశ్లేషిస్తూ ఇది మీ డివైజ్ భద్రతకు హాని కలిగించదని నిర్ధారించారు. డబుల్యూ అనే సెక్యూరిటీ స్టార్టప్ని స్థాపించిన మరో ఐఓఎస్ నిపుణుడు పాట్రిక్ వార్డ్లే కూడా బగ్ కొంచెం ఇబ్బంది కలిగించేదే అయినా ప్రమాదకరం కాదని అంగీకరిస్తున్నారు.కాగా ఈ బగ్పై యాపిల్ ఇంకా స్పందించలేదు. అయితే వారు భవిష్యత్తు అప్డేట్లో దాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ అసౌకర్యాన్ని నివారించాలనుకుంటే, మీ ఐఫోన్, ఐప్యాడ్ సెర్చ్ బార్లలో “”: అని మాత్రం టైప్ చేయొద్దు. -
యాపిల్ కీలక నిర్ణయం: మొదటిసారి భారత్లో..
యాపిల్ కంపెనీ తన 'ఐఫోన్ ఎస్ఈ' 2017లో భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 వంటివన్నీ మన దేశంలోనే తయారయ్యాయి. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఇండియాలో ఎప్పుడూ ప్రో వేరియంట్లను తయారు చేయలేదు. ఇప్పుడు మొదటిసారి ఐఫోన్ 16 ప్రో మోడల్ తయారు చేయనున్నట్లు సమాచారం.యాపిల్ కంపెనీ ప్రో మోడల్ మొబైల్స్ తయారు చేయనున్నట్లు చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా యాపిల్ భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో & ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడల్ల తయారీని ప్రారంభించాలని యోచిస్తోందని పేర్కొంది. ప్రారంభంలో ఎంట్రీ-లెవల్, పాత ఐఫోన్ మోడళ్లపై దృష్టి సారించిన కంపెనీ క్రమంగా అప్డేటెడ్ మోడల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది.వచ్చే 3 - 4 సంవత్సరాలలో దేశంలో మొత్తం ఐఫోన్ ఉత్పత్తిలో 25 శాతం లక్ష్యంగా, యాపిల్ తన ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశ వాటాను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 16 ప్రో మోడల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. స్థానిక ఉత్పత్తిని ప్రపంచవ్యాప్త విడుదలతో సమకాలీకరించాలనే లక్ష్యంతో ఫాక్స్కాన్ ఇప్పటికే తమిళనాడులోని తన సదుపాయంలో వేలాది మంది కార్మికులకు శిక్షణ ఇవ్వడం కూడా ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తుంటే కంపెనీ తన లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటుందని స్పష్టంగా తెలుస్తోంది. -
ఐఫోన్, ఐప్యాడ్ వాడుతున్నారా? హై రిస్క్ వార్నింగ్!
ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన సలహా జారీ చేసింది. కొన్ని యాపిల్ ఉత్పత్తుల్లో వినియోగదారుల భద్రత, గోప్యతకు ముప్పు కలిగించే సాంకేతిక లోపాలను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ టీమ్ (CERT-in) గుర్తించింది. ముప్పు ఉన్న పరికరాల జాబితాను విడుదల చేసింది.ఈ లోపాలను వినియోగించుకుని హ్యాకర్లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సెర్ట్ ఇన్ తెలిపింది. స్పూఫింగ్పై వినియోగదారులను హెచ్చరించింది. ఈ లోపాల వల్ల యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్, ఐప్యాడ్ తదితర పరికరాల సాఫ్ట్వేర్లు ప్రభావితం కావచ్చని ప్రభుత్వం జారీ చేసిన హై రిస్క్ హెచ్చరికలో పేర్కొంది. వీటి నుంచి బయటపడటానికి యాపిల్ నుంచి సరికొత్త సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.ముప్పు ఉన్న వెర్షన్లు ఇవే..17.6, 16.7.9కి ముందున్న iOS, iPadOS వెర్షన్లు, 14.6కి ముందు MacOS Sonoma వెర్షన్లు, 13.6.8కి ముందు MacOS వెంచురా వెర్షన్లు, 12.7.6కి ముందు macOS Monterey వెర్షన్లు, 10కి ముందు వాచ్OS వెర్షన్లు, 17.6కి ముందు tvOS వెర్షన్లు, 1.3కి ముందు visionOS వెర్షన్లు, 17.6కి ముందు Safari వెర్షన్లు.Safari versions before 17.6iOS and iPadOS versions before 17.6iOS and iPadOS versions before 16.7.9macOS Sonoma versions before 14.6macOS Ventura versions before 13.6.8macOS Monterey versions before 12.7.6watchOS versions before 10.6tvOS watchOS versions before 17.6visionOS versions before 1.3 -
ఐఫోన్ కోసం బ్లాక్మెయిల్.. ఆ తల్లి కళ్లలో నీళ్లు తిరిగే ఉంటాయి!
పిల్లలు కోరింది కాదని అనకుండా ఇచ్చే తల్లిదండ్రులను చాలామందినే చూస్తుంటాం. కానీ, తమ తల్లిదండ్రుల స్తోమతను బట్టి నడుచుకునే పిల్లలే ఈరోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అయితే.. ఇక్కడో పుత్రరత్నం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడి తనని పోషిస్తుందన్న సోయి మరిచి.. కన్నతల్లిని ఐఫోన్ కోసం బ్లాక్మెయిల్ చేశాడా ఘనుడు.ఐఫోన్ కోసం మూడు రోజులపాటు అన్నం తినకుండా తల్లిని బ్లాక్మెయిల్ చేశాడు ఆ కొడుకు. దీంతో కన్నపేగు తల్లడిల్లిపోయింది. గుడి ముందు పూలు అమ్ముకుని జీవన సాగించే ఆమె.. కూడబెట్టిన డబ్బునంతా కొడుకు చేతిలో పెట్టింది. అయితే డబ్బు కొడుకు చేతికి ఇస్తే.. దారి తప్పే అవకాశం ఉందని ఆమె భయపడింది. కొడుకు కూడా వెళ్లి ఫోన్ షోరూంలో ఐఫోన్ కొనిచ్చింది. ఆ టైంలో వీడియో రికార్డు చేశారు అక్కడే ఉన్న సిబ్బంది. అయితే, ఆ కొడుకు కళ్లలో ఆనందం కంటే.. తన భావోద్వేగాన్ని అణుచుకుంటూ కన్నీళ్లను దిగమింగుకోవడం వీడియోలో హైలైట్ అయ్యింది. ఎంతైనా తల్లి మనసు కదా.. అలాగే ఉంటుందిలేండి!. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ.. వీడియో వైరల్ కావడంతో నెట్టింట చర్చ నడుస్తోంది. మరి ఈ ఘటనపై మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పేయండి.This nithalla boy stopped eating food and was demanding iPhone from her mother.His mother finally relented and gave him money to buy iPhone. She sells flowers outside a mandir.Too much love will always destroy children. Parents should know where to draw the line.This is… pic.twitter.com/govTiTKRAF— Incognito (@Incognito_qfs) August 18, 2024 -
ఏడాదిలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న యాపిల్ భారత్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఇండియాలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపారం సాగించింది. దేశీయంగా ఐఫోన్లు, మ్యాక్బుక్లు, ఐప్యాడ్లు, యాపిల్ వాచ్లకు భారీ గిరాకీ ఏర్పడిందని కంపెనీ తెలిపింది. ఏడాది వ్యవధిలోనే రూ.2 లక్షల కోట్లు వ్యాపార మార్కును సాధించడానికిగల కారణాలను కంపెనీ విశ్లేషించింది.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడ్డాయి.పాక్స్కాన్తో భాగస్వామ్యం కుదుర్చుకుని తమిళనాడులో ఐఫోన్లను తయారు చేస్తోంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా తయారైన రూ.1.35 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను కంపెనీ ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. స్థానికంగా రూ.68,000 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.అంతర్జాతీయంగా యాపిల్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్కు తగిన విధంగా తయారీ పెంచేందుకు ఫాక్స్కాన్తోపాటు విస్ట్రోన్, పెగాట్రాన్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది.కర్ణాటకలో యాపిల్ ఐఫోన్ తయారీ ప్లాంట్ ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ను సిద్ధం చేస్తోంది. ఏటా ఆ ప్లాంట్లో దాదాపు 2 కోట్లు యూనిట్లను తయారుచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.దేశీయంగా యాపిల్ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా ముంబయి, ఢిల్లీలో అవుట్లెట్లు ఏర్పాటు చేశారు.ఈకామర్స్ ప్లాట్పామ్లతో జతకట్టి యాపిల్ 42 శాతం ఉత్పత్తులను విక్రయిస్తోంది.ఇదీ చదవండి: చిన్న కిటుకుతో సిబిల్ స్కోర్ పెంపుప్రధానంగా యాపిల్ ప్రీమియం ఉత్పత్తులపై ఎక్కువ దృష్టి పెడుతోంది. దానివల్ల మార్జిన్ ఎక్కువగా సమకూరుతుంది.అత్యాధునిక మార్కెటింగ్తో పెరుగుతున్న బ్రాండ్ విలువ కంపెనీకి ఎంతో లాభం చేకూరుస్తోంది. -
‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ విస్తరణపై చర్చలు
ఫాక్స్కాన్ కంపెనీ భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించింది. ఈమేరకు కంపెనీ సీఈఓ యంగ్ లియు కర్ణాటకలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ ప్రారంభించేందుకు సీఎం సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ పేరుతో ఫాక్స్కాన్ ఐఫోన్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. అనంతరం ఐటీఐఆర్ ఇండస్ట్రీ ఏరియాలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఫాక్స్కాన్కు కేటాయించింది. ఈమేరకు భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై తాజాగా చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ..‘ఫాక్స్కాన్తో రాష్ట్ర ప్రభుత్వం జతకట్టడం సంతోషంగా ఉంది. ఈ సహకారంతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం) రంగంలో కర్ణాటక దేశ ఎగుమతుల్లో భాగమైంది. రాష్ట్రంలో సమర్థవంతమైన లాజిస్టిక్స్, విద్యుత్ సరఫరా, నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్ ఉంది. కంపెనీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని లాభాలు పొందాలి. దాంతోపాటు రాష్ట్రానికి మేలు చేయాలని భావిస్తున్నాం. ఫాక్స్కాన్ తన ప్రాజెక్ట్లను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, భారీ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: విషపూరిత మందులు.. లక్షల్లో మరణాలు!తమిళనాడులో ఇప్పటికే ఫాక్స్కాన్ ఐఫోన్లను తయారు చేస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా యాపిల్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండడంతో తయారీని పెంచాలని కంపెనీ నిర్ణయించింది. దాంతో కర్ణాటకలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ పేరుతో భారీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొడ్డబల్లాపుర, దేవనహల్లిలో 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.22,000 కోట్లుగా అంచనా వేశారు. దీనివల్ల సుమారు 40,000 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ చెప్పింది. ఈ యూనిట్లో ఏటా రెండు కోట్ల స్మార్ట్ఫోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫాక్స్కాన్ ఇప్పటికే ‘ప్రాజెక్ట్ చీతా’ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే మెకానికల్ కాంపోనెంట్ల తయారీ ప్లాంట్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తోంది. -
భారత్లో ఐప్యాడ్ తయారీ..?
భారత్లో యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్కాన్ తన కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు యూనిట్లో యాపిల్ ఐఫోన్లను తయారుచేస్తున్న కంపెనీ త్వరలో ఐప్యాడ్లను కూడా అసెంబుల్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ మేరకు త్వరలో కంపెనీ నుంచి ప్రకటన విడుదల కావొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.యాపిల్ భారత్లో మరిన్ని ఉత్పత్తులను తయారుచేసేందుకు ఆసక్తిగా ఉందని గతంలోనే ప్రకటించింది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ప్రత్యేకంగా యాపిల్ అవుట్లెట్లను ప్రారంభించింది. తమిళనాడులో ఫాక్స్కాన్ ద్వారా ఐఫోన్లను తయారు చేస్తోంది. ఆ యూనిట్లోని పరికరాల్లో కొన్నింటిని అప్గ్రేడ్ చేసి ఐప్యాడ్లను తయారు చేయవచ్చని నిపుణులు సూచించినట్లు తెలిసింది. అందుకు సంస్థ కూడా ఆమోదం తెలిపిందని కొందరు అధికారులు చెప్పారు. త్వరలో దీనిపై కంపెనీ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా విభిన్న ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఐప్యాడ్ తయారీలో కొంత భాగాన్ని గత సంవత్సరం వియత్నాంకు మళ్లించారు.తమిళనాడులో కొత్త యూనిట్ కోసం భారత్కు చెందిన ఓ సంస్థ రూ.1,200 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఫాక్స్కాన్ ఫిబ్రవరిలో ప్రకటించింది. బడ్జెట్ 2024-25లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. దాంతో దేశీయ తయారీకి ప్రోత్సహం లభించనుంది. యాపిల్ సంస్థ ఫాక్స్కాన్ ద్వారా భారత్లో ఐప్యాడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తే స్థానికంగా మరింత మంది ఉపాధి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు అంతర్జాతీయంగా భారత్లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) వల్ల కూడా దేశీయ తయారీని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!ట్రెండ్ఫోర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ బోయ్స్ ఫ్యాన్ మాట్లాడుతూ..‘భారత్లో ఐప్యాడ్ ఉత్పత్తిని చేపట్టడం వల్ల సప్లై-చైన్ డిమాండ్ను భర్తీ చేయవచ్చు. దేశీయంగా యాపిల్ ఉత్పతులకు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఐప్యాడ్ ఎగుమతులు 49 మిలియన్ల(4.9 కోట్లు)కు చేరుకుంటాయని అంచనా’ అని తెలిపారు. -
ఐఫోన్ 16 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రతి సంవత్సరం యాపిల్ కంపెనీ కొత్త సిరీస్ లాంచ్ చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా సంస్థ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్లను రాబోయే రోజుల్లో యాపిల్ నిర్వహించనున్న ఈవెంట్లో ఆవిష్కరించనున్నారు.గత ఏడాది యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ను సెప్టెంబర్ 12న ఆవిష్కరించింది. దీన్ని బట్టి చూస్తే వచ్చే సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 16 సిరీస్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్లలో అప్డేటెడ్ ఫీచర్స్ ఉండనున్నట్లు సమాచారం. ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ హై-ఎండ్ ఫీచర్లకు సపోర్ట్ చేయడానికి ఏ18 ప్రో పొందనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16 సీరీస్తో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ ఐఓఎస్ 18 కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.గత సంవత్సరం యాపిల్ ఐఫోన్ 15 ప్రో కోసం యాక్షన్ బటన్ పరిచయం చేసింది. అయితే ఈ ఫీచర్ వనిల్లా ఐఫోన్ 15లో లేదు. కానీ ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో ఈ యాక్షన్ బటన్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. దీనితోపాటు క్యాప్చర్ బటన్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఫోటో టేకింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రెండూ కూడా ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే కూడా పెద్ద డిస్ప్లేలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో డిస్ప్లే 6.1 ఇంచెస్ నుంచి 6.3 ఇంచెస్కు పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.7 ఇంచెస్ నుంచి 6.9 ఇంచెస్ డిస్ప్లే పొందవచ్చు. వీటి బరువు కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. -
ఫోల్డబుల్ యాపిల్ ఐఫోన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో కంపెనీల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఈ రంగంలో ఫోల్డబుల్ మోడల్ సరికొత్త ఆవిష్కరణగా కొనసాగుతోంది. ఫోల్డబుల్ మోడల్ తేవడం ద్వారా శామ్సంగ్, గూగుల్, మోటరోలా, షావొమీ, టెక్నో, వివో, వన్ప్లస్, ఒప్పో, హువావే, హానర్ సరసన చేరేందుకు ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.అన్నీ అనుకూలిస్తే ఒకట్రెండేళ్లలో ఐఫోన్ ఫోల్డబుల్ రంగ ప్రవేశం చేయనుంది. వీ68 కోడ్ పేరుతో ఈ మోడల్ను అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. డిజైన్ విషయంలో కంపెనీ ఒక నిర్ణయానికి వచ్చింది. మరోవైపు 2025 సంవత్సరానికిగాను తక్కువ మందం కలిగిన ఐఫోన్ అభివృద్ధి చేస్తున్నటు మార్కెట్ వర్గాల సమాచారం. -
ఆఫీసులో ఐఫోన్ మాత్రమే వాడండి!.. మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
ప్రముఖ టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' మొబైల్ వాడకంపై కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు తప్పకుండా ఐఫోన్స్ మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాలోని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉపయోగిస్తున్న వారికి ఐఫోన్లను అందించడం ప్రారంభించినట్లు సమాచారం. చైనాలోని ఉద్యోగులందరూ సెప్టెంబర్ నుంచి ఆపిల్ ఐఫోన్స్ తప్పనిసరిగా ఉపయోగించాలని సంస్థ స్పష్టం చేసింది.చైనాలో గూగుల్, గూగుల్ ప్లే సేవలు లేదు. ఆ దేశం మొబైల్ బ్రాండ్స్ అన్నీ సొంత ప్లాట్ఫామ్ కలిగి ఉన్నాయి. కాబట్టి అలాంటి మొబైల్స్ ఉపయోగించడం వల్ల కంపెనీ డేటాకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అయితే యాపిల్ ఐఫోన్లలో సెక్యూరీటీ సిస్టం పటిష్టంగా ఉంటుంది. కాబట్టి డేటా బయటకు వెళ్లే అవకాశం లేదు. ఈ కారణంగానే మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.చైనాలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ పాస్వర్డ్ మేనేజర్, ఐడెంటిటీ పాస్ యాప్ను ఉపయోగించాలని కంపెనీ పేర్కొంది. ఇవి యాపిల్, గూగుల్ ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఉద్యోగులు తప్పకుండా ఆండ్రాయిడ్ ఫోన్స్ వదిలిపెట్టి.. ఐఫోన్ ఉపయోగించాలని కోరింది.ఐఫోన్ లేని, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ఉద్యోగులకు కంపెనీ కొత్త డివైజ్లను అందజేస్తుంది. ఉద్యోగులకు కొత్త ఐఫోన్ 15 ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడొద్దని, కేవలం ఐఫోన్స్ మాత్రమే వాడండి అని చెప్పడంతో కొందరిలో అనుమానాలు పుడుతున్నాయి. -
యాపిల్కు ఓపెన్ఏఐ బోర్డులో స్థానం..!
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఓపెన్ఏఐ బోర్డులో పరిశీలక స్థానాన్ని పొందినట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. యాపిల్ తన ఉత్పత్తుల్లో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీను వాడుతున్నట్లు ప్రకటించింది. దాంతో ఇరు కంపెనీల విధానాలను ఏకీకృతం చేయడానికి యాపిల్ ఓపెన్ఏఐ బోర్డులో స్థానం పొందినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.ఈ మేరకు యాప్స్టోర్కు సారథ్యం వహిస్తున్న ఫిల్ షిల్లర్ను బోర్డులో పరిశీలకుడిగా ఎంచుకున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. ఆయన గతంలో యాపిల్ మార్కెటింగ్ వ్యవహారాలు కూడా పర్యవేక్షించేవారు. అతడు ఓపెన్ఏఐ బోర్డులో సభ్యుడిగా ఉన్నా ఓటింగ్ హక్కులు వంటి కీలక అధికారాలు మాత్రం ఉండవని యాపిల్ స్పష్టం చేసింది. రెండు సంస్థల విధానాలను యాపిల్కు అనుగుణంగా ఏకీకృతం చేయాడానికి ఆయన ప్రయత్నిస్తారని తెలిపింది. ఈ ఏడాది చివరి నుంచి షిల్లర్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.ఇదీ చదవండి: ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!జూన్ నెలలో నిర్వహించిన వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో భాగంగా యాపిల్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. యాపిల్ ఉత్పత్తుల్లో చాట్జీపీటీను వినియోగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఏడాది చివరి నాటికి యాపిల్ ఉత్పత్తుల్లో చాట్జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపాయి. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్బాట్ను వినియోగించుకోవచ్చని యాపిల్ పేర్కొంది. జనరేటివ్ఏఐ వినియోగానికి సంబంధించి యాపిల్ మెటా, గూగుల్తోనూ చర్చలు జరుపుతోంది. ఇంకా వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. -
వివాహితులకు ‘నోజాబ్’ అంటూ ఫాక్స్కాన్పై ప్రచారం.. ఎందుకంటే?
చెన్నై: వివాహితులకు ‘నోజాబ్’ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఐఫోన్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ ఖండించింది. తాము నియమించుకున్న ఉద్యోగుల్లో 25 తం మంది వివాహుతలైన మహిళలే ఉన్నారని స్పష్టం చేసింది.తమిళనాడులోని చెన్నై కేంద్రంగా ఫాక్స్కాన్ సంస్థ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్లను తయారు చేస్తుంది. అయితే ఇటీవల ఐఫోన్ తయారీ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లో మరికొంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కానీ దీనిపై ప్రచారం మరోలా జరిగినట్లు తెలుస్తోంది. ఫాక్స్కాన్ యాజమాన్యం వివాహితులైన మహిళల్ని నియమించుకోవడం లేదనే పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రచారంతో అప్రమత్తమైన కేంద్రం ఫాక్స్కాన్లో జరిగిన నియామకాలపై వెంటనే తమకు సమగ్ర సమాచారాన్ని అందించాలని తమిళనాడు కార్మిక శాఖకు ఆదేశాలు జారీచేసింది. ఉద్యోగుల నియామకంపై ఫాక్స్కాన్ వివరణ ఇచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాలు ఆధారంగా తమ ఐఫోన్ తయారీ ఫ్లాంట్లో కొత్తగా ఉద్యోగుల నియామకం జరిగిందని, వారిలో 25 శాతం మంది వివాహిత మహిళలేనని ఫాక్స్కాన్ ప్రతినిధులు చెప్పారు. ఉద్యోగం రాలేదని అసత్య ప్రచారం చేశారని, ఇలాంటి నిరాధారమైన ప్రచారంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ తయారీ రంగాన్ని దెబ్బతీస్తున్నాయని వారు తెలిపారు.ఇదిలా ఉంటే, ఫాక్స్ కాన్ ఫ్లాంట్లో పని చేయడానికి వివాహిత మహిళలను అనుమతించకపోవడంపై పలు మీడియా సంస్థలు (అందులో పీటీఐ) ఆరా తీయగా ఫాక్స్కాన్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. తమిళనాడు ప్లాంట్ దేశంలో మహిళలు అత్యధికంగా ఉపాధి పొందుతున్న మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్గా పేరు సంపాదించింది. ఇందులో ప్రస్తుతం ఉపాధి పొందుతున్న సిబ్బంది సంఖ్య 45,000 దాటినట్లు ఫాక్స్కాన్ ప్రతినిధులు వెల్లడించారు. పలు జాతీయ మీడియా కథనాలు సైతం.. ఫాక్స్ కాన్లో ఉద్యోగం రాలేదన్న కారణంతో 5 నుంచి 10 మంది ఈ అసత్య ప్రచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. -
సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్లు పంపాలా..?
మొబైల్లో సిమ్ లేకుండా మెసేజ్ చేయడం సాధ్యమవుతుందా..? ఎందుకు అవ్వదు.. వై-ఫై ద్వారా వీలవుతుంది కదా అంటారా. మరి వై-ఫై లేకపోయినా మెసేజ్చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒకేవేళ మారుమూల ప్రదేశాలు, అడవులు, కొండలు, సముద్రాలు.. వంటి ప్రాంతాల్లో కూడా మన సమాచారాన్ని ఇతరులకు చేరేవేసే అవకాశం ఉంటే అదిరిపోతుంది కదా. ఇలాంటి కొత్త టెక్నాలజీను ప్రపంచ ప్రఖ్యాత సంస్థ యాపిల్ ప్రవేశపెడుతుంది. కాలిఫోర్నియాలోని సంస్థ ప్రధానకార్యాలయంలో జరుగుతున్న వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో ఇలాంటి కొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తుంది. ఈ ఏడాది చివరినాటికి విడుదలచేసే ఐఓఎస్ 18 వర్షన్లో ఈ ఫీచర్లను అందుబాటులో ఉంచనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.యాపిల్ ఐఫోన్లో శాటిలైట్ మెసేజింగ్ సామర్థ్యాలను విస్తరిస్తోంది. కొత్త iOS 18 వర్షన్ ద్వారా సాటిలైట్ సేవలను వినియోగించుకుని ఎమర్జెన్సీ మెసేజ్లను పంపించేలా ఏర్పాటు చేస్తున్నారు. సెల్యులార్, వై-ఫై కనెక్షన్లు అందుబాటులో లేనప్పుడు శాటిలైట్ ద్వారా సందేశాలు పంపే టెక్నాలజీను తీసుకొస్తున్నారు. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. 2022లో విడుదల అయిన ఐఫోన్14తోపాటు దాని తర్వాత మార్కెట్లోకి వచ్చిన యాపిల్ ఫోన్లలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని చెప్పింది. ఈమేరకు ఆయా ఫోన్ల్లోని యాంటెన్నాలు ఉపగ్రహాల ప్రత్యేక ఫ్రిక్వెన్సీని చేరుకునేలా ఇప్పటికే హార్డ్వేర్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అందుకు అనువుగా నిర్దిష్ట సాప్ట్వేర్, అల్గారిథమ్లను రూపొందించినట్లు యాపిల్ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్తో ఐఫోన్ వినియోగదారులు ఐమెసేజ్, ఎస్ఎంఎస్ల ద్వారా టెక్స్ట్లు, ఎమోజీలు పంపవచ్చని వివరించింది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?యాపిల్ శాటిలైట్ కనెక్టివిటీ కాంపోనెంట్ కోసం అమెరికాకు చెందిన గ్లోబల్స్టార్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్లోబల్స్టార్ సంస్థ స్పేస్టెక్నాలజీ అందిస్తున్న ఎండీఏతో ఈమేరకు ఒప్పందం చేసుకుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ తన ఉత్పత్తుల్లో చాట్జీపీటీ చాట్బాట్ను వినియోగించేందుకు ఓపెన్ఏఐతో ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన వరల్డ్వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్2024లో ఈమేరకు తమ భాగస్వామ్యాన్ని వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు యాపిల్ ఉత్పత్తుల్లో చాట్జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్బాట్ను వినియోగించుకోవచ్చని పేర్కొంది.మైక్రోసాఫ్ట్ పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించిన కాసేపటికే యాపిల్ షేర్లు పుంజుకున్నాయి. కానీ ఈ కాన్ఫరెన్స్లో మరిన్ని జనరేటివ్ ఏఐలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని ఆశించిన దీర్ఘకాల పెట్టుబడిదారులకు నిరాశకలిగింది. దాంతో సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి యాపిల్ పేర్లు 2శాతం నష్టపోయాయి.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్డెవలర్ కాన్ఫరెన్స్లో భాగంగా యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్-రియాలిటీ హెడ్సెట్, ఐఓస్18 ఆపరేటింగ్ సిస్టమ్ను ఆవిష్కరించింది. రియాలిటీ హెడ్సెట్ విజన్ ప్రోను చైనా, జపాన్తో సహా మరో ఎనిమిది దేశాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ‘సిరి’లోనూ కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లు యాపిల్ పేర్కొంది. అన్ని యాపిల్ సూట్ యాప్స్లో ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తీసుకురానున్నట్లు తెలిపింది. -
రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్జాబ్స్..!
ప్రపంచ నం.1 కంపెనీగా చలామణి అవుతున్న యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టెక్ పరిశ్రమలో ఈ కంపెనీ గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. యాపిల్ కంపెనీ 'వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) కార్యక్రమం సోమవారం (జూన్ 10) నుంచి జరగనుంది. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఈసారి కూడా లేటెస్ట్ ఉత్పత్తులను ఆవిష్కరిస్తుంది. అటువంటి సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్ అతిపెద్ద సంస్థ.కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది.యాపిల్ ఐప్యాడ్లో వినియోగిస్తున్న రెటీనా డిస్ప్లేను శామ్సంగ్ కంపెనీ తయారు చేస్తోంది.యాపిల్ కో-ఫౌండర్లో ఒకరైన రొనాల్డ్వేన్ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్ విలువ 35 బిలియన్ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు).ప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది.యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి.యాపిల్ మాక్బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్ప్రూఫ్.యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు.స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్ డాలర్(ప్రస్తుతం రూ.83). -
వర్కలా బాయ్స్
ఇటీవల ‘ముంజమ్మల్ బాయ్స్’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. బిలంలో పడ్డ స్నేహితుణ్ణి బయటకు లాగడం కథ. ఇక్కడ మనం ‘వర్కలా బాయ్స్’ని చూడొచ్చు. కర్నాటక నుంచి కేరళ విహారానికి వచ్చిన ఒక మహిళ వర్కలా బీచ్లో ఫోన్ జారవిడిచింది. అది అక్కడి రాళ్ల కింద చాలా లోతులో పడింది. అసలే అది ఐఫోన్. ఇంకేముంది వర్కలా అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది. 7 గంటలు శ్రమించాక... ఏమైంది?విహారంలో అపశృతులు దొర్లితే మనసు పాడవుతుంది. కర్నాటక నుంచి కేరళలోని వర్కలాకు విహారానికి వచ్చిన ఒక మహిళ అక్కడి బ్లాక్ బీచ్లో ఉండగా పొరపాటున ఫోన్ జారింది. అది రాళ్ల కట్ట ఉన్న బీచ్. ఫోన్ రాళ్ల సందులో నుంచి లోపలికి పడిపోయింది. లక్షన్నర రూపాయల విలువ చేసే ఐఫోన్. వెంటనే ఆమె బస చేసిన హోటల్ సిబ్బంది, వర్కలా అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. రాళ్లు తొలగించి ఫోన్ తీసే వీలు లేదు. తాడుతో తీగతో బయటకు లాగడం కూడా కష్టమైంది. దానికితోడు బీచ్లో భారీ అలలు, వాన పనికి అంతరాయం కలిగించాయి. దాంతో మరుసటి రోజు ఉదయం వచ్చి సుమారు ఏడు గంటలు కష్టపడి ఆ ఫోన్ని వెలికి తీశారు. అమ్మయ్య. కథ సుఖాంతం అయ్యింది. సుఖాంతం సంతోషమే కదా ఇస్తుంది. మంజుమ్మల్ బాయ్స్లో కూడా కథ సుఖాంతం కావడం వల్లే అది అంత పెద్ద హిట్ అయ్యిందని అనుకోవచ్చా? -
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
ఐఫోన్లు, యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్న్యూస్ ఇది. ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ జూన్ 8 నుంచి 17 వరకు "యాపిల్ డేస్" సేల్ ను నిర్వహిస్తోంది. ఆన్లైన్, ఇన్-స్టోర్ రెండింటిలోనూ యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్ను అందిస్తోంది.ఐఫోన్లపై డిస్కౌంట్లు ఇవే..ఐఫోన్ 15 సిరీస్: ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.64,900, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.74,290, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.6,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.ఐఫోన్ 15 ప్రో సిరీస్: ఐఫోన్ 15 ప్రో రూ .123,990, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ .145,990 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో రూ .3,000 తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయి.పాత ఐఫోన్ మోడల్స్: ఐఫోన్ 14, ఐఫోన్ 13 వంటి పాత మోడల్స్పై డీల్స్ వరుసగా రూ .57,990, రూ .50,999 నుంచి ప్రారంభమవుతాయి.ఇతర యాపిల్ ఉత్పత్తులపై.. ఐప్యాడ్లు: ఐప్యాడ్ 9వ జనరేషన్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో సహా వివిధ ఐప్యాడ్ మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. వీటి ధర రూ .24,990 నుంచి ప్రారంభమవుతుంది.మ్యాక్బుక్స్: శక్తివంతమైన ఎం1, ఎం2, ఎం3 చిప్లతో కూడిన మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో మోడళ్ల ధర రూ.67,490 నుంచి ప్రారంభమవుతుంది.యాపిల్ వాచ్: ఫిట్నెస్ను ట్రాక్ చేసే యాపిల్ వాచ్ సిరీస్ 9, ఎస్ఈ, అల్ట్రా మోడళ్ల ధరలు రూ .25,900 నుంచి ప్రారంభం.ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ఇన్ స్టంట్ డిస్కౌంట్లు: ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డుదారులు తమ కొనుగోళ్లపై రూ.10,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.ఎక్స్ఛేంజ్ బోనస్: ఇన్-స్టోర్ కస్టమర్లు క్యాషిఫై ద్వారా రూ .12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.మైవీఎస్ లాయల్టీ ప్రోగ్రామ్: అన్ని కొనుగోళ్లపై 0.75 శాతం లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. -
ఐఫోన్పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
యాపిల్ కంపెనీ చైనాలోని తన ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తుంది. చైనాలోని ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫామ్ ‘ట్మాల్’ వెబ్సైట్లో యాపిల్ ఐఫోన్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రచారాన్ని ప్రారంభించింది.ఎంపిక చేసిన ఐఫోన్ మోడళ్లపై 2,300 యువాన్ల (సుమారు రూ.26వేలు) వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెబ్సైట్లో ప్రకటనలు వెలిశాయి. ఈ ఆఫర్ మే 20 నుంచి 28 వరకు మాత్రమే ఉంటుందని ప్రచారం సాగుతోంది. హువాయ్ వంటి స్థానిక బ్రాండ్ల నుంచి యాపిల్కు గట్టిపోటీ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తా సంస్థలు కథనాల వెలువరించాయి. దాంతోపాటు యాపిల్ కొత్త మోడల్ లాంచ్ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉన్నవాటికి ధర తగ్గిస్తుందనే వాదనలున్నాయి. ప్రస్తుతం యాపిల్ ఇస్తున్న డిస్కౌంట్ ఫిబ్రవరిలో ప్రకటించిన తగ్గింపు కంటే ఎక్కువగా ఉంది. అప్పుడు అత్యధికంగా 1,150 యువాన్లు మాత్రమే డిస్కౌంట్ ఇచ్చారు.చైనాలో ప్రముఖ హైఎండ్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ హువాయ్ గత నెలలో ‘పురా 70’ అనే మోడల్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇటీవల యాపిల్ ఐఫోన్ అమ్మకాలు తగ్గుతున్నాయి. చైనా అకాడమీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (సీఏఐసీటీ) డేటా ఆధారంగా మార్చిలో యాపిల్ ఎగుమతులు 12% పెరిగాయి. అయితే అమ్మకాలు మాత్రం 37% తగ్గాయి. దాంతో కంపెనీ భారీ రాయితీలు ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
భారత్లో ఐఫోన్ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఐఫోన్ ఉత్పత్తుల్లో ప్రతి ఏడింటిలో ఒకటి భారత్లోనే తయారవుతోందని ప్రధానిమోదీ అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్ఐ) ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ..‘ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఎదిగింది. గ్లోబల్గా తయారువుతున్న ఏడు ఐఫోన్లలో ఒకటి ఇండియాలోనే తయారుచేస్తున్నారు. ఐఫోన్తోపాటు యాపిల్ ఉత్పత్తులను కూడా భారత్ రికార్డు సంఖ్యలో ఎగుమతి చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం ద్వారానే ఇది సాధ్యమైంది’ అని అన్నారు.2028 నాటికి మొత్తం ఐఫోన్లలో 25 శాతం భారత్లోనే తయారవుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి త్రైమాసికానికి సంబంధించి యాపిల్ ఉత్పత్తుల షిప్మెంట్లో దేశం రికార్డు స్థాయిని చేరుకుంది. దేశంలోని యాపిల్ ఉత్పత్తుల్లో ఏడాదివారీగా 19 శాతం వృద్ధి నమోదైనట్లు కంపెనీ తెలిపింది.యాపిల్ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్లెట్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదవుతోందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనల ద్వారా తెలిసింది. త్వరలో భారత్లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్లో వెలువడిన బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
ఐఫోన్ ఫింగర్ అంటే ఏంటీ? ఇది ప్రమాదకరమా..?
స్మార్ట్ ఫోన్ అడిక్షన్తో పలు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పిల్లలను వాటికి అడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు కూడా. కానీ ఇప్పుడు ఏకంగా వాటి వాడకం వల్లే వేళ్ల సంబంధ సమస్యలొస్తున్నాయంటూ పలువురు ఊదరగొడుతున్నారు. నిపుణులు మాత్రం అది సాధారణ సమస్య అని కొట్టిపారేస్తున్నారు. ఈస్మార్ట్ ఫోన్లను అలా ఉపయోగిస్తేనే సమస్యలు వస్తాయంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు వైద్యులు. మరీ ఇంతకీ ఏంటీ ఐఫోన్ ఫింగర్..ఐఫోన్ ఫింగర్ అంటే..ఐఫోన్ ఫింగర్"ని "స్మార్ట్ఫోన్ పింకీ" అని కూడా అంటారు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు పెద్దపెద్ద సైజుల్లో వస్తున్నాయి. వాటిని అరచేతిలో పట్టుకునేటప్పుడు ఫోన్ కింద చిటికెన వేలుతో నొక్కి పట్టుకోవడం సహజం. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోతోందని ఆందోళన చేస్తున్నారు కొందరూ. దీన్నే 'స్మార్ట్ ఫోన్ పింకీ' లేదా 'ఐఫోన్ ఫింగర్' అని అంటారు. ఈ ఆపిల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నప్పుడు భారం చిటికెన వేలుపై పడటంతో ఉంగరం వేలుకి దీనికి గ్యాప్ రావడం లేదా వంకరపోవడం వంటివి జరుగుతున్నాయని పలువురు టెక్ ఔత్సా హికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇది సాధారణ సమస్యే అని కొట్టిపారేస్తున్నారు. క్లీవ్ల్యాండ్ క్లినిక్కి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పీటర్ ఎవాన్స్ చిటికెన వేళ్ల మధ్య గ్యాప్లు, వంకరపోవడానికి అదే కారణమని చెప్పలేమని అన్నారు. దీన్ని సాధారణ పింకీ అనాటమీ(చిటికెన వేలు సమస్య)గా చెబుతున్నారు. అలాగే ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఏప్రిల్ హిబ్బెలర్, రోలినాకు చెందిన హ్యాండ్ సర్జన్ డాక్టర్లిద్దరు సదరు సర్జన్ డాక్టర్ ఎవాన్స్ మాటలతో ఏకీభవించారు. ఐఫోన్, స్మార్ట్ పోన్ల వల్లే ఇది వస్తుందని అధికారిక నిర్థారణ కాలేదని అన్నారు. కానీ వారంతా ఫోన్కు సంబంధించిన కొన్ని అనారోగ్య పరిస్థితుల గురించి హెచ్చరించారు. అవేంటంటే..ఫోన్ సంబంధిత వైద్య పరిస్థితులుస్మార్ట్ వాడకం వల్ల "స్మార్ట్ఫోన్ ఎల్బో" వస్తుందని అన్నారు. వైద్యపరంగా దీన్ని క్యూబిటల్ టన్నెల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. టక్స్ట్ టైప్ చేయడానికి ఎక్కువ వ్యవధిలో మోచేతిని 90 డిగ్రీలకు మించి వంచితే ఇది వస్తుందని వివరించారు. బహుశా ఇదే చిటికెన వేలుపై వస్తున్న మార్పులకు సంకేతాలు కూడా కాడొచ్చని అన్నారు. అందువల్లే నరాలు దెబ్బ తిని ఇలా చిటికెన వేలు వంకరపోవడం లేదా గ్యాప్ రావడం జరగుతుండవచ్చు అని అన్నారు. విపరీతంగా బొటనవేలుతో టెక్స్టింగ్ చేసేవాళ్లు మెడ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్మార్ట్ ఫోన్ వినియోగదారులను కోరారు. రోజంతా బొటనవేలుతో స్వైపింగ్, టైప్ చేయడం వంటివి చేస్తే ఈ సమస్యలు అధికమవుతాయని, పైగా అంతర్గతంగా ఆర్థరైటిస్ వంటి సమస్యలను తీవ్రతరం చేసి బొటనవేలు స్నాయువులలో కొత్త సమస్యలను కలిగిస్తుందని తెలిపారు. ఇక్కడ మనిషి తల బరువు కనీసం 10 నుంచి 12 పౌండ్లు వరకు ఉంటుంది. స్మార్ట్ఫోన్ చూసేందుకు ఎప్పుడైతే తలను వంచుతామో అప్పుడు ఆ భారం అంతా మెడ కండరాలపై పడుతుంది. ఈ అదనపు ఒత్తిడి కండరాల నొప్పికి దారితీసి ఆర్థరైటీస్ వంటి సమస్యల్లో పెడుతుందని వివరించారు సర్జన్ ఎవాన్స్. (చదవండి: ఆశకు స్ఫూర్తి ఆమె'!..ఏకంగా 33 వేల అడుగుల ఎత్తు నుంచి విమానం కూలినా..!) -
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.ఈ ఏడాది తొలిసారి యాపిల్ సంస్థ ఏప్రిల్ 7న ‘లెట్ లూస్’ ఈవెంట్లో కొత్త ఐపాడ్లపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. ఓల్ఈడీ ఐపాడ్ ప్రో, ఐపాడ్ ఎయిర్స్ను లాంచ్ చేయనుందని సమాచారం. టెక్ దిగ్గజం లాంచ్ చేయనున్న కొత్త ఐపాడ్ ప్రో తరహాలో మాక్ బుక్ ప్రో సైతం మరింత పవర్ఫుల్గా ఉండనుంది.యాపిల్ లెట్ లూస్ ఈవెంట్లో ప్రత్యేకతలు లెట్ లూస్ ఈవెంట్లో యాపిల్ సంస్థ విడుదల చేయనున్న ఐపాడ్ ప్రోలో ఓఎల్ఈడీ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని బ్లూమ్బెర్గ్ నివేదిక చెబుతోంది. అంతేకాదు బెటర్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, కలర్ ఆక్యురెన్స్ సైతం అప్గ్రేడ్ వెర్షన్ యూజర్లకు వినియోగం మరింత సులభం కానుందనే నివేదిక హైలెట్ చేసింది. స్క్రీన్ అప్గ్రేడ్తో పాటు కొత్త ఐపాడ్ ప్రో మోడల్లు ఓల్డ్ మోడళ్ల కంటే సన్నగా ఉండనుందని అంచనా. 12.9 అంగుళాల మోడల్కు 20 శాతం, 11 అంగుళాల మోడల్కు 15 శాతం వరకు సైజ్ తగ్గుతుంది. ఐపాడ్ ప్రోలో ఎం4 చిప్యాపిల్ నెక్ట్స్ జనరేషన్ ఎం4 చిప్ని ఐపాడ్ ప్రోలో అప్డేట్ చేయనుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ప్రస్తుత ఎం3 చిప్ కంటే గణనీయమైన పనితీరు, సామర్థ్యం సైతం పెరగనుందని టెక్ లవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఊహానాల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న యాపిల్ లెట్ లూస్ ఈవెంట్లో స్పష్టత రానుంది. యాపిల్ లెట్ లూస్ ఐప్యాడ్ లాంచ్ను ఎలా చూడాలిఇక మే 7న యాపిల్ లెట్ లూస్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ను యూట్యూబ్, యాపిల్.కామ్, యాపిల్ టీవీలో వీక్షించవచ్చు. -
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ముంబై: లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మొత్తం 20 కేసుల్లో 12.74 కిలోల బంగారాన్ని ముంబై కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు ఖరీదైన నాలుగు ఐఫోన్లను (15 ప్రో ఫోన్లను) కూడా స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని లోదుస్తులు, వాటర్ బాటిల్స్, బట్టలు, ముడి అభరణాలు, బంగారు కడ్డీలు, శరీరంపై దొంగచాటుగా దాచి తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన బంగారం, ఐఫోన్ల విలువ సుమారు రూ.8.37 కోట్లకుపైమాటే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఐదుగురు ప్రయాణికుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.Officials of Mumbai Customs at Chhatrapati Shivaji Maharaj International Airport have seized goods worth a total of Rs 8.37 crores including 12.74 Kg Gold across 20 cases. Gold was found concealed in various forms like gold dust in wax and gold layered cloths, crude jewellery and… pic.twitter.com/4OQlYsATIE— ANI (@ANI) May 4, 2024 -
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్లో మాత్రం..
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఐఫోన్ విక్రయాలు తగ్గుతున్నట్లు తెలిసింది. మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ ఐఫోన్ విక్రయాలు 10 శాతం తగ్గినట్లు కంపెనీ చెప్పింది. దాంతో కంపెనీ ఆదాయం 4 శాతం క్షీణించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు.గడిచిన త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ విక్రయాలు తగ్గుతుంటే ఇండియాలో మాత్రం వీటికి ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఇండియాలో రికార్డు స్థాయిలో విక్రయాలు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియాలో యాపిల్ ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్ ఉంది. భారత్లో స్థిరంగా రెండంకెల వృద్ధి నమోదవుతోంది. ఇక్కడ రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ముందుగా కంపెనీ ఆశించినమేరకు అంచనాలను అధిగమిస్తున్నాం’ అని అన్నారు.యాపిల్ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్లెట్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదవుతోంది. త్వరలో భారత్లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్లో వెలువడిన బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
యాపిల్కు ఆదాయం సమకూర్చడంలో భారత్ టాప్
యాపిల్ భారత్లో తన ఆదాయాన్ని పెంచుకుంటుంది. కేవలం రెండు అవుట్లెట్ల ద్వారా 2024 ఆర్థిక సంవత్సరానికిగాను ఏకంగా రూ.190-రూ.210 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవుట్లెట్ల్లో ఇదే రికార్డు ఆదాయమని కంపెనీ తెలిపింది. ముంబై, దిల్లీలో రెండు యాపిల్ స్టోర్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: కొత్త సౌండ్బాక్స్లు ప్రారంభించిన పేటీఎం.. ప్రత్యేకతలివే.. ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదైంది. త్వరలో భారత్లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి యాపిల్ చర్చలు జరుపుతోందని తెలిసింది. అయితే గతేడాది జూన్లో బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. -
భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచ నం.1 కంపెనీ అయిన యాపిల్ భారత్లో కార్యకలాపాలపై ఆసక్తిగా ఉందని తెలుస్తుంది. తాజాగా ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ సరఫరా చేసేందుకు భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ తయారీకి టాటా గ్రూప్నకు చెందిన టైటాన్ కంపెనీతో, మురుగప్ప గ్రూప్తో యాపిల్ చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే కుపెర్టినో కంపెనీ తన కార్యకలాపాలను చైనాతోపాటు భారత్లో విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కుపెర్టినో కంపెనీ చైనాలో ఐఫోన్ కెమెరాలను తయారుచేస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి మరో 5-6 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. టైటాన్ గడియారాలు, ఇతర ఆభరణాల తయారీలో ప్రత్యేకత చాటుకుంటోంది. చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న మురుగప్ప గ్రూప్నకు ఇంజినీరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కెమికల్స్ రంగంలో 100 ఏళ్ల అనుభవం ఉంది. ఈనేపథ్యంలో ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు చేసుకోవచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది. ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని నోయిడాకు చెందిన కెమెరా మాడ్యూల్ తయారీ సంస్థ మోషిన్ ఎలక్ట్రానిక్స్లో మురుగప్ప గ్రూప్ 76% వాటాను కొనుగోలు చేసింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న టైటాన్ కంపెనీ ఇంజినీరింగ్, ఆటోమేషన్లో సేవలందిస్తోంది. హై ప్రెసిషన్ కాంపోనెంట్ తయారీ, ఇంజినీరింగ్ డిజైన్ సర్వీస్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్షణ, ఏరోస్పేస్ వంటి పరిశ్రమల్లోను సేవలందిస్తోంది. యాపిల్ జనవరి నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్లో దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ఐఫోన్లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో స్థానికంగా ఆ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఇండియాలో తయారవుతున్న దాదాపు 70 శాతం ఐఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగి అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్రపంచంలోని రద్దీ ఎయిర్పోర్ట్ల్లో భారత విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా యాపిల్ భారత్లో తయారీకి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఫాక్స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. -
ఐఫోన్ అప్డేట్ కూడా తెలియదా..పరువు పోగొట్టుకున్న లోకేష్
-
Apple: స్పైవేర్ దాడులు జరగొచ్చు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్దతున్న సైబర్ నేరగాళ్లు మీ ఐఫోన్ తదితర యాపిల్ ఉత్పత్తులపై సైబర్దాడులు చేయొచ్చని గతంలో హెచ్చరించి తీవ్ర చర్చకు తెరలేపిన యాపిల్ సంస్థ తాజాగా మరోమారు అలాంటి హెచ్చరికనే చేసింది. పెగాసస్ తరహా అత్యంత అధునాతనమైన స్పైవేర్ దాడులు కీలకమైన పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరగొచ్చని యాపిల్ ఏప్రిల్ పదో తేదీ ఒక ‘థ్రెట్’ నోటిఫికేషన్లో పేర్కొంది. ‘‘కొనుగోలుచేసిన అధునాతన స్పైవేర్తో సైబర్ దాడులు జరిగే అవకాశాలను ముందే పసిగట్టి యూజర్లకు సమాచారం ఇవ్వడం, వారిని అప్రమత్తం చేయడం కోసం థ్రెట్ నోటిఫికేషన్లను రూపొందించాం. సాధారణ సైబర్నేరాల కంటే ఈ దాడులు చాలా సంక్షిష్టమైనవి. అత్యంత తక్కువ మందినే లక్ష్యంగా చేసుకుంటారు కాబట్టి ఎవరిపై, ఎందుకు దాడి చేస్తారో చెప్పడం కష్టం. అయితే దాడి జరిగే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అంచనావేసి ముందే యూజర్లను అప్రమత్తం చేస్తాం’’ అని థ్రెట్ నోటిఫికేషన్లో యాపిల్ హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న భారత్సహా 60 దేశాల్లోని యూజర్లకు యాపిల్ ఈ నోటిఫికేషన్లు పంపించింది. ఇజ్రాయెల్ తయారీ పెగాసస్ స్పైవేర్ సాయంతో మొబైల్ ఫోన్కు వాట్సాప్ ద్వారా మిస్డ్కాల్ ఇచ్చి కూడా ఆ ఫోన్ను సైబర్నేరగాళ్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ‘‘ఎవరైనా యూజర్ను సైబర్నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటే ముందే గుర్తించి ఆ యూజర్ను హెచ్చరిస్తాం. ఐఫోన్ను సైబర్భూతం నుంచి కాపాడాలంటే దానిని లాక్డౌన్ మోడ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఫోన్లో ఫింగర్ఫ్రింట్ సెన్సార్, ఫేఫియల్ రికగ్నీషన్, వాయిస్ రిగ్నీషన్ ఏవీ పనిచేయవు. ఒకవేళ మనమే మళ్లీ వాడుకోవాలంటే పిన్ లేదా పాస్కోడ్ లేదా ప్యాట్రన్ సాయంతోనే మళ్లీ ఫోన్ను పనిచేసేలా చేయొచ్చు’’ అని యాపిల్ సూచించింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49 శాతం సంస్థలు తమ ఉద్యోగుల డివైజ్లపై సైబర్ దాడులు/ ఉల్లంఘన ఉదంతాలను పసిగట్ట లేకపోతు న్నాయి. భారత్లో లెక్కిస్తే మొబైల్ మాల్వే ర్ సాయంతో సగటు వారానికి 4.3 శాతం సంస్థలపై సైబర్ దాడులు జరుగుతు న్నాయి. అదే ఆసియాపసిఫిక్ ప్రాంతంలో అయితే గత ఆరు నెలల్లో సగటును 2.6 శాతం సంస్థలపై సైబర్ దాడులు చోటుచేసుకున్నాయి. -
యాపిల్ ఐఫోన్ల తయారీ.. టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ల తయారి కంపెనీ పెగట్రాన్తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ల తయారీ కోసం బెంగళూరులోని విస్ట్రాన్ ప్లాంట్ను కొనుగోలు చేసిన టాటా ఎలక్ట్రానిక్స్.. తాజా పెగట్రాన్తో సంప్రదింపులు జరగడం ఆసక్తికరంగా మారింది. అయితే టాటా ఎలక్ట్రానిక్ పెగట్రాన్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుందని, ఇందుకోసం ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత డీల్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా, దీనిపై పెగట్రాన్ గానీ, టాటా ఎలక్ట్రానిక్స్ గానీ స్పందించేందుకు నిరాకరించాయి. -
Apple Security Alert: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
యాపిల్ యూజర్లకు భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్టీ-ఇన్ కీలక సూచన చేసింది. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, మాక్బుక్స్,ఐపాడ్స్, విజన్ ప్రో హెడ్సెట్లు వినియోగిస్తున్న యూజర్లకు హై-రిస్క్లో ఉన్నారని హెచ్చరించింది. నేరస్తులు సైబర్ దాడులు చేసేందుకు వినియోగించే ఆర్బిటరీ కోడ్ యాపిల్ ఉత్పత్తుల్లో గుర్తించినట్లు సీఈఆర్టీ తెలిపింది. సైబర్ నేరస్తులు వినియోగించే ఈ ఆర్బిటరీ కోడ్ కారణంగా యాపిల్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్లకు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా యాపిల్ సఫారీ వెర్షన్ ప్రైయర్ టూ 17.4.1, యాపిల్ మాక్ఓఎస్ వెంచురా వెర్షన్ ప్రైవర్ టూ 13.6.6, యాపిల్ మాక్ ఓస్ సోనోమా వెర్షన్ ప్రైవర్ టూ 14.4.1, యాపిల్ ఓఎస్ వెర్షన్ ప్రైయర్ టూ 1.1.1, యాపిల్ ఐఓఎస్ అండ్ ఐపాడ్ ఓస్ వెర్షన్ ప్రైయర్ టూ17.4.1, యాపిల్ ఐఓఎస్ అండ్ ఐపాడ్ ఎస్ వెర్షన్ ప్రైయర్ టూ 16.7.7లపై ప్రతి కూల ప్రభావం ఎక్కువ ఉందని సూచించింది. టెక్ నిపుణుల అభిప్రాయం మేరకు ఐఫోన్ ఎక్స్ఎస్, ఐపాడ్ ప్రో 12.9 అంగుళాలు, ఐపాడ్ ప్రో 10.5 అంగుళాలు, ఐపాడ్ ప్రో 11 అంగుళాలు, ఐపాడ్ ఎయిర్, ఐపాడ్ మినీ వినియోగదారులు 17.4కి ముందు ఐఓఎస్, ఐపాడ్ఓస్ వెర్షన్లను వినియోగిస్తుంటే వాటిపై సైబర్ దాడుల ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం. అదనంగా, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐఫాడ్ 5, ఐపాడ్ ప్రో 9.7-అంగుళాల,12.9-అంగుళాల 1వ తరం ఐపాడ్ ప్రోలను వినియోగిస్తున్న యూజర్లు తమ పరికరాలను ఐఓఎస్, ఐపాడ్ఓస్ వెర్షన్లు 16.7.7 లేదా తర్వాతి వెర్షన్లకు అప్డేట్ చేయకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. -
యాపిల్ కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలా..?
ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ యాపిల్ కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి సిద్ధమైంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యాపిల్ వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(WWDC) తేదీలను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తీసుకురానున్న కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లు, ఉత్పత్తుల గురించి యూజర్లకు పరిచయం చేస్తుంటుంది. ఈ ఏడాది కాన్ఫరెన్స్ను వర్చువల్ వేదికగా జూన్ 10 నుంచి జూన్14 వరకు నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత టెక్ ప్రపంచంలో ఏఐ హవా అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో యాపిల్ తీసుకురానున్న సాఫ్ట్వేర్ అప్డేట్లలో ఏఐ ఫీచర్లను జోడించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్లౌడ్ ఆధారిత జనరేటివ్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చేందుకు గూగుల్, బైదూ.. వంటి ఏఐ సంస్థలతో భాగస్వామ్యం గురించి సమాచారం అందొచ్చని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఇక iOS 18, iPadOS 18, macOS 15, watchOS 11, tvOS 18లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ (OS) వివరాలను పరిచయం చేస్తారని తెలిసింది. ఐపాడ్ ఎయిర్, ఓఎల్ఈడీ ఐపాడ్ ప్రోలో కొత్త మోడల్స్ను లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా. యాపిల్ నిర్వహించనున్న కాన్ఫరెన్స్ ఆన్లైన్ అయినప్పటికీ మొదటి రోజు వ్యక్తిగతంగా వెళ్లి హాజరయ్యే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఆసక్తి ఉన్న వాళ్లు యాపిల్ డెవలపర్ యాప్, కంపెనీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం -
లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాల్ని సేకరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన ఐఫోన్ను పరిశీలించనుంది. ఇందుకోసం ఐఫోన్ లాక్ను ఓపెన్ చేయించుందుకు ఈడీ అధికారులు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కంపెనీని ఆశ్రయించనున్నారు. పలు నివేదికల ప్రకారం.. లిక్కర్ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత ల్యాప్ట్యాప్, డెస్క్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు మరో నాలుగు ఫోన్లను జప్తు చేశారు. ఆ సమయంలో ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నాయి. అయితే విచారణ సమయంలో ఆ ఫోన్ల పాస్వర్డ్లను చెప్పేందుకు కేజ్రీవాల్ ఒప్పుకోలేదు. దీంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఫోన్ లాక్లను ఓపెన్ చేయించేందుకు యాపిల్ సంస్థను సంప్రదించనున్నట్లు సమాచారం. విచారణకు సహకరించని కేజ్రీవాల్ గత గురువారం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టును కోరింది. తమ రిమాండ్లో ఉన్న కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. ‘కేజ్రీవాల్ నుండి రికవరీ చేసిన మొబైల్ ఫోన్ పాస్వర్డ్ను వెల్లడించలేదు. అతను సహకరించకపోతే, మేం ఆ ఫోన్లను (సాంకేతికంగా) తెరవాల్సి ఉంటుంది. మేం అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి, కేజ్రీవాల్ రిమాండ్ పొడిగించాలని కోర్టును కోరింది. దీంతో కోర్టు ఏప్రిల్ 1వరకు పొడిగించింది. రేపటితో కేజ్రీవాల్ ఈడీ రిమాండ్ ముగియనుంది. కేజ్రీవాల్ ఐఫోన్ చుట్టూ దర్యాప్తు ఈలోపే కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆధారాల్ని సేకరించేందుకు ఈడీ సిద్ధమైంది. కేజ్రీవాల్ ఐఫోన్ పాస్వర్డ్లను ఓపెన్ చేసి ఆధారాల్ని సేకరించేందుకు యాపిల్ సంస్థను ఆశ్రయించింది. ఫోన్లో ఆప్ ‘ఎన్నికల వ్యూహం’ ఎన్నికలకు ముందు పొత్తుల వివరాలను ఈడీ గోప్యంగా ఉంచనుంది. -
ఉద్యోగులను తొలగించనున్న ప్రపంచ నం1 కంపెనీ.. కారణం..
ప్రపంచ నంబర్1 కంపెనీ యాపిల్ తయారుచేస్తున్న ఐఫోన్లు, వాచ్లకు ఉన్న క్రేజ్ తెలిసిందే. అలాంటి విలువైన కంపెనీలో ఉద్యోగం అంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. కానీ, యాపిల్ తన ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోందని వార్తలొస్తున్నాయి. యాపిల్ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూసేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మీడియా కథనాల ప్రకారం.. యాపిల్ స్మార్ట్ వాచ్ డిస్ప్లే డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ప్రాజెక్టును మూసేయనుంది. దాంతో కంపెనీ ఆ ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగులకు లేఆఫ్లు ఇవ్వబోతుంది. కొంత కాలం క్రితమే మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్ల తయారీని కంపెనీ నిలిపేసింది. మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్లు, విజువల్స్ ఎంతో మెరుగ్గా ఉండటంతో అందరూ ‘యాపిల్ వాచ్’ కొనుగోలు చేస్తున్నారు. అయితే, డిస్ ప్లే తయారీ ఖర్చు ఎక్కువ కావడంతో యాపిల్ తన డిస్ ప్లే ఇంజినీరింగ్ టీంలో మార్పులు చేయనుందని సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా, ఆసియా ఖండాల్లోని ఆపిల్ యూనిట్లలో డజన్ల కొద్దీ ఉద్యోగులను తొలగించనుంది. అయితే సరిగ్గా ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారనే దానిపై కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. డిస్ప్లే డెవలప్మెంట్ ప్రాజెక్టును మూసేయడానికి ముందే ఉద్యోగులను ఇతర ప్రాజెక్టులు, కంపెనీల్లో తమకు వీలైన కొలువు వెతుక్కునేందుకు సంస్థ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. కానీ అందరికీ ఆ అవకాశం ఉండదు కాబట్టి మిగతా వారిని ఇంటికి సాగనంపేందుకు కంపెనీ సిద్ధమైనట్లు మీడియా కథనాల సారాంశం. ‘టైటన్’ను పక్కన పెట్టిన యాపిల్ యాపిల్ తన ప్రతిష్టాత్మకమైన కారు ప్రాజెక్టును ఎట్టకేలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని ఇటీవలే కథనాలు వెలువడ్డాయి. అటానమస్ డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన కారు విడుదల ప్రణాళికలను యాపిల్ పక్కన పెట్టింది. ఈ మేరకు గత దశాబ్దకాలంగా ‘టైటన్’ పేరిట పనిచేస్తున్న రహస్య ప్రాజెక్టుకు స్వస్తి పలికినట్లైంది. ఇదీ చదవండి: భారత్లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు గతేడాది భారీగా లేఆఫ్స్ లు ప్రకటించిన టెక్ కంపెనీలు..2024లో కూడా అదే పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 50 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. కంపెనీ పునర్వవస్థీకరణ, ఖర్చుల తగ్గింపు, అప్డేటెడ్ టెక్నాలజీ వినియోగం, కొత్త వ్యాపారంలోకి ప్రవేశించడం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్, హెల్త్ రంగంలోని కంపెనీలు ఉద్యోగులపై వేటువేస్తున్నాయి. -
మరీ ఇంత మోసమా? ఐఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తికి షాక్..
ఆన్లైన్లో కొనుగోలు చేసే వస్తువులు కొన్ని సందర్భాల్లో మారిపోతూ ఉంటాయి. ఒక వస్తువు బుక్ చేస్తే.. మరో వస్తువు డెలివరీ అయిన సందర్భాలు చాలానే వున్నాయి. ఇటీవల కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, గబ్బర్ సింగ్ అనే వ్యక్తి అమెజాన్లో ఒక ఐఫోన్ 15 ఆర్డర్ చేశారు. అయితే అతనికి డెలివరీ అయిన ఫోన్ను చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే అతనికి వచ్చిన ఫోన్ నకిలీది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. వావ్ అమెజాన్ ఇన్.. ఒక నకిలీ ఐఫోన్ 15ని డెలివరీ చేసింది. బాక్స్లో కేబుల్ కూడా లేదు. మొత్తం డబ్బా, ఇలాంటి సమస్యను ఎవరైనా ఎదుర్కొన్నారా? అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ రెస్పాండ్ అవుతున్నారు. ఈ సంఘటనపైన అమెజాన్ స్పందించి ఇలా జరిగినందుకు మమ్మల్ని క్షమించండి, ఆర్డర్ వివరాలను తెలియజేస్తే.. 6 నుంచి 12 గంటల్లో మీకు తప్పకుండా సహాయం చేస్తామని వెల్లడించింది. ఐఫోన్ కోసం వెచ్చించిన మొత్తాన్ని రీఫండ్ చేయమని బాధితుడు అమెజాన్ను కోరారు. ఇదీ చదవండి: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే? Waah @amazonIN delivered a Fake iPhone 15. Seller is Appario. Tagged with “Amazon choice” No cable in the box. Total Dabba. Has anyone faced similar issue? pic.twitter.com/QjUqR7dKSU — Gabbar (@GabbbarSingh) February 23, 2024 -
ఐఫోన్ పోగొట్టుకున్నారా? ..సుప్రీం కోర్టు కీలక తీర్పు!
దొంగతనాలకు గురైన ఐఫోన్లకు సంబంధించి భారత సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో కస్టమర్లు పోగొట్టుకున్న ఐఫోన్లను కనుగొనడంలో యాపిల్ ఇండియా బాధ్యతకు సంబంధించిన కీలక సమస్యను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. యాపిల్ సంస్థకు వ్యతిరేకంగా ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ తస్కరణకు గురైన ఐఫోన్లను ప్రత్యేక గుర్తింపు సంఖ్యలతో ట్రేస్ చేసే బాధ్యత యాపిల్ కంపెనీకి లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని లైవ్ లా అనే వార్తా సంస్థ నివేదించింది. వినియోగదారుల కమిషన్ ఆదేశాలపై యాపిల్ ఇండియా దాఖలు చేసిన అప్పీల్ను న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారించింది. థెఫ్ట్ ఇన్సూరెన్స్తో ఐఫోన్ను కొనుగోలు చేసిన వినియోగదారుడు తన ఫోన్ చోరీకి గురైనట్లు పోలీసులకు, యాపిల్ ఇండియాకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ప్రారంభమైంది. అయితే పోయిన ఐఫోన్ను ట్రాక్ చేయడానికి ఆపిల్ ఇండియా ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో వినియోగదారుడు ఫిర్యాదు దాఖలు చేయడంతో జిల్లా వినియోగదారుల ఫోరమ్ బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంపై యాపిల్ ఇండియా ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్కు అప్పీల్ చేసింది. దొంగతనానికి గురైన ఫోన్ను ప్రత్యేక గుర్తింపు సంఖ్యలతో ట్రేస్ చేయాల్సిన బాధ్యత ఐఫోన్ తయారీదారుగా యాపిల్ ఇండియాకు ఉందని ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్ తీర్పు పేర్కొంది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యాపిల్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఒడిశా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాన్ని అన్యాయమని పేర్కొంటూ దానిని తోసిపుచ్చింది. అయితే బాధితుడికి యాపిల్ ఇండియా పరిహారాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే దొంగతనానికి గురై ఫోన్లను కనుగొనవలసిందిగా ఆపిల్ ఇండియాను కోరడం అసమంజసమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
ఐఫోన్ నీళ్లలో పడిందా.. ఈ ఒక్కటి చేయండి - యాపిల్ సలహా
మనం రోజు ఉపయోగించే స్మార్ట్ఫోన్ నీటిలో పడినప్పుడు చాలామంది చేసేపని దాన్ని తీసి వెంటనే తుడిచి ఓ బియ్యం సంచిలోనో లేక డబ్బాలోనో ఉంచి, కొంత సమయం వేచి ఉన్న తరువాత దానికి మళ్ళీ ఛార్జింగ్ పెడతారు. అయితే ఈ విధానం 'ఐఫోన్'ల విషయంలో అమలు చేయకూడదని యాపిల్ కంపెనీ పేర్కొంది. ఐఫోన్ నీళ్లలో పడితే దాన్ని బియ్యం సంచిలో ఉంచకూడదని, అలా చేస్తే బియ్యంలో ఉండే సూక్ష్మ రేణువులు ఫోన్లోకి చేసే అవకాశం ఉంది, తద్వారా ఫోన్ పాడయ్యే అవకాశం ఉంటుందని యాపిల్ కంపెనీ పేర్కొంది. నీళ్లలో ఐఫోన్ పడితే దాన్ని దానిలోకి చేరిన నీటిని మెల్లగా బయటకు తీయడానికి కిందివైపు ఉన్న డివైజును నెమ్మదిగా/సున్నితంగా కొట్టాలి. ఆ తరువాత గాలి వీచే ప్రదేశంలో ఉంచాలి. ఓ అరగంట తరువాత కేబుల్తో ఛార్జ్ చేయాలి. ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల కోసం బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవే! ధరలు ఎలా ఉన్నాయంటే? నిజానికి ఫోన్లోకి చేరిన నీరు బయటకు రావడానికి ఒక రోజు సమయం కూడా పట్టొచ్చు. దీనిని లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ సాయంతో ఫోన్ పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఇంకా ఏదైనా అనుమానం ఉంటే దాన్ని యాపిల్ అధీకృత సర్వీస్ ప్రొవైడర్ వద్దకు తీసుకెళ్లాలని సంస్థ సూచించింది. -
లాంచ్కు ముందే ఐఫోన్ 16 వివరాలు లీక్!
యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ త్వరలో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ముందే.. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఇప్పటి వరకు లీక్ అయిన వివరాల ప్రకారం, ఐఫోన్ 16 సిరీస్ మొత్తం 5 వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. వీటి ధరలు రూ.58 వేలు నుంచి రూ.91 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇవి ఖచ్చితమైన ధరలు కాదు, కంపెనీ ఈ ఐఫోన్ 16 లాంచ్ చేసే సమయంలో అధికారిక ధరలను వెల్లడిస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ ఇప్పటి వరకు ఉన్న ఇతర మోడల్స్ కంటే కూడా ఎక్కువ అప్డేట్స్ పొందుతుందని, కొత్త వేరియంట్స్ కూడా అందుబాటులో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటిలో 6.1 ఇంచెస్, 6.7 ఇంచెస్ డిస్ప్లేలు ఉంటాయని సమాచారం. కొత్త ఐఫోన్ 16లో సింగిల్ పిల్ షేప్లో కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఎంతవరకు వాస్తవమని విషయం తెలియాల్సి ఉంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే అద్భుతంగా ఉంటుందని భావించవచ్చు. అయితే ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కంపెనీ ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది. -
‘నా జీవితాన్ని నాశనం చేయొద్దు నాన్న’!
ఐఫోన్! పరిచయం అక్కర్లేని పేరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు యాపిల్ తయారు చేసిన ఐఫోన్లను అంటే మక్కువ. కానీ సెలబ్రిటీలు ఐఫోన్ను కొనుగోలు చేస్తున్నా దాని ధర కారణంగా సామాన్యులకు అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది. ఇప్పుడు అలాంటి కాస్ట్లీ ఐఫోన్ని కావాలని ఓ 11 ఏళ్ల అమ్మాయి మారం చేస్తోంది. అందుకు ఆ చిన్నారి తండ్రి ఏం చేశాడు. గత దశాబ్దకాలంగా లేటెస్ట్గా మార్కెట్లో విడుదలవుతున్న గాడ్జెట్లు ఎంత ఖరీదైనవి అయినప్పటికీ పిల్లలు సైతం వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిల్లో యాపిల్ తయారు చేసిన ఐఫోన్తో పాటు ఇతర ఉత్పత్తులు ప్రత్యేకం. నాకు ఐఫోన్ 15 కావాలి తాజాగా, ఓ తండ్రిని తన 11 ఏళ్ల కుమార్తె ఐఫోన్ 15 కొనిపెట్టమని అడిగింది. అందుకు అతను సున్నితంగా తిరస్కరించాడు. అంత ధర పెట్టి ఫోన్ కొనుగోలు చేయకూడదని సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. సరే కుమార్తె అడిగింది కదా.. పోనీలే అని కెమెరా పనితనం, బ్యాటరీ లైఫ్టైం బాగుందనే ఉద్దేశ్యంతో ఐఫోన్ 13 ఫోన్ని కొనుగోలు చేస్తానని మాటిచ్చాడు. ఐఫోన్ 13 కొనిస్తా నాన్న అందుకు కుమార్తె ససేమిరా అన్నది. ‘నాకు 11 ఏళ్ల కుమార్తె ఉంది. రెండేళ్ల క్రితం ఆమెకు నా పాత ఐఫోన్ 8ని ఇచ్చాను. ఆ ఫోన్తో తన స్నేహితులతో మాట్లాడుకునేందుకు, సోషల్ మీడియాను వాడుతుంది. ఇటీవల ఆమె స్నేహితులు కొత్త ఫోన్లను కొనుగోలు చేశారు. తనకి కూడా కొత్త ఫోన్ కావాలని మారం చేస్తోంది. నా ఫోన్ పాతది. నా స్నేహితులు కొత్త ఫోన్లు కొనుక్కున్నారు. నా క్కూడా కొత్త ఫోన్ కొనిపెట్టమని అడుగుతుంది. సరే నా కూతురు ఫోన్ అడిగిందని ఐఫోన్ 13ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డా. ఇతర లేటెస్ట్ ఐఫోన్ సిరీస్లు ఎలా ఉన్నాయో.. ఆ ఫోన్ కూడా అలాగే ఉంది. ధర కూడా 600 డాలర్లు. అయితే, ఆఫోన్ 120హెచ్జెడ్ డిస్ప్లే ఉందని, గేమ్స్ ఆడుకునేందుకు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ని కోరుకుంటుంది. ఆ ఫోన్ కూడా అంతే 120 హెచ్జెడ్ డిస్ప్లేగా ఉందిగా. ఐఫోన్ 15 కొనడం డబ్బు వృధా అని భావించాను. కానీ నా నిర్ణయాన్ని నా 11 ఏళ్ల కుమార్తె విభేదించింది. మీరే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారని అంటోంది. గడుగ్గాయ్.. చివరికి అనుకున్నది సాధించింది ‘నా కుమార్తె గేమర్. పాతది అయినందున తన ఫోన్ సరిగ్గా గేమ్ చేయడం లేదని ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. ఆమె ఐఫోన్ 13ని కొనిస్తానని నేను ఇప్పటికే చెప్పాను. కానీ ఆమె ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కావాలని మొండిగా ప్రవర్తిస్తుంది. ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ సోషల్ మీడియాలో వాపోయాడు తండ్రి. చివరికి తన కుమార్తెకు ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రోని కొనిచ్చి సంతోష పెట్టిందని అన్నాడు. ఈ పోస్ట్పై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయస్సు అంత ఖరీదైన ఫోన్ కొనొద్దని, పిల్లలకు అతిగారాభం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. -
ఇదేం ‘సేల్’ బాబోయ్.. అంతా మోసం! ఐఫోన్15 ఆర్డర్ చేస్తే..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కస్టమర్లను బెంబేలెత్తిస్తోంది. ప్రత్యేక సేల్ పేరుతో భారీ తగ్గింపులు ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో అత్యధికంగా ఉత్పత్తులు అమ్ముడుపోతున్నాయి. అయితే తమకు లోపాలతోకూడిన ఉత్పత్తులు డెలివరీ అవుతున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఓ వ్యక్తి ఐఫోన్ 15 ఆర్డర్ చేయగా అది నకిలీ బ్యాటరీతో వచ్చింది. ఈ మేరకు తనకు వచ్చిన లోపభూయిష్టమైన ఐఫోన్ 15కు సంబంధించిన ఫోటోలు, వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేశాడు. నలికీ బ్యాటరీతో వచ్చిన ఈ ఐఫోన్ 15ను రీప్లేస్ చేయడానికి ఫ్లిప్కార్ట్ నిరాకరించిందని వాపోయాడు. “నేను జనవరి 13న ఫ్లిప్కార్ట్ నుంచి iPhone 15ని ఆర్డర్ చేశాను. జనవరి 15న డెలివరీ వచ్చింది. కానీ Flipkart మోసం చేసింది. లోపభూయిష్టమైన ఐఫోన్ 15ని పంపించింది. బాక్స్ ప్యాకేజింగ్ కూడా నకిలీదే. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేయడం లేదు” అని అజయ్ రాజావత్ అనే యూజర్ ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. దీనిపై యూజర్లు మిశ్రమంగా స్పందించారు. I ordered iPhone 15 from Flipkart on 13th Jan and I got it on 15th Jan but Flipkart has done fraud they have delivered defective iPhone15 and box packaging was also fake. Now they are not replacing OrderID-OD330202240897143100@flipkartsupport @jagograhakjago @stufflistings pic.twitter.com/dfLEh3FSnk — Ajay Rajawat (@1234ajaysmart) January 18, 2024 -
ఐఫోన్ల కోసం ఓ కీబోర్డ్.. అదెలా పనిచేస్తుందంటే?
స్మార్ట్ఫోన్లోని టచ్స్క్రీన్ కీబోర్డు మీద టైప్చేయడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. స్మార్ట్ఫోన్లకు భౌతికంగా కీబోర్డు లేకపోవడం లోపమే! ఈ లోపాన్ని భర్తీ చేయడానికే స్మార్ట్ఫోన్కు పనికొచ్చే భౌతికమైన కీబోర్డును అమెరికన్ కంపెనీ క్లిక్స్ టెక్నాలజీ రూపొందించింది. తొలిప్రయత్నంగా ఐఫోన్–15 మోడల్కు ఉపయోగపడే కీబోర్డును ‘క్లిక్స్’ పేరుతో నమూనాగా రూపొందించింది. సాధారణ టైప్రైటర్, డెస్క్టాప్, లాప్టాప్ కంప్యూటర్ల కీబోర్డు తరహాలోనే ఉన్న ఈ కీబోర్డు ద్వారా స్మార్ట్ఫోన్లో సులువుగా టైప్ చేయడానికి వీలవుతుంది. ఈ ఏడాది లాస్ వేగస్లో జరగనున్న సీఈఎస్–2024 షోలో ఈ కీబోర్డును క్లిక్స్ టెక్నాలజీ సంస్థ ప్రదర్శించనుంది. -
ఐఫోన్ 16 సిరీస్ డిజైన్లు.. తెరపైకి మరో రూమర్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రతి ఏడాది ఐఫోన్ సిరీస్ ఫోన్లను విడుదల చేస్తుంది. ఇప్పటికే గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ను విడుదల చేసిన యాపిల్ ఈ ఏడాది ఐఫోన్ 16 సిరీస్ను మార్కెట్కు పరిచయం చేయనుంది. అయితే, ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్ డిజైన్పై రూమర్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఐఫోన్ 16తో తీసుకునే ఫోటోలు, వీడియోల కోసం యాపిల్ సంస్థ కొత్త బటన్పై పనిచేస్తుందని, ప్రోటోటైప్లపై దాని వినియోగం ఎలా ఉందో పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ బటన్ను ఐఫోన్లపై అమర్చితే సింగిల్ క్లిక్తో ఫోటోలు, వీడియోలు తీసుకునే వెసులు బాటు కలగనుంది. నివేదిక ప్రకారం.. కెమెరా బటన్ ఫోన్కు కుడి దిగువన ఉండవచ్చని, అంటే ల్యాండ్స్కేప్ మోడ్లో ఫోటోలు ,వీడియోలను తీసేటప్పుడు అది నేరుగా చూపుడు వేలు కింద ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా, గత సంవత్సరం సెప్టెంబర్లో లాంచ్ చేసిన యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ను పాత ఫోన్ సిరీస్ల కంటే భిన్నంగా మ్యూట్ బటన్ను భర్తీ చేస్తూ కొత్త యాక్షన్ బటన్తో వచ్చింది. మాక్ రూమర్స్ ప్రకారం.. ఐఫోన్ 16 సిరీస్లో ప్రాజెక్ట్ నోవా పేరుతో కొత్త కెమెరా బటన్ మెకానికల్కు బదులుగా కెపాసిటివ్ బటన్గా ఉంటుందని అంచనా వేయబడింది. ఐఫోన్ ఎస్ఈ లోని హోమ్ బటన్ను పోలి ఉండేలా కొత్త బటన్ ఉండవచ్చని తెలుస్తోంది. -
‘సంపాదన తగ్గింది’.. సీఈఓ టిమ్కుక్కు యాపిల్ భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు వచ్చే ఆదాయం తగ్గడంతో ఆ సంస్థ సీఈఓ టిమ్కుక్ సంపాదించే సంపాదన తగ్గించింది. 2022తో పోలిస్తే 2023లో ఆయన సంపాదన భారీగా తగ్గినట్లు యాపిల్ సంస్థ విడుదల చేసిన ఓ నివేదికలో తేలింది. ఆ నివేదిక ప్రకారం.. టిమ్కుక్ గత ఏడాది భారీ మొత్తంలో సంపాదించారని, కానీ అది 2022లో కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. 2022లో ఆయన సంపాదించిన మొత్తం 99.4 మిలియన్లు కాగా 2023లో 63.2 మిలియన్లగా ఉందని నివేదికలో పేర్కొంది. రిపోర్ట్లో ఏముందంటే? ఇటీవల యాపిల్ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. అందులో టిమ్ కుక్కు అందించే పరిహారం, షేర్ హోల్డర్స్ సలహాలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో మార్పులు వంటి అంశాలను ప్రధానంగా చర్చించింది. అందులో యాపిల్ సీఈఓ సంపాదన తగ్గినట్లు హైలెట్ చేసింది. టిమ్కుక్ విమాన ఖర్చులు యాపిల్ 2022లో సీఈఓ కుక్కి అందించే శాలరీ, స్టాక్ అవార్డ్స్, నాన్ ఈక్విటీ బోనస్ (పరిహారం) 84 మిలియన్లగా నిర్దేశించింది. అయితే అతను అంచనాలను మించి 99.4 మిలియన్లను సంపాదించాడు. కానీ 2023కి కుక్ పరిహారం 40 శాతం తగ్గి 49 మిలియన్లకు పడిపోయింది. కుక్ అందించే పరిహారంలో 3 మిలియన్ల జీతం, స్టాక్ అవార్డులు మొత్తం 46,970,283 డాలర్లు, నాన్-ఈక్విటీ ఇన్సెంటివ్ ప్లాన్ పరిహారం మొత్తం 10,713,450 డాలర్లు, ఇతర పరిహారం 2,526,112 డాలర్ల వరకు పొందారు. 2023లో కుక్ కోసం యాపిల్ వ్యక్తిగత విమాన ప్రయాణ కోసం 1,621,468 డాలర్లు ఖర్చు చేసిందని, 2022లో వెచ్చించిన మొత్తం కంటే రెండింతలు ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. కంపెనీ కుక్ కోసం వ్యక్తిగత భద్రత కోసం 820,309 డాలర్లు పెట్టుబడి పెట్టింది యాపిల్ సగటు ఉద్యోగి వేతనం ఎంతంటే? 2023లో తన సగటు ఉద్యోగికి సగటు వార్షిక మొత్తం పరిహారం 94,118 డాలర్లు అని యాపిల్ తెలిపింది. ఇక టిమ్కుక్తో పాటు మిగిలిన ఎగ్జిక్యూటీవ్లకు యాపిల్ భారీ మొత్తాన్ని అందించింది. వారిలో సీఎఫ్ఓ లూకా మాస్త్రి : 26,935,883 డాలర్లు జనరల్ కౌన్సెల్ అండ్ సెక్రటరీ కేట్ ఆడమ్స్ : 26,941,705 డాలర్లు రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఓబ్రెయిన్ : 26,937,010 డాలర్లు సీఓఓ జెఫ్ విలియమ్స్ : 26,961,221 డాలర్లను అందిచినట్లు యాపిల్ తన నివేదికలో వెల్లడించింది. -
ఐఫోన్ యూజర్లకు శుభవార్త.. నష్టపరిహారం చెల్లిస్తున్న యాపిల్!
మీరు పాత ఐఫోన్లను వినియోగిస్తున్నారా? వాటిల్లో ఏమైనా బ్యాటరీ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయా? ఈ తరహా ఇబ్బందులు తలెత్తుంటే ప్రముఖ టెక్ దిగ్గజం, ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ నష్టపరిహారం చెల్లిస్తుంది. సుమారు 8 ఏళ్ల క్రితం నమోదైన యాపిల్పై ‘బ్యాటరీగేట్’ క్లాస్-యాక్షన్ లాసూట్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఐఫోన్లను వినియోగిస్తుంటే యాపిల్ నుంచి నష్టపరిహారం పొందవచ్చు. అసలేంటి యాపిల్ ‘బ్యాటరీగేట్’ వివాదం 2016లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, 7 సిరీస్తో పాటు ఎస్ఈ మోడల్ ఫోన్లపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఐఫోన్ సిరీస్ మోడళ్లు స్లో అవ్వడంతో వాటిని ఆపరేట్ చేయలేపోతున్నామంటూ అమెరికాకు చెందిన సుమారు 33 రాష్ట్రాల యూజర్లు మూకుమ్మడిగా సంబంధిత రాష్ట్రాల కోర్టులను ఆశ్రయించారు. యాపిల్ సంస్థ ధనార్జన కోసం కావాలనే తమ ఫోన్లలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిందని, తద్వారా మేం వినియోగించే ఫోన్లు పనిచేయడం మందగిస్తే.. కొత్త ఫోన్లు కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా కొనుగోలు చేస్తే ఐఫోన్ల అమ్మకాలు జరిగి.. యాపిల్ సంస్థకు లబ్ధి చేకూరుతుందని ఆరోపించారు. యాపిల్ అనాలోచిత నిర్ణయం వల్లే వినియోగదారుల హక్కుల కోసం పోరాడే జస్టిన్ గుట్మాన్ సైతం యాపిల్కు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్లతో పాటు పవర్ మేనేజ్మెంట్ టూల్ వల్ల ఐఫోన్లు అకస్మాత్తుగా షట్డౌన్ అవ్వడం, బ్యాటరీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. యాపిల్ నిర్ణయంతో ఐఫోన్ 6, 6ప్లస్, 6 ఎస్, 6ఎస్ ప్లస్, ఎస్ఈ,7, 7 ప్లస్, 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ను వినియోగిస్తున్న యూకేలో 25 మిలియన్ల ఐఫోన్ యూజర్లకు నష్టం వాటిల్లిందని, ఆ మొత్తం విలువ 768 మిలియన్లని కోర్టుకు ఆధారాల్ని అందించారు. తెరపైకి బ్యాటరీగేట్ వివాదం ఈ వివాదాన్ని మరింత ఉదృతం చేసేలా.. యాపిల్ కంపెనీ ఐఫోన్లను ఉద్దేశపూర్వకంగా ప్రాసెసర్ పనితీరు మందగించేలా వ్యవహరించిందని తెలిపేలా ‘బ్యాటరీగేట్’ అనేపదాన్ని అనే పదాన్ని రూపొందించారు. ‘బ్యాటరీగేట్’ పేరును ట్రెండింగ్లోకి తెచ్చారు. బాధిత యూజర్లకు 92 డాలర్ల నష్టపరిహారం ఈ వివాదం చిలిచిలికి గాలివానలా మారింది. వినియోగదారుల ఫిర్యాదు దెబ్బకు యాపిల్ దిగొచ్చింది. 2020లో బాధిత యూజర్లకు 500 మిలియన్ల నష్టపరిహారం చెల్లిస్తామని అంగీకరించింది. ఒప్పందం ప్రకారం.. యాపిల్ ఇటీవల ప్రతి ఒక్క బాధిత యూజర్కు 92 డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
ఐఫోన్ 16 ఫోన్లు ఇలాగే ఉంటాయా?
కొత్త ఏడాదిలో యాపిల్ నుంచి రానున్న హై-ఎండ్ వేరియంట్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఐఫోన్ 16 (iPhone 16), ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ లుక్, స్పెసిఫికేషన్లు ఇలాగే ఉంటాయంటూ వాటి ప్రోటోటైప్ లీక్ అయింది. యాపిల్ అంతర్గత డిజైన్ల ఆధారంగా మ్యాక్రూమర్స్ (MacRumors) అనే వెబ్సైట్ ఐఫోన్ 16, ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లు ఇలాగే ఉంటాయంటూ మాక్అప్లను రూపొందించింది. వీటి ప్రకారం.. యాపిల్ తదుపరి తరం వేరియంట్లు పెద్ద డిస్ప్లే, కెపాసిటివ్ క్యాప్చర్ బటన్ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఐఫోన్ 16 వేరియంట్ డిస్ప్లే 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్ప్లే 6.9 అంగుళాలు ఉంటాయి. అంటే ఇది ఐఫోన్ 15 ప్రో లైనప్లో ఉన్న 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల కంటే ఎక్కువ. ప్రో మోడల్లలో వస్తుందని భావిస్తున్న కొత్త టెలిఫోటో కెమెరా మాడ్యూల్ దీనికి కారణం కావచ్చు. గత సంవత్సరం వచ్చిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లో మాత్రమే టెలిఫోటో లెన్స్ ఉంది. కానీ రానున్న రెండు ప్రో మోడల్లలో టెలిఫోటో లెన్స్లను చూడొచ్చని భావిస్తున్నారు. డిజైన్ విషయంలో గతంలో వచ్చిన వేరియంట్ల కంటే పెద్దగా మార్పులు లేనప్పటికీ రానున్న కొత్త మోడల్స్లో కనీసం నాలుగు బటన్ కాన్ఫిగరేషన్లతో ప్రయోగాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే బటన్ ప్లేస్మెంట్ ఉంటుంది కానీ యాడెడ్ బటన్తో ఉంటుంది. కొత్త క్యాప్చర్ బటన్ ఫోర్స్-సెన్సార్ ఫంక్షనాలిటీతో కెపాసిటివ్గా ఉంటుందని భావిస్తున్నారు. బ్లూమ్బెర్గ్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఈ బటన్ వీడియో రికార్డింగ్ కోసమే ప్రత్యేకంగా ఉపయోగించేలా ఉంటుందని సమాచారం. -
బంపర్ డిస్కౌంట్.. ఐఫోన్ 15పై రూ.10,000 తగ్గింపు!
స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతిఒక్కరి దగ్గరా స్మార్ట్ఫోన్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీటిపై డిస్కౌంట్లు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఫోన్ 15పై భారీ తగ్గింపు సమాచారం ఇక్కడ ఇస్తున్నాం. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ తమ ఇయర్ ఎండ్ యాపిల్ సేల్ను తాజాగా ప్రకటించింది. ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్తో సహా కొన్ని లేటెస్ట్ యాపిల్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఇందులోనూ ఐఫోన్ 15 సిరీస్పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 15ప్రో 1టీబీ వేరియంట్ను డిస్కౌంట్పై రూ. 159,990కి కొనుగోలు చేయవచ్చు. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ 256జీబీ వేరియంట్ను బ్యాంక్ ఆఫర్లు లేకుండానే కేవలం రూ. 148,710లకే లిస్ట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగిస్తే రూ. 5,000 వరకు అదనపు తక్షణ తగ్గింపును పొందవచ్చు. విజయ్ సేల్స్ స్టోర్లలో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఐఫోన్ 14 మోడల్లు కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి. కేవలం ఐఫోన్లే కాకుండా మ్యాక్బుక్స్, ఐప్యాడ్లు, యాపిల్ వాచీలు, ఇతర ఉపకరణాలపై కూడా రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. బేస్ మ్యాక్బుక్ ఎయిర్ ఎం2 (MacBook Air M2)ని డిస్కౌంట్తో రూ. 96,960కే కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ (iPad Air 5th Gen) ఆఫర్ల తర్వాత రూ. 50,680కి అందుబాటులో ఉంది. యాపిల్ సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రోని డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 18,990 లకే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుందని విజయ్ సేల్స్ తెలిపింది. -
ఐఫోన్ కొనటానికి ఇది మంచి సమయం - ఎందుకంటే?
2023 ముగుస్తోంది.. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలామంది కొత్త బైకులు, కార్లు లేదా మొబైల్ ఫోన్స్ వంటివి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఈ కథనంలో ఐఫోన్ 15 (iPhone 15)పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. వండర్లస్ట్ ఈవెంట్లో లాంచ్ అయిన ఐఫోన్ 15 ధర రూ. 79990. ఈ లేటెస్ట్ ఫోన్ను అమెజాన్లో కొనుగోలు చేసినట్లయితే రూ. 74990కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఐఫోన్ 15 కొనుగోలుదారులు రూ.5000 డిస్కౌంట్ పొందవచ్చు. రూ.5000 డిస్కౌంట్ మాత్రమే కాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులు 5 శాతం (రూ. 3745) క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతో రూ.79990 మొబైల్.. అన్ని డిస్కౌంట్స్ తరువాత రూ.71245కే కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద ఐఫోన్ 15 కొనుగోలుపై ఇప్పుడు 8745 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ఇదీ చదవండి: సచిన్కు రూ.27 కోట్ల లాభం.. ఎలా అంటే? ఐఫోన్ 15 ఫీచర్స్ ఐఫోన్ 15 అనేది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కొత్త డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీతో వస్తుంది. 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ అద్భుతమైన కెమెరా సెటప్ పొందుతుంది. దీంతో వినియోగదారులు 0.5x, 1x, 2x జూమ్ స్థాయిలలో కూడా ఫోటోలను తీసుకోవచ్చు. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ మొబైల్ 128, 256, 512 జీబీ మెమొరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పుడు USB-C ఛార్జర్కు సపోర్ట్ చేస్తుంది. మొత్తం మీద ఐఫోన్ 15 అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది. మంచి డిస్కౌంట్తో ఐఫోన్ కొనాలనే వారికి ఇది గొప్ప అవకాశం అని తెలుస్తోంది. -
టెక్ దిగ్గజం యాపిల్ను గడగడలాడిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్!?
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ను గడగడలాడిస్తున్నాడా? తమ దేశం కాదని ఇతర దేశాల్లో యాపిల్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జిన్ పింగ్ నిర్ణయాలను చూస్తుంటే. ఇటీవల జిన్ పింగ్ ప్రభుత్వం దేశంలో మేడిన్ ఇన్ చైనా ఉత్పత్తులను ప్రోత్సహించాలని, ఐఫోన్లాంటి ఇతర దేశాలకు చెందిన ఉత్పత్తులను దేశంలో వినియోగించడాన్ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. డ్రాగన్ కంట్రీ స్థానికంగా తయారవుతున్న విదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సంస్థలైన బ్యాంక్లు ఇతర రంగాల ప్రభుత్వ సంస్థలకు అవసరమయ్యే సాఫ్ట్వేర్లను దేశీయ సంస్థల నుంచి పొందాలని, అదే సమయంలో సెమీ కండక్టర్ పరిశ్రమ వృద్దిలో పాలు పంచుకోవాలని కోరింది. ఈ తరుణంలో కనీసం ఎనిమిది ప్రావిన్సుల్లోని పలు రాష్ట్ర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఉద్యోగులు స్థానికంగా తయారైన స్మార్ట్ఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తులను ఉపయోగించాలని సూచించినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది. అంతవరకూ బాగున్నా..ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ఉన్న జెజియాంగ్, షాన్డాంగ్, లియోనింగ్, సెంట్రల్ హెబీ వంటి ప్రావిన్సులకు చెందిన నగరాల్లోని సంస్థలు, ఏజెన్సీలకు ఈ ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. మేడిన్ ఇన్ చైనా నినాదం దేశ వ్యాప్తంగా అమలు చేయాలి గానీ.. కేవలం ఐఫోన్ తయారీ ప్రాంతాల్లో మాత్రమే అమలు చేయడం ఏంటని ఐఫోన్ లవర్స్ చర్చించుకుంటున్నారు. కాగా, సెప్టెంబర్ నెలలో కనీసం మూడు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లోని సిబ్బందికి కార్యాలయాల్లో ఐఫోన్లను ఉపయోగించవద్దని చైనా ప్రభుత్వం చెప్పినట్లు రాయిటర్స్ నివేదించింది. చివరిగా ఐఫోన్ల బ్యాన్ అంశంపై యాపిల్ కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. -
మొన్న శాంసంగ్.. తాజాగా యాపిల్ ప్రొడక్ట్లపై కేంద్రం హైరిస్క్ అలర్ట్..
కేంద్రప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్-ఇన్) ఇటీవల శాంసంగ్ కంపెనీ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సైబర్ నేరస్థులు శాంసంగ్ ఫోన్లు వాడుతున్న లక్షల మంది వినియోగదారుల నుంచి తమ వ్యక్తిగత డేటాను దొంగలించే ప్రమాదం ఉందని సెర్ట్ పేర్కొంది. తాజాగా యాపిల్ ఉత్పత్తులకు కూడా ఇదే తరహాలో ప్రమాదం ఉందని కేంద్రం తెలిపింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. దీని వల్ల యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఐఫోన్, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, ఐపాడ్, యాపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్లతో పాటు సఫారీ బ్రౌజర్లో ఈ భద్రతా పరమైన లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ తన అడ్వైజరీలో వివరించింది. ‘యాపిల్ ఉత్పత్తుల్లో పలు సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి. దీని వల్ల హ్యాకర్లు యాపిల్ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉంది’ అని సెర్ట్ తెలిపింది. ఈ లోపాలను హ్యాకర్లు గుర్తిస్తే సెక్యూరిటీ పరిమితులను అధిగమించగలరని, ఏకపక్షంగా కోడ్ను ఎగ్జిక్యూట్ చేసి కీలక సమాచారాన్ని పొందే ప్రమాదం ఉందని తెలిపింది. ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వెర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వెర్షన్లు, మ్యాక్ ఓఎస్ సొనోమా 14.2, వెంట్యురా 13.6.3, మానిటరీ 12.7.2, యాపిల్ టీవీ ఓఎస్ 17.2, యాపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్-ఇన్ వెల్లడించింది. కాగా.. యాపిల్ ఉత్పత్తులకు కేంద్రం గతంలోనూ పలుమార్లు ఇలాంటి అలర్ట్లు జారీ చేసింది. ఇదీ సంగతి: స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్! ఇటీవలే శాంసంగ్ స్మార్ట్ఫోన్ యూజర్లకు కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వినియోగదారులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యూజర్లు లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ వివరించింది. -
యాపిల్కి గట్టి దెబ్బ.. తప్పుకొంటున్న చీఫ్ డిజైనర్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండే ప్రీమియం ఫోన్లు, వాచీల తయారీ సంస్థ యాపిల్కి గట్టి దెబ్బ తగిలింది. ఐఫోన్లు, యాపిల్ వాచీల డిజైన్ను పర్యవేక్షిస్తున్న యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ టాంగ్ టాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వైదొలుగుతున్నారు. కీలకమైన టాన్ నిష్క్రమణతో కంపెనీ డిజైన్ బృందానికి గట్టి దెబ్బ తగిలిందని యాపిల్ వర్గాలు బ్లూమ్బెర్గ్కి వెల్లడించాయి. యాపిల్కు చెందిన అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులకు సంబంధించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేది ఈయనే. యాపిల్ వాచ్, ఎయిర్పాడ్స్ వంటి ఇతర ఉత్పత్తుల రూపకల్పనలో టాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. యాపిల్ ఉత్పత్తుల ఫీచర్లు, వాటి రూపం, అమరిక.. అన్నీ టాన్ బృందం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ముఖ్యంగా ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచీలను కంపెనీకి లాభదాయక ఉత్పత్తులుగా మార్చడంలో టాన్ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు టాన్ నిష్క్రమణతో కంపెనీ ముఖ్యమైన ఉత్పత్తి శ్రేణులలో మార్పులు అనివార్యం కానున్నాయి. ఈయన నేరుగా హార్డ్వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జాన్ టెర్నస్ కింద పనిచేశారు. మరిన్ని నాయకత్వ మార్పులు కంపెనీకి చెందిన ఇతర మ్యాక్ ప్రొడక్ట్ డిజైన్, ఐఫోన్ హార్డ్వేర్ ఎగ్జిక్యూటివ్లు ఇటీవల పదోన్నతి పొందిన నేపథ్యంలో రాబోయే సంవత్సరంలో యాపిల్ మరిన్ని నాయకత్వ మార్పులకు సిద్ధమవుతుందని నివేదిక సూచిస్తోంది. కాగా టాన్ నిష్క్రమణ కంపెనీలో కీలక కార్యనిర్వాహక నిష్క్రమణల్లో రెండోది. ఐఫోన్ మల్టీటచ్ స్క్రీన్, టచ్ ఐడీ, ఫేస్ ఐడి వంటి కీలక సాంకేతికతలపై పనిచేసిన స్టీవ్ హోటల్లింగ్ యాపిల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈ వారం ప్రారంభంలో వార్తలు వచ్చాయి. -
‘చైనాకి యాపిల్ మరో భారీ షాక్!’
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఐఫోన్ల తయారీ కోసం డ్రాగన్ కంట్రీపై ఆధారపడడం ఏమాత్రం ఇష్టం లేని యాపిల్ భారత్లో మరో ఐఫోన్ తయారీ కేంద్రాన్ని నిర్మించనుంది. ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను టాటా గ్రూప్ నెలకొల్పనుంది. ఈ ఏడాది అక్టోబర్లో కర్ణాటక కేంద్రంగా భారత్లో ఐఫోన్లను తయారు చేసే విస్ట్రాన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను టాటా గ్రూప్ 125 మిలియన్ భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసింది. అయితే, బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం.. తమిళనాడు హోసుర్ కేంద్రంగా టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా రెండో ఐఫోన్ తయారీ యూనిట్ను ప్రారంభించే యోచనలో ఉన్నారని తెలిపింది. ఈ ఫ్యాక్టరీలో టాటా గ్రూప్ కనీసం 20 లైన్లో ఐఫోన్లను తయారు చేసేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకుందని, తద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశం కలుగుందని బ్లూంబెర్గ్ నివేదికలో పేర్కొంది. ఇక ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ 12 నెలల నుంచి 18 నెలల లోపల అందుబాటులోకి రానుందని అంచనా. చైనాకు భారీ షాక్ టెక్ దిగ్గజం యాపిల్ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఫలితంగా చైనా కాకుండా మిగిలిన దేశాలైన భారత్, థాయిలాండ్, మలేషియాలలో ఐఫోన్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు స్థానిక కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా భారత్కు చెందిన టాటా కంపెనీ ఐఫోన్లు తయారు చేసుకునేలా ఒప్పందం కుదర్చుకుంది. ఇప్పటికే భారత్లోని కర్ణాటక కేంద్రంగా ఐఫోన్లను మ్యానిఫ్యాక్చరింగ్ చేస్తున్న విస్ట్రాన్ కార్పొరేషన్ను టాటా కొనుగోలు చేసేలా పావులు కదిపింది. ఈ తరుణంలో విస్ట్రాన్ కాకుండా.. టాటానే సొంతంగా ఐఫోన్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించేలా యాపిల్.. టాటా గ్రూప్ను ప్రొత్సహించింది. ఆ చర్చలు చివరి దశకు రావడం.. దేశీయంగా టాటా మరో ఐఫోన్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని బ్లూమ్బర్గ్ నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉 యూపీఐ చెల్లింపుల్లో మార్పులు..ఆర్బీఐ కీలక నిర్ణయం! -
రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత!
ప్రపంచంలోనే నంబర్వన్ బ్రాండ్గా ఎదిగిన యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఒక సంతకం విలువ ఏకంగా రూ.20 లక్షలు! అవును.. ఇది నిజమే 47 ఏళ్లు నాటి చెక్కుపై ఆయన పెట్టిన సంతకం కోసం తన అభిమానులు ఎంతైనా చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. కేవలం నాలుగు డాలర్లు(రూ.333) రాసిఉన్న ఆ చెక్కుకు ఎందుకు అంత క్రేజో తెలుసుకుందాం. ‘ఆర్ఆర్ ఆక్షన్స్’ అనే సంస్థ తాజాగా ఓ చెక్కును వేలానికి ఉంచింది. ఇప్పటికే ఈ చెక్కును కొనేందుకు అనేక మంది బిడ్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు దాఖలైన బిడ్ల ప్రకారం చూస్తే.. ఈ చెక్కు 25,000 వేల డాలర్ల (రూ.20 లక్షలకు పైనే)కు అమ్ముడయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. అయితే ఆ చెక్కుపై 4 డాలర్లే రానుండడం విశేషం. ప్రస్తుతం డాలర్ విలువతో పోలిస్తే దాని విలువ కేవలం రూ.333గా ఉంది. 1976లో కాలిఫోర్నియాలో స్టీవ్జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ కలిసి యాపిల్ సంస్థను స్థాపించారు. యాపిల్-1 కంప్యూటర్ కోసం వీరిద్దరూ పనిచేస్తున్న సమయంలో అదే ఏడాది జులై 23న జాబ్స్ ఓ చెక్కుపై సంతకం చేశారు. తాజాగా అమెరికాకు చెందిన ‘ఆర్ఆర్ ఆక్షన్స్’ సంస్థ స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన ఈ చెక్కును ఇటీవల వేలానికి ఉంచింది. వేలం ప్రక్రియ డిసెంబరు 6న ముగియనుంది. అయితే ఇప్పటివరకు దాఖలైన బిడ్ల ఆధారంగా చూస్తే స్టీవ్ సంతకానికి రూ.20 లక్షలకు పైనే వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదీ చదవండి: దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్కాన్ ఇంతకీ స్టీవ్ జాబ్స్ చేసిన సంతకానికి ఎందుకంత క్రేజ్ అనే సందేహం రావొచ్చు. సాధారణంగా జాబ్స్ ఎవరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చేవారు కాదట. దాంతో ఆయన పూర్తి పేరుతో చేసిన సంతకం కావడంతో ఈ చెక్కుకు ఇంత క్రేజ్. ఇప్పటికే స్టీవ్ జాబ్స్కి సంబంధించిన అనేక వస్తువులను ఎన్నో సంస్థలు వేలానికి పెట్టాయి. యాపిల్ సంస్థ ప్రకటన కోసం ఆయన రాసిన పత్రాన్ని వేలం వేయగా.. 1,75,759 డాలర్ల(రూ.1.45 కోట్లు)కు అమ్ముడయింది. -
దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్కాన్
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు మార్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో చైనా తర్వాత ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న గ్లోబల్ కంపెనీలకు భారత్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అందువల్లే యాపిల్ సంస్థ దేశంలోని చెన్నైలో తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్ ద్వారా ఐఫోన్లు తయారుచేస్తోంది. కానీ ప్రస్తుతం అది నిలిచిపోయింది. అందుకుగల కారణాలు ఎంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తైవాన్ టెక్ కంపెనీ ఫాక్స్కాన్ యాపిల్ ఐఫోన్లను మన దేశంలోని చెన్నైలో తయారు చేస్తోంది. అయితే తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కంపెనీ తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అక్కడి పరిస్థితులు ఇంకా కొలిక్కి రాకపోవటంతో ఐఫోన్ల నిలిపివేత ఇంకా కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి. తమిళనాడు వ్యాప్తంగా మిచౌంగ్ తుపాను వల్ల కురుస్తోన్న కుండపోత వర్షాలతో చెన్నైలోని ఫాక్స్కాన్ ప్లాంట్ వరదల్లో మునిగిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫాక్స్కాన్, పెగాట్రాన్ చెన్నై సమీపంలోని తమ ఫ్యాక్టరీల్లో ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేసాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరుకోవడంతో రవాణాకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇదీ చదవండి: తగ్గిన డీజిల్ అమ్మకాలు.. కారణం ఇదే.. చైనా నుంచి ఐఫోన్ తయారీని మార్చాలనే క్రమంలో యాపిల్ తన ఉత్పత్తిని 2020లో ఇండియాకు షిఫ్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 7 శాతం వాటాను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కంపెనీ తన ఉత్పత్తిని 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా కంపెనీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 35,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. గడిచిన రెండో త్రైమాసికం(సెప్టెంబర్)లో 25 లక్షల యూనిట్లను తయారుచేసినట్లు తెలిసింది. -
180 ఎకరాల విస్తీర్ణంలో జపాన్ కంపెనీ ప్లాంట్.. ఎక్కడంటే?
న్యూఢిల్లీ: ఐఫోన్లకు కావాల్సిన బ్యాటరీలను సరఫరా చేస్తున్న జపాన్ కంపెనీ టీడీకే భారత్లో లిథియం అయాన్ సెల్స్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. హర్యానాలోని మనేసర్ వద్ద 180 ఎకరాల విస్తీర్ణంలో ఇది రానుంది. దశలవారీగా ఈ కేంద్రానికి కంపెనీ రూ. 6,000–7,000 కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. పూర్తి స్థాయి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అయ్యేనాటికి సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మేడిన్ ఇండియా ఐఫోన్లలో వాడే బ్యాటరీల కోసం ఈ ప్లాంటులో సెల్స్ను తయారు చేస్తారని మంత్రి తెలిపారు. అయితే తయారీ కేంద్రం స్థాపనకై పర్యావరణ అనుమతి కోసం టీడీకే వేచి చూస్తోందని సమాచారం. లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో ఉన్న చైనాకు చెందిన యాంపీరెక్స్ టెక్నాలజీని (ఏటీఎల్) 2005లో టీడీకే కొనుగోలు చేసింది. అనుబంధ కంపెనీ అయిన నవిటాసిస్ ఇండియా ద్వారా భారత్లో ఏటీఎల్ కార్యకలాపాలు సాగిస్తోంది. రీచార్జేబుల్ బ్యాటరీ ప్యాకేజ్లను హర్యానాలోని బావల్ వద్ద ఉన్న ప్లాంటులో నవిటాసిస్ తయారు చేస్తోంది. -
లాంచ్కు ముందే వివరాలు లీక్.. ఐఫోన్ 16 ఇలాగే ఉంటుందా!
ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ విడుదల చేస్తున్న యాపిల్.. ఐఫోన్ 16 లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. విడుదల చేయడానికి ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే దీనికి సంబంధించిన చాలా వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 డిజైన్, కెమెరా, చిప్సెట్ వంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. డిజైన్ లీకైన సమాచారం ప్రకారం, రానున్న కొత్త ఐఫోన్ సాలిడ్-స్టేట్ బటన్లను పొందే అవకాశం ఉంది. కంపెనీ దీనిని ఐఫోన్ 16 ప్రో మోడల్లలో క్యాప్చర్ బటన్గా అందించే అవకాశం ఉంది. ఇది ఒత్తిడి, స్పర్శను వంటి వాటిని గుర్తించేలా ఉంటుంది. డిస్ప్లే 2024లో విడుదల కానున్న కొత్త ఐఫోన్ 16 ప్రో 6.3 ఇంచెస్ స్క్రీన్, ప్రో మాక్స్ 6.9 ఇంచెస్ స్క్రీన్ను కలిగి ఉండవచ్చు. కాగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ స్క్రీన్లు వరుసగా 6.1 ఇంచెస్, 6.7 ఇంచెస్ వరకు ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా రాబోయే ఈ కొత్త మోడల్స్ శాంసంగ్ అందించే ఓఎల్ఈడీ మెటీరియల్ కలిగి.. బ్లూ ఫాస్ఫోరోసెన్స్తో బ్లూ ఫ్లోరోసెంట్ టెక్నాలజీని కలిగి ఉండవచ్చు. మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే టెక్నాలజీ ఇందులో ఉండే అవకాశం ఉంది. కొత్త ఐఫోన్ 16 సిరీస్ మల్టిపుల్ కలర్స్లో లాంచ్ అవ్వనున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. చిప్సెట్ వచ్చే సంవత్సరం విడుదలకానున్న కొత్త ఐఫోన్ 16 చిప్సెట్కు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు, కానీ ఇది ఐఫోన్ 15 ప్రో మోడల్లలోని A17 ప్రో చిప్ను ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే కంపెనీ రానున్న కొత్త ఐఫోన్స్ కోసం 3 నానోమీటర్ A18 చిప్ అందించాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. చిప్సెట్కు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. కెమెరా సెటప్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్లు 'టెట్రా-ప్రిజం' టెలిఫోటో కెమెరాను పొందే అవకాశం ఉంది. అద్భుతమైన ఫొటోల కోసం ఆప్టికల్ జూమ్ 3ఎక్స్ నుంచి 5ఎక్స్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో సిరీస్ కోసం ఉపయోగించే 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా తక్కువ వెలుతురులో (లైటింగ్) కూడా మంచి పనితీరుని అందిస్తుంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
ఐఫోన్లు హ్యాక్..షాక్ లో నేతలు..
-
రూ.1000 కోట్ల డీల్ - భారత్లో టాటా ఐఫోన్స్ తయారీ..
ఉప్పు నుంచి టెక్నాలజీ వరకు అన్ని రంగాల్లోనూ దిగదినాభివృద్ది చెందుతున్న దేశీయ దిగ్గజం 'టాటా' ఇప్పుడు కొత్త రంగంలోకి అడుగు పెట్టనుంది. దీని కోసం కంపెనీ పెద్ద ఎత్తున ఖర్చు చేయడానికి సిద్ధమైంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో టాటా గ్రూప్ ఐఫోన్స్ తయారు చేయనుంది. మరో రెండున్నర సంవత్సరాల్లో విదేశాలకు కూడా ఎగుమతి చేయడానికి సన్నద్దవుతుందని ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' తెలిపారు. టాటా కంపెనీ ఇండియాలో ఐఫోన్లను తయారు చేయడానికి తైవాన్ బేస్డ్ సంస్థ 'విస్ట్రాన్ కార్ఫ్' (Wistron Corp) భారతదేశంలోని విభాగాన్ని 125 మిలియన్ డాలర్లకు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1000 కోట్లు కంటే ఎక్కువ) కొనుగోలు చేయనుంది. దీంతో ఈ కంపెనీ భారతదేశంలో మొట్ట మొదటి ఐఫోన్లను ఉత్పత్తి చేసే సాఫ్ట్వేర్ కంపెనీగా అవతరించింది. ఇదీ చదవండి: పీఎఫ్ పేరుతో మోసం - కోట్ల రూపాయలు కోల్పోయిన వృద్ధ జంట భారత ప్రభుత్వం గ్లోబల్ ఇండియా కంపెనీల వృద్ధికి మద్దతు ఇస్తుందని, ప్రపంచానికి భారతదేశ విశ్వసనీయతను, ప్రతిభను చాటి చెప్పడానికి బ్రాండ్లకు సపోర్ట్ చేస్తుందని చంద్రశేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు. PM @narendramodi Ji's visionary PLI scheme has already propelled India into becoming a trusted & major hub for smartphone manufacturing and exports. Now within just two and a half years, @TataCompanies will now start making iPhones from India for domestic and global markets from… pic.twitter.com/kLryhY7pvL — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 27, 2023 -
Apple: ప్రపంచ నం1 కంపెనీ వాచ్లపై నిషేధం!
ప్రపంచ నంబర్వన్ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించాలని ఆరోపణలు వస్తున్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే లైట్ టెక్నాలజీతో పనిచేసే యాపిల్ వాచ్ మోడళ్ల దిగుమతులను నిషేధించాలంటూ మాసిమో కార్ప్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి అమెరికా ట్రేడ్ కమిషన్కు సిఫారసు చేసినట్లు మెడికల్ టెక్నాలజీ కంపెనీ మాసిమో కార్ప్ గురువారం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన మాసిమో తెలిపిన వివరాల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్(యుఎస్ఐటీసీ) 60 రోజులపాటు ‘పరిమిత మినహాయింపు ఉత్తర్వు’లు జారీ చేసినట్లు సమాచారం. యుఎస్ఐటీసీ ఇచ్చే తీర్పు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ కూడా చట్టానికి అతీతం కాదనే సందేశాన్ని పంపుతుందని మాసిమో చీఫ్ ఎగ్జిక్యూటివ్ జో కియాని ఒక ప్రకటనలో తెలిపారు. తమ పేటెంట్ టెక్నాలజీని యాపిల్ చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తున్నారు. ‘లైట్-బేస్డ్ ఆక్సిమెట్రీ ఫంక్షనాలిటీ’ కోసం ఆపిల్ వాచ్ మాసిమో పేటెంట్ టెక్నాలజీని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ 2021లో సంస్థ కమిషన్కు ఫిర్యాదు చేసింది. (ఇదీ చదవండి: BIS Helmets: ఇకపై ఇవి వాడరాదు.. ఎందుకంటే..?) యాపిల్ వినియోగదారుల ఆరోగ్యం కంపెనీకి చాలా ముఖ్యమని సంస్థ తెలిపింది. తమ ఉత్పత్తుల్లో భద్రతా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి యూజర్లకు మరింత సేవలందించేలా సంస్థ నిత్యం పనిచేస్తుందని చెప్పింది. అయితే కొందరు కావాలనే యాపిల్ ఉత్పత్తులను కాపీచేసి తమ సొంత ఉత్పత్తులుగా ప్రచారం చేస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మాసిమో చర్యలపై ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేస్తామని యాపిల్ తెలిపింది. యాపిల్ గత నెలలో వాచ్సిరీస్ 9ని విడుదల చేసింది. ఆరోగ్య డేటాను యాక్సెస్ చేసి వివరాలు విశ్లేషించే వెసులుబాటు అందులో ఉంది. -
Israel Hamas war: యాపిల్ వాచ్ ద్వారా కూతురి మృతదేహాన్ని గుర్తించిన తండ్రి..!
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా మరణించిన ఓ యువతి మృతదేహాన్ని ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా గుర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు అకస్మికంగా దాడిచేశారు. ఒకవైపు రాకెట్లుతో, మరోవైపు తుపాకులతో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ ఘటనలో మెల్లనాక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఇయల్ వాల్డ్మాన్ కుమార్తె డేనియల్ మరణించారు. స్నేహితుడితో కలిసి ఇజ్రాయెల్లోని ఓ మ్యూజిక్ ప్రోగ్రాంకు వెళ్లిన డేనియల్ హమాస్ దాడిలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అనంతరం డేనియల్ ఫోన్ నుంచి వాల్డమన్ ఫోన్కు అత్యవసర కాల్ వచ్చింది. కానీ ఎటువంటి సమాచారం అందలేదు. అయితే కుమార్తెను హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకొని ఉంటారని తొలుత భావించారు. అనంతరం కుమార్తె వినియోగిస్తున్న ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా లోకేషన్ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఘటన స్థలానికి సమీపంలోనే ఉన్నట్లు డేనియల్ ఆపిల్ వాచ్ నుంచి సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ అందిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. కుమార్తె మృతదేహం కనిపించింది. ఆమెతోపాటు వెళ్లిన డేనియల్ స్నేహితుడు మృతదేహం కూడా అక్కడే కనిపించింది. వారిద్దరికి త్వరలో పెళ్లి చేయాలని భావించినట్లు వాల్డమన్ తెలిపారు. అంతలో ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డేనియల్ ఐఫోన్లో క్రాష్ డిటెక్షన్ కాల్ టెక్నాలజీ ఉందని, అందువల్ల ప్రమాదం జరిగిన వెంటనే తనకు అత్యవసర కాల్ వచ్చినట్లు వాల్డమన్ వెల్లడించారు. ఆ కాల్ రావడంతోనే తమ కుమార్తెను వెతుక్కుంటూ వెళ్లినట్లు తెలిపారు. (బైక్పై జొమాటో డెలివరీ గర్ల్ రైడింగ్..సీఈవో ఏమన్నారంటే!) యాపిల్ ఐఫోన్, వాచ్లో ఉన్న క్రాష్ డిటెక్షన్ కాల్ ఫీచర్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముందుగా అందించిన ఫోన్ నంబర్కు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఆ ప్రాంతం లోకేషన్ను కూడా షేర్ చేస్తుంది. ఫలితంగా తమ ఆత్మీయులను త్వరగా కాపాడుకొనేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. -
ఊర్వశి రౌతేలా బంగారు ఐఫోన్.. రివార్డ్ ప్రకటించిన భామ!
మెగాస్టార్ మూవీ వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ ఊర్వశి రౌతేలా. అఖిల్ మూవీ ఏజెంట్లోనూ ప్రత్యేక సాంగ్తో అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇటీవల జరిగిన భారత్-పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లో హాజరైన ముద్దుగుమ్మ తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. (ఇది చదవండి: చిన్నప్పుడే అమ్మ చనిపోయింది.. ఆమె నా తల్లి అని చెప్పారు: రాజేంద్రప్రసాద్) అయితే తాజాగా తన ఫోన్ తిరిగి ఇచ్చినవారికి రివార్డ్ ఇస్తానని ఊర్వశి ప్రకటించింది. ఈ మేరకు నా తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఫోన్ లాస్ అయిన లోకేషన్ను కూడా షేర్ చేసింది. అహ్మదాబాద్లోని మాల్లో ఉన్నట్లు లోకేషన్ను పంచుకుంది. ఇప్పటికే అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా.. ఊర్వశి రౌతేలా.. సాబ్ ది గ్రేట్ మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆమె సన్నీ డియోల్ సరసన ప్రధాన పాత్రలో నటించింది. ఆ తరువాత ఆమె సనమ్ రే, హేట్ స్టోరీ 4, పాగల్పంటి వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వినీత్ కుమార్ సింగ్, అక్షయ్ ఒబెరాయ్లతో కలిసి దిల్ హై గ్రేలో నటించనుంది. అంతేకాకుండా బ్లాక్ రోజ్ అనే తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. (ఇది చదవండి: నయని ఎలిమినేషన్తో బిగ్బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్ ) 📱 Lost my 24 carat real gold i phone at Narendra Modi Stadium, Ahmedabad! 🏟️ If anyone comes across it, please help. Contact me ASAP! 🙏 #LostPhone #AhmedabadStadium #HelpNeeded #indvspak@modistadium @ahmedabadpolice Tag someone who can help pic.twitter.com/2OsrSwBuba — URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) October 15, 2023 -
ఏటా కొత్త ఐఫోన్ ఎందుకు? పాత ఫోన్లను ఏం చేస్తారు?
Why Apple launches new iPhone every year: ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ ఒకటి. యాపిల్ (Apple) సంస్థ ప్రతి సంవత్సరం కొత్త సిరీస్ ఐఫోన్లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఐఫోన్ కోసం యూజర్లు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఈ సంవత్సరం, ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్ను తీసుకొచ్చింది. గత సెప్టెంబర్లో జరిగిన యాపిల్ వండర్లస్ట్ ఈవెంట్ సందర్భంగా వీటిని లాంచ్ చేసింది. కొత్త ఐఫోన్ అమ్మకానికి రాగానే ఆన్లైన్తోపాటు యాపిల్ స్టోర్లకు కస్టమర్లు క్యూకట్టారు. (iPhone 15 series: ఇంతవరకూ ఏ ఫోన్లోనూ లేని 9 ఫీచర్లు! అవి ఏంటంటే..) యాపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ను ఎందుకు విడుదల చేస్తుంది.. ఎక్స్చేంజ్ కింద తీసుకున్న పాత ఐఫోన్లను ఏం చేస్తుంది.. అని తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. ఈ ప్రశ్నలకు యాపిల్ సీఈవో టిమ్కుక్ (Tim Cook) స్వయంగా సమాధానాలు చెప్పారు. కొత్త ఐఫోన్ల లాంచ్ గురించి.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్, బ్రూట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏటా యాపిల్ ఎందుకు కొత్త ఐఫోన్ సిరీస్ను తీసుకొస్తుందన్న ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కావాలని యూజర్లు కోరుకుంటారని, వారికిది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. పాత ఐఫోన్లను ఏం చేస్తామంటే.. అలాగే కొత్త ఐఫోన్ కోసం పాత ఐఫోన్లను ట్రేడ్ చేయడానికి అనుమతించే ఆపిల్ పాలసీ గురించి కూడా టిమ్కుక్ మాట్లాడారు. ఈ పాత ఫోన్లను ఏమి చేస్తారో వివరించారు. పనిచేస్తున్న పాత ఐఫోన్లను తిరిగి విక్రయిస్తామని, పని చేయనివాటిని విడదీసి కొత్త ఐఫోన్ను తయారు చేయడానికి వాని విడిభాగాలను ఉపయోగిస్తామని వెల్లడించారు. -
ఐఫోన్ 16 ఫోన్ ఫీచర్లు లీక్.. భారీ మార్పులు చేయనున్న యాపిల్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఐఫోన్ 15 విడుదలైందో లేదో టెక్ ప్రియులు ఐఫోన్ 16 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 ఫీచర్లు ఇలా ఉండబోతున్నాయంటూ పలు లీకులు వెలుగులోకి వచ్చాయి. ఐఫోన్ 15 సిరీస్ను విడుదల చేసిన యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ని సైతం అప్గ్రేడ్ చేసి మార్కెట్లో విడుదల చేయనుందని సమాచారం. ముఖ్యంగా స్టాండర్డ్ ఐఫోన్ 16 మోడల్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెచ్జెడ్గా ఉంది. ఇప్పటి వరకు అన్నీ ఐఫోన్లలోని రిఫ్రెష్ రేటు 60 ఉండగా.. దీనిపై వినియోగదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టే ఐఫోన్ 16లో రిఫ్రెష్ రేటుని 120హెచ్జెడ్కి అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ సైజ్ 6.9 అంగుళాలు ఐఫోన్ 16 ప్రో 6.3 అంగుళాలతో లార్జ్ డిస్ప్లే ఉండనుంది. అదే సిరీస్లోని ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల స్క్రీన్తో రావచ్చు. ఇక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ స్క్రీన్లో ఎలాంటి మార్పులు ఉండబోవని అంచనా. ఐఫోన్ 15 సిరీస్ వరకు విడుదలైన స్టాండర్డ్, ప్లస్ ఫోన్ల డిస్ప్లేలు 6.1-అంగుళాల, 6.7-అంగుళాల స్క్రీన్లను కొనసాగిస్తుందని లీకులు వచ్చాయి. సాలిడ్-స్టేట్ బటన్లు ఐఫోన్ ఎస్ సిరీస్ హోమ్ బటన్లో కనిపించే హాప్టిక్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ మాదిరిగానే ఐఫోన్ 15 ప్రో లైనప్తో సాలిడ్-స్టేట్ బటన్లను పరిచయం చేయాలని యాపిల్ మొదట భావించింది. ఐఫోన్ 15 ప్రోలో ఈ ఫీచర్ కార్యరూపం దాల్చనప్పటికీ, ఐఫోన్ 16 ప్రో మోడల్స్లో సాలిడ్-స్టేట్ బటన్లు ఉండొచ్చని యాపిల్ ఫోన్ అనలిస్ట్ మింగ్-చి కువో సూచించారు. ‘టెట్రా-ప్రిజం’ అంతేకాకుండా, ఐఫోన్ 15 ప్రో మాక్స్లో కనిపించే ‘టెట్రా-ప్రిజం’ టెలిఫోటో కెమెరా రాబోయే ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్లో ఉండనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ టెక్నాలజీ 3x నుండి 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసే అవకాశం ఉంది. హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ టెక్ విశ్లేషకుడు జెఫ్ పు ఐఫోన్ 16 ప్రో సిరీస్లో 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను చేర్చాలని అంచనా వేస్తున్నారు. లైట్ తక్కువగా ఉన్నా మెరుగైన పనితీరును అందిస్తుంది. చిప్ సెట్ డిజైన్లలో మార్పులు ప్రస్తుత ఐఫోన్ 15 ప్రో మోడల్లు 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో పాటు వెనుక రెండు సెన్సార్లను కలిగి ఉన్నాయి. వచ్చే ఏడాది విడుదలయ్యే ఐఫోన్ 16 సిరీస్లో నెక్ట్స్ జనరేషన్ చిప్సెట్ డిజైన్తో వచ్చే అవకాశం ఉందని పలువురు టెక్నాలజీ నిపుణులు ఆశిస్తున్నారు. యాపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్ల కోసం A18 ప్రో చిప్ని ఉపయోగించవచ్చని అంచనా. -
ఫెస్టివ్ బొనాంజా: కస్టమర్లకు బంపర్ ఆఫర్లు, ఐఫోన్ 15పై స్పెషల్ ఆఫర్
దేశీయ రెండో అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్ ప్రారంభంలో తన కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు, తగ్గింపులు రూ. 26 వేల వరకు క్యాష్బ్యాక్తో ‘ఫెస్టివ్ బొనాంజా’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. లేటెస్ట్ యాపిల్ ఐఫోన్ 15 పై ప్రత్యేక ఆఫర్ కూడా అందిస్తోంది. అంతేకాదు గృహ రుణాలు, వాహన రుణాలు ద్విచక్ర వాహన రుణాలపై త్వరలోనే గుడ్ న్యూస్ను అందించనున్నట్టు తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే క్రెడిట్ కార్డ్ల ద్వారా UPI , కార్డ్లెస్ EMI కొనుగోళ్లపై భారీ ప్రయోజనాలను పొందవచ్చు. నో-కాస్ట్ EMI సదుపాయం కూడా కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా ఐఫోన్ 15పై నో-కాస్ట్ EMI ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. (రికార్డ్ సేల్స్: మోదీ పిలుపు, ఖాదీ గెలుపు) కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను అందించే లక్ష్యంతో ప్రముఖ బ్రాండ్లు, ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ ఝా తెలిపారు. ముఖ్యంగా బిగ్ బిలియన్ డేస్ సేల్ (అక్టోబర్ 8 - అక్టోబర్ 15 వరకు), మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ (అక్టోబర్ 6 -అక్టోబర్ 19 వరకు), అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. అలాగే గృహ, బైక్, ఫోర్వీలర్ వాహన రుణాలపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తామని కూడా తెలిపారు. (కళ్లద్దాల్నే నమ్ముకున్నాడు: కట్ చేస్తే..వేల కోట్ల వ్యాపారం, లగ్జరీ లైఫ్!) దీని ప్రకారం యాపిల్ ఐఫోన్ 15తోపాటు,ఎలక్ట్రానిక్స్, మొబైల్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఫర్నిచర్, ట్రావెల్, ఫుడ్, ఇతర కేటగిరీలపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మేక్మైట్రిప్, టాటా న్యూ, వన్ప్లస్, హెచ్పి, మైక్రోసాఫ్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎల్జి, సోనీ, శాంసంగ్, తనిష్క్, తాజ్, స్విగ్గీ, జొమాటో వంటి ప్రధాన బ్రాండ్స్తో డీల్ కనుగుణంగా ఆఫర్లు పొందవచ్చు. కాగా ICICI బ్యాంక్ లిమిటెడ్కు జూన్ 30, 2023 నాటికి బ్యాంక్ మొత్తం ఆస్తులు రూ.16,47,000 కోట్లుగా ఉన్నాయి. -
చెవులకు చిల్లు.. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల నుంచి వింత శబ్ధాలు!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ కొనుగోలు దారులకు రోజుకో కొత్త సమస్య ఎదురవతున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల నుంచి వింత శబ్ధాలు వినిపిస్తున్నట్లు యాపిల్కు పిర్యాదు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐ ఫోన్15 సిరీస్ ఫోన్లోని ఐఫోన్ 15 ప్రొ మోడల్స్లో స్పీకర్ నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయని, ఫోన్ వ్యాల్యూమ్ ఎక్కువ పెట్టినప్పుడు వస్తున్న శబ్ధాలకు చికాకు తెప్పిస్తున్నాయని వాపోతున్నారు. అంతేకాదు, ఫోన్ నుంచి శబ్ధం వచ్చే సమయంలో ఆ ఫోన్ల లోపల ఏదో ద్రవం ఉన్నట్లుగా అనిపిస్తుందని, ఈ సమస్య ఎక్కువగా కాల్స్ చేసే సమయంలో కానీ, మ్యూజిక్ ప్లే అవుతున్న సమయంలో ఉత్పన్నమవుతుంది. దీంతో ఆడియో స్పష్టత లేకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. యాప్స్ వాడుతున్న సమయంలో కూడా వింత సౌండ్స్ వస్తున్నాయని కస్టమర్లు వరుస ఫిర్యాదులతో హోరెత్తిస్తున్నారు. విడుదల నుంచి ఏదో ఒక సమస్య యాపిల్ ఎంతో అట్టహాసంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్లను వాడుతున్న యూజర్లు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా,యాపిల్ ఐఫోన్ ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడల్స్ ఫోన్లలో హీటింగ్ సమస్యపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. గేమ్స్ ఆడుతున్నప్పుడు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు ఫోన్ వెనుక భాగం వేడెక్కుతుందని కస్టమర్లు ఫిర్యాదు చేసినట్లు యాపిల్ యాజమాన్యం ధృవీకరించింది. సమస్యల్ని పరిష్కరిస్తాం అయితే ఈ సమస్య కొత్తగా విడుదల చేసిన ఐఓఎస్లోని బగ్ ఇందుకు కారణమని గుర్తించినట్లు చెప్పింది. దాంతోపాటు థర్డ్పార్టీ యాప్ల నుంచి వచ్చే అప్డేట్లు కూడా ఫోన్ వేడెక్కేందుకు కారణం అవుతున్నాయి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త ఐఒఎస్ 17 అప్డేట్ను విడుదల చేస్తామని యాపిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
ఐఫోన్ నుంచి కాళ్లకి వేసుకునే షూ వరకు అప్గ్రేడ్..ఇదేమైనా వ్యాధా?
ఇటీవల యువత గాడ్జెట్ల వ్యామోహం ఓ రేంజ్లో ఉంది. మార్కెట్లోకి ఏ కొత్త ఫీచర్ వచ్చినా క్షణం కూడా ఆగరు. రిలీజ్ చేస్తున్న డేట్ ఇవ్వంగానే కొనేసేందుకు రెడీ. ఇంట్లో తల్లింద్రండ్రుల వద్ద డబ్బు ఉందా లేదా అనేది మేటర్ కాదు. ఆరు నూరైనా..కేవలం ఆ కొత్త ఫీచర్ మనం వద్ద ఉండాల్సిందే అన్నంతగా ఉన్నారు యువత. ఇది అసలు మంచిదేనా?..ఒకవేళ్ల అలా కొత్త టెక్నాలజీ కొత్త ఫ్యాషన్కి అప్గ్రేడ్ కాకపోతే ఏదో పెద్ద నష్టం జరిగనట్టు లేదా భయానక అవమానం జరిగిన రేంజ్లో యువత ఇచ్చే బిల్డప్ మాములుగా ఉండదు. ఏంటిదీ? దీని వల్ల ఏం వస్తుంది? ఎవరికీ లాభం? నిజానికి యువత ముఖ్యంగా కాలేజ్కి వెళ్లే టీనేజ్ల దగ్గర నుంచి ఉద్యోగాలు చేస్తున్న పెద్దవాళ్ల వరకు అందరికి అప్గ్రేడ్ అనే జబ్బు పట్టుకుంది. మార్కెట్లోకి వచ్చే కొత్త ఫీచర్ లేదా టెక్నాలజీకి అప్గ్రేడ్ అయిపోవాల్సిందే!. లేదంటే ఓర్నీ..! ఎక్కడ ఉన్నవురా? అంటూ ఎగతాళి. పైగా నిన్న మొన్నటి టెక్నాలజీని కూడా తాతాల కాలం నాటిది అంటూ తేలిగ్గా తీసిపడేస్తాం. ఇలా ధరించే దుస్తులు దగ్గర నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకు మార్కెట్లోకి వచ్చే ప్రతీ కొత్త బ్రాండ్లతో అప్గ్రేడ్ అవ్వడం నాగరికత లేక ఓ గొప్ప ట్రెండ్గా ఫీలవుతున్నారా? అంటే..ఇక్కడ ఇలా అప్గ్రేడ్ పేరుతో మార్కెట్లోకి వచ్చే ప్రతిది కొంటున్న యువతకు కూడా ఇలా ఎందుకు అనేది వారికే స్పష్టత లేదు. కానీ ఓ ఆందోళనకరమైన విషవృక్షంలా మనుషుల్లో ఈ విధానం విజృంభిస్తుంది. మన పక్కోడు ఆ కొత్త టెక్నాలజీకి వెళ్లపోయినంత మాత్రనా వాడు ఏదో సాధించినట్లు కాదు. ముందు మనం దేన్ని ఎంతవరకు కొనాలి. దేనికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే ధోరణిని మర్చిపోయేలా మాయాజాలం సృష్టిస్తున్నాయి ఈ కార్పొరేట్ కంపెనీలు. ఉదహారణకి ఐఫోన్ పరంగా చూస్తే 4జీ నుంచి 5జీ అప్గ్రేడ్ అవ్వాలని నీ వద్ద ఉన్న ఫోర్జీ ఫోన్ని వదిలేసి కొత్తదానికి వెళ్లాల్సినంత పనిలేదు. మహా అయితే వీడియో లేదా స్టోరేజ్కి సంబంధించి కాస్త బెటర్ ఫీచర్ ఉండొచ్చు. దానికోసం ఇలా వేలవేలకు వేలు దుబారా చేయడం సరియైనది కాదు. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్ని మర్చిపోతున్నాం. మనం ఓ ఫోన్ లేదా ఏ వస్తువైన కొనుక్కుంటున్నాం. దానికి కంపెనీ ఇన్ని ఏళ్లు అని వ్యారెంటీ ఇచ్చేది. మనం కొనుక్కుని వెళ్లిపోతే వాడివద్దకు మళ్లా కస్టమర్లు రారు. వాళ్ల బ్రాండ్ని మర్చిపోతారు. నిరంతరం కస్టమర్లతో టచ్లో ఉండేలా తన బ్రాండ్ని ప్రమోట్ చేసుకునే దృష్ట్యా కంపెనీలు చేసే ఇంద్రజాలం ఇది. దీన్ని గమనించక మన జేబులు గుల్లచేసుకుంటూ అప్గ్రేడ్ అంటూ మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త బ్రాండ్ని కొనేస్తున్నాం. అప్పటి వరకు మనతో ఉన్న వాటిని పక్కన పడేస్తున్నాం. కొందరి యువతలో ఇదొక మానసిక రుగ్మతలా తయారయ్యిందని మానసిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కొత్త టెక్నాలజీకి చెందిన వస్తువు లేదా మార్కెట్లోకి వచ్చిన ట్రెండీ ఫ్యాషన్ తన వద్ద లేనంత మాత్రన ఆత్మనూన్యతకు గురయ్యిపోతున్నారు. మనుషులకు వారి భావాలకు వాల్యూ ఇవ్వండి. నిజానికి అదేమీ స్టాటస్ కాదు. అది అందరూ గమనించాలి. తల్లిదండ్రులు ఇలాంటి ధోరణి గల పిల్లలను గమనించి కౌన్సిలింగ్ ఇప్పించడం లేదా మీరే చొరవ తీసుకుని ఫ్రెండ్లీగా మాట్లాడి సరైన గాఢీలో పెట్టాలి లేదంటే ఆ మోజులో జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి. ఎందుకంటే ప్రతీది కొనేయ్యలేం. అలాగే ప్రతి అప్గ్రేడ్ని ప్రతిసారి అందుకోవడం సర్వత్రా సాధ్యం కాదు. ముందు యువత సానుకూల దృక్పథంతో ఈ వస్తువు లేదా దుస్తులు కొనడం వల్ల ఎవరికీ లాభం, దీన్ని ఎందుకు మార్కెట్లో సొమ్ము చేసుకునేలా ఎందుకు ప్రచారం చేస్తారు అనే దానిపై దృష్టిపెట్టండి. మీ పరిజ్ఞానం ఇలాంటి చిన్న చితక వస్తువులకు బానిసైపోకూడదు. ఏదైనా మనకు ఉపయోగపడేది, మన స్థాయికి, ఉన్న పరిస్థితులకు అనుగుణమైనవి మన వద్ద ఉంటే చాలు. ఈ పిచ్చి విధానం మీ ఉనికిని, మీ వైఖరిని కోల్పోయేలా చేస్తుంది. నువ్వు కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవ్వడం కాదు. టెక్నాలజీనే నువ్వు సృష్టించగలిగే దిశగా నాలెడ్జ్ని పెంచుకునేలా అడుగులు వేస్తే మీ భవిష్యత్తు బంగారు పూలబాట అవుతుందని అంటున్నారు మానసికి నిపుణులు. (చదవండి: తినదగిన ప్లేట్లు! ఔను! భోజనం చేసి పారేయకుండా..) -
ఇది కదా ఆఫర్ అంటే, ఐఫోన్ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి ఇలా!
టెక్ ప్రియులకు శుభవార్త. అనకాపల్లి నుంచి అమెరికా దాకా ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడే ఐఫోన్లు ఇప్పుడు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. తక్కువ ధర అంటే? ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లను కొనే ధరలోనే ఐఫోన్ను సొంతం చేసుకోవచ్చు. అదెలా అంటారా? ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ నిర్వహిస్తుంది. ప్రత్యేకంగా నిర్వహించే అమ్మకాల్లో యాపిల్ ఐఫోన్ 12ని రూ.35,000 లోపే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 12 మార్కెట్ ధర రూ.38,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్ రూ.3,000తో దాని ధర రూ. 35,999కి చేరుతుంది. ఎక్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.3,000 తగ్గుతుంది. అదే ఫోన్ను రూ.32,999కే కొనుగోలు చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీకెంతో ఇష్టమైన ఐఫోన్ ను ఇప్పుడే సొంతం చేసుకోండి. ఐఫోన్12 ఫీచర్లు ఐఫోన్ 12లో 6.1, 5.4 అంగుళాల స్క్రీన్, స్పోర్ట్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, 12 ఎంపీ డ్యూయల్ రియల్, వైడ్ యాంగిల్, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా డ్యూయల్ సిమ్ (నానో+ఇ-సిమ్), అత్యంత శక్తిమంతమైన ఏ14 బయోనిక్ చిప్ మొదలైన ఫీచర్లు ఐఫోన్ 12లో ఉన్నాయి. -
ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లపై విమర్శలు.. స్పందించిన యాపిల్!
కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్ వేదికగా ‘వండర్ లస్ట్’(WonderLust) పేరుతో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. అయితే ఆ ఫోన్ల అమ్మకాలు కొనసాగుతుండగా.. వాటిని కొన్న యూజర్లు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా, కొనుగోలుదారుల నుంచి వస్తున్న విమర్శలపై యాపిల్ స్పందించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు వేడెక్కడంతో పాటు టైటానియం ఫ్రేమ్, కొత్త ఫీచర్, రంగు మారుతున్నట్లు యూజర్లు యాపిల్ సంస్థకు మెయిల్స్ పెడుతున్నారు. స్పందించిన యాపిల్ ఈ క్రమంలో ఫోన్పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు యాపిల్ రంగంలోకి దిగింది. ఫోన్ వేడెక్కడానికి కారణం ఫోన్ హార్డ్వేర్ డిజైన్ కాదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 27న ఇన్స్టాగ్రామ్ అప్డేట్ చేసిన వెర్షన్ 302 వల్లేనని యాపిల్ చెప్పినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. పేరు చెప్పేందుకు ఇష్టపడని యాపిల్ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ ఫోన్ వేడెక్కడానికి ఇన్స్టాగ్రామ్, ఊబెర్, వీడియోగేమ్ అస్ఫల్ట్ అని తెలిపారు. వీటి వినియోగం వల్లే ఐఫోన్లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు స్పష్టం చేశారు. కానీ ఫోన్ వేడి వల్ల వినియోగదారులకు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. ఛార్జింగ్ మరో కారణం 20డబ్ల్యూ కంటే ఎక్కువ ఛార్జింగ్ సామర్థ్యంతో యూఎస్బీ-సీ పవర్ అడాప్టర్లను ఉపయోగించడం, ఫోన్ను పునరుద్ధరించిన కొద్దిసేపటికే బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెసింగ్ కారణంగా ఫోన్ వేడెక్కేందుకు దోహదం చేస్తుందన్నారు. కాగా, ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ సమస్యలకు పరిష్కారం చూపించాలని, లేదంటే అమ్మకాలపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఐఫోన్ 15లో మరో సమస్య.. తలలు పట్టుకుంటున్న యాపిల్ లవర్స్
టెక్ విభాగంలో యాపిల్ సంస్థకు, ఆ కంపెనీ విడుదల చేసే ప్రొడక్ట్లకు మార్కెట్లో ఉన్న ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే యాపిల్ విడుదల చేసే ఉత్పత్తుల్ని సొంతం చేసుకోవాలని టెక్ లవర్స్ ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా ఐఫోన్లు. అవి విడుదలైతే వాటిని పోటీ పడి మరి దక్కించుకోవాలని అనుకుంటారు. అందుకే వినియోగదారుల డిమాండ్ తగ్గట్లు యాపిల్ సైతం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్లను విడుదల చేస్తుంది. తాజాగా, యాపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్ని విడుదల చేసింది. ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్ కోసం యూజర్లు ఎగబడి మరీ కొనుగోలు చేశారు. తీరా.. ఎంతో ముచ్చటపడి కొన్న ఫోన్లు విపరీతంగా వేడెక్కడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. భారీ మొత్తం చెల్లించి ఫోన్ని దక్కించుకుంటే ఇలా అయ్యిందేంటని తలలు పట్టుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమకు ఎదురవుతున్న చేదు అనుభవాల్ని పంచుకుంటున్నారు. ముఖ్యంగా, ఐఫోన్ 15 సిరీస్లోని ఐఫోన్ ప్రో, ఐఫోన్ మ్యాక్స్లో గేమ్స్ ఆడే సమయంలో, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఫోన్ల వెనుక భాగం వేడెక్కుతుందని చెబుతున్నారు. మరికొందరు ఛార్జింగ్ ఎక్కే సమయంలో ఇదే తరహా సమస్య ఎదుర్కొంటున్నట్లు యాపిల్ సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు.కస్టమర్ల ఫిర్యాదుతో యాపిల్ టెక్నీకల్ సపోర్ట్ టీం సైతం గతంలో ఐఫోన్ను ఎలా వినియోగించాలో వివరిస్తూ బ్లాగ్లో రాసిన ఆర్టికల్స్ను చదవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లాగ్ ఆర్టికల్లో ఫోన్ కూల్గా, హీట్గా ఉన్న సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. వేడెక్కుతున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ .. అందుకు కారణాలు 👉సూపర్ ఛార్జ్ ప్రాసెసర్ల కారణంగా ఐఫోన్లు వేడెక్కుతుంది. 👉వినియోగదారులు తమ కొత్త ఫోన్లో యాప్లు, డేటా, ఫోటోలను డౌన్లోడ్ చేయడం వంటి పనులు చేయడం వల్ల హీటెక్కుతుంది. 👉ఇన్స్టాగ్రామ్,ఉబెర్ వంటి యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుండడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని కొందరు వినియోగదారులు నమ్ముతున్నారు. 👉చాలా మంది యూజర్లు థర్మామీటర్తో ఫోన్ ఉష్ణోగ్రతను చెక్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఓ పోస్ట్ ప్రకారం, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ త్వరగా వేడెక్కుతుంది. సోషల్ మీడియాను బ్రౌజ్ చేయడం వల్లేనని మరో యూజర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. 👉పలువురు ఐఫోన్ 15 ప్రో యూజర్లు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవడం లేదని, మునుపటి మోడల్లకు అనుగుణంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు ఉన్నాయని చెబుతున్నారు. 👉ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కాల్ సమయంలో స్విచ్ ఆఫ్ అయ్యేంత వేడిగా ఉంది. సాధారణ స్థితికి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది : మరో యూజర్ 👉ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్లు శక్తివంతమైన గ్రాఫిక్స్ ఇంజన్తో కొత్త ఏ17 చిప్లు ఉన్నాయి. బహుశా గేమింగ్ పనితీరును మెరుగుపడే సమయంలో వేడెక్కొచ్చని యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 👉‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్కుక్ వైరల్ -
ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్కు హై సివియారిటీ వార్నింగ్!
ఐఫోన్లు (iPhone), పలు ఇతర యాపిల్ (Apple) ఉత్పత్తులకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హై సివియారిటీ వార్నింగ్ ఇచ్చింది. పలు ఉత్పత్తుల్లో సాఫ్ట్వేర్లు సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఫోన్లు, యాపిల్ మ్యాక్లు, వాచ్లు, ఐపాడ్లలో ఉపయోగిస్తున్న పలు వర్షన్ల సాఫ్ట్వేర్లు సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉందని సెర్ట్ఇన్ గుర్తించింది. ఆయా సాఫ్ట్వేర్లు టార్గెటెడ్ సిస్టమ్పై ఆర్బిటరీ కోడ్ అమలు చేయడానికి, భద్రతా పరిమితులను చేధించడానికి అటాకర్కు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రభావిత సాఫ్ట్వేర్లు ఇవే.. Apple macOS Monterey 12.7కి ముందు వెర్షన్లు Apple macOS Ventura సంస్కరణలు 13.6కి ముందు వెర్షన్లు Apple watchOS 9.6.3కి ముందు వెర్షన్లు Apple watchOS 10.0.1కి ముందు వెర్షన్లు Apple iOS 16.7కి ముందు వెర్షన్లు, iPadOS 16.7కి ముందు వెర్షన్లు Apple iOS 17.0.1కి ముందు వెర్షన్లు iPadOS 17.0.1కి ముందు ఉన్న వెర్షన్లు Apple Safari 16.6.1కి ముందు ఉన్న వెర్షన్లు సెక్యూరిటీ కాంపోనెంట్లో సర్టిఫికేట్ ధ్రువీకరణ, కెర్నల్, వెబ్కిట్ కాంపోనెంట్లో సమస్యల కారణంగా యాపిల్ ఉత్పత్తులలో సైబర్ దాడికి అవకాశాలు ఉన్నట్లు సెర్ట్ఇన్ పేర్కొంది. ప్రత్యేకంగా రూపొందించిన అభ్యర్థనను పంపడం ద్వారా ఈ అవకాశాలను అటాకర్ ఉపయోగించుకోవచ్చని హెచ్చరించింది. ఆయా వెర్షన్లకు ముందున్న సాఫ్ట్వేర్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు సూచించింది. (ఐఫోన్ 15పై అప్పుడే వెల్లువెత్తిన కంప్లైంట్లు..) -
రైలు పక్కనే కాచుకుని ఉంటారు, చటుక్కున మొబైల్ లాగేసుకుంటారు
-
భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్
యాపిల్ ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్. అమెరికా దిగ్గజం యాపిల్ లాంచ్ చేసిన లేటెస్ట్ ఐఫోన్ల 15 సిరీస్పై భారీ డిస్కౌంట్ లభించనుంది. Apple iPhone 15పై అమెజాన్ , Flipkartలో రూ.60,000 వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. ఇప్పటికే ప్రీ బుకింగ్లనుమొదలైన సంగతి తెలిసిందే.ఐఫోన్ 15 సెప్టెంబర్ 22 నుండి తొలి సేల్. అలాగే షిప్పింగ్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం. యూజర్లు Apple India వెబ్సైట్లో అలాగే ఢిల్లీ, ముంబైలోని రిటైల్ అవుట్లెట్లలో ఈ ఆకర్షణీయమైన ఆఫర్లను యాక్సెస్ చేయవచ్చు. HDFC బ్యాంక్ కార్డ్ని ఉపయోగించి వారి వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ. 6,000 వరకు తక్షణ తగ్గింపు లభ్యం. యాపిల్ దేశంలో తన తాజా ఉత్పత్తులపై వరుస డిస్కౌంట్లను ప్రకటించింది. iPhone 15 ఇప్పుడు రూ. 74,900 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 79,900.అలాగే రూ. 89,900 నుంచి దిగి వచ్చిన iPhone 15 Plus రూ. 84,900 వద్ద అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్ 15 ప్రో రూ. 128,900కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1,34,900. iPhone 15 Pro Maxని రూ. 153,900కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు రూ. 159,900. (ఎన్ఆర్ఐలకు ఎస్బీఐ గుడ్ న్యూస్:యోనో యాప్తో ఈజీగా) తాజా నివేదికల ప్రకారం, అమెజాన్లో iPhone 15 ప్రీ-ఆర్డర్లో రూ. 89,900 నుంచి షురూ అవుతాయి. డిస్కౌంట్ తర్వాత, ఐఫోన్ 15 ఫ్లిప్కార్ట్లో రూ. 79,900 నుండి ప్రారంభం అయితే, ఈ సమయంలో వెబ్సైట్లో అన్ని మోడల్లు స్టాక్లో లేవు. ఎంపిక చేసిన HDFC కార్డ్ల ద్వారా వినియోగదారులు రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. (ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్...భయంకర పోరాటం: చివరికి ఇలా..!) మీదగ్గర iPhone 12 ట్రేడ్-ఇన్ ఆఫర్లో భాగంగా రూ. 20,000 అదనపు తగ్గింపు. ఈ డిస్కౌంట్ రావాలంటే ఫోన్ మంచి స్థితిలో ఉండాలి. దీనికి అదనంగా రూ.6,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. ఈ రెండు ఆఫర్లు వర్తించినతరువాత ఐఫోన్ 15 ధర రూ. 48,900కి పడిపోతుంది.ఈ తాజా ఆఫర్ సెప్టెంబర్ 22 నుండి అందుబాటులో ఉంటుంది. మీకు iPhone 12 లేకపోయినా డోంట్వర్రీ. మీ iPhone లేదా Android స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా Cashifyలో లేదా iStore అధికారిక వెబ్సైట్లో తగ్గింపు పొందవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఫోన్ వయస్సు ,పరిస్థితిని బట్టి వినియోగదారులు రూ.2వేల రూ.67,800 వరకు ధర దిగి వస్తుంది. (Disclaimer: తాజా iPhone 15 స్మార్ట్ఫోన్పై ఉత్తమమైన డీల్స్కోసం ఆయా ప్లాట్ఫారమ్లలో అన్ని డిస్కౌంట్లు అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్లను చెక్ చేసుకోవడం ఉత్తమం) -
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్
దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్దిగ్గజం యాపిల్పై మరోసారి ట్రోలింగ్కు దిగింది. అమెరికాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ను తాజాగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే యూఎస్బీ-సీ పోర్ట్తో లాంచ్ తాజా ఐఫోన్లను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది శాంసంగ్. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో యుఎస్బి-సి పోర్ట్లపై దారుణంగా ట్రోల్ చేస్తోంది శాంసంగ్. దీనికి మరో స్మార్ట్ఫోన్దిగ్గజం వన్ప్లస్ కూడా తోడైంది. అలాగే మరికొన్ని డిజిటల్ ప్లాట్ఫాంలు కూడా యాపిల్పై విమర్శలకు దిగాయి. ఎట్టకేలకు మనం ఒక మాజికల్ చేంజ్ను (సీ) చూస్తున్నా అంటూ పోరక్షంగా ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ కొంతమంది యూజర్లు యాపిల్కు మద్దతుగా నిలవడం విశేషం. ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా కాలంగా USB-Cని ఉపయోగి స్తున్నాయి. నిజానికి, యాపిల్ఇపుడు యూఎస్బీ-సీ స్విచ్ చేయడానికి ఏకైక కారణం, 2024 నుంచి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అన్ని స్మార్ట్ఫోన్లు USB-C ని మాండేటరీ చేసింది. కాగా USB-Cతో Apple Watch Series 9, Airpods Proతో పాటు iPhone 15 సిరీస్ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 79,900 నుండి ప్రారంభం. అలాగే ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 గాను నిర్ణయించింది. ఇక iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభం.స్మార్ట్ఫోన్ సెక్టార్లో శాంసంగ్, యాపిల్ మధ్య పోటీ గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫోల్డబుల్ ఫోన్ లేదంటూ గత ఏడాది కూడా శాంసంగ్ యాపిల్పై విమర్శలు గుప్పించింది. Apple announcing USB-C… pic.twitter.com/KIzXQFIzMx — OnePlus_USA (@OnePlus_USA) September 12, 2023 -
తొలిసారి మేడిన్ ఇండియా ఐఫోన్..నో వెయిటింగ్! ఇక ఐఫోన్ లవర్స్కు పండగే!
Apple iPhone 15: ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులంతా యాపిల్ ఐఫోన్ 15 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సందర్బంగా యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ ఇండియాలోని ఐఫోన్ లవర్స్కి గుడ్ న్యూస్. ఐఫోన్ 15 లాంచింగ్ తరువాత ఎలాంటి వెయిటింగ్ లేకుండానే, గ్లోబల్ సేల్స్ అరంగేట్రం రోజునే ఇండియా మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోందట. అదీ మేడిన్ ఇండియా కొత్త ఐఫోన్ మోడల్స్ రాబోతున్నాయి. అదే నిజమైతే ఐఫోన్ లవర్స్కు నిజంగా పండగే. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం లాంచ్ రోజున భారతదేశంలో అసెంబుల్ చేసిన యాపిల్ ఐఫోన్లను విక్రయించనుంది. ఐఫోన్ 15ని దక్షిణాసియాతో పాటు మరికొన్ని ఇతర గ్లోబల్ ప్రాంతాల్లో తొలిరోజే అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. భారత్లొ సరికొత్త ఐఫోన్లకు ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. మేడ్-ఇన్-ఇండియా పథకానికి ఇదొక కీలకమైన మైలురాయి కానుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. (ఐఐటీ కాదని నటిగా..చివరికి బి-టౌన్ని కూడా వదిలేసి..ఇన్ని ట్విస్ట్లా!) ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్గా ఉన్న చైనాలో ఇటీవల ఆంక్షలు, యాపిల్కు తర్వాతి చైనాగా భారత్ నిలుస్తుందన్న అంచనాల మధ్య ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనికి తోడు ఈ సంవత్సరం ప్రారంభంలో, యాపిల్ తొలి అధికారిక రిటైల్ స్టోర్లను దేశంలో ప్రారంభించింది. కాగా గత నెలలో దక్షిణ తమిళనాడులోని ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ఫ్యాక్టరీలో ఐఫోన్ 15 ఉత్పత్తిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. (రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు) అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా వండర్ లస్ట్ పేరుతో నిర్వహించనున్న మెగా ఈవెంట్లో ఐఫోన్ 15సిరీస్ను ప్రకటించనుంది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్లో ఐఫోన్ 15, ఐఫోన్15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తో పాటు, యాపిల్వాచ్ సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్ 9 యాపిల్ వాచ్ అల్ట్రా (2వ తరం) ఐపాడ్స్ లాంచింగ్పై భారీ అంచనాలే ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900గాను, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900 వరకు ఉంటుందని అంచనా -
ఐఫోన్లలో పెగాసస్ స్పైవేర్: అప్డేట్ చేసుకోకపోతే అంతే!
iPhone Spyware Alert యాపిల్ ఐఫోన్లో లోపాలకు సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఐఫోన్లలో డిజిటల్ వాచ్డాగ్ గ్రూప్ సిటిజెన్ ల్యాబ్ కొత్త స్పైవేర్ను గుర్తించింది. ఈ లోపాన్ని ఉపయోగించుకునే ఇజ్రాయెల్ పెగాసస్కు చెందిన స్పైవేర్ ఐఫోన్, ఇతర డివైస్లలోకి చొరబడినట్టు గుర్తించామని సిటిజెన్ ల్యాబ్ తెలిపింది. అలాగే ప్రతి ఒక్కరూ వెంటనే తమ డివైస్లను అప్డేట్ చేయాలని కోరింది. సిటిజెన్ ల్యాబ్ నివేదించిన లోపాలను పరిశోధించిన యాపిల్ కొత్త అప్డేట్స్ను జారీ చేసింది.ఐఫోన్ సాఫ్ట్ వేర్ లో గుర్తించిన లోపాలను 'జీరో డే బగ్స్' గా సిటిజన్ ల్యాబ్ పేర్కొంది. (యాపిల్కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు) గత వారం వాషింగ్టన్కు చెందిన సివిల్ సొసైటీ గ్రూప్కు చెందిన ఉద్యోగి యాపిల్డివైస్ చెక్ చేస్తున్నప్పుడు, NSO పెగాససస్కు సంబంధించిన స్పైవేర్ ద్వారా తాజా బ్రీచ్ గుర్తించినట్లు సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది.iOS 16.6లో చొరబడుతున్న మూడు కొత్త వైరస్ను కనుగొన్నట్టు తెలిపింది. ఇవి యూజర్తో సంబంధం లేకుండానే బ్లాస్ట్పాస్(BLASTPASS)చేస్తుందని, ఎటాకర్ iMessage ఖాతా నుండి హానికరమైన చిత్రాలతో పాస్కిట్ఎ టాక్ ఉంటుందని తెలిపింది. అధునాతన దాడుల గురించి పౌర సమాజానికి మరోసారి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తోందని సిటిజెన్ ల్యాబ్ టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన మంక్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీలోన సిటిజెన్ ల్యాబ్ సీనియర్ పరిశోధకుడు జాన్ స్కాట్-రైల్టన్ పేర్కొన్నారు. సిటిజన్ ల్యాబ్ బాధిత వ్యక్తి లేదా సంస్థపై మరిన్ని వివరాలను అందించలేదు. సిటిజన్ ల్యాబ్ పరిశోధనపై తక్షణ వ్యాఖ్య ఏమీ లేదని NSO ప్రతినిధి తెలిపారు.ఇజ్రాయెల్ సంస్థ పెగాసస్పై ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులపై నిఘాతో సహా దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో 2021 నుండి అమెరికా ప్రభుత్వందీన్ని బ్లాక్ లిస్ట్లోపెట్టిన సంగతి తెలిసిందే. Today, Apple released iOS 16.6.1, patching two vulnerabilities exploited by BLASTPASS in Wallet (CVE-2023-41061) and ImageIO (CVE-2023-41064) so update your iPhones! Also, if you're at risk because of who you are or what you do, please enable Lockdown Mode https://t.co/3cqQyWI3pG — Bill Marczak (@billmarczak) September 7, 2023 -
యాపిల్కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు
Apple iphone Ban: అమెరికా టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్కు భారీ షాక్ తగిలింది. ఐఫోన్ల వాడకంపై నిషేధాన్ని మూడు చైనా మంత్రిత్వ శాఖలతోపాటు, ప్రభుత్వ మద్దతు ఏజెన్సీలు, కంపెనీలకు విస్తరించాలని చైనా యోచిస్తోందన్న నివేదికల నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఏకంగా రెండు రోజుల్లో షేరు సుమారు 6 శాతం నష్టపోయాయి. షేరు ధర సుమారు 175డాలర్ల స్థాయికి చేరుకుంది. దీంతో కంపెనీ సుమారు 200 బిలియన్ డాలర్లు కోల్పోయింది, గురువారం షేర్లు 2.9 శాతం కుప్పకూలాయి.ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ భారీ పతనాన్ని నమోదు చేసింది. (మోడ్రన్ కార్లలో అక్కడ మొదలు పెట్టి.. పాలిటిక్స్ దాకా మొత్తం లీక్: షాకింగ్ రిపోర్ట్) యాపిల్ ఉత్పత్తులకు చైనా అతిపెద్ద విదేశీ మార్కెట్. గత ఏడాది కంపెనీ మొత్తం ఆదాయంలో ఐదో వంతు చైనానుంచే. ప్రభుత్వ సంస్థల్లోని అధికారులు ఐఫోన్ల వాడకంపై చైనా ప్రభుత్వం గతంలో విధించిన నిషేధాన్ని తాజాగా మరిన్ని శాఖలకు విస్తరించాలనే, చైనా తాజా నిర్ణయం యాపిల్ మరింత నష్టం తీసుకొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ వార్తపై చైనా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి, యూజర్ల భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం కూడా ఐఫోన్ వాడకంపై నిషేధం విధించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెల కొన్నాయి. 2 కోట్ల ఐఫోన్ అమ్మకాలు ప్రమాదం చైనాలో బ్యాన్, ప్రత్యర్థి హువావే లాంచింగ్స్తో కారణంగా యాపిల్ ఏకంగా 20 మిలియన్ల ఐఫోన్ల్అమ్మకాలు ప్రమాదంలోఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, చైనీస్ ప్రభుత్వ ఉద్యోగులు పని కోసం ఐఫోన్లను ఉపయోగించకుండా నిరోధించినట్లయితే యాపిల్ 5 నుండి కోటి ఐఫోన్లు ప్రమాదంలో పడతాయి. కార్యాలయానికి ఐఫోన్లను తీసుకురావడంపై కూడా చైనా నిషేధాన్ని అమలు చేస్తే ఆ సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు , Oppenheimer విశ్లేషకులు యాపిల్ ప్రత్యర్థి Huawei పోటీ కారణంగా మరోకోటి ఐఫోన్ల ఆర్డర్లను కోల్పోయిట్టు అంచనా. హువావే జోరు అతిత్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 లాంచ్ కానున్న తరుణంలో చైనీస్ మొబైల్ ఫోన్ తయారీదారు Huawei టెక్నాలజీస్ అధునాతన చిప్తో Mate 60 స్మార్ట్ఫోన్ కొత్త వెర్షన్ ప్రీసేల్స్ను ప్రారంభించింది. అటు ఐఫోన్ల వినియోగంపై అధికారుల నియంత్రణలను చైనా మరింత పెంచే అవకాశం ఉందిన తైపీ మెగా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలెన్ హువాంగ్ వ్యాఖ్యానించారు. -
ఈ ఒక్క రీజన్తో యాపిల్ యూజర్లు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా?
యాపిల్ కంపెనీ ఈనెల 12 (2023 సెప్టెంబర్ 12)న జరగబోయే ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ లాంచ్ చేయనుంది. అయితే ఇప్పటికే స్మార్ట్ఫోన్ ట్రేడ్-ఇన్ ప్లాట్ఫారమ్ సెల్సెల్ అనే కొత్త సర్వేలో ఎక్కువమంది ఈ మొబైల్ కొనటానికి కారణం USB-C ఛార్జింగ్ పోర్ట్ను ప్రవేశపెట్టడమే అని తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ సెల్సెల్ సర్వే ప్రకారం.. యాపిల్ USB-C ఛార్జింగ్ పోర్ట్తో ఐఫోన్ 15 మోడల్స్ అందించనుంది. ఈ కారణంగా చాలామంది కొత్త వినియోగదారులు కూడా వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సుమారు 63 శాతం మంది ఐఫోన్ యూజర్లు కొత్త ఐఫోన్ కొనటానికి ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ యూఎస్బీ-సీ ఛార్జర్ ప్రవేశపెట్టడం వల్ల కేవలం ఐఫోన్ వినియోగదారులు మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ యూజర్లు కూడా 15 శాతం ఇటువైపు మొగ్గు చూపుతారని నివేదికలు చెబుతున్నాయి. కేవలం వినియోగదారుడు మాత్రమే కాకుండా కుటుంబంలోని అందరూ ఈ ఛార్జర్ ఉపయోగించవచ్చని, ఇదీ ఒక కారణమని చెబుతున్నారు. ఇదీ చదవండి: దేశం పేరు మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే? విస్తుపోయే నిజాలు.. 2012 నుంచి యాపిల్ కంపెనీ ఐఫోన్లకు ప్రత్యేకమైన చార్జర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా యూరోపియన్ యూనియన్ నిబంధనల వల్ల మొదటిసారి ఐఫోన్ 15 సిరీస్ యూఎస్బీ-సీ ఛార్జర్తో రానుంది. ఇది వినియోగదారులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. -
తైవాన్ అధ్యక్ష రేసులో..టెర్రీ గౌ
ఐ ఫోన్ తయారీ సంస్థ ఫౌండర్, అపర కుబేరుడు టెర్రీ గౌ కూడా తైవాన్ అధ్యక్ష రేసులో నిలిచారు. కుచేలుడి నుంచి కుబేరుని స్థాయికి ఎదిగిన ఆసక్తికర నేపథ్యం టెర్రీది. కనుక ఆయనకున్న ప్రజాదరణ నేపథ్యంలో ఒక్కడే గనక బరిలో ఉంటే పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కి గట్టి పోటీ ఇవ్వడం కూడా ఖాయమేనని అంటున్నారు. కానీ విపక్షాల తరఫున ఇప్పటికే ఇద్దరు రంగంలోకి దిగారు.ఈ నేపథ్యంలో టెర్రీ పోటీ విపక్ష ఓటును మూడుగా చీల్చి చివరికి 2024 జనవరిలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం నెత్తిన పాలు పోసేలా కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ... తైవాన్కు చెందిన 72 ఏళ్ల టెర్రీ అపర కుబేరుడు. ఐ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ వ్యవస్థాపకుడు.వ్యాపారవేత్తగా దేశ ప్రజల్లో ఆయనకున్న చరిష్మా అంతా ఇంతా కాదు. అధికార పక్షంతో ఇప్పటికే రెండు విపక్షాలు తలపడుతుండగా మూడో శక్తిగా ఆయన కూడా రంగంలోకి దిగి అధ్యక్ష ఎన్నికల రేసును ఆసక్తికర మలుపు తిప్పారు. బరిలో ఆ ముగ్గురు... అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు ఇది రెండో టర్మ్. అంతకు మించి పదవిలో కొనసాగేందుకు తైవాన్ నిబంధనలు అనుమతించవు. దాంతో ఈసారి అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తరఫున విలియం లై చింగ్ తే బరిలో దిగుతున్నారు. ప్రధాన విపక్షమైన జాతీయవాద కోయిమిన్ టాంగ్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్గా చాన్స్ దక్కించుకునేందుకు టెర్రీ ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయనకు బదులుగా హొవ్ యూ ఇయ్కు పార్టీ అవకాశం ఇచ్చింది. మరో విపక్షం టీపీపీ తరఫున దేశ ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న కో వెన్ జే పోటీ పడుతున్నారు. రాజధాని తాయ్ పీ సిటీ మేయర్గా చేసిన అనుభవం ఆయన సొంతం. పైగా యువ ఓటర్లు ఆయనను వేలం వెర్రిగా అభిమానిస్తారు. ప్రస్తుతం రేసులో రెండో స్థానంతో వెన్ దూసుకుపోతున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రధాన విపక్షం డీపీపీ నుంచి అవకాశం దక్కకపోవడంతో టెర్రీ స్వతంత్ర హోదాలో పోటీకి దిగారు. అంతులేని సంపద, వ్యాపార విజయాలతో పాటు చైనాతో దీర్ఘకాలం పాటు విజయవంతంగా కలిసి పని చేసిన విశేషానుభవం టెర్రీకి మరింతగా కలిసొచ్చే అంశం.– నేషనల్ డెస్క్, సాక్షి తైవాన్ ఇంజనీరింగ్ ప్రతిభకు మానవ వనరులను కలగలిపి ఫాక్స్ కాన్ (హాన్ హై ఇండస్ట్రీస్)ను ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్రక్టానిక్స్ తయారీదారుగా తీర్చిదిద్దారు టెర్రీ. 1980, 90ల్లో దక్షిణ చైనాలో అతి పెద్ద తయారీ సంస్థలను నెలకొల్పి చైనీయులకు వేలాదిగా ఉపాధి కల్పించారు. ఈ మోడల్ సూపర్ సక్సెస్ అయింది. ఎంతగా అంటే, యాపిల్ తన మాక్ బుక్స్, ఐ ఫోన్ల తయారీని ఫాక్స్ కాన్కే అప్పగించేలా ఒప్పించగలిగారు టెర్రీ. దాంతో ఫాక్స్ కాన్ అతి పెద్ద కంపెనీగా, టెర్రీ దేశంలోనే అతి సంపన్నుల్లో ఒకరిగా ఎదగడం సాధ్యపడింది. తైవాన్ సారబౌమత్వాన్ని కాపాడేందుకు చైనాతో తనకున్న సంబంధాలన్నింటిన్నీ ఉపయోగిస్తానని, దేశాభివృద్ధి కోసం తన అనుభవం మొత్తాన్నీ రంగరిస్తానని చెబుతున్నారు టెర్రీ. తైవాన్ను ఎలాగైనా పూర్తిగా తనలో కలిపేసుకోవాలని చైనా ప్రయత్నిస్తుండటం, ఇటీవల ఆ దిశగా దూకుడు పెంచడం, అది తైవాన్ కు కొమ్ము కాస్తున్న అమెరికాతో ఘర్షణ దాకా వెళ్లడం తెలిసిందే పాలక డీపీపీ అసమర్థ, అసంబద్ధ, దుందుడుకు విధానాలే ఈ దుస్థితికి కారణమని టెర్రీ ఆరోపిస్తున్నారు. కానీ తైవాన్ ప్రజల్లో అత్యధికులు ఈ వాదనను విశ్వసించడం లేదు. త్రిముఖ ఓటుతో ఇప్పటికే అవకాశాలు సన్నగిల్లేలా కనిపిస్తున్న టెర్రీకి ఇది మరింత ప్రతికూలంగా మారేలా ఉంది. 40 శాతానికి పైగా ఓటర్లు పాలక పక్షానికి గట్టిగా మద్దతిస్తున్నట్టు ఇటీవలి సర్వేలు కూడా తేల్చాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఒక్కటై ఉమ్మడిగా ఒకే అభ్యర్ని నిలిపితేనే అధికార పార్టీ కి కాస్తో కూస్తో పోటీ ఇవ్వడం సాధ్యపడేలా కనిపిస్తోంది. కానీ అందుకు రెండు విపక్షాల్లో ఏదీ సిద్ధంగా లేదు. దాంతో సర్వేలు చెబుతున్నట్టు అధికార డీపీపీకి కేవలం 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా అది అధికారం నిలుపుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
విడుదల కాకముందే.. ఐఫోన్ 15కి భారీ ఎదురుదెబ్బ?
మరో వారం పది రోజుల్లో ఐఫోన్ 15 సిరీస్ విడుదల కానుంది. ఈ తరుణంలో ఐఫోన్ తయారీ విషయంలో ఏదో ఒక రూమర్ సామాజిక మాధ్యమాల్లో హాట్టాపిగ్గా మారుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఐఫోన్ తయారీపై ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. అందులో ఐఫోన్ 15 తయారీ భారీ తగ్గిందని.. భారీ అమ్మకాలు, డిమాండ్ దృష్ట్యా ఇది యాపిల్ సంస్థకు భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 9 టూ 5 రిపోర్ట్ ప్రకారం.. ఇటీవల ప్రముఖ హాంకాంగ్ పెట్టుబడి సంస్థ హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ టెక్ విశ్లేషకుడు జెఫ్ పు ఐఫోన్ 15 యూనిట్లు తయారవుతాయో అంచనా వేశారు. గతంలో 83 మిలియన్ యూనిట్లు వస్తాయని అంచనా వేసిన ఆయన..ఇప్పుడు 77 మిలియన్ యూనిట్లు మాత్రమే అని అన్నారు. ఫోన్ల తయారీకి అవసరమైన అన్ని విడిభాగాలను పొందడంలో సమస్యలు ఉండటమే అందుకు కారణమని అన్నారు. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు కొనాలనుకునే వారి సంఖ్య తక్కువగా ఉన్నందున.. ఉత్పత్తి తగ్గించినట్లు జోస్యం చెప్పారు. 11 మిలియన్ యూనిట్ల తగ్గింపు జెఫ్ పు నివేదికను ఊటంకిస్తూ ఐఫోన్ 15ను ఎన్ని ఉత్పత్తి అవుతాయో తెలుపుతూ మిజుహో అనే జపనీస్ బ్యాంక్ ఓ రిపోర్ట్ను వెల్లడించింది. అందులో 84 మిలియన్లు అవుతుందని భావించిన మార్కెట్ నిపుణుల అంచనాలకు భిన్నంగా 73 మిలియన్లు ఉత్పత్తి అవుతుందని చెప్పడం గమనార్హం. ఐఫోన్ 15 ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన విడి భాగాల్ని యాపిల్ పొందలేకపోతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఆలస్యం 9 టూ 5 మరో నివేదికలో.. ఈ సెప్టెంబర్లో యాపిల్ సంస్థ ఈవెంట్ నిర్వహించనుంది. ఆ ఈవెంట్లో ఐఫోన్ 15 మోడల్స్ను విడుదల చేయనుంది. కానీ వాటిల్లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఉండబోదని భావిస్తోంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కోసం అక్టోబర్ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోటోల్ని మరింత దగ్గరగా జూమ్ చేసేలా లేటెస్ట్ టెక్నాలజీతో కెమెరాను డిజైన్ చేయనుంది. అయితే కెమెరా విడిభాగాలను తయారు చేసే సోనీ సంస్థ ఐఫోన్ లాంచ్ కు సకాలంలో వాటిని అందించలేకపోతోంది. కాబట్టి, ఫ్యాన్సీ ఐఫోన్ కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. -
ఐఫోన్ 15 కీలక అప్డేట్: ఆ రంగులకు సెలవు!
ఎంతగానో ఎదురు చూస్తున్న యాపిల్ ( Apple ) ఐఫోన్ 15 ( iPhone 15) సిరీస్కు సంబంధించిన కీలక అప్డేట్ గురించి తెలిసింది. ఐఫోన్ 15 లాంచ్ డేట్పై యాపిల్ పెదవి విప్పలేదు. కానీ సెప్టెంబర్ 12 లేదా 13 తేదీల్లో ఐఫోన్ 15 విడుదలవుతుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 15 రంగులకు సంబంధించి తాజా రూమర్ ఒకటి విస్తృతంగా ప్రచారమవుతోంది. ఐఫోన్ల, ఇతర యాపిల్ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించే 9to5Mac అనే వెబ్సైట్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 ప్రో ( iPhone 15 Pro ) కోసం యాపిల్ కంపెనీ రెండు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేయాలని యోచిస్తోంది. గోల్డ్, పర్పుల్ కలర్ ఆప్షన్లను నిలిపివేసి కొత్తగా గ్రే, బ్లూ కలర్స్ను తీసుకురానుంది. గోల్డ్, పర్పుల్ కలర్స్ అవుట్! ఐఫోన్లలో ముందు నుంచి వస్తున్న గోల్డ్, పర్పుల్ కలర్ ఆప్షన్లను ఐఫోన్ 15 ప్రో మోడల్తో నిలిపేస్తున్నట్లు చెబుతున్నారు. 2018లో ఐఫోన్ ఎక్స్ఎస్ మోడల్ నుంచి గోల్డ్ కలర్ ఆప్షన్ను యాపిల్ కొనసాగిస్తోంది. నిజానికి ఐఫోన్ 6 మోడల్ నుంచే గోల్డ్ కలర్ ఏదో ఒక రూపంలో ఉంటూ వస్తోంది. ఇక పర్పుల్ కలర్ వేరియంట్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్తో పరిచయమైంది. These could be the new iPhone 15 Pro color options:- Space Gray- Silver- Titan Gray- Dark BlueWhich color would you pick?Source: @9to5mac pic.twitter.com/ePSwkkk9m4— Apple Hub (@theapplehub) August 24, 2023 సెప్టెంబరులో విడుదల కానున్న ఐఫోన్ 15 ప్రో ( iPhone 15 Pro ) కొత్త ఏ17 బయోనిక్ చిప్, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సిస్టమ్, పిల్-ఆకారపు కటౌట్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంటుందని పుకారు ఉంది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్తో మొదటిసారిగా కలర్-కోఆర్డినేటెడ్ ఛార్జింగ్ కేబుల్లను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. Apple is expected to launch the iPhone 15 Pro and iPhone 15 Pro Max next month! Here are some of the major changes:Design updatesThe new Pro models will feature some design changes, including a new Titanium body (replacing Stainless Steel) and the thinnest bezels on a… pic.twitter.com/dg8kDLNJdw— Apple Hub (@theapplehub) August 23, 2023 -
అలా చేస్తే ముప్పే: యూజర్లకు యాపిల్ తీవ్ర హెచ్చరిక
Apple Warning: టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఫోన్ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల కోసం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో ఉండగా పక్కన పెట్టుకుని నిద్రపోవడం ప్రమాదకరమని హెచ్చరించింది. అంతేకాదు ఈ సూచనలను తమ ఆన్లైన్ యూజర్ గైడ్లో చేర్చింది. ఐఫోన్లను సరైన వెలుతురు ఉన్న వాతావరణంలోనూ, టేబుల్ల వంటి ఫ్లాట్ ఉపరి తలాలపై మాత్రమే ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఉంచి చార్జ్ చేయవద్దని సూచించింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా ఫోన్ కింద ఉన్న భాగం కాలిపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో మంటలంటుకోవడంతో ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపింది. అలాగే,ఘైను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ అడాప్టర్, వైర్లెస్ ఛార్జర్పై నిద్రపోవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్కి కనెక్ట్చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచొద్దంటూ తన యూజర్లకు మార్గ దర్శకాలు జారీ చేసింది. అంతేకాదు దెబ్బతిన్న కేబుల్స్ లేదా ఛార్జర్లను ఉపయోగించడం లేదా తేమగా ఉన్న ప్రదేశాల్లో చార్జింగ్ చేయకూడదని సలహా ఇచ్చింది. కాగా పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు చివరికి వాష్ రూంలో కూడా వదలకుండా ఫోన్ వాడటం ఇపుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. అంతేకాదు చార్జింగ్లో ఉన్నపుడు చాలాసార్లు ఫోన్ పేలిన ప్రమాదాల్లోప్రాణాల్లో కోల్పోతున్న ఘటనలు కూడా చాలానే చూశాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వినియోగం ప్రమాదకరమనీ, సిగ్నల్ లేని సమయంలో వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఇప్పటికే పలు అధ్యయనం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
చైనాకు షాకిచ్చిన యాపిల్ సంస్థ..భారత్ లో ఐఫోన్15 సిరీస్ ఫోన్ల తయారీ..
-
యాపిల్ కీలక నిర్ణయం.. చైనా గొంతులో పచ్చి వెలక్కాయ?!
ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్ల తయారీతో గుత్తాదిపత్యం వహిస్తున్న డ్రాగన్ కంట్రీకి భారీ షాక్ తగలనుందా? తాజాగా, యాపిల్ తీసుకున్న నిర్ణయం చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఐఫోన్ల తయారీలో ప్రధాన దేశమైన చైనాకు, యాపిల్ ప్రొడక్ట్ల తయారీ, సరఫరా, అమ్మకాలు, సర్వీసింగ్ వంటి విభాగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న భారత్కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాను కాదనుకొని భారత్లో ఐఫోన్ 15ను భారీ ఎత్తున తయారు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో తమిళనాడు పెరంబదూర్ కేంద్రంగా ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్కు ప్లాంట్లో గతంలో కంటే ఎక్కువగానే ఈ లేటెస్ట్ ఐఫోన్లను తయారు చేయనుంది. చైనాలో తయారైన యాపిల్ ప్రొడక్ట్లు ఇతర దేశాలకు దిగుమతి చేసిన వారం రోజుల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్రమత్తమైన టిమ్కుక్ యాపిల్ సంస్థ గత కొన్నేళ్లుగా చైనాలో తన ఉత్పత్తుల్ని తయారీ, అమ్మకాలు నిర్వహిస్తుంది. అయితే, డ్రాగన్ కంట్రీలో సప్లయి చైన్ సమస్యలు, అమెరికా - చైనాల మధ్య తగ్గిపోతున్న వ్యాపార సత్సంబంధాలు, అదే సమయంలో తయారీ కేంద్రంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అమెరికాతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుని, తనను తాను తయారీ కేంద్రంగా మార్చుకోవాలని కోరింది. ఇలా వరుస పరిణామాలతో యాపిల్ సీఈవో టిమ్కుక్ అలెర్ట్ అయ్యారు. చైనాలో వ్యాపారం ఎప్పటికైనా ప్రమాదమనే ఓ అంచనాకు వచ్చిన యాపిల్ గత కొన్నేళ్లుగా తన వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. ఇందులో భాగంగా భారత్లో ఐఫోన్ 15 తయారీని ప్రారంభించనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా నుంచి భారత్కు చైనాలో సప్లయి చైన్ సమస్యలతో యాపిల్ తన తయారీని భారత్కు తరలించాలని భావించింది. కాబట్టే గత ఏడాది భారత్లో తయారైన యాపిల్ ఐఫోన్ షిప్మెంట్ విలువ 65 శాతం పెరిగింది. ఐఫోన్ల విలువ 162 శాతం పెరిగిందంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఆ నివేదికను ఊటంకిస్తూ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ మరో రిపోర్ట్ను వెలుగులోకి తెచ్చింది. 2022లో భారత్లో మొత్తం స్మార్ట్ఫోన్ షిప్మెంట్ విలువలో యాపిల్కు 25 శాతం వాటాను కలిగి ఉందని వెల్లడించింది. ఈ వృద్ది రేటు 2021లో 12 శాతం నుండి పెరిగినట్లు మరికొన్ని సంస్థలు నివేదించాయి. ప్రమాదం అంచున చైనా ఆధిపత్యం ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్లను చైనానే తయారు చేస్తుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికలో టెక్నాలజీ రిపోర్టర్ జిన్మీ షెన్ తెలిపారు. అయినప్పటికీ, యాపిల్ తన తయారీని చైనా నుంచి బయట (ముఖ్యంగా భారత్కు) దేశాలకు తరలించాలని భావిస్తున్నందున బీజింగ్ తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే! -
‘ఫొటో చూసి ఎత్తు చెప్పండి’ అమ్మడి ప్రశ్నకు ఐఫోన్తో నెటిజన్ సమాధానం!
సోషల్ మీడియాలో రోజురోజుకూ విచిత్రమైన పోస్టులు కనిపిస్తున్నాయి. తాజాగా x (గతంలో ట్విట్టర్)లో ఒక యువతికి సంబంధించిన పోస్టు వైరల్గా మారింది. దీనిలో ఆమె యూజర్స్కు ఒక ప్రశ్న సంధించింది. వెంటనే దీనికి సమాధానాలు, కామెంట్ల వెల్లువ మొదలయ్యింది. తన ఎత్తు ఎంతో చెప్పమన్న ఆ అమ్మడిని కంగుతినిపిస్తూ యూజర్స్ సమాధానాలిస్తున్నారు. guess my height 👀 pic.twitter.com/02t86D25a7 — S. (@daalmakhniiii) August 12, 2023 xలో దాల్మఖనీ పేరు కలిగిన యూజర్ తనకు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె ఒక ఐఫోన్ పట్టుకుంది. ‘నా హైట్ ఎంతో చెప్పండి’ అని అడిగింది. ఈ పోస్టుకు ఇప్పటి వరకూ లక్షల్లో సమాధానాలు వచ్చాయి. 1500కు పైగా యూజర్స్ ఈ పోస్టును లైక్ చేశారు. సాగర్ అనే యూజర్ చేసిన కామెంట్ ఎంతో ప్రత్యేకంగా ఉంది. ఆమె చేతిలోని ఐఫోన్-12 పొడవు 14.6 సెంటీమీటర్లు అని పేర్కొంటూ, ఆమె ఫొటో పక్కన అంటే తల మొదలు కొని పాదాల వరకూ ఒక్కొక్కటిగా 9 ఫోన్లను పెడుతూ వచ్చాడు. దీనిని మొత్తం లెక్కించాక ఆమె ఎత్తు 4 అడుగుల 31 ఇంచీలు అని తేల్చిచెప్పాడు. రాహుల్ అనే యూజర్ ఎన్నో దుర్గుణాలు కలిగిన రావణుడు కూడా ఏనాడూ ఇటువంటి ప్రశ్న అడగలేదని కామెంట్ చేశాడు. ఇది కూడా చదవండి: ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్.. ఆనక వధువు ఏంచేస్తుందంటే.. 4.31 ft pic.twitter.com/mmtgmh1LAk — Sagar Budhwani (@Sagarbudhwani_) August 12, 2023 -
యాపిల్ ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్...ఇక పండగే!
Apple Big Event iphone15 launch: టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి చెందిన కొత్త ఐఫోన్ వస్తోందంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు .ప్రతీ ఏడాది సెప్టెంబరులో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్లో యాపిల్ ఈ సందడి ఉంటుంది. ఈ సందర్భంగా యాపిల్ తన కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో కొత్త ఫ్లాగ్షిప్లను లాంచ్లపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా రానున్న ఐఫోన్ 15 లాంచింగ్ డేట్ లీక్అయింది. రానున్న యాపిల్ బిగ్ ఈవెంట్కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజా లీక్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో ,ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఎప్పుడు లాంచ్ చేయబడుతుందో తేదీ బహిర్గతమైంది. సాధారణంగా ఈ ఈవెంట్ను తేదీని యాపిల్ లీక్కాకుండా చివరి గంట వరకూ ఉత్కంఠ రేపుతుంది.తాజా నివేదిక ప్రకారం, సెప్టెంబర్ 13న యాపిల్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సెప్టెంబర్ 13న లీవ్ తీసుకోవద్దని కంపెనీ తన ఉద్యోగులను కోరినట్టుతెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 7 ఈవెంట్ బుధవారం జరిగినప్పటికీ, ఐఫోన్ ప్రకటనలలో ఎక్కువ భాగం మంగళవారాల్లోనే జరిగాయి. సెప్టెంబరు 13 బుధవారం నాడు వస్తుంది కాబట్టి, ఈ ఏడాది స్పెషల్ ఈవెంట్కూడా అప్పుడే ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) సరఫరా సమస్యల కారణంగా ఐఫోన్ 14 ప్లస్ విక్రయాలు గత ఏడాది అక్టోబర్ 7న ప్రారంభమయ్యాయి. 2020లో ఐఫోన్ 12 Pro Max, ఐఫోన్12 mini లాంచింగ్ లేట్ అయింది. ఈ ఏడాది సేల్ కూడా ఐఫోన్ 15 మోడల్లు "తీవ్రమైన కొరత" కారణంగా ఆలస్యం కావచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తుండగా, మరికొందరు అన్ని కొత్త మోడళ్ల అమ్మకాలు సెప్టెంబర్లో ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే, యాపిల్ అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. (పల్సర్ బైకా? మజాకా..రూ.35 వేల కోట్ల ఆస్తి..ఎవరా హీరో?) Breaking 😍 Apple to launch iPhone 15 series on 13 September, 2023. USB-C#iPhone15 #USBC #Apple pic.twitter.com/2YPVLTMlbR — Abhishek Yadav (@yabhishekhd) August 4, 2023 -
భారత్లో ఫాక్స్కాన్.. 500 మిలియన్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు ఐఫోన్లను తయారీ చేసి సరఫరా చేసే ఫాక్స్కాన్ టెక్నాలజీ సంస్థ భారత్ రెండు మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 మిలియన్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉందంటూ బ్లూమ్బెర్గ్ నివేదించింది. ఫాక్స్కాన్ ఈ తయారీ యూనిట్లను కర్ణాటకలో నిర్మించనుండగా..ఒక ఫ్యాక్టరీ ఐఫోన్ల తయారీ, రెండో ఫ్యాక్టరీలో యాపిల్కు విడిభాగాలు ఉత్పత్తి చేయనుందని నివేదిక పేర్కొంది. అయితే, ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీలను నిర్మించాలనే అంశంపై ఫాక్స్కాన్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ప్రాంతం ఎక్కడనేది నిర్ణయించలేదు. ఈ వారంలో ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన అనువైన ప్రాంతంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో కర్నాటకలో ఫాక్స్ కాన్ యూనిట్ కోసం 80 బిలియన్ రూపాయల ($972.88 మిలియన్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. చైనా కంటే భారత్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ కంపెనీ సిద్ధమైంది. తమిళనాడులో ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీ కేంద్రంలో 16 బిలియన్లను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. తద్వారా 6,000 మందికి ఉపాధి కలగనుంది. కాగా, ఫాక్స్ కాన్ తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని కాంచీపురం జిల్లాలో నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపై ఫాక్స్కాన్, తమిళనాడు ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదీ చదవండి : చైనాను వద్దనుకొని వచ్చేస్తోంది?.. భారత్లో ఫాక్స్కాన్ 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు -
మార్కెట్లోకి యాపిల్ కంపెనీ బూట్లు.. ధర వింటే గుండెల్లో దడపుట్టాల్సిందే!
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చే ప్రాడెక్ట్స్ ఏవైనా, ఎంత ధర ఉన్నా సరే మార్కెట్లో వీటికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల యాపిల్ నుంచి అరుదైన స్నీకర్లను అమ్మకానికి పెట్టగా అవి ఊహించని ధర పలికాయి. మీరు ఐఫోన్, ఐప్యాడ్ లేదా మ్యాక్బుక్లో ఖర్చు చేసే దానికంటే ఎక్కువ డబ్బును ఈ స్నీకర్ల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అసలు ఆ బూట్లు ఎంత ధర పలికిందంటే.. ధర వింటే భయపడతారు దిగ్గజ సంస్థ ఆపిల్ గతంలో తన ఉద్యోగుల కోసం అత్యున్నత టెక్నాలజీతో మేలు రకమైన ఒక నమూనా స్మార్ట్ బూట్లను తయారు చేసింది. కొన్ని కారణాల వల్ల తాజాగా ఈ బూట్ల విక్రయించింది. 1990ల మధ్యకాలంలో ప్రత్యేకంగా తయారు చేసిన జత బూట్లను కంపెనీ వేలం, బ్రోకరేజీ ద్వారా వేలం పోర్టల్లలో ఒకటైన సోథెబీస్లో వేలం వేశారు. యుఎస్ సైజ్ 10.5లో పురుషుల కోసం తయారైన ఒక జత తెల్లటి బూట్లు ధర $50,000 సుమారు 41 లక్షల రూపాయలకు విక్రయించారు. తన ఉద్యోగుల కోసం కస్టమ్-మేడ్, ఈ అల్ట్రా-రేర్ స్నీకర్స్ 90వ దశకం మధ్యలో జరిగిన నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్లో ఒక సారి బహుమతిగా కూడా ఇచ్చినట్లు వేలం హౌస్ కంపెనీ సోథెబైస్ తెలిపింది. యాపిల్ వంటి వంటి దిగ్గజ టెక్ కంపెనీ స్నీకర్లను ఉత్పత్తి చేయడం అసాధారణంగా అనిపించినప్పటికీ, ఆ సంస్థ ముందుగా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు గతాన్ని పరీశిలిస్తే తెలుస్తుంది. 1986లో ఈ కంపెనీ "ది యాపిల్ కలెక్షన్"ను ప్రారంభించింది. ఇది రెయిన్బో ఆపిల్ లోగోతో అలంకరించి దుస్తులు, ఉపకరణాల శ్రేణి. ఇందులో మగ్లు, గొడుగులు, బ్యాగులు, కీరింగ్లు, సెయిల్బోర్డ్తో సహా అనేక రకాల వస్తువులు ఉన్నాయి, అన్నీ ఐకానిక్ లోగోను కలిగి ఉంటాయి. యాపిల్ ఉత్పత్తులంటే డిమాండ్ అట్లుంటది ఆసక్తికరమైన విషయమేమిటంటే, వింటేజ్ ఆపిల్ ఉత్పత్తులు కళ్లు చెదిరే రేట్లకు అమ్ముడుపోవడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవల వేలంలో యాపిల్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. గత నెలలో, ఐఫోన్ 2007 మొదటి-ఎడిషన్ను $190,000కి విక్రయించగా.. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్కు చెందిన ఒక జత Birkenstock చెప్పులు వేలం వేయగా అంతా అవాక్కయ్యేలా $200,000కి అమ్ముడుపోయాయి. చదవండి బర్త్ డే నాడు కొత్త బిజినెస్లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు! -
షిప్మెంట్లో ఐఫోన్ సరికొత్త రికార్డ్లు
ఐఫోన్ షిప్మెంట్లో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త రికార్డ్లను నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. 2022లో 6.7 మిలియన్ల ఐఫోన్ల షిప్మెంట్ జరగ్గా.. ఈ ఏడాది అత్యధికంగా 8 నుంచి 9 మిలియన్ ఐఫోన్ షిప్మెంట్ జరిగే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది గడిచిన ఆరు నెలల కాలంలో 4 మిలియన్లకు పైగా ఐఫోన్ అమ్మకాలు రెట్టింపు అయినట్లు ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్, ఐడీసీని ఉటంకిస్తూ.. 2023లో ఐఫోన్ షిప్మెంట్లు దాదాపు 8-9 మిలియన్లు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి యాపిల్ తన మార్కెట్ వాటాను 6-7 శాతానికి చేరుకుంటుందని మార్కెట్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐఫోన్ 15 లాంచ్తో పాటు పండగలు, డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లు సైతం ఐఫోన్ అమ్మకాలకు కలిసొచ్చే అవకాశం ఉంది. కాగా, జూన్ 30న యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సంవత్సరం జనవరి నుండి మొదటిసారిగా 3 ట్రిలియన్ మార్కును దాటింది. -
యాపిల్ ఐఫోన్ లవర్స్కు బ్యాడ్న్యూస్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ లవర్స్కు బ్యాడ్ న్యూస్. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో యాపిల్ ఐఫోన్ సిరీస్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐఫోన్ 15 సిరీస్ విడుదలలో జాప్యం ఏర్పడనుంది. ముందే అనుకున్న విడుదల షెడ్యూల్ కంటే మరికొన్ని వారాలు ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ అమెరికా అనలిస్ట్ వంశీ మోహన్ మాట్లాడుతూ.. ఐఫోన్ 15 విడుదల ఆలస్యం ఎందుకు జరుగుతుందో స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే ఫోన్ క్యూ4లో అంటే అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఎప్పుడైనా యూజర్లకు పరిచయమయ్యే అవకాశం ఉందని అన్నారు. డిస్ప్లే సమస్యలే కారణమా? ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం.. యాపిల్ సంస్థ ఫోన్ల డిస్ప్లే సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లిమిటెడ్ ఫోన్లకే డిస్ప్లేలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు ఐఫోన్ 15 ఫోన్ల డిస్ప్లే బెజెల్స్ పరిణామాన్ని తగ్గించడంతో పాటు, ఐఫోన్ల డిస్ప్లేలను ఎల్జీ తయారు చేస్తుంది. వీటి తయారీలోనూ ఆలస్యానికి కారణమని సమాచారం. యాపిల్ వాచ్ 7 డిస్ప్లే అంశంలోనూ ఇదే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. యాపిల్ వాచ్ 7ను మార్కెట్లో విడుదల చేసిన నెల రోజుల తర్వాత విక్రయాలు జరిగాయి. చదవండి👉 ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే! -
యాపిల్ ఐఫోన్14పై భారీ తగ్గింపు, ఈ రోజే చివరి రోజు
Flipkart Big Saving Days Sale Apple iPhone 14: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు (జూలై 19)తో ముగియనుంది. ఈ సేల్ యాపిల్ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. యాపిల్ ఐఫోన్ తక్కువ ధరలో లభిస్తోంది అంటే ఐఫోన్ లవర్స్కు పండగే పండగ. అలాంటి వారు.. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్14ను సొంతం చేసుకోవాలనుకుంటే ఇదే మంచి తరుణం. వివరాలేంటో చూద్దాం రండి! (యాపిల్ వాచ్ కొత్త ఫీచర్ వచ్చేసింది: క్రానిక్ హార్ట్ కండిషన్ ఈజీ ట్రాక్) ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో ఐఫోన్ 14 రూ. 47,501 తగ్గింపు తర్వాత కేవలం రూ. 32.399కి అందుబాటులో ఉంది. ఇంత తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ను కొనుగోలు చేయడానికి అవకాశం నేటితో ముగియనుంది. యాపిల్ ఐఫోన్ 14 రూ. 10,901 తగ్గింపుతో రూ. 68,999 వద్ద అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, యాక్సిస్ బ్యాంక్ , సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , EMI లావాదేవీలపై రూ. 1000 తగ్గింపును పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.67,999కి తగ్గింది. దీంతోపాటు పాత స్మార్ట్ఫోన్కు బదులుగా ఫ్లిప్కార్ట్ రూ. 35,600 దాకా తగ్గింపు లభిస్తుంది. అలా ఫ్లిప్కార్ట్ సేల్లో రూ. 47,501 తగ్గింపు తర్వాత రూ. 32,399కి లభిస్తుంది. గత ఏడాది చివర్లో లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 14 ఐఫోన్ 13 లానే ఉంది,పెద్దగా అప్డేట్ లేదనే అంచనాల నేపథ్యంలో ప్రారంభ అమ్మకాల సమయంలో పెద్దగా స్పందనను పొందడంలో విఫలమైంది. అయితే ఇటీవలి ఫ్లిప్కార్ట్ సేల్లో ఆదరణ పొందుతోన్నట్టు తెలుస్తోంది. -
ఇకపై ఐఫోన్ వాడక్కర్లేదు.. ఆ దేశంలో నిషేధం విధించిన ప్రభుత్వం!
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధర ఎంత ఎక్కువ ఉన్నా ప్రజలు ఐఫోన్కే మొగ్గు చూపుతారు. అంతటి చరిత్ర ఉన్న ఈ బ్రాండెడ్ కంపెనీకు అంతర్జాతీయంగా ఎంత ఆదరణ పొందుతుందో అందరికీ తెలిసిందే. అలాంటి ఐఫోన్ వాడకంలో రష్యా ప్రభుత్వం జంకుతోంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ఐఫోన్ ఉపయోగించకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది. దీని వెనుకున్న అసలు స్టోరీ ఏంటంటే... ఐఫోన్ల వాడకం నిషేధించాలని రష్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రధాన కారణం.. యాపిల్ అమెరికాకు చెందిన సంస్థ కావడం, దీంతో అక్కడి కంపెనీలు తమపై గూఢచర్యానికి పాల్పడుతున్నాయనే రష్యాన్ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ .. తమ అధికారులకు ఇదివరకే ఈ మేరకు ఆదేశాలు జారీచేయగా, తాజాగా అక్కడి వాణిజ్యశాఖ కూడా ఐఫోన్లను వాడవద్దని ఉద్యోగులను ఆదేశించింది. అమెరికా తమ ఉత్పత్తులతో హ్యాకింగ్కు పాల్పడే అవకాశం ఉందంటూ మార్చిలో యాపిల్ ఉత్పత్తులను ఉపయోగించడం మానేయాలని అధికారులను ఆదేశించగా.. తాజాగా దీని అమలును మరింత సీరియస్గా తీసుకుంది. అమెరికన్లు తమ పరికరాలను వైర్ ట్యాపింగ్ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని తమ అధికారులు విశ్వసిస్తున్నారని" రష్యా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ నిపుణుడు ఆండ్రీ సోల్డాటోవ్ తెలిపారు. ఇదిలా ఉండగా... ఉక్రెయిన్తో రష్యా యుధ్దం ప్రారంభించిన తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ, ఆర్థిక రంగాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్నే వినియోగించాలనే నిర్ణయంపై పుతిన్ సంతకం చేశారు. ఈ క్రమంలోనే యాపిల్ ఉత్పత్తుల వాడకంపై అనధికారిక నిషేధం విధించి ఉండచ్చని తెలుస్తోంది. -
16 ఏళ్ల నాటి ఐఫోన్ రూ. 1.3 కోట్లు.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధర ఎక్కువైనా కొనేందుకు యువత ఆసక్తి చూపిస్తుంటారు. యూజర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్లను యాపిల్ సంస్థ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ప్రస్తుత తాజా మోడల్ ఐఫోన్ 15 హవా నడుస్తోంది. అయితే 2007లో విడులైన మొదటి తరం ఐఫోన్ తాజాగా జరిగిన వేలంలో రూ. 1.3 కోట్లకు (158,000 డాలర్లు) అమ్ముడుపోయింది.ఇప్పటివరకు వేలంలో అమ్ముడుపోయిన అత్యంత విలువైన ఐఫోన్గా ఇది కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఐఫోన్కు టెక్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ రూపొందించడంలో పాలుపంచుకున్న ఇంజనీర్లలో ఒకరికి చెందినది. మొదటి తరం ఐఫోన్ను ప్రపంచానికి పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్, టచ్స్క్రీన్ ఇంటర్ఫేస్, ఆసక్తికరమైన ఫీచర్లతో స్మార్ట్ఫోన్లను విప్లవాత్మకంగా మార్చారు. కాగా వేలానికి ఉంచిన ఈ ఐఫోన్ 16 ఏళ్లయినా ఇప్పటికీ అంతే కొత్తగా ఉంది. అందుకే వేలంలో అత్యధిక విలువను దక్కించుకుంది. ఇదీ చదవండి ➤ మొబైల్ నంబర్.. మీకు నచ్చినట్టు.. ఈ ఐకానిక్ ఐఫోన్ 4జీబీ వెర్షన్ను ఎల్సీజీ సంస్థ వేలం వేసింది. 50,000 డాలర్ల నుంచి 100,000 డాలర్లు (రూ.41 లక్షలు నుంచి రూ.82 లక్షలు) మధ్య అమ్ముడుపోతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే అనూహ్యంగా 158,644 డాలర్లకు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 1.3 కోట్ల భారీ ధరను దక్కించుకుని కొత్త రికార్డు సృష్టించింది. వాస్తవానికి 2007లో విడుదలైన మొదటి తరం ఐఫోన్ 4జీబీ వర్షన్ ధర కేవలం 499 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 40 వేల కంటే తక్కువే. ఈ ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిన 16 ఏళ్ల తర్వాత 318 రెట్లు అధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. -
తుది దశలో టాటా-విస్ట్రాన్ డీల్
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్కు చెందిన కర్ణాటక ప్లాంటును టాటా గ్రూప్ కొనుగోలు చేసే అంశం తుది దశలో ఉన్నట్లు సమాచారం. అనుబంధ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా టాటా గ్రూప్ ఈ డీల్ను కుదుర్చుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తయితే యాపిల్ ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ సంస్థగా టాటా నిలవనుంది. అలాగే, ఈ ప్లాంటులో ఐఫోన్లతో పాటు ఇతరత్రా కొత్త యాపిల్ ఉత్పత్తులను కూడా అసెంబుల్ చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రస్తుతం తైవాన్కు చెందిన విస్ట్రాన్తో పాటు ఫాక్స్కాన్, పెగాట్రాన్ వంటి సంస్థలు యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. -
150 ఏళ్ల చరిత్రలో.. తొలి ఐఫోన్ తయారీ సంస్థగా టాటా గ్రూప్!
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ యాపిల్ ఐఫోన్ల సప్లయి తయారీ సంస్థ విస్ట్రాన్ కొనుగోలు కోసం చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఆగస్ట్లో టాటా గ్రూప్ - విస్ట్రాన్ల మధ్య కొనుగోలు ఒప్పందం పూర్తవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే భారత కంపెనీ ఐఫోన్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి అవుతుంది. కర్ణాటక కేంద్రంగా విస్ట్రాన్ సంస్థ ఐఫోన్లను తయారు చేసి యాపిల్ సంస్థకు అందిస్తుంది. ఈ సంస్థ విలువ రూ.4942 కోట్లు. ఇందులో 10వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఫాక్స్కాన్ ఐఫోన్ 14 మోడళ్లను తయారు చేసింది. టాటా చేతుల్లోకి వచ్చేది అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు, ఇతర ప్రోత్సహాకాలు పొందాలంటే నిబంధనల ప్రకారం.. విస్ట్రాన్ వచ్చే ఏడాది మార్చి వరకు ఐఫోన్లను తయారు చేయాల్సి ఉంది. ఆ గడువు ముగిసిన వెంటనే విస్ట్రాన్ తయారీ ప్లాంట్ను టాటా గ్రూప్కు అప్పగించనున్నట్లు సమాచారం. ఒప్పందం, తయారీ ఇతర అంశాలపై టాటా గ్రూప్, విస్ట్రాన్లు ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కార్పొరేట్ ప్రపంచంలో 155 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ ఉప్పు నుంచి టెక్నాలజీ సర్వీసుల వరకు అన్నింటిని విక్రయిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ సంస్థ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ, ఈ-కామర్స్ రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. విస్ట్రాన్తో ఒప్పందం పూర్తయితే కార్పొరేట్ చరిత్రలో టాటా గ్రూప్ అనే పేరు సువర్ణక్షరాలతో లికించపడుతుంది. చదవండి👉 ‘దయ చేసి నమ్మకండి.. అవన్నీ అవాస్తవాలే’! -
ఫ్లైట్లో పోగొట్టుకున్నా.. ప్లీజ్ తెచ్చి ఇవ్వండి: ఊర్వశి రౌతేలా
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తన అంద చందాలతో నెట్టింట కుర్రకారుకు హీటెక్కిస్తుంది ఈ బీ టౌన్ చిన్నది. ఈ నటి ఇటీవలే ప్రపంచంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అవార్డును కూడా అందుకుంది. ఈ విషయాన్ని ఊర్వశి స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పింది. తాజాగ మరోసారి సోషల్ మీడియాలో ఆమె చర్చనీయాంశమైంది. (ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) ఇటీవల విమానంలో దూర ప్రయాణం చేసిన ఊర్వశి తన వద్దనున్న రెండు ఐఫోన్లను ఫ్లైట్లోనే మరచిపోయి వచ్చేసిందట. అది వెతికేందుకు సహాయం కోరుతూ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ను ఇలా పెట్టింది. 'డియర్ విస్తారా నేను నా రెండు ఐఫోన్లను యూకే 772 విమానంలో మరచిపోయాను. వాటి వాల్ పేపర్లో మా తల్లిదండ్రుల ఫొటో ఉంటుంది. దయ చేసి మీరు దాన్ని వెతికేందుకు సహాయం చేస్తారా' అంటూ రాసుకొచ్చింది. కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ సినిమాల్లోనూ మెరుస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వాల్తేరు వీరయ్యలో చిరు సరసన 'బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ' అంటూ స్టెప్పులేస్తూ.. యూత్ ఫాలోయింగ్ను పెంచుకుంది . ప్రస్తుతం ఆమె లో బోయపాటి-రామ్ పోతినేని సినిమాతో పాటు 'బ్రో' లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో మెరవనుంది. (ఇదీ చదవండి: రాధికా ఆప్టేతో రోమాన్స్ చేసిన ఈ నటి గురించి తెలుసా?) -
భారత్లో యాపిల్ క్రెడిట్ కార్డ్.. విడుదల చేసేందుకు కసరత్తు!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారత్లో ఆర్ధిక రంగంలోకి అడుగు పెట్టనుంది. ఈ ఏడాది యాపిల్ తన స్టోర్లను భారత్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశాన్ని సందర్శించిన ఆ కంపెనీ సీఈవో టిమ్కుక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ శశిధర్ జగదీషన్తో భేటీ అయ్యారు. వారిద్దరి భేటీలో యాపిల్ క్రెడిట్ కార్డ్ విడుదలతో పాటు ఇతర అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. తాజాగా,యాపిల్..నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)తో సంప్రదింపులు జరిపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, టెక్ దిగ్గజం ‘యాపిల్ పే’ పేరుతో క్రెడిట్ కార్డ్ను తేనుందని, ఈ కార్డ్ సాయంతో రూపే ప్లాట్ ఫామ్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ చేసుకునేలా చర్చలు జరిపినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. భారత్లోని బ్యాంక్లు తన కస్టమర్ల కోసం క్రెడిట్ కార్డ్లను విడుదల చేస్తున్నాయి. అయితే, వినియోగదారులు ట్రాన్సాక్షన్లను మరింత వేగంగా, సులభతరం చేసుకునేందుకు క్యూఆర్ కోడ్ను ఉపయోగిస్తున్నారు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డబ్బుల్ని సెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు యాపిల్ఏ తరహా క్రెడిట్ కార్డ్లను విడుదల చేయనుందనే ఆసక్తికరంగా మారింది. ఇక, ఈ క్రెడిట్ కార్డ్ విడుదలపై టెక్ దిగ్గజం ఆర్బీఐని సంప్రదించగా.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల కోసం నిర్ధిష్ట నిబంధనలను అనుసరించాలని ఆర్బీఐ సూచించింది. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ -
మీరు స్టూడెంట్సా? యాపిల్ బంపరాఫర్.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీగా ఎయిర్ పాడ్స్!
భారతీయ విద్యార్ధులకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేక సేల్ను అందుబాటులోకి తెచ్చింది. ‘బ్యాక్ టూ యూనివర్సిటీ 2023’ పేరుతో జూన్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ సేల్లో విద్యార్ధులు కొనుగోలు చేసే ఐపాడ్, మ్యాక్బుక్స్,డెస్క్ ట్యాప్ కంప్యూటర్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపింది. 11 అంగుళాల యాపిల్ ఐపాడ్ ప్రో, 12.9 అంగుళాల ఐపాడ్ ప్రో, 24 అంగుళాల ఐపాడ్ పో’లు డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. ఇక, ఈ సేల్లో కొనుగోలు చేసే ప్రొడక్ట్లపై ఉచితంగా ఎయిర్ పాడ్స్, యాపిల్ కేర్ ప్లస్ ప్లాన్స్ పై 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాక్ టూ యూనివర్సిటీ సేల్లో విద్యార్ధులతో పాటు బోధన,బోధనేతర సిబ్బంది యాపిల్ ప్రొడక్ట్లను మార్కెట్ ధర కంటే తక్కువకే పొందవచ్చు. ప్రస్తుతం, కొనసాగుతున్న సేల్లో అర్హులైన కస్టమర్లు 11 అంగుళాల ఐపాడ్ ప్రో ధర రూ.96,900 ఉంటే రూ.76,900కే కొనుగోలు చేయొచ్చు. 12.9 అంగుళాల ఐపాడ్ ప్రో ధర రూ.1,12,900 ఉంటే రూ.1,02,900కే, రూ.59,900 ఐపాడ్ను రూ.54,900కే పొందవచ్చు. ఈ మూడు ఐపాడ్ మోడళ్లపై సెకండ్ జనరేషన్ యాపిల్ పెన్సిల్లు ఉచితంగా అందిస్తుంది. ఎం 1 పవర్డ్ 13 అంగుళాల మాక్ బుక్ ఎయిర్ను రూ. 89,900కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు లాంచ్ ధర రూ.99,900గా ఉంది. 13 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ 13 అసలు ధర రూ.1,29,900 కాగా రూ.1,04,900 కే విద్యార్ధులు కొనుగోలు చేయొచ్చు. సేల్లో 15 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ ధర రూ. 1,24,900, అసలు ధర రూ. 1,34,900 గా ఉంది. తాజా,ఆఫర్లు ధృవీకరించబడిన విద్యార్ధులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ విద్యార్థులు,ఇతర సిబ్బంది యాపిల్ అధికారిక వెబ్సైట్ను విజిట్ చేసి అర్హులో, కాదో తెలుసుకోవచ్చు. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
ఐఫోన్ 15 అప్డేట్ : ఇక ఆ కలర్ వేరియంట్ ఫోన్లకు యాపిల్ గుడ్బై?
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయని అంచనా. దీంతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల మీద టెక్ అభిమానుల దృష్టిపడింది. ఈ నేపథ్యంలో పలువురు టెక్నాలజీ నిపుణులు ఐఫోన్ 15 సిరీస్ మార్పులు, అప్డేట్ల గురించి ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా, గత కొన్నేళ్లుగా యాపిల్ సంస్థ రెడ్ కలర్ వేరియంట్ ఐఫోన్ల విడుదల చేస్తూ వస్తుంది. కానీ, ఈ ఏడాది నుంచి రెడ్ కలర్ వేరియంట్ ఫోన్లకు స్వస్తి పలకునుందని సమాచారం. As far as future leaks are concerned, I think I’ll stick to iPhone stuff for now. — Unknownz21 🌈 (@URedditor) June 14, 2023 హెచ్ఐవీ, ఎయిడ్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధిల నుంచి సురక్షితంగా ఉంచేలా, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు యాపిల్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2017లో తొలిసారి రెడ్ కలర్ వేరియంట్ ఫోన్ను మార్కెట్కి పరిచయం చేసింది. అదే వేరియంట్లో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఫోన్లను విక్రయిస్తుండేది. ఆ ఫోన్లను అమ్మగా వచ్చిన సొమ్ముతో ఎయిడ్స్ బాధితులకు అండగా నిలిచేందుకు ఉపయోగిస్తుంది ఈ టెక్ దిగ్గజం. ఏది ఏమైనప్పటికీ..ఈ ఏడాది నుంచి రెడ్ కలర్ వేరియంట్ ఫోన్లను యాపిల్ తయారు చేయలేదని, కనుమరుగు కానున్నాయంటూ వచ్చిన ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. -
సూపర్ ఆఫర్: రూ. 2749 కే యాపిల్ ఐఫోన్ 11!
అతి తక్కువ ధరకే యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది ఫ్లిప్కార్ట్. నిబంధనలప్రకారం 2019 లో లాంచ్ చేసిన యాపిల్ ఐఫోన్ 11ను ఇప్పుడు కేవలం రూ. 2749కే దక్కించుకోవచ్చు. ఐఫోన్ 11 ఫ్లిప్కార్ట్ సేల్లో రూ. 36,250 తగ్గింపు తర్వాత కేవలం రూ. 2,749కే లభిస్తుంది. ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్స్లో ఐఫోన్ 11 కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 2020లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ఫోన్. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ఈ స్మార్ట్ఫోన్కు అద్భుతమైన స్పందన లభించింది. ఐఫోన్ 11: 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్ప్లే, A13 బయోనిక్ చిప్సెట్ , 12 ఎంపీ రియర్ డ్యుయల్ కెమెరా ,12 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటివిప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (చైనా స్మార్ట్ఫోన్ మేకర్కి ఎదురుదెబ్బ: సీఈవో గుడ్బై, ప్రత్యర్థికి సై!?) ఆఫర్ ఎలా వర్తిస్తుందంటే.. రూ.4,901 తగ్గింపుతో ఫ్లిప్కార్ట్లో రూ.38,999 లిస్ట్ అయింది. అయితే దీనితో పాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీపై ఫ్లాట్ రూ. 1,250 తగ్గింపును పొందవచ్చు. అంటే ధర రూ. 37,749కి దిగి వచ్చింది. అలాగే పాత స్మార్ట్ఫోన్ మార్పడిద్వారా ఫ్లిప్కార్ట్ రూ. 35,000 వరకు తగ్గింపు లభ్యం. అంటే కేవలం రూ. 2,749కియాపిల్ ఐఫోన్ 11ని పొందవచ్చు. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) మరిన్ని టెక్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
దుమ్మురేపుతున్న ఐఫోన్ అమ్మకాలు, నెలలో రూ.25కోట్ల విలువైన విక్రయాలు!
భారత్లో ఐఫోన్లకు ఉండే ఆ క్రేజే వేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాపిల్ దేశంలోని ఢిల్లీ, ముంబై రెండు స్టోర్లను ప్రారంభించింది. పలు నివేదికల ప్రకారం.. యాపిల్ స్టోర్లు ప్రారంభమైన నెలలోనే దాదాపు రూ.25 కోట్ల విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. . పండగలు లేకపోయినప్పటికీ యాపిల్ భారీ ఆదాయాన్ని అర్జించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా, ముంబై యాపిల్ బీకేసీ స్టోర్ ప్రారంభోత్సవం రోజు రూ.10కోట్లకు విక్రయాలు జరిగాయి. ఆ స్టోర్ ప్రారంభించిన తొలిరోజు 6వేల మందికిపైగా సందర్శించారు. ఈ తరుణంలో యాపిల్ ఉత్పత్తుల సేల్స్ మరింత పెరిగేలా ఐఫోన్ 15, యాపిల్ వాచ్ సిరీస్ 9, మాక్ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో భారత్లో ఐఫోన్ ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ సన్నాహలు చేస్తున్నది. ఐపాడ్, ఎయిర్పాడ్లను అసెంబ్లింగ్ ప్రారంభించాలని యోచిస్తున్నదని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
భారత్లో ఐఫోన్ల తయారీ నిలిపివేత..వ్యాపారంలో లాభాలు లేక సతమతం?
భారత్లో ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాభాల్ని గడించే విషయంలో విస్ట్రాన్ అసంతృప్తిగా ఉంది. కాబట్టే వచ్చే ఏడాది నాటికి దేశీయంగా మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లలో ఐఫోన్ల తయారీని దశల వారీగా నిలిపి వేయనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ అంశంపై విస్ట్రాన్ యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. విస్ట్రాన్ భారత్లో అనుకున్నంత స్థాయిలో దీర్ఘకాలిక లాభాల్ని గడించడంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేలా వియాత్నం, మెక్సికో వంటి దేశాల్లో లాభదాయకమైన టెక్నాలజీ తయారీ సంబంధిత ప్రొడక్ట్లపై దృష్టి సారించినట్లు సమాచారం. ఐఫోన్తో జరిపిన చర్చలు విఫలం ఇక, ఐఫోన్ల తయారీ నిలిపివేతపై విస్ట్రాన్ ఎగ్జిక్యూటీవ్లు కీలక వ్యాఖ్యలు చేశారంటూ రిపోర్ట్లు పేర్కొన్నాయి. భారత్లో యాపిల్ చేస్తున్న బిజినెస్లో ప్రాఫిట్స్ రావడం లేదని, ఎక్కువ లాభాలు వచ్చేలా యాపిల్ సంస్థతో జరిపిన చర్చలు విఫలమైనట్లు హైలెట్ చేశాయి. అయితే అంతర్జాతీయ తయారీ సంస్థలైన ఫాక్స్కాన్, పెగాట్రాన్స్ స్థాయిలో విస్ట్రాన్ ఆదాయాన్ని అర్జించడంలో ఇబ్బందులు పడుతుందని సమాచారం. చదవండి👉 ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా? విస్ట్రాన్ భారత్లో యాపిల్ కోసం ఐఫోన్ ఎస్ఈలను తయారు చేయడమే కాదు..ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అంటే ఐఫోన్ల తయారీ, స్టోరేజ్ నిర్వహణ, అమ్మకాలు జరుపుతుంది. అయినప్పటికీ ఫ్రాఫిట్స్ పొందే విషయంలో ఇబ్బందులు పడుతుంది. వ్యాపారాన్ని మరింత విస్తరించలేకపోతుంది. వేధిస్తున్న అట్రిషన్ రేటు ఇంకా, కర్ణాటకలోని కోలార్ జిల్లా, అచ్చటనహళ్లి గ్రామ పారిశ్రామక వాడలో ఉన్న విస్ట్రాన్ తయారీ యూనిట్లో ఉద్యోగులు స్థిరంగా ఉండటం లేదు. అధిక వేతనం కోసం ఇతర సంస్థల్లో చేరుతున్న సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంది. నివేదిక ప్రకారం.. చైనా - భారత్ల మధ్య వర్క్ కల్చర్ విషయంలో కంపెనీ అనేక సవాళ్లు విస్ట్రాన్ ఐఫోన్ తయారీ నిలిపివేయడానికి దోహదపడ్డాయి. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకపోవడంతో అట్రిషన్ రేట్ పెరిగేందుకు దారి తీసింది. ఐఫోన్ 15 తయారు చేయనున్న టాటా! సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా, విస్ట్రాన్ తన ఐఫోన్ల తయారీని టాటా గ్రూప్కు విక్రయిస్తోంది. ట్రెండ్ ఫోర్స్ రిపోర్ట్ సైతం టాటా గ్రూప్ భారత్లో విడుదల కానున్న ఐఫోన్ 15 మోడళ్లను తయారు చేసేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. చివరిగా.. 2008లో పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సర్వర్లతో సహా ఇతర సేవల్ని అందించేలా విస్ట్రాన్ భారతీయ మార్కెట్లో అడుగు పెట్టింది. 2017లో, కంపెనీ తన కార్యకలాపాలను విస్తరించి యాపిల్ కోసం ఐఫోన్లను తయారు చేయడం ప్రారంభించింది. చదవండి👉‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్కుక్ వైరల్ -
ఐఫోన్ కోసం ఎన్ని తిప్పలో.. రెండో అంతస్తు నుంచి దూకేశాడు.. వీడియో వైరల్!
ఐఫోన్ క్రేజ్ మామూలుగా ఉండదు.. యాపిల్ కంపెనీకి చెందిన ఆ ఫోన్ అంటే ప్రతిఒక్కరికీ మోజు. దానిని కొనాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే అది చాలా ఖరీదు కావడంతో అందరూ కొనలేరు. ఇదీ చదవండి: iPhone 15 Manufacturing: టాటా ఐఫోన్! ఇక ఐఫోన్ 15 తయారీ ఇక్కడే.. అయితే కష్టపడి కొనడం ఎందుకు? కొట్టేస్తే పోలా అనుకున్నాడో వ్యక్తి. యాపిల్ స్టోర్కి వెళ్లి నచ్చిన మోడల్ ఐఫోన్ తీసుకుని పరుగు లంకించుకున్నాడు. ఈ క్రమంలో రెండో అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడ్డాడు. క్రేజీ క్లిప్స్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు మాత్రం ప్రస్తుతానికి అందుబాటులో లేవు. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) Dude jumps off 2nd floor trying to get away after robbing Apple store 😬 pic.twitter.com/pdEjodh1Ka — Crazy Clips (@crazyclipsonly) May 17, 2023 -
టాటా ఐఫోన్! ఇక ఐఫోన్ 15 తయారీ ఇక్కడే..
iPhone 15 Manufacturing: దేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ ఐఫోన్లను తయారు చేయబోతోంది. భారత్లో రాబోయే ఐఫోన్ 15 (iPhone 15), 15 ప్లస్ (15 Plus) ఫోన్లను తయారు చేసేందుకు యాపిల్ (Apple) సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా తైవాన్కు చెందిన ఓ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంటోంది. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! టాటా సంస్థ భారత్లో యాపిల్ కోసం నాలుగో ఐఫోన్ తయారీ భాగస్వామిగా ఉంటుందని తైవాన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్రొవైడర్ ‘ట్రెండ్ఫోర్స్’ పేర్కొంది. టాటా భాగస్వామ్యంతో భారత్లో యాపిల్ మొత్తం ఐఫోన్లలో ఎంత శాతం ఉత్పత్తి చేయనుందో కచ్చితంగా తెలియదు. యాపిల్కు భారత్లో ఇప్పటికే విస్ట్రాన్, ఫాక్స్కాన్, పెగాట్రాన్ అనే మూడు తయారీ భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. అదే విధంగా భారత్లో రెండు రిటైల్ స్టోర్లను యాపిల్ ప్రారంభించింది. టాటా గ్రూప్పై యాపిల్ దృష్టి ట్రెండ్ఫోర్స్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ల తయారీ కోసం భారత్లోని అతిపెద్ద వ్యాపార సంస్థలలో ఒకటిగా ఉన్న టాటా గ్రూప్పై యాపిల్ దృష్టి సారిస్తోంది. ఇది నిజమైతే ఐఫోన్ 15 తొలి షిప్మెంట్లు మొదట భారత్లోనే అందుతాయి. సాధారణంగా ఐఫోన్లు భారత్లోకి ఆలస్యంగా వస్తాయి. ఇక భారత్లోనే తయారైతే ఐఫోన్ 15 సిరీస్ ధరలు కూడా తక్కువ ఉండేందుకు దోహదం చేస్తుంది. దేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో ఉనికిని విస్తరించాలని చూస్తున్న టాటా గ్రూప్నకు ఇది గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కోవిడ్ పరిమితులు, సప్లయి చైన్ సమస్యల కారణంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఇటీవలి కాలంలో దాని తయారీ స్థావరాలను విస్తరించాలని చూస్తోంది. కంపెనీ ఇప్పటికే ఐఫోన్14, ఐఫోన్ SE, ఐఫోన్13లతో సహా కొన్ని ఫోన్లను భారత్లోనే తయారు చేస్తోంది. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! -
నా పాట కాపీ కోటేసారు...
-
ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్..
ఐఫోన్ (iPhone) యూజర్లకు కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఐఫోన్లను కంప్యూటర్కు కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ యాప్ స్టోర్లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ (Microsoft Phone Link) యాప్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ యాప్తో ఐఫోన్ యూజర్లు నేరుగా విండోస్ (Windows) పీసీకి స్మార్ట్ఫోన్ను కనెక్ట్ చేసుకోవచ్చు.మ ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! ఇంతకుముందు ఐఫోన్ను మ్యాక్బుక్ ల్యాప్టాప్తో మాత్రమే కనెక్ట్ చేసుకునే వీలు ఉండేది. ఈ కొత్త అప్డేట్తో ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లను విండోస్ పీసీలకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. iOS కోసం కొత్త ఫోన్ లింక్ యాప్ 85 మార్కెట్లలో 39 భాషల్లో విడుదల చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఈ ఫీచర్ను ప్రకటించారు. విండోస్ 11 యూజర్లందరూ మే నెల మధ్య నాటికి ఫోన్ లింక్లో ఐఫోన్ సపోర్ట్కు యాక్సెస్ పొందుతారని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్లో మైక్రోసాఫ్ట్ ఫోన్ లింక్ యాప్ అందుబాటులోకి వచ్చినా విండోస్ పీసీలలో ఐఫోన్తో కనెక్షన్కు సపోర్ట్ చేయడం లేదు. దీన్ని సరిచేయడానికి మైక్రోసాఫ్ట్ కొత్త యాప్ లేదా సిస్టమ్ అప్డేట్ను విడుదల చేయవచ్చు. అయితే ఈ సమస్య యూజర్లందరికీ లేదు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. విండోస్ 11 పీసీలో ఒకవేళ iOS ఫోన్ లింక్ యాప్కి సపోర్ట్ చేసి ఎనేబుల్ చేసుకుంటే తమ ఐఫోన్ను పీసీకి కనెక్ట్ చేసుకుని కాల్స్, సందేశాలు, కాంటాక్టలను యాక్సెస్ చేసుకునేందుకు iOS సపోర్ట్ చేస్తుందని మైక్రోసాఫ్ట్ ఒక బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది. ఇలా కనెక్ట్ చేసుకోండి.. విండోస్ పీసీలో ఫోన్ లింక్ యాప్ iOSతో కనెక్షన్కు సపోర్ట్ చేస్తే ఐఫోన్ను పీసీకి కనెక్ట్ చేసుకోవడం చాలా సులభం. ఐఫోన్లో యాపిల్ స్టోర్ Microsoft Phone Link యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత 'iPhone'ని ఎంచుకుని, QR కోడ్తో సెటప్ను పూర్తి చేయండి. అనంతరం నోటిఫికేషన్ ప్రాధాన్యతలను సెట్ చేసుకోండి. తర్వాత ఐఫోన్లో ఫోన్ లింక్ యాప్ను ఓపెన్ చేయండి లేదా విండోస్ 11 పీసీ టాస్క్బార్లో ‘ఫోన్ లింక్’ కోసం సెర్చ్ చేయండి. ఇప్పుడు ఐఫోన్ను విండోస్ పీసీకి కనెక్ట్ చేసుకోండి. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
'విరూపాక్ష' డైరెక్టర్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంయుక్తా మీనన్
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో కమర్షియల్ సక్సెస్ని సొంతం చేసుకుంది. చదవండి: ప్రతీకారంతో జైలుపాలు.. డ్రగ్స్ కేసులో నిర్దోషిగా తేలిన హీరోయిన్ సినిమా రిలీజ్ అయిన ఆరు రోజులకు కూడా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్తో దూసుకుపోతుంది. సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో హీరోయిన్ సంయుక్తా మీనన్ డైరెక్టర్ కార్తీక్ దండుకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి షాకిచ్చింది. ఈ విషయంపై సంయుక్తా మాట్లాడుతూ.. 'మూవీ హిట్ కావడంతో కార్తీక్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా. విరూపాక్ష రిలీజ్ రోజు ఓ థియేటర్లో అతని ఫోన్ ఎవరో కొట్టేశారు. దీంతో సినిమా రెస్పాన్స్ చూడటానికి వేరే వాళ్ల ఫోన్లలో చూసేవాడు. అందుకే వెంటనే ఐఫోన్ను కొని గిఫ్ట్గా ఇచ్చాను' అంటూ చెప్పుకొచ్చింది. చదవండి: డైరెక్టర్ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే -
ఐఫోన్ 15 ప్రో మాక్స్ కొత్త ఫీచర్స్...
-
Apple iPhone 15 ప్రో మ్యాక్స్ కెమెరాపై భారీ అంచనాలు, మురిసిపోతున్న యూజర్లు
సాక్షి, ముంబై: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కొత్త ఐఫోన్ను లాంచ్ చేస్తోందటే చాలు.. మార్కెట్లో సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు గణనీయమైనమార్పులతో కొత్త సిరీస్లను రిలీజ్ చేస్తూ ఐఫోన్ లవర్స్ను ఆకట్టుకుంటున్న యాపిల్ త్వరలోనే ఐఫోన్ 15 సిరీస్ను లాంచ్ చేయనుంది. దీంతో ఐఫోన్ సిరీస్ 15 ఫీచర్లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. రోజుకొక కొత్త లీక్ ఐఫోన్ లవర్స్ను ఊరిస్తోంది. ముఖ్యంగా కెమెరా విషయంలో యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. తాజా నివేదికల ప్రకారం ఐఫోన్ 15 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్లో పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్న కొత్త 48ఎంపీ సోనీ సెన్సార్ను వినియోగిస్తోందట. ఐస్ యూనివర్స్ అంచనా ప్రకారం, అధునాతన Sony IMX903 48MP యూనిట్ని ఇందులో ఉపయోగిస్తుంది. ఇటీవల లాంచైన షావోమి 13 అల్ట్రాలోని కెమెరాలానే ప్రధాన సెన్సార్ (సుమారం ఒక అంగుళం) ఉంటుందని టిప్పర్ ట్వీట్ చేయడం గమనార్హం. కాగా గత ఏడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లు సక్సెస్ అయ్యాయి. యాపిల్ కంపెనీ డైనమిక్ ఐలాండ్ ,కెమెరా ఫీచర్లతో తీసుకొచ్చినట్టుగానే 15 సిరీస్ మోడల్స్లో కీలక మార్పులు ఉంటాయని అంచనాలు భారీగా నెకొలన్నాయి. 6x జూమ్కు మద్దతు ఇచ్చేపెరిస్కోప్ లెన్స్ ఫీచర్తో పవర్ఫుల్ కెమెరాతో వస్తున్న తొలి ఐఫోన్ కానుందని అంచనా. కొత్త టెక్నాలజీతో తీసుకొస్తుందని భావిస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఈ ఏడాది చివర్లో లాంచ్ కానుంది. The iPhone's main camera is improving every year, which is commendable, with 15pm approaching 1 ". iPhone 15 Pro Max :IMX903,≈1” iPhone 14 Pro:48MP, IMX803,1/1.28 iPhone 13 Pro:12MP,IMX703,1/1.63 iPhone 12 Pro:12MP, IMX603,1/1.78 iPhone 11 Pro:12MP, IMX503, 1/2.55 — Ice universe (@UniverseIce) April 23, 2023 -
‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్కుక్ వైరల్
భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈవో టిమ్కుక్ ముంబైలో సందడి చేశారు. ఏప్రిల్ 18న యాపిల్ తన మొదటి స్టోర్ను ముంబైలో, ఏప్రిల్ 20న ఢిల్లీలో రెండో స్టోర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముంబైలోని ప్రముఖ స్వాతీ స్నాక్స్ రెస్టారెంట్లో భారతీయులు అమితంగా ఇష్టపడే వడపావ్ను బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్తో కలిసి యాపిల్ సీఈవో టిమ్కుక్ రుచి చూశారు. వడపావ్ చాలా బాగుంది అంటూ ఆ ఫోటోల్ని ట్వీట్ చేశారు. Thanks @madhuridixit for introducing me to my very first Vada Pav — it was delicious! https://t.co/Th40jqAEGa — Tim Cook (@tim_cook) April 17, 2023 నటి మాధురీ దీక్షిత్ టిమ్ కుక్తో కలిసి వడ పావ్ తింటున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకున్నారు. “ముంబైకి వడ పావ్ కంటే మెరుగైన స్వాగతం గురించి ఆలోచించలేను!” అని ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. Can’t think of a better welcome to Mumbai than Vada Pav! pic.twitter.com/ZA7TuDfUrv — Madhuri Dixit Nene (@MadhuriDixit) April 17, 2023 -
భారత్లో తొలి యాపిల్ స్టోర్.. ఫస్ట్ లుక్ అదిరింది!
భారత్లో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ దేశీయంగా రెండు యాపిల్ రిటైల్ స్టోర్లను ప్రారంభించనుంది. ఏప్రిల్ 18న యాపిల్ తన మొదటి స్టోర్ను ముంబైలో, ఏప్రిల్ 20న ఢిల్లీలో రెండో స్టోర్ తెరవనుంది. ప్రపంచంలోని ఐకానిక్ బ్రాండ్ రీటైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి టిమ్ కుక్ హాజరు కానున్నారు. పలు నివేదికల ప్రకారం.. యాపిల్ సీఈవో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. యాపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓబ్రియన్ మాట్లాడుతూ..యాపిల్ రీటైల్ స్టోర్లలో ఉండే 100 మంది సిబ్బంది 18 మంది భాషల్లో మాట్లాడతారని తెలిపారు. సంస్థ దేశంలో 2,500 మందికి ఉపాధి కల్పిస్తోందని, యాప్ ఎకోసిస్టమ్ ద్వారా 10 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో పరోక్షంగా సహాయపడిందని ఆమె చెప్పారు. యాపిల్కు ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో 500 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఆ స్టోర్లలో ఉన్న ఫీచర్లే భారత్లో ప్రారంభించబోయే స్టోర్లలో ఉన్నాయి. అయితే స్థానికతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన రెండు స్టోర్లూ భారత వినియోగదారులకు కొత్త అనుభూతిని పంచేలా దృష్టిసారించింది. ముఖ్యంగా స్టోర్ లోపల గోడల కోసం, కంపెనీ ప్రత్యేకంగా రాజస్థాన్ నుండి రాయిని కొనుగోలు చేసింది. 4.5 లక్షల కలప ముక్కలు పైకప్పు గోడలను అలంకరించింది.స్టోర్లో ఉత్పత్తులు, కస్టమర్ల కోసం అందుబాటులో ఉన్న గాడ్జెట్లను రిపేర్ చేయడం వంటి సేవలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్లు మాట్లాడుతూ..కస్టమర్లు ప్రొడక్ట్లను తనిఖీ చేసుకోవచ్చని వాటిని ఎలా ఉపయోగించాలనే అంశంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. -
ఐఫోన్ మేడ్ ఇన్ ఇండియా! చైనా కంటే అధికంగా భారత్లో ఉత్పత్తి
ప్రీమియం ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 7 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. అంటే ఇది గతంలో కంటే మూడు రెట్లు అధికం. దీంతో స్మార్ట్ఫోన్ రంగంలో భారత్.. చైనా దాటి వేగంగా దూసుకెళ్తోంది. (New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు!) ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ నుంచి పెగాట్రాన్ కార్ప్కి విస్తరించిన భాగస్వాముల ద్వారా యాపిల్ ఇప్పుడు దాదాపు 7 శాతం ఐఫోన్లను భారతదేశంలో తయారుచేస్తోంది. 2021లో 1 శాతం వాటాను కలిగి ఉన్న భారతదేశానికి ఇది గణనీయమైన పురోగతి. వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాపై ఆధారపడటాన్ని యాపిల్ తగ్గించి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. గత సంవత్సరం జెంగ్జౌలోని ఫాక్స్కాన్ ప్రధాన “ఐఫోన్ సిటీ” కాంప్లెక్స్లో గందరగోళం కారణంగా యాపిల్ ఉత్పత్తి అంచనాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. మరోవైపు భారత ప్రభుత్వం తయారీ రంగాన్ని పెంపొందించడానికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో యాపిల్ చైనాను కాదని భారత్లో ఉత్పత్తిని పెంచింది. ఇదే దూకుడు కొనసాగితే 2025 నాటికి మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో నాలుగింట ఒక వంతు భారత్లోనే జరగనుంది. తన సప్లయి చైన్ను విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించిన యాపిల్ భారతదేశంలో ప్రోత్సాహకాల కోసం విజయవంతంగా లాబీయింగ్ చేసింది. ఫాక్స్కాన్, విస్ట్రాన్ కార్ప్, పెగాట్రాన్ సంస్థలతో జత కట్టింది. ఈ మూడు కలిసి భారత్లో దాదాపు 60,000 మందికి ఉపాధి కల్పించాయి. ఐఫోన్ 11 నుంచి తాజా ఐఫోన్ 14 వరకు మోడల్లను ఇక్కడ తయారు చేస్తున్నాయి. యాపిల్ తన మొదటి రెండు రిటైల్ స్టోర్లను వచ్చే వారం భారతదేశంలో ప్రారంభించనుంది. ఒకటి ఆర్థిక కేంద్రమైన ముంబైలో, మరొకటి దేశ రాజధాని న్యూఢిల్లీలో. యాపిల్ చీఫ్ టిమ్ కుక్ వీటిని ప్రారంభించేందుకు స్వయంగా వస్తారని తెలుస్తోంది. -
టాటా చేతికి ఐఫోన్ ప్లాంట్.. కొత్త రంగంలోకి దేశీయ దిగ్గజం
దేశీయ మార్కెట్లో ఎంతోమంది ప్రజలకు నమ్మికైనా టాటా గ్రూప్ బెంగళూరులోని విస్ట్రాన్ ఐఫోన్ ప్లాంట్ను ఏప్రిల్ చివరి నాటికి కొనుగోలు చేసే అవకాశం ఉందని నివేదికల చెబుతున్నాయి. ఇదే జరిగితే యాపిల్ ఉత్పత్తుల కోసం భారతదేశం మొదటి స్వదేశీ ఉత్పత్తి శ్రేణిగా అవతరిస్తుందనటంలో సందేహం లేదు. టాటా గ్రూప్ ఇప్పటికే ఈ విస్ట్రాన్ ప్లాంట్లో కొన్ని మార్పులను చేయడం కూడా ప్రారంభించింది. అయితే ఈ ప్లాంట్ సొంతం చేసుకునే క్రమంలో సుమారు రెండు వేల మంది కార్మికులను తొలగించే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో మధ్య స్థాయి ఉద్యోగుల నుంచి, సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్ల వరకు ఉండటం గమనార్హం. టాటా గ్రూప్ ఈ కంపెనీని సొంతం చేసుకున్న తరువాత ఐఫోన్ 15ను తయారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విస్ట్రాన్ ప్లాంట్లోని ఎనిమిది ఉత్పత్తి లైన్లలో ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 14 తయారవుతున్నాయి. టాటా బెంగళూరు ప్లాంట్ను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆపిల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే ఏకైక ప్లాంట్ విస్ట్రాన్ పూర్తిగా దేశీయ మార్కెట్కు దూరంగా ఉంటుంది. ఇవన్నీ టాటా గ్రూప్ సొంతమవుతాయి. యాపిల్ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్ సుమారు 600 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ టేకోవర్ ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆపిల్ చైనా నుండి షిఫ్ట్ను ప్లాన్ చేస్తోంది, ఈ కారణంగానే ఇండియాలోని ప్లాంట్ టాటా ద్రౌప్ స్వాదీనం చేసుకునే అవకాశం ఏర్పడింది. గత ఏడాది కాలిఫోర్నియాకు చెందిన కుపెర్టినో కంపెనీ చైనా, అమెరికా మధ్య విభేదాలు ఏర్పడిన కారణంగా తమ ఉత్పత్తిలో 25శాతం భారతదేశానికి మార్చాలని దాని కోసం తన ప్రణాళికలను కూడా ప్రకటించింది. మన దేశంలో ఆపిల్ ఉత్పత్తులను అసెంబ్లింగ్ చేసే మూడు తైవాన్ కంపెనీలలో విస్ట్రాన్, పెగాట్రాన్, ఫాక్స్కాన్ వున్నాయి. ఇప్పుడు 'విస్ట్రాన్'లో కంపెనీ ఉత్పత్తులు నిలిపివేయగా.. ఫాక్స్కాన్, పెగాట్రాన్లలో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే భారతదేశంలో టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. దీనికోసం కొత్త ఉత్పత్తులను ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఐఫోన్ కోసం పెగాట్రాన్ తయారీ యూనిట్లను టాటా కొనుగోలు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. -
యాపిల్ లవర్స్కు గుడ్ న్యూస్.. రిటైల్ స్టోర్ ప్రారంభం అప్పుడే!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. భారత్లో తొలి రిటైల్ స్టోర్ ‘యాపిల్ బీకేసీ’ (Apple BKC) ను ఏప్రిల్ 18న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. బ్లూమ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం.. యాపిల్ సీఈవో టిమ్కుక్ ఏప్రిల్ 18న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఉదయం 11 గంటలకు భారత్లో తొలి అధికారిక రిటైల్ స్టోర్ ప్రారంభించనున్నారు. రెండ్రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 20 ఉదయం 10 గంటలకు ఢిల్లీ సాకెట్లోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో యాపిల్ రిటైల్ స్టోర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు నివేదిక పేర్కొంది. లాస్ ఎంజెల్స్,న్యూయార్క్, బీజింగ్, మిలాన్, సింగ్పూర్ దేశాల తరహాలోనే ముంబైలోని యాపిల్ బీకేసీ రీటైల్ స్టోర్ 22,000 చదరపు అడుగుల్లో నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో యాపిల్ సంస్థ రీటైల్ స్టోర్ల సంఖ్య 25 దేశాల్లో 552కి చేరినట్లైంది. -
ఎలక్ట్రిక్ విభాగంలో ఫాక్స్కాన్ భారీ పెట్టుబడులు!
ఎలక్టాన్రిక్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్నకు చెందిన ‘ఫాక్స్కాన్’ సంస్థ సౌత్ తైవాన్లో ఎలక్ట్రిక్ విభాగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఫాక్స్కాన్ తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ కోసం రాబోయే మూడేళ్లలో తైవాన్లో 820 మిలియన్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే సౌత్ తైవాన్ Kaohsiung Cityలో ఫాక్స్కాన్ ఎలక్ట్రిక్ బస్సులు, ఈవీ బ్యాటరీలు తయారు చేసే ప్లాంట్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో ఫాక్స్కాన్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధులు తెలిపారు. కాగా, ఫాక్స్ కాన్ సంస్థ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు చెందిన ఐఫోన్లను తయారు చేసే ప్రధాన ఉత్పత్తి దారుల్లో ఒకటిగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితం భారత్లోని పలు రాష్ట్రాల్లో ఇదే సంస్థ ఐఫోన్ల తయారీ యూనిట్లును నెలకొల్పేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.