ప్రియుడిపై యాసిడ్‌ పోసిన ప్రియురాలు | Young Woman Pours Acid On Lover In Nandyal | Sakshi
Sakshi News home page

ప్రియుడిపై యాసిడ్‌ పోసిన ప్రియురాలు

Published Fri, Sep 4 2020 11:05 AM | Last Updated on Fri, Sep 4 2020 3:11 PM

Young Woman Pours Acid On Lover In Nandyal - Sakshi

సాక్షి, కర్నూలు: తనను కాదని మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడన్న కోపంతో ప్రియుడిపై యాసిడ్‌ దాడి చేసిందో యువతి. ఈ సంఘటన జిల్లాలోని నంద్యాల మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన నాగేంద్ర, సుప్రియ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరని, ప్రేమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని నాగేంద్ర ఆమెతో ప్రేమకు బ్రేకప్‌ చెప్పాడు. ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రియుడి వివాహాన్ని జీర్ణించుకోలేకపోయింది సుప్రియ. అతడిపై యాసిడ్‌ దాడికి పాల్పడింది. యాసిడ్‌ దాడిలో నాగేంద్ర ముఖం, చెయ్యి బాగా కాలిపోవటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అందుకే యాసిడ్ పోశా: సుప్రియ
తనను మోసం చేసింది కాక తిరిగి తనతో ప్రేమగా ఉండాలని వేధించడంతో యాసిడ్ దాడికి పాల్పడినట్టు సుప్రియ వెల్లడించింది. తనతో పెళ్లికి కులం పేరుతో అడ్డు చెప్పి మరో యువతిని పెళ్లి చేసుకొని మళ్లీ ఇప్పుడు ప్రేమ పేరుతో వేధిస్తుంటే తట్టుకోలేక ఇలా చేశానని ఆమె తెలిపారు.


చదవండి : ప్రేయసి చితిలో పడి ప్రియుడి ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement