గంగాధరనెల్లూరు: అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా సీఎం జగనన్న అని డెప్యూటీ సీఎం కే.నారాయణస్వామి కొనియాడారు. మంగళవారం ఆయన మండలంలోని అగరమంగళం, వెజ్జుపల్లి పంచాయతీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీప్రియదామోదరం ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం డెప్యూటీ సీఎం మాట్లాడుతూ పేదల జీవితాలలో వెలుగులు నింపిన దేవుడు జగనన్న అని తెలిపారు. పేద ప్రజలకు జరుగుతున్న మంచిని ఓర్వలేక దుష్టశక్తులు ఎన్నో ప్రయత్నాలు చేసి అడ్డుంకులు సృష్టించాయని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో మంచి చేసిన జగనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ పూర్ణచంద్రారెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ బ్యూటిఫికేషన్కార్పొరేషన్న్ డైరెక్టర్ గుణశేఖర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వేల్కూరు బాబురెడ్డి, జిల్లా రైతు అధ్యక్షుడు వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునిరాజారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వీరక నెల్లూరు కోదండన్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్, సీనియర్ నాయకులు నాయనిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, ఎంపీటీసీ ఇందిర, వెజ్జుపల్లి సర్పంచ్ హరిప్రసాద్రెడ్డి, ఎంపీటీసీ బాలసుబ్రమణ్యంరెడ్డి, మండల నాయకులు దామోదరం, గోపి, చిట్టి, వెంకటేశు, రుక్మానందరెడ్డి పాల్గొన్నారు.