
లక్నో: జర్నలిస్టులపై దాడి చేశారన్న ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్తోపాటు ఆ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మొరాదాబాద్ జిల్లా పఖ్వారా పోలీస్స్టేషన్లో శుక్రవారం రాత్రి ఓ విలేకరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ నెల 11వ తేదీన ఓ హోటల్లో అఖిలేశ్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు పలు ప్రశ్నలు సంధిం చారు. దీనిపై అఖిలేశ్ అసహనం వ్యక్తం చేశారు. అఖిలేశ్ ఉసిగొల్పడంతో వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అనుచరులు విలేకరులపై దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు విలేకరులు గాయపడ్డారని బాధితుడొకరు పోలీసుల కిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment