HYD: సూరారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రయాణికులకు గాయాలు | Rtc Bus Accident In ​Hyderabad Suraram | Sakshi
Sakshi News home page

HYD: సూరారంలో డివైడర్‌ను ఢీకొన్న బస్సు.. ప్రయాణికులకు గాయాలు

Published Sun, Jul 7 2024 7:33 PM | Last Updated on Sun, Jul 7 2024 7:45 PM

Rtc Bus Accident In ​Hyderabad Suraram

సాక్షి,హైదరాబాద్‌: నగరంలోని సూరారంలో ఆదివారం​(జులై 7) సాయంత్రం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు మండిపడ్డారు. ఈ ఘటనతో బహదూర్‌పల్లి చౌరస్తా నుంచి సూరారం వరకు ట్రాఫిక్‌జామ్‌ అయింది.

వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. జీడిమెట్ల డిపో బస్సు గండి మైసమ్మ నుంచి సికింద్రాబాద్‌ వెళుతుండగా ప్రమాదం జరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement