Omicron ఎఫెక్ట్‌.. కీలక భేటీ నిరవధిక వాయిదా! | Omicron Variant WTO indefinitely postpone Ministerial meet | Sakshi
Sakshi News home page

ఒమిక్రాన్‌ భయం.. ట్రావెల్‌ బ్యాన్‌, ఎంసీ12 భేటీ వాయిదా

Published Sat, Nov 27 2021 4:06 PM | Last Updated on Sat, Nov 27 2021 8:06 PM

Omicron Variant WTO indefinitely postpone Ministerial meet - Sakshi

ఒమిక్రాన్‌ భయం నేపథ్యంలో ట్రావెల్‌ బ్యాన్‌ తెర మీదకు వచ్చింది.

ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త గుబులుతో ఉడికిపోతోంది.  బీ.1.1.529 కరోనా వేరియంట్‌పై ప్రపంచ దేశాల ఆందోళన పెరిగిపోతోంది. వ్యాక్సిన్‌లకు సైతం తలొగ్గని ఒమిక్రాన్‌ మొండి వేరియంట్‌ కావడంతో పలు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు తెర మీదకు వస్తున్నాయి. 

వచ్చే వారం జెనీవాలో డబ్ల్యూటీవో మినిస్టీరియల్‌(ఎంసీ12) కాన్ఫరెన్స్‌ జరగాల్సి ఉంది.  అయితే కొత్త వేరియెంట్‌ ఠారెత్తిస్తున్న తరుణంలో ఈ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్లకొకసారి జరిగే ఎంసీ12 భేటీలో మల్టీలేటరల్‌ ట్రేడ్‌ అగ్రిమెంట్స్‌ గురించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రపంచంలో 98 శాతం వాణిజ్యాన్ని సమీక్షించే డబ్ల్యూటీవోలో 164 మంది సభ్యులు ఉన్నారు.

ఇక నవంబర్‌ 30 డిసెంబర్‌ 3 మధ్య  వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ఎంసీ12 సమావేశం  జరగాల్సి ఉంది. అయితే స్విస్‌ ప్రభుత్వం శుక్రవారం నుంచి అంతర్జాతీయంగా ట్రావెల్‌ బ్యాన్‌ ప్రకటించింది. ముఖ్యంగా సౌతాఫ్రికా, హాంకాంగ్‌, బెల్జియం ఇతర దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలను నిషేధించింది. ఈ నేపథ్యంలోనే భేటీని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది WTO.  ఇదిలా ఉంటే ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులు వెలుగుచూశాక.. త్వరలో జరగాల్సిన కీలక సమావేశాలు, అంతర్జాతీయ సదస్సులు చాలానే వాయిదా పడ్డాయి.

చదవండి: ఆ మార్కెట్‌లో మళ్లీ కరోనా కలకలం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement