Acid Attack
-
ప్రేమోన్మాది కోసం గాలింపు
-
యాసిడ్ దాడి నిందితుడు గణేష్ ఎక్కడ?
అన్నమయ్య, సాక్షి: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై ఉన్మాదంతో నాశనం చేయాలని చూసిన నిందితుడు గణేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు!. నేరం జరిగిన కాసేపటికే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. ఆ వెంటనే మాట మార్చేశారు. దీంతో.. ఈ కేసులో పోలీసుల అలసత్వంతో పాటు, రాజకీయ నేతల జోక్యం ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి.మరీ ముఖ్యంగా చిన్నారులు, మహిళలలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. నంద్యాల ముచ్చుమర్రి బాలిక కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదు. వీటికి తోడు ఉన్మాద ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నా.. కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలైతే కనిపించడం లేదు.తాజాగా.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ పరిధిలోని ప్యారంపల్లెలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. త్వరలో వివాహం కావాల్సిన ఓ యువతిపై.. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని గ్రామానికి చెందిన గౌతమిగా గుర్తించగా.. నిందితుడు అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్గా పోలీసులు ప్రకటించారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోపే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. తర్వాత అతని జాడ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరకు.. అతను పరారీలో ఉన్నాడని, గాలింపు కోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు ప్రకటించారు. దీంతో బాధితురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా.. నిందితుడు గణేష్ తండ్రి సుంకారపు మురళి టీడీపీ నేత. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్బాషాకు ప్రధాన అనుచరుడు. అంతేకాదు.. కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా సన్నిహితుడే. దీంతో నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని బాధితురాలి బంధువులు నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఈ కేసులో న్యాయం జరిపిస్తామని హామీ ఇస్తున్నా.. ఇంత వరకు కేసులో ఎలాంటి పురోగతి చోటు చేసుకోలేదు. ఉన్మాది దాడి ఇలా..యువతి డిగ్రీ వరకు చదువుకుని మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. పట్టణంలోని అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురిచేసేవాడు. యువతికి ఈనెల 7న బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న గణేశ్.. శుక్రవారం ఉదయం 6 గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. యువతి తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఆమె వద్దకు వెళ్లి ముఖంపై యాసిడ్ పోసి కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టు పక్కలవాళ్లు వచ్చారు. అప్పటికే నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యులు యువతిని 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి వల్ల బాధితురాలి ముఖంపై గాయాలయ్యాయి. దీంతో బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు. బాధిత కుటుంబ ఫిర్యాదుతో కొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్తో దాడి చేయటాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. -
యాసిడ్ తాగించి.. కత్తితో పొడిచి!
గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా), మదనపల్లె, పీలేరు: అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో కామ పిశాచాలు వరుసగా అఘాయిత్యాలకు తెగబడుతున్నాయి. ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ కుటుంబం వెనుక ఉన్నారని.. రెడ్బుక్ రాజ్యాంగ పాలనలో తమను ఏమీ చేయలేరనే ధీమాతో అన్నమయ్య జిల్లాలో ఓ ఉన్మాది నిశ్చితార్థం జరిగిన యువతిపై అత్యంత కిరాతకంగా యాసిడ్తో దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన బాధితురాలు ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. వారం క్రితం నిశ్చితార్థం.. మరో రెండు నెలల్లో పెళ్లి.. ఇక జీవితమంతా ఆనందంగా సాగుతుందని కలలు కన్న ఆ యువతి జీవితంలో ప్రేమికుల రోజు రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకొంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లెలో శుక్రవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడి తండ్రి సంకారపు మురళి మదనపల్లె, కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు సన్నిహితుడు కావడం గమనార్హం. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్బాషా ప్రధాన అనుచరుడైన మురళికి టీడీపీలో క్రియాశీల సభ్యత్వం కూడా ఉంది.వేధింపులతో ఉద్యోగం మానేసి..ప్యారంపల్లెకు చెందిన దాసరి జనార్దన్, రెడ్డెమ్మల కుమార్తె గౌతమి (21) డిగ్రీ తరువాత బ్యూటీషియన్ కోర్సు చేసి మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పని చేస్తోంది. మదనపల్లెలోని అమ్మచెరువు మిట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు మురళీ కుమారుడు గణేష్ (24) ప్రేమ పేరుతో బాధితురాలిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. అతడి ఆగడాలు భరించలేక బాధితురాలు మూడు నెలల కిందట ఉద్యోగం వదిలేసి సొంత గ్రామమైన ప్యారంపల్లెలో తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. పీలేరుకు చెందిన మేనత్త కుమారుడితో ఆమెకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శ్రీకాంత్తో ఈనెల 7వ తేదీన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే ఏప్రిల్ 29 తేదీన వీరిద్దరికీ వివాహం చేయాలని నిర్ణయించారు. ఏడాదిగా బాధితురాలిని వేధిస్తున్న నిందితుడు గణేష్ ఆమెను అంతమొందించేందుకు 15 రోజుల కింద ప్యారంపల్లెకు వెళ్లి రెక్కీ నిర్వహించాడు. శుక్రవారం ఉదయం బాధితురాలి తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి గడియ వేశాడు. తనతోపాటు తెచ్చుకున్న యాసిడ్ బాటిల్తో ఆమెపై దాడి చేసి బలవంతంగా తాగించాడు. తలపై కూడా పోశాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమెపై దాడి చేసి పలుచోట్ల కత్తితో పొడిచాడు. అనంతరం ఆమె వద్ద నుంచి సెల్ఫోన్ లాక్కుని పరారయ్యాడు. పొలం నుంచి పరుగులు తీస్తూ..బాధితురాలి ఇల్లు గ్రామం చివరిలో ఉండటం, అందరూ పొలం పనులకు వెళ్లడంతో ఈ దాష్టీకం ఎవరి కంట పడలేదు. అయితే తన తల్లి సెల్ఫోన్ను ఇంటి వద్దనే ఉంచి వెళ్లడంతో తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పొలం నుంచి పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. తొలుత 108 వాహనంలో గుర్రంకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం బెంగళూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్తో దాడి చేయటాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. –సాక్షి, అమరావతినిత్యం మహిళలపై దాడులు..యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. బాధిత కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ ఫోన్లో పరామర్శించారు. మంత్రి రాంప్రసాద్, ఎమ్మెల్యే షాజహాన్బాషా బాధితురాలిని పరామర్శించేందుకు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే పోలీసులు స్పందించి నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
విశాఖలో దారుణం.. అంగన్వాడీ టీచర్పై యాసిడ్ దాడి!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. విశాఖలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్ మున్నీసా బేగంపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో భాదితురాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ దారుణ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
విశాఖలో మహిళలపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం
-
మహిళ దుస్తులు నచ్చలేదని ‘యాసిడ్ దాడి’ బెదిరింపు
బెంగళూరు: ఓ మహిళ తనకు నచ్చిన దుస్తులు వేసుకున్నందుకు.. యాసిడ్ పోస్తానని సోషల్ మీడియాలో బెదిరించిన ఓ వ్యక్తిని అతని యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ‘‘అతనికి నచ్చని దుస్తులు వేసుకున్నందుకు యాసిడ్ పోస్తానని నా భార్యను నికిత్శెట్టి అనే వ్యక్తి బెదిరిస్తున్నాడు, వెంటనే ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి’’అని జర్నలిస్ట్ షాబాజ్ అన్సార్ ఎక్స్లో పోస్టు చేశారు. దీనికి కర్ణాటక అధికారులను ట్యాగ్ చేశారు. దీంతో నెటిజన్స్ మహిళకు మద్దతుగా నిలిచారు. నికిత్ శెట్టిపై చర్యలు తీసుకోవాలని అతడు ఉద్యోగం చేస్తున్న సంస్థ ఎటియోస్ డిజిటల్ సరీ్వసెస్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై నికిత్ శెట్టి యాజమాన్యం స్పందించింది. అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ‘‘మా ఉద్యోగి మరో వ్యక్తి దుస్తుల ఎంపిక గురించి బెదిరించడం మాకు బాధ కలిగించింది. ఈ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఇది మా విలువలకు విరుద్దం. మేం నికిత్ శెట్టిని తొలగిస్తున్నాం. అతనిపై ఫిర్యాదు చేశాం. కేసు నమోదు అయ్యింది’’అని ఎటియోస్ డిజిటల్ సరీ్వసెస్ తెలిపింది. అయితే తన భార్యను బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకున్న కంపెనీకి, అందుకు మద్దతు తెలిపిన పలువురు నెటిజన్స్కు అన్సార్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఈ ఛాయాచిత్రాలు...కన్నీటి కథలు...పోరాట రూపాలు
వన్య్రన ప్రాణులపై ఆసక్తితో సరదాగా కెమెరాను చేతపట్టింది నాన్కీ సింగ్.అయితే ఇప్పుడు ఆమె దృష్ణి కోణం మారింది.తన కెమెరా ఇప్పుడు బాధితుల చేతిలో ఆయుధం. వారి పోరాట పటిమకు నిదర్శనం. సరదాగా ‘రీల్స్’ చేసే వయసులో సామాజిక విషయాలపై దృష్టి పెట్టింది 22 సంవత్సరాల నాన్కీ సింగ్.దిల్లీకి చెందిన నాన్కీ సింగ్ యాసిడ్–ఎటాక్ సర్వైవర్ల జీవితాలను ‘ఏ జర్నీ టు ది మిర్రర్’ పేరుతో డాక్యుమెంటేషన్ చేసింది.ఈ ఛాయాచిత్ర ప్రదర్శన దిల్లీలోని స్టెయిన్లెస్ గ్యాలరీలో జరుగుతోంది.అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగింది... అనే వార్త చదివి ‘అయ్యో’ అనుకుంటాం. దాడి చేసిన దుర్మార్గుడిని తిట్టుకుంటాం. వాడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం.ఎవరి పనుల్లో వారు బిజీ కావడం వల్ల, ఎవరి లోకంలో వారు ఉండిపోవడం వల్ల ‘ఘటన తరువాత యాసిడ్ బాధితురాలి పరిస్థితి ఏమిటి?’ అనేదానిపై దృష్టి మళ్లదు.‘సర్వైవర్’ అన్న సానుకూల మాటేగానీ యాసిడ్–సర్వైవర్లలో చాలామంది జీవితాలు నరక్రపాయంగా ఉంటాయి. సానుభూతికే పరిమితమైనవారు సహాయానికి ముందుకు రాకపోవచ్చు. అంతకుముందు వరకు ఆత్మీయులుగా ఉన్నవారు అందనంత దూరం జరగవచ్చు.‘బతికాను సరే, ఎలా బతకాలి’ అనేది వారికి ప్రధాన సమస్య అవుతుంది. ఉద్యోగం చేయడం నుంచి సొంతంగా చిన్నపాటి వ్యాపారం మొదలు పెట్టడం వరకు ఏదీ సులభం కాదు.యాసిడ్ దాడి బాధితుల గురించి ఎన్నో ఆర్టికల్స్ చదివిన నాన్కీసింగ్ తన కాలేజి అసైన్మెంట్లో భాగంగా వారి కష్టాలు, కన్నీళ్లు, పోరాటాలను ప్రపంచానికి చూపించాలనుకుంది. అలా ‘ఏ జర్నీ టు ది మిర్రర్’ప్రాజెక్ట్ పట్టాలకెక్కింది. ఈ ప్రాజెక్ట్ కోసం నోయిడాలోని చాన్వ్ అనే ఫౌండేషన్ ప్రతినిధులను సంప్రదించింది. యాసిడ్ దాడి బాధితులకు వైద్య, ఆర్థిక సహాయాలు అందించడంతో పాటు పునరావాసం కలిగించే సంస్థ ఇది.నాన్కీ ఎంతోమంది సర్వైవర్స్తో మాట్లాడింది. మొదట్లో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు.అయితే పరిచయం స్నేహంగా మారిన తరువాత మనసు విపారు ఒక్కొక్కరిది ఒక్కోకథ.కన్నీళ్లు తెప్పించే కథ.చుట్టూ చీకటి కమ్ముకున్న క్లిష్ట సమయంలోనూ వెలుగు దారుల వైపు అడుగులు వేసిన కథ.సబ్జెక్ట్తో ఫొటోగ్రాఫర్ మమేకం అయినప్పుడు చిత్రం ప్రేక్షకుల దగ్గరికి వేగంగా వెళుతుంది. తాను ఎంచుకున్న సబ్జెక్ట్కు అనుగుణంగా సాంకేతిక జ్ఞానాన్ని వాడుకుంది నాన్కీ.ఉద్దేశపూర్వకంగానే బ్లాక్ అండ్ వైట్లో ఫొటోలు తీసింది. దీనికి కారణం కలర్ ఫొటోలు సబ్జెక్ట్కు అతీతంగా వేరే అంశాలపై దృష్టి మళ్లిస్తాయి.బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు మాత్రం నేరుగా సబ్జెక్ట్పై దృష్టి పడేలా చేస్తాయి.‘అద్దంలో నా ముఖం చూసుకోవాలంటే అంతకుమించిన నరకం లేదు అని చాలామంది అమ్మాయిలు నాతో పదేపదే చెప్పారు’ అంటుంది నాన్కీ సింగ్.అలాంటి వారిలో ధైర్యం నింపింది నాన్కీ. ‘మీరేమీ తప్పు చేయలేదు. కష్టాలను తట్టుకొని మీరు చేస్తున్న జీవన పోరాటం సాధారణమైనదేమీ కాదు’ అని చెప్పింది.కాలేజి ప్రాజెక్ట్లో భాగంగా యాసిడ్ దాడి బాధితుల దగ్గరికి వచ్చిన నాన్కీ వారితో కలిసి ప్రయాణం చేస్తోంది. వారి కష్టాలను పంచుకుంటోంది.‘ఫొటోగ్రాఫర్లు, డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్లు వారి దగ్గర రావడం కొత్తేమీ కాదు. అయితే నేను మాత్రం ప్రాజెక్ట్కు అతీతంగా వారితో అనుబంధం పెంచుకోవాలనుకున్నాను. వారికి ఏది నచ్చుతుందో, నచ్చదో తెలుసుకోవాలనుకున్నాను. వారిని కేవలం బాధితులుగా చూడడం నాకు ఇష్టం లేదు’ అంటుంది నాన్కీ సింగ్.తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు వారి దగ్గరకు వెళ్లి మాట్లాడి వస్తుంది. వారి బర్త్డేకు కేక్ కట్ చేయించి ఫొటోలు దిగుతుంది.తన ఫొటో ఎగ్జిబిషన్ల ద్వారా యాసిడ్ దాడి బాధితుల కోసం నిధుల సేకరణ చేస్తోంది.వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్గా తన ప్రయాణం మొదలు పెట్టింది నాన్కీ. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాకు వెళ్లింది. అక్కడినుంచి తిరిగి వచ్చిన తరువాత దిల్లీలోని చాందిని చౌక్లాంటి ప్రాంతాల్లో స్ట్రీట్ ఫొటోగ్రఫీ చేసింది. ఫొటోగ్రఫీలోని సాంకేతిక విషయాలపై పట్టుకోసం న్యూయార్క్లోని ‘స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్’లో చేరింది.నాన్కీ సింగ్ ఇప్పుడు సామాజిక విషయాలపై దృష్టి పెట్టింది. మహిళల హక్కుల నుంచి వారిపై జరుగుతున్న హింస వరకు ఎన్నో అంశాలపై ఫోటో ప్రాజెక్ట్లు చేస్తోంది.వారి కుటుంబంలో భాగం అయింది...‘ఎ జర్నీ టు ది మిర్రర్’ప్రాజెక్ట్ పూర్తికాగానే ‘ఇక సెలవు’ అనే మాట నాన్కీసింగ్ నోట వినిపించలేదు.‘మళ్లీ మళ్లీ కలుస్తుంటాను’ అన్నది నాన్కీ. అనడమే కాదు తనకు సమయం దొరికినప్పుడల్లా యాసిడ్ దాడి బాధితుల దగ్గరికి వెళుతుంది. వారితో సరదాగా కబుర్లు చెబుతుంది. వారి కష్టసుఖాల్లో భాగం పంచుకుంటుంది.‘నాన్కీతో మాట్లాడుతుంటే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లుగానే ఉంటుంది. ఆమెతో మాట్లాడితే సంతోషమే కాదు ఆత్మస్థైర్యం కూడా వస్తుంది’ అంటారు యాసిడ్ దాడి బాధితులు. -
ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి
సాక్షి, హైదరాబాద్: శంకర్పల్లి ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం చేసుకుంది. బీటెక్ విద్యార్థిని లేఖపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో యాసిడ్ దాడి జరిగింది. విద్యార్థిని లేఖ్యపై తోటి విద్యార్థులు యాసిడ్ దాడి చేశారు. రంగు నీళ్లకు బదులు బకెట్లో యాసిడ్ను విద్యార్థులు నింపారు. రంగు నీళ్లు అనుకొని యాసిడ్ని తోటి విద్యార్థులు విద్యార్థినిపై పోశారు. విద్యార్థిని లేఖకు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. -
కర్ణాటకలో విద్యార్థినులపై యాసిడ్ దాడి
మంగళూరు: ప్రేమను తిరస్కరించిందన్న ఆవేశంతో ఒక యువకుడు ఒక అమ్మాయిపై కక్ష పెంచుకుని యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. యాసిడ్ దాడి సమయంలో ఆ బాధిత అమ్మాయి పక్కనే కూర్చున్న వేరే ఇద్దరు అమ్మాయిలపైనా యాసిడ్ పడి వారికీ ముఖంపై కాలిన గాయాలయ్యాయి. కర్ణాటకలో మంగళూరు సమీపంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కడబ తాలూకాలో ఈ యాసిడ్ దాడి ఘటన జరిగింది. బాధిత అమ్మాయి ముఖంపై తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడబలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రీ–యూనివర్సిటీ కోర్సు పరీక్షల కోసం కారిడార్లో కూర్చుని సిద్ధమవుతున్న ముగ్గురు టీనేజీ అమ్మాయిల ముఖంపైకి ఒక యువకుడు యాసిడ్ చల్లాడు. ఆ యాసిడ్ ద్రావకం పక్కనే ఉన్న మరో ఇద్దరు అమ్మాయిలపైనా పడింది. దాడి చేసి పారిపోతున్న యువకుడిని స్థానికులు వెంబడించి పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. అతడిని కేరళ మణప్పురం జిల్లా నీలాంబూర్కు చెందిన 23 ఏళ్ల అబిన్ షిబిగా పోలీసులు గుర్తించారు. తన ప్రేమను తిరస్కరించినందుకే బాధిత విద్యారి్థనిపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు పోలీసుల ముందు యువకుడు నేరం అంగీకరించాడు. -
పరీక్షకు వచ్చిన విద్యార్థినిపై యాసిడ్ దాడి!
కర్ణాటకలోని మంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కడబా ప్రాంతంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు యాసిడ్ దాడి చేశాడు. బాధితురాలు స్థానిక పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. ఆ బాలిక సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద కాపుగాసిన 23 ఏళ్ల అబిన్ ఆమెపై యాసిడ్ విసిరాడు. దీనిని గమనించిన అక్కడున్నవారు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబిన్ కేరళకు చెందినవాడని, ఎంబీఏ చదువుకున్నాడని తెలిపారు. అతనికి బాధితురాలితో గతంలో పరిచయం ఉంది. నిందితుడు అబిన్ బాధితురాలు కేరళలో ఒకే ప్రాంతంలో ఉండేవారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాధితురాలికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
విశాఖజిల్లా పెందుర్తిలో రెచ్చిపోయిన టీడీపీ నాయకుడు
-
పెందుర్తిలో టీడీపీ నేత రాక్షసత్వం
పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల దుశ్శాసన పర్వం కొనసాగుతోంది. చింతగట్ల పంచాయతీ నందవరపువానిపాలెంలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళపై పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు చీపురపల్లి నరసింగరావు రాక్షసంగా దాడి చేయడంతో పాటు ఆమె వద్ద ఉన్న రూ.5 లక్షలు, బంగారు ఆభరణాలను తస్కరించాడు. తీవ్ర గాయాలతో దాదాపు నాలుగు రోజుల పాటు నిందితుడు, అతడి కుటుంబ సభ్యుల చేతిలో బందీగా ఉండి సక్రమంగా చికిత్స అందక నరకయాతన అనుభవించిన ఆ అభాగ్యురాలు.. తెగించి శనివారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు.. బాధితురాలి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన మహిళ భర్తతో విభేదాల కారణంగా విశాఖ గోపాలపట్నం ప్రాంతంలో బ్యుటీషియన్గా పనిచేసేది. మూడేళ్ల కిందట నందవరపునవానిపాలెంలో చింతగట్ల పంచాయతీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చీపురపల్లి నరసింగరావు వద్ద ఇంటి స్థలాన్ని కొని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంటి స్థలం కొన్న చనువుతో ఆమె వద్దకు తరచూ నరసింగరావు వస్తూ ఆమెను లోబరుచుకున్నాడు. ఎంతో ప్రేమ నటిస్తూ ఆరి్థక అవసరాలు కూడా తీర్చుకునేవాడు. ఈ వ్యవహారంలో నరసింగరావు భార్య చిన్ని కూడా ‘నువ్వు లేకపోతే నా భర్త ఉండలేడు.. మీ ఇద్దరూ కలిసి ఉండండి’ అంటూ బాధితురాలిని ఒప్పించడం గమనార్హం. ఇలా సహజీవనం సాగిస్తున్న తరుణంలో నరసింగరావు ప్రవర్తనలో మార్పు రావడంతో అతడిని దూరం పెట్టింది. యాసిడ్తో దాడి చేసి.. నరసింగరావుకు ఆమె దూరంగా ఉండటంతో అతడు సహించలేకపోయాడు. ఆమె ఇంటికి వెళ్లి కొడుతూ ఉండేవాడు. అలా నరసింగరావు వేధిస్తూ ఉంటుంటే.. అతడి భార్య చిన్ని వచ్చి బాధితురాలికి సర్ది చెబుతూ ఉండేది. ఈ క్రమంలో ఈ నెల 7 మధ్యాహ్నం 2.30 సమయంలో నరసింగరావు ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె దుస్తులు చింపేసి యాసిడ్ను ఆమెపై చల్లాడు. దీంతో ఆమె ఛాతి భాగం కాలిపోయింది. అంతటితో ఆగకుండా ఆమె పొత్తికడుపు, మెడపై పిడిగుద్దులు గుద్దుతూ పేట్రేగిపోయాడు. బాధితురాలు అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆమె బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఇంట్లో గొడవను గుర్తించిన స్థానికులు రావడంతో నిందితుడు నరసింగరావు గోడ దూకి పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే బాధితురాలికి ఏదైనా అయితే తన మెడకు చుట్టుకుంటుందన్న భయంతో ఆమెను నరవలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. తన భార్య, కుటుంబ సభ్యులను ఆమె వద్ద కాపాలా ఉంచి అరకొర చికిత్సను అందించాడు. ఈ నాలుగు రోజుల పాటు ఆమె ఎక్కడుందో ఆమె బంధువులకు కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఆస్పత్రి నుంచి బాధితురాలు బయటికొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను కేజీహెచ్కు తరలించినట్టు పోలీసులు చెప్పారు. -
విశాఖ: మహిళపై టీడీపీ నేత యాసిడ్ దాడి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో టీడీపీ నాయకుడు రెచ్చిపోయారు. మహిళపై టీడీపీ నేత నర్సింగరావు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నర్సింగరావు.. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అనుచరుడు. ఈనెల 7వ తేదీన మధ్యాహ్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్? -
21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం!
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో 2002లో 14 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. అయితే ఈ ఉదంతంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు న్యాయం కోసం పరితపించింది. అయితే 2014లో ఆమెకు ఆగ్రాలోని ఓ కేఫ్లో ఉద్యోగం వచ్చింది. ఒకరోజు ఆగ్రా జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ ఈమె పనిచేస్తున్న కేఫ్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన యాసిడ్ బాధితురాలితో మాట్లాడారు. ఆమె తన కథను ఏడీజీ రాజీవ్ కృష్ణకు వివరించింది. దీంతో ఆయన ఈ ఉదంతంపై కేసు నమోదు చేయించారు. జనవరి 2023లో ఈ కేసు అలీఘర్లోని ఉపర్కోట్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు ఆరిఫ్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2002లో అలీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోరావర్ వాలీ ప్రాంతంలో ఉంటున్న బాలికపై ఆరిఫ్ అనే యువకుడు యాసిడ్ పోశాడు. యాసిడ్ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆరీఫ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014లో యాసిడ్ బాధితులకు ఆగ్రాలోని ఓ కేఫ్లో ఉద్యోగాలు ఇచ్చారు. పోలీసు అధికారి రాజీవ్ కృష్ణ 2022, డిసెంబరులో ఈ కేఫ్కు వచ్చారు. అలీఘర్ బాధితురాలి కథ విన్న ఆయన కేసు దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆరిఫ్ దోషి అని తేలింది. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిని జైలుకు తరలించారు. ఇది కూడా చదవండి: దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు? -
ఏలూరు యాసిడ్ దాడి కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
ఏలూరు టౌన్: ఏలూరులో మహిళపై యాసిడ్ దాడికి తెగబడిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.సునీల్కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. యాసిడ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎడ్ల ఫ్రాన్సికా కుటుంబానికి సత్వర న్యాయం అందిస్తూ కేవలం 117 రోజుల్లోనే తీర్పు వెలువరించారు. జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి మీడియాకు బుధవారం వెల్లడించారు. ఏలూరు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు బోడ నాగసతీ‹Ùకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, యాసిడ్ దాడికి పాల్పడిన ఏలూరుకు చెందిన బెహరా మోహన్, బూడిద ఉషాకిరణ్కు జీవిత ఖైదుతోపాటు రూ.15 వేల చొప్పున జరిమానా విధించారు. యాసిడ్ విక్రయించిన ఏలూరు గడియార స్తంభం ప్రాంతానికి చెందిన కొల్లా త్రివిక్రమరావు (68)కు రూ.1,500 జరిమానా విధించారు. దాడి జరిగిందిలా.. మృతురాలు ఫ్రాన్సికా భర్తకు దూరంగా ఉంటూ నగరంలోని ప్రైవేట్ దంత వైద్యశాలలో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. కాగా.. ఫ్రాన్సికా సోదరితో ఏలూరు వన్టౌన్ ప్రాంతానికి చెందిన బోడ నాగసతీష్ సన్నిహితంగా ఉండేవాడు. దీనిని ఫ్రాన్సికా వ్యతిరేకించింది. దీంతో కక్ష పెంచుకున్న సతీ‹Ù.. ఫ్రాన్సికాను హతమార్చేందుకు నగరానికి చెందిన మోహన్, ఉషాకిరణ్ అనే వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. వారిద్దరూ ఈ ఏడాది జూన్ 13న రాత్రి 8.30 గంటల సమయంలో ఫ్రాన్సికాపై యాసిడ్తో దాడి చేశారు. గాయపడిన ఆమెను ఏలూరు జీజీహెచ్లో చేర్పించగా.. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని విజయవాడ జీజీహెచ్కు, ఆ తరువాత మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు తల్లి ధనలక్ష్మి ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. సీఐ ఇంద్ర శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. కాగా, ఫ్రాన్సికాను బతికించాలనే తపనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితురాలి చికిత్స కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. అయితే.. 8 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె జూన్ 21న మృతి చెందింది. సత్వర విచారణతో నిందితులకు కఠిన శిక్షలు డీజీపీ కేవీ రాజేంద్రనాద్రెడ్డి ఆదేశాలతో కేసు సత్వర విచారణ బాధ్యతను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులుకు అప్పగించారు. నిందితుల్ని అరెస్ట్ చేసి కేవలం 21 రోజుల్లోనే చార్జ్ïÙట్ దాఖలు చేసి, పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. సునీల్కుమార్ కేవలం 117 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.శ్రీవాణిబాయ్ వాదనలు వినిపించారు. సాక్షులను ప్రవేశ పెట్టడంతో కీలకంగా వ్యవహరించిన దిశ సీఐ ఇంద్ర శ్రీనివాస్, విశ్వం, డీఎస్పీ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ దుర్గాప్రసాద్ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించారు. -
ధైర్యం పలికిన పేరు... దేవాన్షి! ఆమె ఒక సైన్యంలా..!
పద్నాలుగు సంవత్సరాల వయసులో యాసిడ్ దాడికి గురైంది ఉత్తర్ప్రదేశ్కు చెందిన దేవాన్షీ యాదవ్. తాను బాధితురాలిగా ఉన్నప్పుడు ఒంటరి. ఇప్పుడు మాత్రం తానే ఒక సైన్యం. ‘షాహీద్ రామాశ్రయ్ వెల్ఫేర్ సోసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టి న్యాయసహాయం అందించడం నుంచి ఉపాధి అవకాశాలు కల్పించడం వరకు బాధితుల కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న దేవాన్షి గురించి... కష్టాలన్నీ కలిసికట్టుగా వచ్చాయా! అన్నట్లుగా దేవాన్షీ యాదవ్ నెలల వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. పద్నాలుగు సంవత్సరాల వయసులో కుటుంబ స్నేహితుడిగా భావించే ఒకడు లైంగిక వేధింపులకు, యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు మాత్రం దేవాన్షినే బోనులో నిలబెట్టారు. ‘మన జాగ్రత్తలో మనం ఉంటే ఇలాంటివి జరగవు కదా’ లాంటి మాటలు తనను ఎంతో బాధ పెట్టాయి. ఉత్తర్ప్రదేశ్లోని బరేలీ పట్టణానికి చెందిన 31 సంవత్సరాల దేవాన్షి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి కష్టాలెన్నో కనిపిస్తాయి. అయితే వాటిని గుర్తు చేసుకుంటూ బాధను గుండెలో పెట్టుకోలేదు. తనలాంటి కష్టాలు వచ్చిన వారికి అండగా నిలబడాలనుకుంది. అలా మొదలైందే ‘షాహీద్ రామాశ్రయ్ వెల్ఫేర్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ. లైంగిక వేధింపులకు గురవుతున్న వారి నుంచి గృహహింస బాధితుల వరకు ఎంతోమందికి ఈ సంస్థ తరపున అండగా నిలబడింది దేవాన్షి. ‘ధైర్యసాహసాలలో మా అమ్మే నాకు స్ఫూర్తి. నాకు తొమ్మిది నెలలు ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు. ఒకవైపు భర్త చనిపోయిన బాధ, మరోవైపు బిడ్డను ఎలా పోషించాలనే బాధ, అయోమయం ఆమెను చుట్టుముట్టాయి. ఆరోజు ఆమె ధైర్యం కోల్పోయి ఉంటే ఈ రోజు నేను ఉండేదాన్ని కాదు. జీవితంలో ప్రతి సందర్భంలో ధైర్యంతో ముందుకు వెళ్లింది. తల్లిగా ప్రేమానురాగాలను పంచడమే కాదు ధైర్యం అనే విలువైన బహుమతిని ఇచ్చింది’ అంటుంది దేవాన్షి. భారమైన జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి, శక్తిమంతం కావడానికి సామాజిక సేవా కార్యక్రమాలు దేవాన్షికి ఎంతో ఉపయోగపడ్డాయి. దేవాన్షి దగ్గరకు సహాయం కోసం వచ్చే బాధితుల్లో ఏ కోశానా ధైర్యం కనిపించదు. అలాంటి వారిలో ధైర్యం నింపడం అనేది తాను చేసే మొదటి పని. తనని కుటుంబ సభ్యురాలిగా భావించుకునేలా ఆత్మీయంగా ఉండడం రెండో పని. కౌన్సెలింగ్ ద్వారా వారికి భవిష్యత్ పట్ల ఆశ రేకెత్తించడం మూడోపని. ‘ఈ సమాజం నన్ను చిన్నచూపు చూస్తుంది. నాకు ఎవరూ అండగా లేరు’ అనుకున్న ఎంతోమందికి ‘నాకు ఎవరి అండా అక్కర్లేదు. ఒంటరిగా పోరాడగలను. నా కోసం నేను పోరాడలేనా!’ అనే ధైర్యాన్ని ఇచ్చింది. ‘ఇంకేముంది నా భవిష్యత్ బుగ్గిపాలు అయింది’ అని జీవనాసక్తి కోల్పోయిన వారిలో ‘కష్టాలు నీ ఒక్కరికే కాదు. అందరికీ వస్తాయి. అదిగో నీ భవిష్యత్’ అంటూ ఆశావాహ దృక్పథాన్ని కలిగించింది. ‘పదా... పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేద్దాం’ అని దేవాన్షి అన్నప్పుడు... ‘అమ్మో! నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం’ అన్నది ఒక బాధితురాలు. ‘తప్పు చేసిన వాడు హాయిగా తిరుగుతున్నాడు. ఏ తప్పూ చేయని నువ్వెందుకు భయపడడం’ అని దేవాన్షి అనగానే ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్కు బయలు దేరింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో! సంస్థ అడుగులు మొదలుపెట్టిన కొత్తలో... ‘మీవల్ల ఏమవుతుంది’ అన్నట్లుగా ఎంతోమంది వ్యంగ్యంగా మాట్లాడేవారు. వారికి తన పనితీరుతోనే సమాధానం ఇచ్చింది దేవాన్షి. ‘దేవాన్షీ చాలా పట్టుదల గల వ్యక్తి. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యదు. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక నేను దేవాన్షి దగ్గరకు వచ్చాను. ఆమె నాకు ఆశ్రయం ఇచ్చింది. విషయం తెలుసుకున్న అత్తింటి వారు దేవాన్షిని బెదిరించడానికి వీధిరౌడీలను పంపించారు. ఆమె ధైర్యాన్ని చూసి వారు తోక ముడవడానికి ఎంతో సమయం పట్టలేదు’ అంటుంది బరేలీకి చెందిన రత్న. బరేలీ పట్టణానికి చెందిన వారే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఎంతోమంది మహిళలు దేవాన్షి సహాయం కోసం రావడం ప్రారంభించారు. ‘మా దగ్గరకు వచ్చేవాళ్లలో 60 నుంచి 70 శాతం గృహహింస బాధితులే. వారికి అండగా నిలిచినప్పుడు సహజంగానే బెదిరింపులు ఎదురయ్యాయి. అయితే నేను వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. మీకు ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? అనే ప్రశ్న అడుగుతుంటారు. ఒకప్పుడు నేను మీలాగే భయపడేదాన్ని... అంటూ నాకు ఎదురైన చేదు అనుభవాలను వారితో పంచుకుంటాను. అమ్మ నుంచి ధైర్యం ఎలా పొందానో చెబుతాను. ధైర్యం అనేది ఒకరు దయతో ఇచ్చేది కాదు. అది అందరిలోనూ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుంటున్నామా? లేదా? అనేదే ముఖ్యం అని చెబుతుంటాను’ అంటుంది దేవాన్షీ యాదవ్. ‘అత్తింటి బాధలు తట్టుకోలేక బయటికి వచ్చాను. ఇప్పుడు నేను ఒంటరిగా ఎలా బతకగలను’ అని దిక్కులు చూస్తున్న ఎంతోమందికి సంస్థ ద్వారా దిక్కు చూపించి సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుపడింది. ‘మంచిపని చేస్తే ఆ ఫలితం తాలూకు ఆనందమే కాదు అపారమైన శక్తి కూడా లభిస్తుంది. ఆ శక్తి మరిన్ని మంచిపనులు చేయడానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది’ అంటుంది దేవాన్షీ యాదవ్. (చదవండి: "బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది! వైద్యులనే విస్తుపోయేలా చేసింది!) -
సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!
మాట్లాడే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెబుతుంటారు. ఆదుకోవాలని మనసు ఉండాలేగానీ, సరికొత్త దారులు అనేకం కనిపిస్తాయని చేసి చూపెడుతోంది పదిహేడేళ్ల సీమర్ సంగ్లా. యాసిడ్ దాడి బాధితులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు సబ్బుల తయారీలో శిక్షణ ఇస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన సీమర్ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఒకసారి పూనమ్ అనే అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది. దీంతో ఆమె ముఖం మొత్తం కాలిపోయింది. అయితే ఆమె మామూలు సబ్బులతో స్నానం చేస్తే యాసిడ్ దాడి జరిగిన ప్రదేశంలో బాగా మంట పుట్టేది. ఈ విషయం తెలిసిన యాసిడ్ దాడి బాధితులకు సాయం చేసే సీమర్ తల్లి... పూనమ్ను ఆదుకునే క్రమంలో ... మంట రాని సబ్బు తయారు చేయాలనుకుంది. ఈ క్రమంలోనే సీమర్ అమ్మ, అమ్మమ్మలు కలిసి, సబ్బు తయారు చేశారు. యాసిడ్ దాడికి కాలిపోయిన పూనంకు ఈ సబ్బు స్వాంతన కలిగించింది. వాడుకోవడానికి చాలా అనువుగా అనిపించింది. ఇదంతా దగ్గర నుంచి చూసిన సీమర్ యాసిడ్ బాధితుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం మొదలు పెట్టింది. పూనమ్లా ఎంతోమంది యాసిడ్ దాడికి గురైనట్లు తెలుసుకుని, వాళ్లందరికి తాను ఏదోరకంగా సాయపడాలనుకుంది. గతేడాది యాసిడి బాధితుల అవసరాలకు తగినట్లుగా ‘సేఫ్ కేవ్’ పేరిట సబ్బులు తయారు చేయడం ప్రారంభించింది. అలోవెర, తేనెలతో సబ్బులు తయారు చేసి యాసిడ్ బాధితులకు ఇచ్చేది. ఈ సబ్బులు బాధితులకు సాంత్వననిచ్చేవి. వారి ఆసక్తిని గమనించిన సీమర్... సబ్బుల తయారీలో శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టింది. శిక్షణ తీసుకున్న వారంతా సబ్బులు తయారు చేసి మార్కెట్లో విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో వాళ్లకంటూ ఒక గుర్తింపుతోపాటు, సాధారణ అమ్మాయిల్లా జీవించగలుగుతున్నారు. సీమర్.. ఇప్పటిదాక ఇరవైమందికిపైగా సబ్బుల తయారీలో శిక్షణ ఇచ్చింది. యాసిడ్ బాధితుల గురించి తన స్నేహితులు, ఇతర పిల్లలకు చెబుతూ వారికి సాయం చేయాలని కోరుతోంది. ఇది చిన్నపనే అయినప్పటికీ వారి జీవితాల్లో పెద్ద మార్పుని తీసుకొస్తుంది సీమర్. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన బాధితులంతా సీమర్ శిక్షణతో ధైర్యాన్ని కూడగట్టుకొంటూ జీవితంపై కొత్త ఆశలతో ముందుకు సాగుతున్నారు. -
వివాహేతర సంబంధం కారణంగా మహిళపై యాసిడ్ దాడి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో వితంతు మహిళపై ఓ ఆటోడ్రైవర్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలుడు, యువతి సహా ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకోగా.. కొద్దిగంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపిన వివరాల ప్రకారం.. ఐతవరం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఆమెకు ఓ కుమారుడున్నాడు. భర్త మరణించడంతో ఆ మహిళ ఐతవరం వచ్చేసి తల్లిదండ్రుల వద్ద ఆశ్రయం పొందుతోంది. సుమారు 8 నెలల క్రితం నెల్లూరుకు చెందిన రాణింగారం మణిసింగ్ (32)తో ఆ మహిళకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. నెల్లూరులోనే ఆటో నడుపుతూ జీవనం సాగించే మణిసింగ్కు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఆ మహిళ ఐతవరంలోనే వేరే ఇంటికి మారింది. ఆమె వద్దకు మణిసింగ్ తరుచూ వస్తుండేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోగా.. మణిసింగ్కు క్షయ వ్యాధి సోకినట్టు తెలుసుకున్న సదరు మహిళ అతన్ని దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న మణిసింగ్ ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. నెల్లూరు నుంచే యాసిడ్ తెచ్చుకుని.. ఈ నెల 8వ తేదీ శనివారం నెల్లూరులో 100 మిల్లీలీటర్ల యాసిడ్ బాటిల్ కొనుగోలు చేసిన మణిసింగ్ మహిళ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఆ ఇంట్లో ఆమె కుమారుడితో పాటు ఆమె సోదరి కుమార్తె ఉన్నారు. వారితో కలిసి మణిసింగ్ భోజనం చేసి అక్కడే నిద్రించాడు. ఆదివారం వేకువజామున 4 గంటలకు అందరూ నిద్రమత్తులో ఉండగా మణిసింగ్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్ను మహిళ ముఖంపై పోసి పరారయ్యాడు. ఈ ఘటనతో మహిళ శరీరం 20 శాతం గాయపడగా, ఆమె కుమారుడుకి, ఆమె సోదరి కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో చుట్టుపక్కల వారు లేచి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నందిగామ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నందిగామ శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న మణిసింగ్ను ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేశారు. అతడిపై నాన్బెయిలబుల్ కేసులు కట్టారు. బాధితులకు అండగా ప్రభుత్వం యాసిడ్ దాడిలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జగన్మోహనరావు బాధితుల్ని పరామర్శించారు. -
ఎనిమిది రోజులు ఆసుపత్రిలో మా అక్క నరకం చూసింది...
ఎనిమిది రోజులు ఆసుపత్రిలో మా అక్క నరకం చూసింది. మంగళవారం రాత్రి 10 గంటలకు కూడా మాట్లాడింది. మీరంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. మాట్లాడటంతో మేం చాలా ఆనందపడ్డాం త్వరలో కోలుకుం టుందని ఆశపడ్డాం. రాత్రి 12.30 గంటలకు చనిపోయినట్లు డాక్టర్ చెప్పడంతో కన్నీరు ఆగలేదు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. యాసిడ్ దాడితో ఊపిరితిత్తులు మొత్తం కాలిపోయాయి. ఓ కన్ను కూడా పోయింది. ఏలూరు టౌన్: ఏలూరు గ్జేవియర్ నగర్ మోనాస్ట్రీ ప్రాంతంలో ఉంటున్న యడ్ల ఫ్రాన్సికపై ఈనెల 13న ఇద్దరు వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడగా.. బాధితురాలు గుంటూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె స్వగ్రామం దెందులూరుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో కేసును హత్య కేసుగా మారుస్తూ పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసును సెక్షన్ 302, 120(బీ), 341, 326–ఏ, రెడ్విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్3(2)(4) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) యాక్ట్ 1989 అండ్ సెక్షన్ 6(1) ఆఫ్ పాయిజన్ యాక్ట్ –1919 కింద కేసు నమోదు చేశారు. కేవలం 15 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన తర్వాత బాధితురాలిని మెరుగైన వైద్యానికి విజయవాడ జీజీహెచ్, ఆధునిక వైద్యచికిత్సకు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి ఎంత ఖర్చయినా భరించి మంచి వైద్యచికిత్స అందించాలని తీవ్రంగా శ్రమించారు. యాసిడ్ తీవ్రస్థాయిలో ప్రభావం చూపడంతో మృత్యువుతో పోరాడిన ఫ్రాన్సిక చివరికు ఓడిపోయింది. -
రెండేళ్లుగా భర్తకు దూరం.. దారికాచి ఫ్రాన్సికపై యాసిడ్తో దాడి
ఏలూరు టౌన్ : ఏలూరు గ్జేవియర్ నగర్లోని ఒక డెంటల్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న యడ్ల ఫ్రాన్సికా (35)పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దారికాచి యాసిడ్తో దాడి చేశారు. ఆమెకు వివాహమై ఏడేళ్లు కాగా, ఆమె భర్త దెందులూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కెమికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. రెండేళ్లుగా భర్త నుంచి విడిగా ఉంటోంది. ఏలూరు నగరంలో ఉంటున్న ఆమె.. స్థానిక స్మార్ట్ డెంటిస్ట్రీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రిలో విధులు ముగించుకొని ఒంటరిగా స్కూటీపై ఇంటికి వెళుతుండగా, ఆమె నివాసానికి సమీపంలో దారికాచిన ఇద్దరు ఆగంతకులు తమ బైక్తో అటకాయించారు. వెంటనే ఆమైపె యాసిడ్తో దాడి చేశారు. యాసిడ్ ప్రభావంతో మంటలు తాళలేక ఆమె కేకలు వేయడంతో నిందితులు అకక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు గుర్తించి వెంటనే ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి సమాచారం అందుకున్న ఏలూరు రేంజి డీఐజీ జేవీజీ అశోక్కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితురాలితో పాటు ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. సంఘటన వివరాలు వారి నుంచి ఆరా తీశారు. అనంతరం సంఘటనాస్థలానికి చేరుకొని దాడి జరిగిన ప్రదేశాన్ని బాధితురాలి స్కూటీని, ఆమె నివాసాన్ని పరిశీలించారు. వారి తల్లిదండ్రులతో ఇంటివద్ద ఈ ఘటనపై ఆరా తీశారు. ప్రాథమిక వైద్యం అనంతరం ఆమెను మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై డీఐజీ మాట్లాడుతూ పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఆమె భర్త వైపు నుంచి.. అలాగే పరిచయమున్న ఇతర వ్యక్తులెవరైనా ఈ దాడికి పాల్పడ్డారా అనే వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. బాధితురాలికి 40 శాతం ముఖం కాలిపోయినట్టు వైద్యుల ద్వారా అందిన సమాచారం. బాధితురాలు ఆమె చెల్లి కుటుంబంతో పాటు ఏలూరులో ఉంటోంది. బాధితురాలి స్వస్థలం కూడా దెందులూరు అని, తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారని సమాచారం. -
రాజస్తాన్లో ఘోరం.. మహిళపై రేప్.. ఆపై సజీవదహనం
జైపూర్: రాజస్తాన్లో ఘోరం జరిగింది. ఓ దుర్మార్గుడు దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెకు నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. బార్మెర్ జిల్లాకు చెందిన దళిత మహిళ(30) ఈ నెల 6న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన షకూర్ఖాన్ అనే వ్యక్తి బలవంతంగా లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన అనంతరం యాసిడ్ వంటి ద్రావకాన్ని ఒంటిపై పోసి, నిప్పంటించి పరారయ్యాడు. 50 శాతం గాయాలపాలైన బాధితురాలు జోథ్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడు ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
అనుమానం వచ్చింది.. ఇంట్లో నిద్రపోతుండగా కోడలి ముఖంపై
తిరువొత్తియూరు(చెన్నై): కడలూరు జిల్లాలో కోడలిపై ఆసిడ్ పోసి హత్యాయత్నం చేసిన అన్నాడీఎంకే మహిళా నాయకురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కడలూరు జిల్లా విరుదాచలానికి చెందిన కలివరదన్ భార్య ఆండాళ్ విరుదాచలం అన్నాడీఎంకే ఉప కార్యదర్శిగా ఉన్నారు. వీరి కుమారుడు ముకేష్ రాజ్. ఇతని భార్య కృతిక (26). వీరికి రిషిత (5), రిషిక (1) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో కృతికపై అనుమానం పెంచుకున్న అత్త ఆండాలు కోడల్ని తరచూ వేధింపులకు గురి చేసేది. ఆదివారం రాత్రి ఆండాళ్కు కృత్తికకు గొడవలు జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కృత్తిక ఇంటిలో నిద్రపోతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆండాలు టాయిలెట్కు ఉపయోగించే ఆసిడ్ను కృత్తిక ముఖంపై పోసి నోటిలో కూడా పోసి హత్య చేయడానికి ప్రయత్నించింది. కృత్తిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు దీనిపై విరుదాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కృత్తికను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఆండాలును అరెస్టు చేశారు. చదవండి: ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్ భర్తపై దూసుకెళ్లి.. -
25 ఏళ్లుగా సహజీవనం.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన మహిళ.. కోపంతో ఆమెపై..
ముంబై: 25 ఏళ్లుగా తనతో సహజీవనం చేసిన మహిళపై యాసిడ్ దాడి చేశాడు 62 ఏళ్ల వ్యక్తి. ఆమె ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో మహిళకు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్ర ముంబైలోని గిర్గావ్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు మహేశ్ పూజారి. బాధితురాలితో 25 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లై భర్త నుంచి విడిపోయింది. మహేశ్ కూడా ఆమె భార్య నుంచి విడిపోయాడు. దీంతో ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్ను తన ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది మహిళ. రెండు రోజుల తర్వాత అతడు ఇంటికి యాసిడ్ బాటిల్తో తిరిగివచ్చాడు. శుక్రవారం వేకువజామున 5:30 గంటల సమయంలో ఆమె నీళ్లు తోడుకునేందుకు బయటకు రాగా యాసిడ్ చల్లాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. పోలీసులు నిందితుడ్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. చదవండి: క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్సభ సభ్యత్వం రద్దు.. -
ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. యువతిని బలవంతంగా కారులోకి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. 19 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి బలవంతంగా కారులోకి లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అయినా యువతి భయపడకుండా కారు ఎక్కేందుకు నిరాకరించింది. దీంతో అతడు ఆమెను కారు దగ్గరకు ఈడ్చుకెళ్లాడు. వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో యువతికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పాండవ్ నగర్లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలో వరుసగా దారుణాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. జనవరి 1న అంజలి అనే యువతి స్కూటీని ఢీకొట్టి ఆమెను కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జనవరి 2న ఆదర్శ్ నగర్లో జరిగిన మరో దారుణ ఘటనలో శివకుమార్ అనే 20 ఏళ్ల యువకుడు 21 ఏళ్ల యవతిని కత్తితో పలుమార్లు పొడిచాడు. ఇద్దరూ స్నేహితులే అయినప్పటీకీ ఏదో విషయంలో గొడవపడి అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చదవండి: అయ్యో అంజలి.. పోస్ట్మార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయాలు -
నడి రోడ్డుపై అడ్డగించి మరీ..మహిళపై ఓ వ్యాపారి యాసిడ్ దాడి..
ఓ వ్యాపారి మహిళపై యాసిడ్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ మహిళ రాకను గమనించి రోడ్డుపై కాపుకాసి మరీ దాడి చేశాడు నిందితుడు. ఈ ఘటన అస్సాంలోని ధేకియాజులిలోని రాఖ్యస్మారి రోడ్డు వద్ద ఆదివారం 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...నిందుతుడికి సదరు మహిళకి ఒకరికొకరు సుపరిచితులే. నిందితుడు వివాహితుడు కాగా ఆమె అవివాహితురాలు. ఇరువురు కొద్దిరోజులు సహజీవనం చేశారు. ఐతే గత కొద్దిరోజులుగా ఇరువురి మధ్య డబ్బుల విషయమై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే నిందితుడు ఆ 30 ఏళ్ల మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను తేజ్పూర్లోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దాడికి పాల్పడిన నిందితుడు వ్యాపారి వాస్తుకర్గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సూపరింటెండెంట్ బిశ్వ శర్మ తెలిపారు. (చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది?) -
నాపై కూడా యాసిడ్ దాడి జరుగుతుందేమో: కంగనా రనౌత్
యువతులపై యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. దీంతో నటి కంగనా రనౌత్కు యాసిడ్ భయం పట్టుకుంది. బాలీవుడ్తో పాటు తమిళం, తెలుగు వంటి దక్షిణాది భాషల్లో నటిస్తూ సంచలన నటిగా ముద్ర వేసుకున్న కంగనా రనౌత్ తాజాగా తమిళంలో చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తున్నారు. ఏ విషయంలోనైనా ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అయితే ఎంత ధైర్యం కలిగిన వ్యక్తి అయినా తమ జీవితంలో జరిగిన భయంకర సంఘటనలు ఆందోళనకు గురి చేస్తూనే ఉంటాయి. నటి కంగనా రనౌత్ అందుకు అతీతం కాదు. ఈమె తన కుటుంబంలో జరిగిన యాసిడ్ దాడి గురించి తన ఇన్స్టా స్టోరీలో పేర్కొంటూ తన సోదరి మాదిరిగానే తనపైనా యాసిడ్ దాడి జరుగుతుందేమోనని భయపడుతున్నట్లు పేర్కొంది. తన సోదరి రంగోలి యాసిడ్ దాడికి గురైందని, ఆమెకు 52 శస్త్ర చికిత్సలు జరిగినట్లు గుర్తు చేసింది. ఆ సంఘటనలో తన సోదరి శారీరకంగా, మానసికంగా ఎంతో బాధింపునకు గురైందని చెప్పింది. ఆ సంఘటన తర్వాత తనపై కూడా యాసిడ్ దాడి జరుగుతుందేమేనని ప్రతిక్షణం భయపడుతున్నట్లు పేర్కొంది. దీంతో ఎవరైనా తన పక్కన వస్తుంటే ముఖం దాచుకుంటున్నానని తెలిపింది. -
Pratibha Naithani: యాసిడ్ సమాజానికి సర్జరీ
పిల్లలను దృష్టిలో పెట్టుకొని టీవీ కార్యక్రమాల్లో అసభ్యత, హింస చూపడాన్ని వ్యతిరేకించడంలో పేరొందారు ముంబై వాసి డాక్టర్ ప్రతిభా నైతాని. యాసిడ్ దాడి బాధితులకు ఉచితంగా కాస్మెటిక్ వైద్యం అందించడంతో పాటు, వారికి తగిన న్యాయం జరగాలంటూ ఆయా మంత్రిత్వ శాఖల చుట్టూ తిరుగుతూ, దోషులకు శిక్ష పడేలా చేశారు, చేస్తున్నారు. డాక్టర్ ప్రతిభ కష్టానికి ఫలితంగా చట్టం మారింది, దోషులకు శిక్షలు పెరిగాయి. యాసిడ్ దాడి బాధితుల జీవితాలు కాస్త తేలికయ్యాయి. అయితే, గడిచిన ఈ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా యాసిడ్ దాడులు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రతిభా నైతాని ఎన్నో విషయాలను మీడియా ముందుంచారు. ‘‘పంతొమ్మిదేళ్ల క్రితం.. ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ అశోక్ గుప్తాతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. డాక్టర్ అశోక్ అప్పటికే తన పనితో పాటు సామాజిక సేవ కూడా చేస్తుండేవారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి పేద, గిరిజనులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఉచితంగా కాస్మెటిక్ సర్జరీలు చేస్తుండేవారు. వారి నుంచి స్ఫూర్తి పొందిన నేను, ఈ సర్జరీలలో సహాయంగా ఉండేదాన్ని. యాసిడ్ దాడి కేసులు మొదట్లో ఒకటో రెండో వచ్చేవి. తర్వాత్తర్వాత వీటి సంఖ్య పెరుగుతుండటం గమనించాను. వీరికి ఉచితంగా సర్జరీలు చేయడమొక్కటే సమస్యకు పరిష్కారం కాదనుకున్నాను. వీటిని అరికట్టేందుకు ఏదైనా చేయాలనుకున్నాను. దోషులకు శిక్షను పెంచాలి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖ, లా కమిష¯Œ వరకు ప్రదక్షిణలు చేశాను. ముంబై నుంచి ఢిల్లీకి తరచూ ప్రయాణించేదాన్ని. గతంలో యాసిడ్ దాడి దోషులకు శిక్షలు చాలా తక్కువగా ఉండేవి. నిందితులకు కేవలం ఆరు నెలలు మాత్రమే బెయిలబుల్ శిక్ష ఉండేది. కానీ అమ్మాయి జీవితమంతా నరకమే. దీంతో పాటు తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మరిన్ని ఇబ్బందులు తప్పవని బాధితురాలి కుటుంబాన్ని బెదిరించేవారు. దీంతో వారికి న్యాయం జరిగేది కాదు. కత్తి గాయం, యాసిడ్ మంట ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒకరి శరీరంపై యాసిడ్ పోయడం హత్య కంటే ఘోరమైన నేరం. ఈ విషయంలో చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత, 2013లో ఐపిసి లో 32-6A, 32-6B సెక్షన్లు చేర్చబడ్డాయి. దీని ప్రకారం, నిందితుడు దోషిగా తేలితే, ఏడేళ్ల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడుతుంది. అపరాధి నుండి జరిమానా కూడా వసూలు చేయబడుతుంది. దీంతో బాధితురాలి కోసం ఎంతో కొంతైనా చేయగలిగామనే ధీమా వచ్చింది. బాధితులకు పునరావాసం ‘‘యాసిడ్ దాడి బాధితులు సమాజంలో జీవించడం కష్టం. ఈ అమ్మాయిలకు పని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. చాలా సందర్భాల్లో చికిత్స ఖర్చులు పెరిగి, ఇంటి నుంచి వెళ్లగొట్టడం వంటి ఘటనలు కూడా తెలిశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. యాసిడ్ దాడి బాధితులను వికలాంగుల కేటగిరీలో చేర్చాలని, విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వంటి వికలాంగుల కోటాలో వచ్చే అన్ని సౌకర్యాలు వారికి కల్పించాలని డిమాండ్ చేశాం. ఈ డిమాండ్ను నెరవేర్చడంలోనూ విజయం సాధించాం’’. ఉచిత వైద్య చికిత్స ‘‘యాసిడ్ దాడి బాధితులకు ప్రతి నగరంలో ఉచితంగా చికిత్స అందించాలన్నది మరో డిమాండ్. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి కేసులకు ప్రత్యేకంగా ప్లాస్టిక్ సర్జరీ సౌకర్యం లేదు. ఏ ఆసుపత్రి అయినా, ఎక్కడ ఉన్నా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశాం. ఈ మేరకు యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ సుప్రీంకోర్టులో పిటిష¯Œ దాఖలు చేశారు. వారికి ఉచితంగా శస్త్ర చికిత్స సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందుబాటులో ఉండకూడదు బహిరంగంగా విక్రయించే యాసిడ్కు సంబంధించి, దాని విక్రయాలను నియంత్రించాలని డిమాండ్ చేశాం. సాధారణ దుకాణాల్లో యాసిడ్ ఉండకూడదు. ఎప్పుడు, ఎవరు కొన్నారు, దేనికి వినియోగిస్తున్నారనేదానిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ విధానం వల్ల యాసిడ్ దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ప్రాణాలతో పోరాటం యాసిడ్ దాడి బాధను భరిస్తూ జీవితంలో ముందుకు సాగిన అమ్మాయిలు ఎందరో ఉన్నారు. అలాంటి అమ్మాయిలలో లలిత ఒకరు. దాడి జరిగి, తీసుకువచ్చినప్పుడు, ఆమె గాయాల వాసనకు, జనం క్లినిక్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనేక శస్త్రచికిత్సల తర్వాత కోలుకుంది. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతోంది. పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు తల్లి అయ్యింది. ఏ అమ్మాయీ యాసిడ్ బారిన పడకుండా అందరూ ఆనందంగా జీవించాలి’ అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారీ వైద్యురాలు. -
యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు ఇవ్వాలి.. హైకోర్టు ఆదేశం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు పరిహారంగా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమెకు అయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని 2017లోనే చెప్పింది న్యాయస్థానం. యూఎస్ నగర్ జిల్లాకు చెందిన ఈ యువతిపై 2014లో ఓ ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశాడు. అప్పడు ఆమె 12వ తరగతి చదువుతోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ చెవి పూర్తిగా కాలిపోయింది. మరో చెవి 50 శాతం దెబ్బతింది. మొహం కూడా కాలిపోయింది. అయితే ప్రభుత్వం ఈమెకు సరైన పరిహారం అందించలేదు. అయితే బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులు ఎంతైనా, దేశంలో ఎక్కడ చికిత్స అందించినా ప్రభుత్వమే భరించాలని 2017లోనే కోర్టు ఆదేశించింది. కానీ ఈమెకు పరిహారం కూడా అందించాలని 2019లో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసింది. యువతికి ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని, సాయం అందించాలని కోరింది. రాజకీయాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం యాసిడ్ దాడి బాధితురాలికి రూ.లక్షలు సాయంగా సమకూర్చలేదా? అని పిటిషన్లో పేర్కొంది. వాదనలు విన్న న్యాయస్థానం యాసిడ్ దాడి బాధితురాలికి ప్రభుత్వం రూ.35 లక్షలు సాయంగా అందించాలని చెప్పింది. ఆమెకు అయిన వైద్య ఖర్చులతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. దేశంలో యాసిడ్ దాడులకు గురవుతున్న ఇతర మహిళలకు కూడా ఇదే విధంగా పరిహారం అందించాలని బాధితురాలి తరఫు న్యాయవాది స్నిగ్ధ తివారి డిమాండ్ చేశారు. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే.. -
మీషో, ఫ్లిప్కార్ట్కు కేంద్రం భారీ షాక్..వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు ఫ్లిప్కార్ట్, మీషోలకు భారీ షాక్ తగిలింది. యాసిడ్ అమ్మకాలపై విధించిన నిబంధనల్ని ఉల్లంఘించాయంటూ ఆ రెండు సంస్థలకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీలోని ద్వారకలో ఓ బాలికపై యాసిడ్ దాడి ఘటనలో నిందితుడు ఫ్లిప్కార్ట్ నుంచి యాసిడ్ కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో నోటీసులు జారీ అయ్యాయి. ప్లాట్ఫారమ్లపై యాసిడ్ అమ్మకాలను అనుమతించినందుకు రెండు ఈ-కామర్స్ సంస్థలకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ-కామర్స్ సంస్థ నుంచి యాసిడ్ను సేకరించినట్లు గుర్తించిన ఢిల్లీ పోలీసులు ఫ్లిప్కార్ట్కు నోటీసులు జారీ చేశారు. కఠిన చర్యలు తప్పవ్ సీసీఏపీ యాసిడ్ విక్రయాల నిబందనల్ని ఆదేశాలు బేఖాతరు చేయడాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లిప్కార్ట్, ఫాష్నియర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (meesho.com) సంస్థలకు నోటీసులు పంపింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇ-కామర్స్ సంస్థలు సీసీపీఏ నోటీసుల ఆదేశాలను పాటించకపోతే, వినియోగదారుల రక్షణ చట్టం - 2019లోని నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఢిల్లీలో దారుణం డిసెంబర్ 14 న దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది తన చెల్లెలితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ 17 ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు యాసిడ్ దాడి చేశారు. ముసుగులు ధరించి బైక్పై వచ్చి యాసిడ్ దాడి చేయటంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.నిషేధం ఉన్నప్పటికీ మార్కెట్లలో యాసిడ్ లభ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కాగా, యాసిడ్ దాడిలో పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిందితుడు సచిన్ అరోరా ఫ్లిప్కార్ట్ నుండి యాసిడ్ను సేకరించినట్లు గుర్తించారు. దీనిపై వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలపై సీసీపీఏ చర్య తీసుకుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
Delhi Acid Attack: జాగ్రత్త... ప్రమాదం పొంచే ఉంది
యాసిడ్ అమ్మకాల మీద నిఘా పెట్టాం. మహిళల రక్షణకు చట్టాలు కఠినతరం చేశాం. షీ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. యాప్స్ డెవలప్ అయ్యాయి. నిజమే. కాని ప్రమాదం పొంచే ఉంది. ఢిల్లీలో తాజా యాసిడ్ దాడి ఘటన ఈ విషయమే నిర్థరిస్తోంది. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి) నివేదిక ప్రకారం 2021లో దేశవ్యాప్తంగా 176 యాసిడ్ దాడులు నమోదయ్యాయి. మరో 73 అటెంప్ట్స్ జరిగాయి. అంటే ప్రమాదం పొంచే ఉంది. నిర్లక్ష్యం ఏ మాత్రం పనికి రాదు. వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నప్పుడు ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది. 2013లో సుప్రీం కోర్టు యాసిడ్ అమ్మకాల మీద జవాబుదారీ ఉండాలని చెప్పింది. రిజిస్టర్ మెయింటెయిన్ చేయాలని చెప్పింది. అంతే కాదు ఐ.డి.ప్రూఫ్ లేకుండా యాసిడ్ అమ్మకూడదు. అలా చేస్తే 50 వేల రూపాయల ఫైన్ ఉంది. అయితే 2016లో ఢిల్లీలో కొంతమంది పోలీసులు మఫ్టీలో యాసిడ్ కొన ప్రయత్నిస్తే 23 షాపులు ఎవరు ఏమిటి అనకుండా అమ్మారు. అప్పుడు గగ్గోలు అయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన యాసిడ్ దాడిలో నిందితుడు ఫ్లిప్కార్ట్ ద్వారా యాసిడ్ను కొన్నాడని పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఆన్లైన్ అమ్మకం దారులను యాసిడ్ అమ్మకాలపై జాగ్రత్త వహించవలసిందిగా తాకీదులు పంపుతున్నారు. అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే. పరిస్థితి దారుణం కోవిడ్ కాలంలో తప్ప దేశంలో యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలు బలవుతూనే ఉన్నారు. ప్రేమ వద్దన్నారని, ప్రేమలో ఉన్నాక బ్రేకప్ చెప్పారని, పెళ్లయ్యాక విడిపోయారని రకరకాల కారణాల వల్ల పురుషులు ద్వేషంతో యాసిడ్ దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. 2016 నుంచి 2021 మధ్య 1300 యాసిడ్ దాడులు జరిగాయి. విషాదం ఏమిటంటే ఈ యాసిడ్ దాడుల్లో నేరస్తులకు శిక్ష పడుతున్న శాతం అతి తక్కువగా ఉండటం. 400 కేసులు నమోదు అయితే 10 మందికి మాత్రమే శిక్ష పడుతోందంటే ఎన్ని విధాలుగా తప్పించుకుంటున్నారో, తప్పించుకోవచ్చులే అనే ధైర్యంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అప్రమత్తత అవసరం విద్యార్థినులు, యువతులు, స్త్రీలు తమకు తారసపడుతున్న ప్రేమ, వైవాహిక బంధాలలో పురుషుల ధోరణి పట్ల అప్రమత్తంగా ఉండాలి. బెదిరిస్తున్నవారిని, వద్దనుకున్నా వెంటపడుతున్నవారిని, ఒకవేళ బంధం నుంచి బయటపడాలనుకుంటే ఆ మగవారిని గమనించి వారి ధోరణి ప్రమాదకరంగా అనిపిస్తే ముందే కుటుంబ సభ్యుల, పోలీసుల మద్దతు తీసుకోవాలి. ముఖ్యంగా ఇష్టం లేని ప్రేమ ప్రతిపాదిస్తున్నప్పుడు, ప్రేమలో నుంచి బ్రేకప్ చెబుతున్నప్పుడు, విడాకుల సందర్భాలలో ఒంటరిగా తిరిగేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, ఎవరైనా అపరిచితుడు లేదా పాత మిత్రుడు దగ్గరిగా వస్తుంటే జాగ్రత్త పడటం, అసలు వీలైనంత సామరస్యంగా, ఒప్పుదలతో బంధాల నుంచి బయటపడటం... ఇవన్నీ ముఖ్యమైనవే. దేశంలో యాసిడ్ దాడులను నిర్మూలించామని ఎవరూ హామీ ఇవ్వడం లేదు. కనుక మన రక్షణకు మనమే బాధ్యత వహించాలి. కుటుంబం, పోలీసుల వద్ద సమస్యను దాచకుండా సాయం పొందాలి. (క్లిక్ చేయండి: వరతమ్మా నీకు వందనాలమ్మా!) -
ఢిల్లీలో దారుణం.. 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. తన చెల్లెలితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఓ 17 ఏళ్ల బాలికపై ఇద్దరు దుండగులు యాసిడ్ దాడి చేశారు. ముసుగులు ధరించి బైక్పై వచ్చి యాసిడ్ దాడి చేయటంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మొహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తనకు తెలిసిన వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయడంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం 9 గంటలకు పోలీస్ కంట్రోల్ రూమ్(పీసీఆర్)కు యాసిడ్ దాడి జరిగినట్లు ఫిర్యాదు అందినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో దాడి జరిగినట్లు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో తన చెల్లెలితో బాధితురాలు ఉందన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శ్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ ఘటనపై మీడియాతో వివరాలు వెల్లడించారు బాధితురాలి తండ్రి. ‘మా కుమార్తెలు (ఒకరు 17, ఒకరు 13 ఏళ్ల వయసు) ఇద్దరు ఉదయం బయటకు వెళ్లారు. ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి మా పెద్ద కూతురిపై యాసిడ్ దాడి చేసి పారిపోయారు. వారు ముఖాలకు మాస్కులు ధరించారు.’ అని తెలిపారు. Swati Maliwal (@SwatiJaiHind), chairperson, Delhi Commission for Women on acid attack on 17-year-old Delhi schoolgirl today pic.twitter.com/g2ge62RAez — NDTV (@ndtv) December 14, 2022 ఇదీ చదవండి: మియాపూర్ ప్రేమోన్మాది దాడి కేసు: యువతి తల్లి మృతి -
భర్తతో రిలేషన్.. ప్రశ్నించిన భార్యపై యువతి యాసిడ్ దాడి
నాగ్పూర్: ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమోనన్న కోపంతో యాసిడ్ దాడి చేసిన సంఘటనలు చూసే ఉంటాం. కానీ, ఓ 25 ఏళ్ల యువతి తన ప్రియుడి భార్యపై యాసిడ్ దాడి చేసింది. ఈ క్రూరమైన చర్య మహారాష్ట్రలోని నాగపూర్లో గత శనివారం ఉదయం జరిగింది. ఈ యాసిడ్ దాడిలో తల్లి, రెండునరేళ్ల కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు స్కూటీపై బాధితుల వద్దకు వచ్చారు. ఒక్కసారిగా వారిపై యాసిడ్ దాడి చేశారు. మహిళతో పాటు తన ఒడిలో బాలుడిపైనా యాసిడ్ పడి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసి క్షణాల్లోనే అక్కడి నుంచి పరారయ్యాను నిందితులు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ‘వివాహేతర సంబంధంపై బాధితురాలు, నిందితురాలి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన స్నేహితురాలితో కలిసి బాధితురాలు, ఆమె కుమారుడిపై యాసిడ్ దాడి చేసింది. బాధితులను ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.’ అని యశోద నగర్ పోలీస్లు తెలిపారు. మొబైల్ ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నట్లు చెప్పారు. ఆమెపై సెక్షన్ 326ఏ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. SHOCKER - ACID ATTACK ON WOMAN & HER CHILD Horrific attack in Nagpur; acid attack on a woman & her child. Reportedly, the attacker had affair with the woman's husband | @Aruneel_S reports #acidattack #BREAKING_NEWS #Nagpur pic.twitter.com/LuLqEhv6gG — Mirror Now (@MirrorNow) December 6, 2022 ఇదీ చదవండి: Bharat Jodo Yatra: బీజేపీ కార్యకర్తలపై రాహుల్ గాంధీ ముద్దుల వర్షం!.. వీడియో వైరల్ -
రెస్టారెంట్ సిబ్బంది నిర్వాకం...వాటర్ బాటిళ్లలో యాసిడ్ అందించి...
పుట్లిన రోజు, పెళ్లి వేడుక లేక మనం ఆనందంగా ఉన్నప్పుడూ సరదాగా రెస్టారెంట్కి వెళ్లి స్నేహితులకు ట్రీట్ ఇచ్చి సెలబ్రెట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడూ ఈ విచిత్రమైన సంఘటన గురించి వింటే రెస్టారెంట్కి వెళ్లాలంటేనే జంకుతారు. ఇక్కడొక కుటుంబం పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు రెస్టారెంట్కి వెళ్లి ఘోరమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ ఘటన పాకిస్తాన్లోని ఒక రెస్టారెంట్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పాకిస్తాన్లోని ప్రముఖ ఇక్బాల్ పార్క్లోని పోయిట్ రెస్టారెంట్లో ఒక కుటుంబం పుట్టిన రోజుల వేడుకలు జరుపుకుంది. ఐతే ఆ రెస్టారెంట్ సిబ్బంది నిర్లక్షపూరిత ధోరణితో సదరు కస్టమర్లకు భోజనంలో వాటర్ బాటిళ్లలో యాసిడ్ని సర్వ్ చేశారు. దీంతో ఆ బాటిల్ని ఉపయోగించి ఇద్దరి చిన్నారుల్లో ఒకరు చేతులు కడుక్కోగా, మరోకరు తాగారు. అంతే కొద్దిసేపటికి ఒకరు మంట మంట అని ఏడవడం, మరోకరు వాంతులు చేసుకుని అశ్వస్థకు గురవ్వడం జరిగిందని చిన్నారులు కుటుంబసభ్యలు చెబుతున్నారు. ఈ మేరకు బాధితుల కుటుంబం సభ్యుడు మహ్మద్ ఆదిల్ మాట్లాడుతూ తన మేనకోడలు రెండేళ్ల వాజిహ, మేనల్లుడు అహ్మద్, రెస్టారెంట్ సిబ్బంది అందించిన వాటర్ బాటిల్లోని యాసిడ్ కారణంగా తీవ్ర అశ్వస్థకు గురయ్యారని చెప్పారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఐతే మేనకోడలు వాజిహ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు. భాదితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరుకు పోలీసులు సదరు రెస్టారెంట్ మేజర్ మహ్మద్ జావెద్ తోపాటు ఐదుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే దర్యాప్తు పూర్తయ్యే వరకు రెస్టరెంట్ని మూసేశారు. ఈ మేరకు పోలీస్ అధికారి తాహిర్ వాకస్ మాట్లాడుతూ..ఇది చాలా విచిత్రమైన సంఘటన అని, తాము ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. (చదవండి: యూఎస్లో ఎనిమిదేళ్ల చిన్నారితో సహ భారత సంతతి కుటుంబం కిడ్నాప్) -
బాలికపై యాసిడ్ దాడి కేసులో నిందితుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): బాలికపై యాసిడ్తో దాడి చేసి గొంతుకోసి నగదు, బంగారంతో ఉడాయించిన ఘటనలో నిందితుడు నాగరాజును బుధవారం నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సీహెచ్ విజయారావు వివరాలు వెల్లడించారు. వెంకటాచలం మండలం చెముడుగుంట నక్కల కాలనీకి చెందిన దంపతులకు 14 ఏళ్ల కుమార్తె ఉంది. ఆ బాలిక మేనత్త కుమారుడు నెల్లూరు నాగరాజు వ్యసనాలకు బానిసై ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 5వ తేదీ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఆమెపై యాసిడ్తో దాడి చేసి చెవి కమ్మలు దోచుకుని ఆమె గొంతుకోశాడు. బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మృతి చెందిందనుకుని బీరువాలోని రూ.నాలుగు వేలు దోచుకెళ్లాడు. కేసు నమోదు చేసిన వెంకటాచలం పోలీసులు నిందితుడిని అతని ఇంటి వద్దే అరెస్ట్ చేసి చోరీ సొత్తు, యాసిడ్ బాటిల్, కత్తి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సీ వివరించారు. -
దాడి చేసింది మేనత్త కొడుకే
నెల్లూరు (క్రైమ్)/సాక్షి, అమరావతి: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో సోమవారం సాయంత్రం బాలికపై యాసిడ్ పోసి గొంతు కోసిన వ్యక్తి బాధితురాలి స్వయాన మేనత్త కొడుకేనని నెల్లూరు రూరల్ డీఎస్పీ వై.హరినాథరెడ్డి వెల్లడించారు. దాడి అనంతరం ఇంట్లోని నగదును అపహరించుకుని వెళ్లాడన్నారు. వివరాలను మంగళవారం మీడియాకు వివరించారు. చెముడుగుంట నక్కలకాలనీలో నివాసముంటున్న దంపతుల కుమార్తె(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలిక మేనత్త కొడుకు నాగరాజు భార్య వినాయక చవితి వేడుకల కోసం కసుమూరులోని పుట్టింటికి వెళ్లింది. మరోవైపు.. ఈనెల 5న బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. నాగరాజు మద్యం తాగొచ్చి ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. భోజనం చేసేందుకు కూర కావాలని కోరాడు. బాలిక కూర ఇవ్వగా నిందితుడు దానిని తీసుకువెళ్లి భోజనం చేశాడు. అనంతరం కూర గిన్నెలో యాసిడ్ పోసుకుని మళ్లీ బాలిక దగ్గరకు వచ్చాడు. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా ఆమె వెంటనే పారిపోయేందుకు యత్నించింది. ఇంతలో నిందితుడు యాసిడ్లో ఓ వస్త్రాన్ని ముంచి దానిని ఆమె ముఖంపై గట్టిగా అద్ది కత్తితో ఆమె గొంతుకోశాడు. దీంతో బాలిక స్పృహ కోల్పోవడంతో మృతిచెందిందని భావించి బీరువా నుంచి రూ.4 వేలు, ఆమె చెవికున్న కమ్మలను తీసుకుని పరారయ్యాడు. స్పృహ నుంచి కోలుకున్న బాధితురాలు చుట్టుపక్కల వారికి విషయాన్ని తెలియజేసింది. వారు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి, కలెక్టర్ కె.చక్రధర్బాబు, ఎస్పీ సీహెచ్ విజయారావు తదితరులు మెరుగైన వైద్యం కోసం బాలికను అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నై అపోలోకు తరలించారు. బాలికపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని.. పూర్తిగా దర్యాప్తుచేసి నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. బాలిక త్వరగా కోలుకోవాలి : వాసిరెడ్డి పద్మ దాడి ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని, వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందన్నారు. -
నెల్లూరు: బాలిక గొంతుకోసిన ఘటనలో కామాంధుడి అరెస్ట్
సాక్షి, నెల్లూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నక్కల కాలనీలో బాలిక గొంతుకోసి, యాసిడ్ పోసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నాగరాజుగా గుర్తించిన పోలీసులు.. బాధితురాలికి దగ్గరి బంధువు అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా ఇంట్లో ఎవరూలేని సమయంలో 14ఏళ్ల బాలికపై నాగరాజు అనే వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్ను బాలిక నోరు, ముఖంపై పోశాడు. అనంతరం కత్తితో గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. చదవండి: విషాదం.. కొడుకును నడుముకు కట్టుకుని.. చెరువులో దూకిన తల్లి మంత్రి పరామర్శ చెముడుగుంటలో దుండగుడి చేతిలో గాయపడి నెల్లూరులోని అపోలో వైద్యశాలలో చికిత్స పొందుతున్న మైనర్ను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. ఆడబిడ్డలపై కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాలికకు సొంత ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అవసరమైతే చెన్నైకు తరలిస్తామన్నారు. చిన్నారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అధికారుల పరామర్శ దుండగుడి చేతిలో గాయపడిన మైనర్ను జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఎస్పీ సీహెచ్ విజయారావు, నెల్లూరు కమిషనర్ హరిత, ఆర్డీఓ మలోలా, డీఎస్పీ హరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తదితరులు పరామర్శించారు. మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో మాట్లాడి బాలికకు మెరుగైన వైద్యం అందిం చేందుకు అపోలోకు తరలించామని గిరిధర్రెడ్డి తెలిపారు. -
బాలికపై మేనమామ నాగరాజు అత్యాచారయత్నం
-
యాసిడ్ పోసి.. గొంతు కోసి..
వెంకటాచలం (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): ఇంట్లో ఎవరూలేని సమయంలో 14ఏళ్ల బాలికపై ఆమె ఇంట్లో గుర్తుతెలియని ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్ను ఆమెపై పోసి, కత్తితో గొంతు కోసి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నక్కల కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెముడుగుంట పంచాయతీ నక్కలకాలనీకి చెందిన 14ఏళ్ల బాలిక బుజబుజ నెల్లూరులోని ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్ను బాలిక నోరు, ముఖంపై పోశాడు. అనంతరం కత్తితో గొంతు కోసి అక్కడ నుంచి పరారయ్యాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ గంగాధర్, ఎస్ఐ అయ్యప్ప నక్కలకాలనీ, ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి విచారించారు. అయితే.. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఒక్కరా, లేక ఇద్దరు ముగ్గురు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Sheroes Hangout: ఆత్మబలమే అసలైన అందం... ఆనందం
ఆ కేఫ్ వేడివేడి చాయ్లకు మాత్రమే ఫేమస్ కాదు. వేడి, వేడి చర్చలకు కూడా. ఎక్కడో ఏదో దిగులుగా ఉందా? అంతా శూన్యం అనిపిస్తుందా? అయితే అటు పదండి. దేశవ్యాప్తంగా ఎంతోమంది యాసిడ్ బాధిత మహిళలకు అంతులేని ధైర్యాన్ని ఇచ్చిన శ్రేయాస్ హ్యాంగవుట్ కేఫ్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది... ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలోని ‘శ్రేయాస్ హ్యాంగవుట్’ కేవలం రుచుల కేఫ్ మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం లేనివారికి అంతులేని ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే వేదిక. అభాగ్యుల కన్నీటిని తుడిచే చల్లని హస్తం. ఆపదలో ఉన్నవారికి చేయూత ఇచ్చి ముందడుగు వేయించే ఆత్మీయ మిత్రురాలు. యాసిడ్ ఎటాక్ సర్వైవర్స్ ఈ కేఫ్ను నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యాసిడ్ బాధిత మహిళలకు స్ఫూర్తి ఇచ్చిన ‘శ్రేయాస్ హ్యాంగవుట్’ తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. ప్రముఖ బ్యూటీ చైన్ సెలూన్ ‘నెచురల్స్’తో కలిసి యాసిడ్ బాధిత మహిళలకు ప్రొఫెషనల్ బ్యూటీ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఈ కోర్స్ చేయడానికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, వారు సొంతంగా బ్యూటీపార్లర్ ప్రారంభించడానికి అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అయిదు మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. వారిలో ఒకరు ఫరాఖాన్. ఒకప్పుడు ఆమెకు మేకప్ వేసుకోవడం అంటే ఎంతో ఇష్టం. అయితే భర్త యాసిడ్ దాడి చేసిన తరువాత అద్దంలోకి చూడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. ‘అందరు మహిళలలాగే నాకు కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం. శుభకార్యాలకు వెళ్లడానికి ముందు ఎంతో హడావిడి చేసేదాన్ని. నా భర్త చేసిన దుర్మార్గం వల్ల మేకప్ అనే మాట వినబడగానే కన్నీళ్లు ధారలు కట్టేవి. అద్దం చూడడానికి భయమేసేది. ఇలాంటి నా మానసిక ధోరణిలో పూర్తిగా మార్పు తీసుకువచ్చి నన్ను బలమైన మహిళగా నిలబెట్టింది శ్రేయాస్. పూర్వంలాగే ఇప్పుడు నేను మేకప్ విషయంలో శ్రద్ధ చూపుతున్నాను. ఏ తప్పు చేశానని భయపడాలి? ఎవరికి భయపడాలి!’ అంటుంది ఫరాఖాన్. 28 సంవత్సరాల కుంతి సోని డిమాండ్ ఉన్న నెయిల్ ఆర్ట్లో శిక్షణ తీసుకుంది. ఒక సినిమా కోసం బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణెతో కలిసి పనిచేసింది. ‘యాసిడ్ బాధితులకు ఉపాధి దొరకడం ఒక ఎల్తైతే, అందమైన ఆనంద జీవితం మరో ఎత్తు. యాసిడ్ బాధితురాలైన నేను మేకప్ వేసుకుంటే నలుగురు చులకనగా మాట్లాడతారేమో...అనే భావనతో చాలామంది అలంకరణ అనే అందమైన సంతోషాన్ని తమ ప్రపంచం నుంచి దూరం చేసుకుంటున్నారు. అలాంటి వారికి శ్రేయాస్ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది’ అంటుంది సోని. ఘాజిపూర్కు చెందిన రూపాలి విశ్వకర్మ సినిమా రంగంలో మేకప్–ఆర్టిస్ట్ కావాలని బలంగా అనుకుంటుంది. కొన్ని ప్రాంతీయ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు వేసిన రుపాలి ఆర్టిస్ట్గా నిలదొక్కుకోకముందే ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె ఒక కన్ను పూర్తిగా దెబ్బతింది. ఆమె రంగుల కల నల్లగా మసక బారింది. ఒకప్పుడు కళ్లముందు సుందర భవిష్యత్ చిత్రపటం తప్ప మరేది కనిపించేది కాదు. దాడి తరువాత ఎటుచూసినా దుఃఖసముద్రమే! ‘బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు ఇంటివాళ్ల నుంచి కూడా నన్ను పట్టించుకోని నిర్లక్ష్య ధోరణి ఎదురైంది. ఒక మూలన కూర్చొని జీవితాన్ని వెళ్లదీయి అన్నట్లుగా ఉండేవి వారి మాటలు. అయితే శ్రేయాస్తో పరిచయం అయిన తరువాత నాలో ధైర్యం పెరిగింది. మరుగున పడిన కలలు మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. నేను మేకప్–ఆర్టిస్ట్గా రాణించడం మాత్రమే కాదు, ధైర్యం లోపించి దారి కనిపించని యువతులకు ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాను’ అంటుంది రుపాలి. శ్రేయాస్ సరికొత్త ముందడుగు ద్వారా ‘అలంకరణ, అందం అనేవి మనకు సంబంధించిన మాటలు కావు’ అనే దుఃఖపూరిత నిరాశానిస్పృహలకు కాలం చెల్లుతుంది. ‘ఆత్మబలమే అసలైన అందం, ఆనందం’ అనుకునే కొత్త కాలం ఒకటి వస్తుంది. -
షాకింగ్ క్రైమ్.. భర్త అలా చేశాడని.. భార్య దారుణం!
క్షణికావేశంలో చేసే తప్పులు తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. భర్త తనను కొట్టాడన్న కోపంతో భార్య దారుణానికి ఒడిగట్టింది. యాసిడ్లో కారం కలిపి అతడిపై పోసింది. వివరాల ప్రకారం.. బరేలీలో మొహమ్మద్ యాసీన్ తాగుడుకు బానిసై భార్య, పిల్లలను కొడుతుండేవాడు. ప్రతీరోజు మద్యం తాగి వచ్చి.. భార్య ఫర్హాతోపాటు నాలుగేళ్ల కుమార్తెను చితకబాదేవాడు. తాగుడు మానేయాలని భార్య ఎంత చెప్పిన వినుపించుకోలేదు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట తాగి ఇంటికి వచ్చిన భర్త.. భార్యను చెంపపై కొట్టాడు. దీంతో, భర్తపై కోపం తెచ్చుకుని క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది. నిద్రిస్తున్న భర్తపై కారం కలిపిన యాసిడ్ పోసింది. దీంతో యాసీన్ తీవ్రంగా గాయపడంతో వారి కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, భర్తపై యాసిడ్ దాడి అనంతరం భార్య ఫర్హా, తన కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.అనంతరం..యాసీన్ బంధువులు భార్య ఫర్హాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ఇన్స్టాగ్రామ్లో పైలట్గా ప్రొఫైల్ పెట్టి 30మంది మహిళలకు టోకరా! -
డ్రైవర్తో వివాహేతర సంబంధం: ప్రియురాలి భర్తను మాట్లాడాలని పిలిచి..
తిరువొత్తియూరు(తమిళనాడు): ఆంబూర్ సమీపంలో వివాహేతర ప్రియురాలి భర్తపై యాసిడ్ దాడి చేసిన జేసీబీ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని వళ్లిపట్టు ఏరి కాలనీకి చెందిన రామన్ (45) మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతని భార్య వేందామ్మాళ్ (40). వీరికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. దంపతుల మధ్య విభేదాల కారణంగా ఏడాది నుంచి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. వేందామ్మాళ్ కంపెనీలో షూ కంపెనీలో పనిచేస్తోంది. రాణిపేటకు చెందిన జేసీబీ డ్రైవర్ శక్తివేలు (26)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రామన్, శక్తివేల్ను అడ్డుకున్నాడు. చదవండి: సహోద్యోగినిపై కన్నేశాడు.. లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించుకుని.. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత తొమ్మిదో తేదీ శక్తివేలు, రామన్ను మాట్లాడాలంటూ పిలిచాడు. ఆంబూర్ సానాంకరై కన్నదాసన్ నగర సమీపంలోని శ్మశానం వద్దకు ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన శక్తివేల్ తాను తెచ్చుకున్న యాసిడ్ను రామన్ మీద పోశాడు. కేకలు విన్న స్థానికులు అతన్ని చికిత్స కోసం వాణియంబాడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆంబూర్ పోలీసులు కేసు నమోదు చేసి శక్తివేల్ను బుధవారం అరెస్టు చేశారు. -
మంచి నీళ్లివ్వమంటే యాసిడ్ ఇచ్చారు
నిజామాబాద్ నాగారం: గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వమంటే యాసిడ్ ఇచ్చారు. ఓ షాపింగ్ మాల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిపాలు కావాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన ఎల్.విజయ్కుమార్ దుస్తుల కొనుగోలు కోసం శనివారం కుటుంబ సభ్యులతో కలసి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. నెహ్రూపార్కు సమీపంలోని ఓ షాపింగ్మాల్ వెళ్లి దుస్తులు కొన్నారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ దాహంగా ఉందని మంచి నీళ్లు ఇవ్వమని సిబ్బందిని కోరారు. సిబ్బంది నీళ్ల మాదిరిగానే ఉండే యాసిడ్ బాటిల్ ఇచ్చారు. విజయ్కుమార్ గొంతులోకి పోసుకోగానే తీవ్ర మంట ప్రారంభమై అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స ప్రారంభించిన వైద్యులు పేషెంట్ పరిస్థితి ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్కు తరలించారు. అంతకు ముందు షాపింగ్ మాల్ నిర్వాహకులతో విజయ్కుమార్ కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అది యాసిడ్ కాదంటూ అందులో పనిచేసే ఆనంద్ అనే ఉద్యోగి కొంచెం నోట్లో పోసుకోవడంతో గొంతులో మంటరేగి అతను కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. -
భర్తతో విడాకులు.. మరొకరితో ప్రేమ.. విధులకు వెళ్తుండగా..
బనశంకరి(బెంగళూరు): సుంకదకట్టెలో యువతిపై యాసిడ్ దాడి ఘటన కళ్లముందు మెదులుతుండగానే అలాంటి ఘోరం నగరంలో పునరావృతమైంది. పెళ్లికి నిరాకరించిందని ఓ వివాహితపై ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఉదంతం కుమారస్వామి లేఔట్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. డీసీపీ హరీశ్పాండే కథనం మేరకు... యాసిడ్ దాడికి గురైన మహిళ కుమారస్వామి లేఔట్ పరిధిలోని కర్ణాటక అగరబత్తి పరిశ్రమలో పనిచేస్తోంది. ఆమెకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉండగా భర్తతో విడాకులు తీసుకుంది. ఇదే పరిశ్రమలో పనిచేస్తూ భార్యకు దూరంగా ఉన్న అహ్మద్కు, ఆమెకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. వివాహం చేసుకుందామని అహ్మద్ కోరగా తన కుమారుడు పెద్దవాడయ్యాడనే కారణంతో ఆ మహిళ అంగీకరించలేదు. ఇదేవిషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. శుక్రవారం ఉదయం ఆ మహిళ విధులకు వెళ్తుండగా సారక్కి వద్ద అహ్మద్ గొడవపడి యాసిడ్ చల్లి ఉడాయించాడు. కుమారస్వామి లేఔట్ పోలీసులు బాధితురాలిని వాసన్ ఐకేర్ ఆసుపత్రికి తరలించారు. కుడి కంటికి తీవ్ర గాయం కావడంతో సంజయ్గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కుమారస్వామి లేఔట్ పోలీసులు అహ్మద్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. చదవండి: పబ్ దగ్గర దింపేస్తామని తీసుకెళ్లి.. -
భర్తతో విడిపోయి బతుకుతోంది.. లవ్ యూ అంటూ సహోద్యోగి వచ్చి..
సమాజంలో కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. మహిళలపై దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా పెళ్లై, ముగ్గురు పిల్లలున్న ఓ మహిళలను ప్రేమిస్తున్నానని వెంటపడి చివరకు ఆమెపై యాసిడ్ చేశాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగళూర్లోని అగర్బత్తి కంపెనీలో బాధితురాలు(32), అహ్మాద్(36) కలిసి పనిచేస్తున్నారు. కాగా, బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉండగా.. ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని జీవనం కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా.. కంపెనీ పనిచేస్తున్న క్రమంలో బాధితురాలితో అహ్మద్ మధ్య పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా వారిద్దరూ అదే కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే, కొద్దిరోజుల నుంచి బాధితురాలితో తనను ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని అహ్మాద్ అడిగాడు. దీనికి ఆమె నిరాకరించింది. తన పిల్లలతో జీవిస్తానంటూ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ అహ్మాద్ ఆమెపై ఒత్తిడి చేశాడు. బాధితురాలు ఒప్పుకోకపోవడంతో కక్షగట్టిన అహ్మాద్ శుక్రవారం.. ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆమె కంటికి తీవ్ర గాయం కాగా.. వెంటనే బాధితురాలని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుడు అహ్మాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: గర్ల్ఫ్రెండ్ను దారుణ హత్య చేసిన ఫుట్బాలర్ -
యువతిపై యాసిడ్ దాడి: ఆ క్లూ రాకుంటే దొరికేవాడు కాదేమో
బనశంకరి(బెంగళూరు): యువతిపై యాసిడ్ దాడికి పాల్పడి పోలీసు కాల్పుల్లో గాయపడిన నిందితుడు నాగేశ్ బెంగళూరులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు బాధిత యువతి కూడా ఆస్పత్రిలో క్రమంగా కోటుకుంటోంది. పరారీలోనున్న నాగేశ్ తిరువణ్నామలైలో రమణ మహర్షి ఆశ్రమంలో తలదాచుకోవడంతో ఆచూకీ తెలియక పోలీసులు తలకిందులయ్యారు. చివరకు స్థానిక ఓ విద్యార్థి సహాయంతో దుండగున్ని పట్టుకున్నారు. ఫోటో తీసి పంపితే కామాక్షిపాళ్య పోలీసులు తిరువణ్ణామలై ప్రభుత్వ బస్టాండు వద్ద నాగేశ్ కోసం వాంటెడ్ ప్రకటనలు అంటించి పలు ఫోన్ నంబర్లు ఇచ్చారు. అతన్ని ఆశ్రమంలో ధ్యానం చేస్తుండగా చూశానని ఒక విద్యార్థి పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాడు. అతని ఫోటోను కూడా రహస్యంగా తీసి పంపాడు. ఫోటో చూసి నాగేశ్ అని పోలీసులు గుర్తించారు. ఏఎస్ఐ రవికుమార్, పోలీసులు మారువేషంలో ఆశ్రమానికి వెళ్లి నాగేశ్ పక్కన కూర్చున్నాడు. తమిళంలో మీ పేరు అని అడిగారు. దీనికి అతను జవాబివ్వలేదు. పోలీసులు నాగేశ్ అని పిలవడంతో అతను తిరిగి చూశాడు. దీంతో నిర్బంధించి తరలించారు. క్లూ రాకపోయి ఉంటే అతడు ఇప్పట్లో దొరక్కపోయేవాడు. చదవండి: వివాహేతర సంబంధం.. వాకిలి ఊడుస్తుండగా ఇంట్లోకి పిలిచి.. -
యాసిడ్ దాడి: ప్రేమోన్మాది కాస్త సన్యాసి అవతారంలో..
బెంగళూరు: ప్రేమ పేరుతో ఓ యువతిని విపరీతంగా వేధించిన వ్యక్తి.. చివరకు ఆమెపై పక్కా ప్లాన్తో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. మరి చేసిన నేరానికి పోలీసులు దొరకబడతారు కదా!. అందుకే.. చిక్కకుండా ఉండేందుకు భలే స్కెచ్ వేశాడు. సన్యాసి అవతారం ఎత్తి పొరుగు రాష్ట్రంలో ఓ ఆశ్రమంలో సేదతీరుతుండగా.. వెంటాడి మరీ పట్టేసుకున్నాయి ఖాకీలు. ఏప్రిల్ 28వ తేదీన బెంగళూరు హెగ్గానహళ్ళి, సంజీవిని నగర్కు చెందిన నగేష్ అనే వ్యక్తి.. మాగడి రోడ్లో తన ఆఫీస్ బయట నిల్చున్న బాధితురాలి(25)పై యాసిడ్ పోశాడు. బాధితురాలి బంధువుల ఇంట్లోనే నగేష్ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో వీళ్లిద్దరికీ ఏడేళ్ల పరిచయం ఉంది. అయితే గత కొంత కాలంగా తనను ప్రేమించాలంటూ నగేష్ బలవంతం చేయగా.. ఆమె అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై కోపం పెంచుకుని దారుణానికి తెగబడ్డాడు. దాడి అనంతరం అతను పారిపోగా.. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్పటి నుంచి పోలీసులు నగేష్ కోసం వెతుకుతూనే ఉన్నారు. పక్కా స్కెచ్.. నగేష్ యాసిడ్ దాడి ఏదో క్షణికావేశంలో జరిగిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. దాడికి ముందు రోజు తన దగ్గరి బంధువులతో ‘నేను రేపు టీవీల్లో కనిపిస్తా’ అంటూ హింట్ కూడా ఇచ్చాడట. అంతేకాదు దాడికి ముందే తాను నడిపిస్తున్న బట్టల దుకాణాన్ని, అందులోని ఇతర సామాన్లను అమ్మేశాడు నగేష్. ఆ డబ్బుతో పాటే దాడి తర్వాత పారిపోయాడు. అయితే పారిపోయే క్రమంలో అతను చేసిన మరో పని.. సెల్ఫోన్ను ఉపయోగించకపోవడం. పోలీసులు ట్రేస్ చేస్తారనే ఉద్దేశంతో.. తన దగ్గరున్న రెండు ఫోన్లను, సిమ్ కార్డులను హోస్కోటే హైవేలో పడేసి వెళ్లిపోయాడు. పైగా ఆ ఫోన్లను ఫార్మట్ చేసి మరీ పడేశాడు. పది టీంలతో వెతుకులాట.. నగేష్ ఫొటోలను రిలీజ్ చేసిన పోలీసులు.. అతని కోసం పది బృందాలతో గాలింపు చేపట్టారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఈలోపు మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పొరుగు రాష్ట్రాలకు టీంలను పంపించారు. ఈలోపు తిరువణ్ణమలై దగ్గర ఓ ఆశ్రమంలో నగేష్ పోలికలతో ఓ వ్యక్తిని చూసినట్లు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిచూసేసరికి.. తనకిప్పుడు దేని మీద ఆశ లేదని, అన్ని బంధాలను తెంచుకుని ఇక్కడికి వచ్చి సన్యాసిగా బతుకుతున్నానంటూ స్టేట్మెంట్లు ఇచ్చాడు. కానీ, పోలీసులు ఊరుకుంటారా? పదహారు రోజుల తర్వాత మొత్తానికి సంకెళ్లు వేసి కటకటాల వెనక్కి నెట్టారు మొత్తానికి. చదవండి: విడిపోయిన భార్యభర్తలను కలిపిన క్రిమినల్!! -
కిరాతకం: ప్రేమిస్తున్నానని వెంటపడి ఆమెపై..
యశవంతపుర: ఐటీ సిటీలో కొంతకాలంగా వినిపించని యాసిడ్ దాడి మళ్లీ తెర మీదకు వచ్చింది. సుంకదకట్టలో ఒక యువతిపై దుండగుడు యాసిడ్ దాడి చేశాడు. స్థానిక ముత్తూట్ ఆఫీసులో ఓ యువతి (23) పని చేస్తోంది. నాగేశ్ అనే యువకుడు రోజూ ఆమె వెంటపడి ప్రేమించాలని అడిగేవాడు. గురువారం ఉదయం 8:30 సమయంలో కూడా అదే మాదిరిగా ఆఫీసు వద్దకు వచ్చి ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. ప్రేమించనని చెప్పడంతో నిన్ను ప్రేమించను, నా వెంట పడొద్దు అని ఆమె ఛీ కొట్టడంతో గొడవ జరిగింది. దీంతో దుండగుడు ముందుగానే పథకం ప్రకారం తెచ్చుకున్న సీసాలో నుంచి యాసిడ్ను ఆమెపై గుమ్మరించి పరారయ్యాడు. బాధను తట్టుకోలేక యువతి రక్షించాలని కేకలు వేసింది. స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. యువతి గొంతు, కాలు సహా శరీరంలో 40 శాతం గాయాలైనట్లు వైద్యుడు కార్తీక్ తెలిపారు. ప్రాణాపాయం లేదని చెప్పారు. కామాక్షిపాళ్య పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కఠిన చర్యలు తప్పవు: హోంమంత్రి యాసిడ్ దాడిని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. ఇది ఒక అమానవీయ ఘటన. నిందితునిపై కఠిన చర్యలను తీసుకోవాలని పోలీసులకు సూచించాను, బాధితురాలికి మెరుగైన చికిత్సలను అందిస్తామన్నారు. అతన్ని వదలొద్దు: యువతి తనపై దాడి చేసిన నాగేశ్ను వదలవద్దని బాధిత యువతి డిమాండ్ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతిని పోలీసులు విచారించారు. అతన్ని మాత్రం వదలద్దు, సరైన శిక్ష పడాలి అని ఆమె అన్నారు. ముత్తూట్లో క్యాషియర్గా పని చేస్తున్నట్లు తెలిపింది. కాగా, యాసిడ్ పోసి పరారైన నిందితుడు నాగేశ్ కోర్టు వద్దకు వెళ్లి లాయర్ను కలిశాడు. ఆపై అతని ఫోన్ స్విచాఫ్ అయిందని పోలీసుల విచారణలో బయట పడింది. ఇది కూడా చదవండి: ఆటోలో యువతిపై అత్యాచారం.. ఫొటోలు, వీడియోలు తీసి.. -
అయ్యో పాపం.. నీళ్లు అనుకొని యాసిడ్ తాగిన యువకుడు
సాక్షి, కృష్ణా జిల్లా: ఓ డిగ్రీ విద్యార్థి మంచినీళ్లని అనుకుని ఫ్రిజ్లో ఉన్న యాసిడ్ తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చిచిత్స పొందుతున్నాడు. ఈ ఘటన విజయవాడరూరల్ మండలం ఎనికేపాడులో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నాగాయలంకలో కోసూరి రామాంజనేయులు, రామతులసి దంపతులు నివసిస్తున్నారు. వారి కుమారులు చైతన్య, సతీష్. రామాంజనేయులు నాగాయలంక పంచాయతీ కార్యాలయం పక్కన బడ్డీకొట్టులో చెప్పుల షాపు నిర్వహిస్తూ కుమారులను చదివిస్తున్నారు. విజయవాడ లయోల కళాశాల ఏవియేషన్ విభాగంలో చైతన్య డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్షిప్ నిమిత్తం తోటి విద్యార్థులతో కలిసి కేసరపల్లిలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నెల 14వ తేదీన స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడేందుకు చైతన్య ఎనికేపాడు వచ్చాడు. ఆట ముగిశాక దాహం తీర్చుకునేందుకు సమీపంలోని ఓ ఫ్యాన్సీ జనరల్ స్టోర్స్కు వెళ్లాడు. మంచినీళ్ల బాటిల్ కావాలని అడిగారు. దుకాణం యజమాని ఫ్రిజ్లో ఉన్న బాటిల్ తీసుకోవాలని సూచించాడు. అయితే ఆ ఫ్రిజ్లో పొర పాటున యాసిడ్ బాటిల్ కూడా ఉంది. కూలింగ్తో ఉన్న ఆ యాసిడ్ బాటిల్ను వాటర్బాటిల్ అనుకుని చైతన్య దానిని తీసుకుని తాగాడు. వెంటనే నురగలు కక్కుకుంటూ వాంతి చేసుకోవడంతో స్నేహితులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలో మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన చైతన్య ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న విజయవాడ పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కాలం ఎంతగామారింది.. తాచేరు వయా ‘ఫోన్ పే’మెంట్! న్యాయం కోసం తల్లిదండ్రుల వినతి మరి కొన్ని నెలల్లో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేసి తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడు దుకాణదారుడి నిర్లక్ష్యం కారణంగా మృత్యువుతో పోరాడుతున్నాడని, తమకు న్యాయం చేయాలని రామతులసి, రామాంజనేయులు దంపతులు వేడుకుంటున్నారు. ఇప్పటికే రూ.లక్షకు పైగా ఖర్చుచేసి వైద్యం చేయించామని పేర్కొన్నారు. యాసిడ్ తాగడంతో లోపల అవయవాలు దెబ్బతిన్నాయని, శస్త్ర చికిత్స చేయాల్సివస్తే రూ.లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెబుతున్నారని వివరించారు. అయితే తమకు అంత ఖర్చు భరించే పరిస్థితి లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న కళాకారిణిపై యాసిడ్ దాడి
యశవంతపుర(బెంగళూరు): రంగస్థల కళాకారిణి దేవిపై యాసిడ్ దాడికి పాల్పడిన రమేశ్, స్వాతి, యోగేశ్ అనేవారిని నందిని లేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందినిలేఔట్ గణేశ్బ్లాక్లో ఉంటున్న దేవి బీఎంటీసీ కండక్టర్గా పనిచేసి రాజీనామా చేసింది. కొన్నిరోజుల నుంచి నాటక కళాకారిణిగా ప్రదర్శనలు ఇస్తూ పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దేవిపై ముగ్గురూ యాసిడ్ దాడి చేశారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరో ఘటనలో.. వేర్వేరుగా ఇద్దరు ఆత్మహత్య హోసూరు: బాగలూరు సమీపంలో వేర్వేరుగా ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకొన్నారు. హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని బెగ్గిళి గ్రామానికి చెందిన నాగరాజ్ (35) కొంత మంది వద్ద అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వారు చెల్లించాలని తీవ్ర ఒత్తిడి చేయడంతో నాగరాజ్ శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. నందిమంగలం ప్రాంతానికి చెందిన కూలికార్మికుడు నారాయణన్ (56)కు తాగుడు అలవాటుండడంతో భార్యాభర్తల మద్య తరచూ గొడవలేర్పడుతుండేది. శనివారం రాత్రి జరిగిన గొడవల్లో ఆవేశం చెందిన నారాయణన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు ఘటనల్లోనూ పోలీసులు కేసు నమోదు చేశారు. -
యువతిపై యాసిడ్ దాడి.. ట్రెండింగ్లో యాసిడ్ అటాక్
Acidattack Trending In Twitter: యువతులపై యాసిడ్ దాడి ఘటనలు పలు సందర్భాల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల వారు పెద్దఎత్తున నిరసనలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో విసృతంగా చర్చ జరిపిన వార్తలను కూడా చూశాం. ప్రస్తుతం ఓ యాసిడ్ దాడిపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అదీ అబ్బాయిలపై జరిగిన దాడుల గురించి కావడం విశేషం.!! జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్లో మంగళవారం 24 ఏళ్ల యువతి యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయాల పాలైంది. శ్రీనగర్లోని హవాల్ ప్రాంతం వాంట్పోరాలోని ఉస్మానియా కాలనీలో యువతిపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని పోలీసులు వెల్లడించారు. ఆమెను వెంటనే స్థానిక ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆమె ముఖానికి గాయాలైనట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కన్వల్జీత్ సింగ్ తెలిపారని పోలీసులు వెల్లడించారు. ఆమె కళ్లు దెబ్బతిన్నాయా లేదా అని నిర్ధారించడానికి శస్త్రచికిత్స చేస్తామని డాక్టర్ సింగ్ తెలిపారు. యాసిడ్ దాడికి తెగపడిన దుండగుడిని పట్టుకోవడానికి పోలీసులు బృందాలు మారి గాలిస్తున్నారని పేర్కొన్నారు. అయితే యాసిడ్ దాడిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. యాసిడ్ దాడి బాధితులు అమ్మాయిలే కాదు. యువతులు చేసిన యాసిడ్ దాడుల్లో అబ్బాయిలు కూడా బాధితులుగా మారారని వాటికి సంబంధించిన పాత ఘటనలు, వార్తలను సోషల్ మీడియాలో నెటిజన్లు #acidattack హ్యాష్ట్యాగ్తో షేర్ చేస్తున్నారు. Crime has no gender and men also fall prey to Acid attacks😑#acidattack pic.twitter.com/qBSmj7QWSc — 🅆🄷🄸🅃🄴 🅃🄸🄶🄴🅁 👉#MI (@SidharthshuklaC) February 2, 2022 #acidattack Crime has no gender and men also fall prey to Acid attacks pic.twitter.com/kmAVyXLhpc — Amrita Pal Nishad (@AmritaP71033808) February 1, 2022 #shefoughtback #acidattack #Shereal Why media is silent when victims are men? pic.twitter.com/jTNf0vjHl0 — Amrita Pal Nishad (@AmritaP71033808) February 1, 2022 #acidattack Surendra Singh of delhi suffered acid attack by his wife because she wanted to live her with her lover pic.twitter.com/va8S7M8CLJ — Mr.India (@MrIndia92586350) February 1, 2022 #acidattack is a gender nuetral crime. Like women , men also become victims of such attacks Crime has no gender...पुरुषो पर भी होता है एसिड अटैक pic.twitter.com/2kAy6kskgS — Amita Tripathi (@AmitaTr52987852) February 1, 2022 #acidattack #shereal Why dont women raise their voice when acid victims are men? Why do feminists show such gender bias? pic.twitter.com/HmlvCWXH5S — Nancy (@NancyGu07971855) February 1, 2022 -
కన్నయ్య కుమార్పై దాడికి యత్నం
లక్నో: కాంగ్రెస్ నేత కన్నయ్యకుమార్పై ఒకరు రసాయనాలతో దాడికి యత్నించారు. లక్నోలోని యూపీసీసీ కార్యాలయంలో మంగళవారం ఈ ఘటన జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని పార్టీ ఆఫీసు బేరర్లు పట్టుకొన్నారని చెప్పాయి. పార్టీ నిర్వహించే యువ సంసద్లో ప్రసంగించేందుకు కన్నయ్య లక్నో వచ్చారు. దాడికి పాల్పడిన వ్యక్తిని దేవాంశ్ బాజ్పాయ్గా గుర్తించారు. దాడికి కారణాలు తెలియరాలేదు. గతంలో విద్యార్థి నాయకుడిగా ఉన్న కన్నయ్య తొలుత కమ్యూనిస్టు పార్టీలో చేరి అనంతరం కాంగ్రెస్లోకి మారారు. -
దాహంగా ఉందని నీళ్లివ్వమన్నాడు! ఏమైందో తెలియదు యాసిడ్తో దాడి చేసి..
మాడుగుల(గురజాలరూరల్): దాహంగా ఉంది మంచినీరివ్వమ్మా... అంటూ అడిగిన వ్యక్తికి..దాహం తీర్చేందుకు నీరుతెస్తున్న మహిళపై ఆదే వ్యక్తి యాసిడ్తోదాడి చేసిన సంఘటన మండలంలోని మాడుగుల గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..మాడగుల గ్రామంలో ఆకుల భూలక్ష్మి వ్యవసాయకూలీ. నాలుగేళ్ల కిందట ఆమె భర్త వెంకటేశ్వర్లు పురుగుమందు తాగి మృతి చెందారు. అప్పటి నుంచి తనకున్న ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రులైన గోనుగుంట్ల వీరయ్య, ధనలక్ష్మీలతో కలిసి ఉంటుంది. గురువారం రాత్రి 9గంటలకు గుర్తు తెలియని వ్యక్తి మంచినీరు ఇవ్వమ్మా దాహంగా ఉంది అని అడుగగా... పిల్లలతో కలిసి నిద్రిస్తున్న భూలక్ష్మీ నీరుతెచ్చి ఇస్తున్న సమయంలో యాసిడ్దాడి చేసి పరారయ్యాడు. యాసిడ్ దాడిలో ఆమెకు కుడి చెంప, గూడ, పక్కటెముకల వద్ద శరీరం కాలిపోయింది. గమనించిన తల్లిదండ్రులు గ్రామస్తుల సహాయంతో గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఏఎస్ఐ స్టాలిన్ కేసు నమోదు చేయగా సీఐ ధర్మేంద్రబాబు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. మంటల్లో కాలి మృతి చెందిన వ్యక్తి మంగళగిరి: కొప్పురావుకాలనీలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మంటలలో కాలి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొప్పురావుకాలనీలో పల్లిశెట్టి సాంబశివరావు తన నివాసంలో ఒక్కడే నివాసముంటున్నాడు. రోజూ లాగే బెడ్రూమ్లో పడుకుని నిద్రపోతుండగా తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బెడ్రూమ్లో మంటలు చెలరేగి మంచానికి అంటుకున్నాయి. సాంబశివరావు మంటలలో చిక్కుకుని మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని ఆసుపత్రికి సాంబశివరావు కుమారుడుకి సమాచారమిచ్చినట్లు తెలిపారు. చదవండి: అమెరికా చరిత్రలో ఇది చీకటి రోజు.. డొనాల్డ్ ట్రంప్పై బైడెన్ తీవ్ర విమర్శలు -
యాసిడ్ పోసినా ప్రేమిస్తూనే ఉంటా!.. ‘తప్పుచేశావమ్మా’
Turkey Acid Victim Marriage ex despite acid attack: లవ్ ఈజ్ బ్లైండ్.. యస్, ఎలాంటోళ్లనైనా తన మాయలో ముంచెత్తుతుంది ప్రేమ. ఆ మత్తులో మునిగితే మంచే కాదు.. ఒక్కోసారి చెడు కూడా జరుగుతుంటుంది. అయితే ఆ యువతి జీవితంలో మాత్రం ‘ప్రేమ’ ఘోరమైన తప్పటడుగు వేసింది. మాజీ ప్రియుడన్న ట్యాగ్ను తట్టుకోలేక ఉన్మాద చర్యకు పాల్పడ్డాడు. వికారంగానేకాదు.. అంధురాలిగా కూడా మార్చేశాడు. అయితేనేం మాయని గాయం చేసిన వాడినే మనువాడి.. ఆసక్తికర చర్చకు తెర తీసింది ఆ యువతి. బెర్ఫిన్ ఒజెక్(20).. టర్కీ యువతి. 2019లో యాసిడ్ దాడికి గురైంది. 70 శాతం చూపు పొగొట్టుకుని.. ముఖం అందవికారంగా మారిపోయింది. ఆ దాడి చేసింది ఎవరో కాదు.. ఆమె మాజీ ప్రియుడు ఒజన్ సెల్టిక్. బ్రేకప్ తర్వాత ఓరోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షమించమని, తిరిగి ప్రేమించాలన్నా అతని కోరికను ఆమె అంగీకరించలేదు. తనకు దక్కకుంటే ఎవరికీ దక్కకూడదనే నిర్ణయానికి వచ్చాడు. ఆ కోపంలో ఆమెపై యాసిడ్ గుమ్మరించాడు. పోరాటం.. బెర్ఫిన్పై జరిగిన దాడికి టర్కీ మొత్తం కదిలింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు కోర్టుకు ఎక్కాయి. దీంతో పరారీలో ఉన్న ఒజన్ను ఎట్టకేలకు పోలీసులు కనిపెట్టి.. అరెస్ట్ చేశారు. అయినా న్యాయపోరాటం ఆగలేదు. జనాగ్రహానికి కదిలిన ఇస్కెండెరన్ కోర్టు (హతాయ్ ప్రావిన్స్) 13 ఏళ్ల ఆరు నెలల శిక్ష విధించింది. యాసిడ్ బాధిత కేసుల్లో బెర్ఫిన్ కేసు పోరాటం ద్వారా ఒక స్ఫూర్తిగా నిలిచింది. పూలు.. ప్రేమ లేఖలు.. క్షమాపణలు ఒజన్ జైలుకి వెళ్లినా.. బెర్ఫిన్కు ప్రేమ సందేశాలు పంపడం ఆపలేదు. పైగా జరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ లేఖలు, పూలు పంపసాగాడు. దీంతో కరిగిపోయిన ఆ యువతి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. దీంతో అతని శిక్షా కాలం తగ్గిపోయింది. మరోవైపు కరోనా కారణంగా మే 2022లో రిలీజ్ కావాల్సిన ఒజన్.. ఈమధ్యే బయటకు వచ్చాడు ఒజన్. వచ్చిరాగానే వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె సంతోషంగా ఒప్పుకుంది. ఇద్దరూ సంతకాలతో ఒక్కటయ్యారు. కన్నవాళ్ల కోపం.. ఇంటర్నెట్లో మంట బెర్ఫిన్ నిర్ణయం సోషల్ మీడియాలో నెటిజన్లకు మంట తెప్పించింది. ఒక బాధితురాలిగా ఆమెకు మద్దతు తెలిపిన వాళ్లంతా.. ఇప్పుడు తిరగబడ్డారు. ముఖాన్ని వికారంగా మార్చేసి.. కంటిచూపు పోయేలా చేసిన మృగాన్ని ఎలా క్షమిస్తావని? పైగా పెళ్లి చేసుకుంటావా? అని తిట్టిపోస్తున్నారు. తప్పు చేశావమ్మా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రేమ ఎక్కువ రోజులు నిలవదని శాపనార్థాలు పెడుతున్నారు. మరోవైపు బెర్ఫిన్ తండ్రి ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఇష్టపడడం లేదు. తమకు తెలియకుండానే కూతురు వివాహం చేసుకుందని, ఆమె కోసం చేసిన పోరాటం అంతా వృథా అయ్యిందని ఆయన బాధపడుతున్నాడు. వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలపై ఈ కొత్త జంట స్పందించాల్సి ఉంది. -
Yasmeen:అసలు పెళ్లి అవుతుందా అని హేళన.. దేశంలోనే తొలి యాసిడ్ సర్వైర్ నర్స్
Acid Attack Survivor Yasmeen Mansoori: ఎవరో మూర్ఖంగా చేసిన పనికి ముఖం కాలిపోయింది, కళ్లు తెరవలేని పరిస్థితి. అయినా జీవితం మీద ఆశలు వదులుకోలేదు. ఇరవై సర్జరీలు చేయించుకున్నా, ముఖం పూర్వస్థితికి రాలేదు. ఏ మాత్రం నిరాశపడకుండా కష్టపడి చదివి ఏకంగా ఎయిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్ అయ్యింది యాస్మిన్ మన్సూరి. చిన్నపాటి కష్టాలను సాకులుగా చూపుతూ లక్ష్యం లేకుండా, నిర్లక్ష్యంగా బతుకుతోన్న ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది యాస్మిన్. అది 2004.. ఉత్తర్ ప్రదేశ్లో షామిలీ జిల్లాలో ఉంటోన్న యాస్మిన్ వాళ్ల కుటుంబం జీవనం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. అప్పుడు యాస్మిన్కు పదహారేళ్లు. ఒకరోజు వారిమీద కిట్టని వాళ్లెవరో యాసిడ్ పోశారు. ఈ దుర్ఘటనలో యాస్మిన్ చర్మం మూడు పొరల లోతు వరకు కాలిపోయింది. కళ్లు తెరిచే పరిస్థితి లేదు. తనతోపాటు ఉన్న చెల్లి శరీరం కూడా కాలింది. మంచి వైద్యం తీసుకునేందుకు యూపీ నుంచి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు వారిని. కొన్నాళ్లు కుటుంబం మొత్తం అక్కడే ఉంటూ మెరుగైన వైద్యం చేయించుకున్నారు. చికిత్స తర్వాత ఇంటికి వచ్చాక కూడా ఆసుపత్రికి వెళ్లక తప్పని పరిస్థితి వారిది. దీంతో రెండు వారాలకొకసారి ఢిల్లీ వెళ్లడం యాస్మిన్ జీవితంలో ఒక భాగమైంది. చికిత్సలో వాడే మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపించడంతో చాలా ఇబ్బందులకు గురైంది. ఈ అక్క చెల్లెళ్లను చూసిన వాళ్లు ‘‘ఈ పిల్లలను ఎవరు పెళ్లి చేసుకుంటారు, వీరికి అసలు పెళ్లి అవుతుందా?’’ అని గుసగుసలాడుకునేవారు. ఒకపక్క శారీరక బాధ, మరోపక్క గుండెల్లో గుచ్చుకునే మాటలు మానసికంగా బలహీన పరిచేవి. కొన్నాళ్లకు ఇలా కాదు. అయ్యిందేదో అయ్యింది. దానిని మార్చలేము కాబట్టి అలాగే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది యాస్మిన్. సేవలు నచ్చి... సఫ్దర్ జంగ్ తర్వాత చికిత్స కోసం ఎయిమ్స్కు వెళ్లింది యాస్మిన్. అక్కడ కొంతమంది నర్సులు రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు నచ్చడంతో తను కూడా నర్స్ అయ్యి సేవలందించాలనుకుంది. అనుకున్న వెంటనే దూరవిద్య ద్వారా ఇంటర్మీడియట్ చదువుతూనే, మరోపక్క కంప్యూటర్ కోర్సు చేసింది. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో బిఏలో చేరింది. ఒకపక్క బిఏ చేస్తూనే ‘జామియా హమ్దార్ద్ యూనివర్సిటీ’లో నర్సింగ్లో చేరింది. అయితే ఆర్ట్స్ సబ్జెక్ట్ చదవడం వల్ల నర్సింగ్ బాగా కష్టంగా అనిపించేది తనకు. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయినప్పటికీ నిరాశ పడకుండా తరువాతి ప్రయత్నంలో పాస్ అయ్యింది. ఉత్తమ ఉద్యోగిగా నర్సింగ్ అయిపోయిన వెంటనే 2014లో హకీమ్ అబ్దుల్ అహ్మద్ సెంటెనరీ ఆసుపత్రిలో ఉద్యోగం దొరికింది. ఇక్కడ రెండేళ్లు పనిచేసాక, మరో ఆసుపత్రిలో చేరింది. ఇక్కడ యాస్మిన్ సేవలకు గుర్తింపుగా ‘బెస్ట్ ఎంప్లాయీ అవార్డు’ వచ్చింది. ఒకపక్క ప్రైవేటు హాస్పిటల్స్లో చేస్తూనే మరోపక్క ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేది. ఇదే సమయంలో ఎయిమ్స్లో నర్సులు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది,. అర్హతలన్నీ ఉన్నప్పటికీ డిజెబిలిటీ నిబంధనలకు ఆమె సరిపోదని తిరస్కరించారు. దీంతో యాసిడ్ సర్వైవర్ను కూడా డిజెబిలిటీ విభాగంలో చేర్చాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. ధర్మాసనం 2016లో డిజెబిలిటీ చట్టంలో కొన్ని సవరణలు చేసి యాసిడ్ సర్వైర్స్ను కూడా ఈ చట్టపరిధిలోకి చేర్చింది. దీంతో రెండేళ్ల తరువాత ఎయిమ్స్లో ఉద్యోగాన్ని పొంది, ‘‘దేశంలోనే తొలి యాసిడ్ సర్వైర్ నర్స్’’ గా రికార్డు సృష్టించింది. ఇక్కడ రోగులకు మంచి సేవలందించడంతో ‘ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ పర్సన్’ విభాగంలో ‘బెస్ట్ ఎంప్లాయీ’ అవార్డును అందుకుంది. ‘‘ప్రస్తుతం దేశంలో ఎంతోమంది అమ్మాయిలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. అమ్మాయిల జీవితంలో పెళ్లి అతిముఖ్యమైన అంశంగా చూస్తారు. అది సరికాదు. పెళ్లికి ముందు మనకెన్నో కలలు ఉంటాయి. వాటిని నిజం చేసుకుని ఆ తర్వాతే, జీవితంలో ముందుకు సాగాలి’’ అని యువతకు చెబుతోంది. -
పెళ్లికి నిరాకరణ.. యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి
Kerala Married Woman Pours Acid On Man For Rejecting To Marriage Her: వివాహం చేసుకోవడానికి నిరాకరించిన వ్యక్తిపై యాసిడ్తో దాడి చేసింది ఓ వివాహిత. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తికి షీబా అనే మహిళతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అప్పటికే షీబాకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విడిపోయిన షీబా పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. షీబా వివాహిత అని తెలియని అరుణ్ ఆమెతో ప్రేమాయణం నడిపాడు. ఈ క్రమంలో ఓ రోజు షీబాకు వివాహం అయి.. ఇద్దరు పిల్లలు ఉన్న విషయం అరుణ్కు తెలిసింది. దాంతో అతడు తమ బంధానికి ముగింపు పలకాలని భావించాడు. కానీ షీబా అందుకు అంగీకరించలేదు. తనను వివాహం చేసుకోవాల్సిందేనని పట్టుబట్టింది. తమ బంధం గురించి నలుగురికి చెప్తానని బెదిరించి.. అరుణ్ కుమార్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయసాగింది. (చదవండి: మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ) ఈ క్రమంలో నవంబర్ 16న అరుణ్ కుమార్ తన అన్న, మరో స్నేహితుడితో కలిసి... తిరువనంతపురంలో ఉన్న చర్చికి వెళ్లాడు. షీబా అడిగిన మొత్తాన్ని ఆమెకు ఇచ్చాడు. ఆ సమయంలో ఇరువురి మధ్య వివాహం గురించి మరో సారి చర్చకు వచ్చింది. ఈ క్రమంలో అరుణ్ కుమార్.. షీబాను వివాహం చేసుకోలేనని తేల్చి చెప్పాడు. అరుణ్కుమార్పై ఆగ్రహంతో ఉన్న షీబా.. చర్చి వద్దకు వచ్చేటప్పుడే తనతో పాటు యాసిడ్ తీసుకుని వచ్చింది. (చదవండి: నకిలీ ఫేస్బుక్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఓకే చేయగానే..) అరుణ్ కుమార్ పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్ అతడిపై పోసి.. అక్కడ నుంచి పరారయ్యింది. ప్రస్తుతం అరుణ్ కుమార్కు తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పటిల్లో చికిత్స జరగుతుంది. యాసిడ్ దాడిలో అరుణ్ కుమార్ కంటి చూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. షీబాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో షీబాకు కూడా గాయాలయినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: ప్రియురాలి యాసిడ్ దాడి, ప్రియుడి మృతి -
మాట్లాడాలని పిలిచి బాలిక కంట్లో యాసిడ్ పోసి..
భోపాల్: ఇద్దరు యువకులు తమ కుటుంబంలోని మహిళ ఓ యువకుడితో పారిపోవడానికి సహకరించిందనే కోపంతో బాలిక కళ్లలోకి యాసిడ్ పోశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆమె చూపు కోల్పోయే పరిస్ధితి లేదని రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఆమె చిత్రకూట్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల ప్రకారం.. బాధితురాలు పన్నా జిల్లాలోని బార్హో గ్రామంలో నివసిస్తుంది. ఆ ఊర్లోని ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడాలని పిలివడంతో ఆమె తన సోదరుడితో కలిసి వారి ఫాంహౌస్కు వెళ్లింది. నిందితులు ఆమె సోదరుడిని దారుణంగా కొట్టి, బాలికను వేధించి ఆమె కళ్లలోకి యాసిడ్ పోశారు. ఆ తర్వాత ఆమె బాధతో కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ బాలిక నొప్పితో వణుకుతూ పొలంలో పడిపోయింది. బాలిక పరిస్థితి చూసిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కమల్ నాథ్ మాట్లాడుతూ.. ఈ ఘటన సిగ్గుచేటని నిందితులపై కఠినచర్యలు చేపట్టాలని, బాధితురాలికి ప్రభుత్వం బాసటగా నిలవాలని డిమాండ్ చేశారు. బాలికకు ఆమె తోబుట్టువులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చదవండి: అత్యాచారం కేసు: గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలని కోర్టు ఆదేశం -
నటి పాయల్ ఘోష్పై యాసిడ్ దాడి.. గాయాలు
సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన నటి పాయల్ ఘోష్పై యాసిడ్ దాడి జరిగింది. ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన కొందరు తనపై దాడి చేసినట్లు పాయల్ తెలిపింది. ముంబైలో ఓ షాపులో మందులు కొనుక్కొని తిరిగి వచ్చి కారులో కూర్చుంటున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. పాయల్ తనపై జరిగిన దాడికి సంబంధించిన అంశాలను వెల్లడిస్తూ ఇన్స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో.. ఆమె తన కారులోకి వెళ్తుండగా కొంతమంది మాస్క్ ధరించిన వ్యక్తులు రాడ్తో దాడి చేశారని, వారి చేతిలో బాటిల్ కూడా ఉందని, అది యాసిడ్ అని తాను భావించినట్లు పాయల్ చెప్పింది. అయితే ఈ దాడి నుంచి తను తప్పించుకున్నట్లు, కానీ ఎడమ చేతికి స్వల్పంగా గాయం అయ్యినట్లు పేర్కొంది. దాడి జరుగుతున్న సమయంలో తాను గట్టిగా అరవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారని తెలిపింది. ఇలాంటి సంఘటన తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని ఇదే మొదటిసారని పాయల్ చెప్పుకొచ్చింది. ఈ అంశంపై పోలీసు కేసు నమోదు చేయనున్నట్లు నటి వెల్లడించింది. కాగా ఈ దాడికి సంబంధించి ఎవరినైనా అనుమానిస్తున్నారా అనే దానిపై మాట్లాడుతూ పాయల్ ఇలా చెప్పింది.. స్పష్టంగా, తెలిసిన వాళ్లు కాదు కానీ ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Payal Ghosh official fanclub (@payalghoshfancl) చదవండి: Shilpa Shetty: జైలు నుంచి వచ్చిన భర్త.. శిల్పా ప్రయాణం ఎటువైపు? -
పెళ్లయి 3 నెలలు: యాసిడ్ తాగించిన భర్త.. సీఎంకు ఫిర్యాదు
గ్వాలియర్ (మధ్యప్రదేశ్): పెళ్లయి మూడు నెలలు కూడా కాలేదు అదనపు కట్నం వేధింపులు తీవ్రమయ్యాయి. భర్తతో పాటు వదిన కూడా హింసించడం మొదలుపెట్టింది. వారి ఆగడాలు శ్రుతిమించి ఆ నవ వధువుపై క్రూరంగా ప్రవర్తించారు. వారిద్దరూ కలిసి ఆ అబల నోటిలో యాసిడ్ పోశారు. అనంతరం అగ్గి పెట్టారు. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కొన ఊపిరి మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె జీర్ణాశయం మొత్తం దెబ్బతింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు ఢిల్లీ మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడంతో బహిర్గతమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్వాలియర్లోని డబ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో యువతికి (25) ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే అత్తింటి వారు వేధింపులు మొదలుపెట్టారు. అదనంగా కట్నం తీసుకురావాలని ఆమెపై నిత్యం వేధిస్తున్నారు. భర్త శారీరకంగా తీవ్రంగా హింసించేవాడు. అతడికి తోడుగా అతడి సోదరి కూడా చేరి ఆమెకు నరకం చూపించారు. జూన్ 3వ తేదీన వారి ఆగడాలు శ్రుతిమించాయి. ఆ యువతిని తీవ్రంగా కొట్టి భర్త, వదిన కలిసి యాసిడ్ తాగించారు. అంతటితో ఊరుకోకుండా అగ్గి పెట్టారు. వాటి దెబ్బకు ఆమె తాళలేక అరుపులు, కేకలు వేసి నరకం అనుభవించింది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్థానికంగా ప్రాథమిక చికిత్స అనంతరం ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో నరకయాతన అనుభవిస్తూ జీవిస్తోంది. యాసిడ్ ప్రభావంతో జీర్ణాశయం పూర్తిగా దెబ్బతింది. కడుపు ముందరి భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో వైద్యులు అతికష్టంగా ఆమెకు తినిపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్, సభ్యురాలు ప్రమీలా గుప్తా బాధితురాలిని పరామర్శించారు. జరిగిన విషయం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ దారుణంపై మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ సహించలేకపోయారు. వెంటనే ఆమె వివరాలు, ఫొటోలను తీసుకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ఫిర్యాదు చేశారు. ఘటన వివరాలు తెలుపుతూ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదై నెల దాటినా ఇంకా నిందితులను అరెస్ట్ చేయలేదని గుర్తుచేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితురాలి దీనస్థితిని ముఖ్యమంత్రికి లేఖలో వివరించారు. दिल्ली महिला आयोग की अध्यक्षा @SwatiJaiHind और मेंबर @promilagupta24 ने दिल्ली के एलएनजेपी अस्पताल पहुंचकर ग्वालियर की एसिड अटैक सर्वाइवर से मुलाकात की। https://t.co/bv7yg8xopK pic.twitter.com/vGmLWGcV39 — Delhi Commission for Women - DCW (@DCWDelhi) July 20, 2021 -
ఆమె బతుకును ఎంచుకుంది
జీవించడంలో ఉన్న ఆనందం మరణించడంలో లేదు అంటుంది డాక్టర్ మహాలక్ష్మి. ఇటీవల గృహిణులు క్షణికావేశంలో ఆత్మహత్యలను ఎంచుకుంటున్నప్పుడు మహాలక్ష్మి వంటివారి జీవితం సరైన స్ఫూర్తి అనిపిస్తుంది. 26 ఏళ్ల వయసులో యాసిడ్ దాడికి లోనైన ఈ మైసూర్ వైద్యురాలు జీవించడాన్నే తన మార్గంగా ఎంచుకుంది. కోవిడ్ పేషెంట్స్కు వైద్యం చేస్తూ తను జీవించి ఉండటానికి ఒక అర్థాన్ని కూడా చెబుతోంది. ఇంతకన్నా ఏం కావాలి? మైసూర్ ప్రభుత్వాస్పత్రిలో రోజుకు 50 నుంచి 60 మంది పేషెంట్స్ను ఓపిలో చూస్తుంది డాక్టర్ మహాలక్ష్మి. కోవిడ్ కాలం వచ్చాక ఆమె కోవిడ్ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తూ గత సంవత్సరకాలంగా ప్రాణాలు కాపాడుతోంది. ‘నేను బతికి ఉండటం వల్లే వారిని బతికించగలుగుతున్నాను’ అంటుంది ఆమె. అవును... జీవితంలో ఆత్మహత్య చేసుకోవడానికి కావలసిన అన్ని కారణాలు ఆమె దగ్గర ఉన్నాయి. కాని ఆమె చావును కాకుండా బతుకును ఎంచుకుంది. బతుకులోనే అందం, ఆనందం, పరమార్థం ఉన్నాయని నిశ్చయించుకుంది. బతికి సాధించాలనేది ఆమె తత్త్వం. ఇవాళ కొంతమంది గృహిణులు చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకోవడం, పిల్లలతో సహా విపరీతమైన నిర్ణయాలను తీసుకోవడం కనిపిస్తూ ఉంది. అలాంటి ఆలోచనలు ఉన్నవారు ప్రతికూలతలను ఎదుర్కొనే మనోబలాన్ని పెంచుకోవాలని అంటుంది మహాలక్ష్మి. 2001లో యాసిడ్ దాడి మైసూర్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చేసిన మహాలక్ష్మి తన 26వ ఏట ఒక అద్దె ఇంటి లో క్లినిక్ మొదలెట్టింది. దాని యజమాని చిక్క బసవయ్య ఆమెను లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. అది భరించలేని ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చి క్లినిక్ ఖాళీ చేసి వేరే చోట ప్రారంభించింది. ఇది చూసి ఓర్వలేని చిక్కబసవయ్య జనవరి 11, 2001న ఆమె క్లినిక్ మూసి ఇంటికి వెళుతుండగా ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఆ యాసిడ్ దాడి సరిగ్గా ఒక 60 సెకన్లలో ముగిసి ఉంటుంది. కాని అది ఆమె జీవితాన్నే మార్చేసింది. 25 సర్జరీలు ‘ముఖం వికారంగా ఉంటే ఈ సమాజంలో ఆదరణ ఉండదు. అటువంటివారు నాలుగు గోడల మధ్య మగ్గిపోవాల్సిందే. కాని నేనలా ఉండదలుచుకోలేదు. 25 సర్జరీలు చేయించుకుని ఎంతవరకు ముఖాన్ని సరి చేసుకోగలనో అంత చేయించుకున్నాను. ఆ సమయంలో డిప్రెషన్ చుట్టుముట్టింది. బతుకు మీద ఆశ సన్నగిల్లింది. కాని బతకాలనే నిశ్చయించుకున్నాను. నేను నా ప్రాక్టీస్ను కొనసాగిస్తూ ఈ కష్టాన్ని మర్చిపోవాలని అనుకున్నాను. వైద్యవృత్తి అభ్యసించిన నేను నా మానసిక భౌతిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో గట్టిగా ఆలోచించాను. నిజానికి యాసిడ్ దాడిలో గాని ఇతర ఏ ఆరోగ్య సమస్యల్లోగాని జీవిత సమస్యల్లో గాని మానసిక బలమే ముఖ్యం అని గ్రహించాను. ఆ మనసును గట్టి చేసుకుంటే మనం కష్టాలు దాటొచ్చు. నేను అదే చేశాను’ అంటుంది మహాలక్ష్మి. 2001లో ఆమెపై దాడి జరిగితే 2005లో సెషన్స్ కోర్టు ఆధారాల్లేవని నిందితుణ్ణి వదిలిపెట్టింది. కాని మహాలక్ష్మి హైకోర్టులో పోరాడింది. 2012లో హైకోర్టు చిక్కబసవయ్యకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ‘అంతవరకూ నేను కేసు ను గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది. ఆలస్యంగానైనా న్యాయం జరిగింది’ అంటుంది మహాలక్ష్మి. చదువే శరణ్యం ‘స్త్రీలు బాగా చదువుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ఏ సవాలునైనా ఎదిరించాలంటే మన దగ్గర చదువు ఉండాలి. అప్పుడే మనం మరింత ధైర్యంగా ఉండగలం. అంతేకాదు మనకు జరిగే ఎటువంటి అన్యాయం పైన అయినా పోరాటం చేయగలం. స్త్రీలు బాధితులయ్యి తల దించుకునే పరిస్థితి సమాజంలో ఉంటుంది. కాని మన పైన పీడన చేసేవారే తల దించుకునేలా చేయాలి. అందుకు సమాజంలో మార్పు రావాలి’ అంటుంది మహాలక్ష్మి. ‘నేను జీవితంలో ఎన్నడూ నిరాశను దగ్గరకు రానిచ్చేలా ఉండకూడదు అని నిశ్చయించుకున్నాను. ఆశతో ఉంటే అన్నీ మారుతాయి’ అంటుంది మహాలక్ష్మి. సవాళ్లను ఎదుర్కొనే సందర్భాలు వస్తే మానసిక స్థయిర్యంతో ఎదుర్కొనాలి తప్ప మరణాన్ని ఆశ్రయించకూడదని మహాలక్ష్మి జీవితం గట్టిగా చెబుతోంది. స్త్రీలు బాధితులయ్యి తల దించుకునే పరిస్థితి సమాజంలో ఉంటుంది. కాని మన పైన పీడన చేసేవారే తల దించుకునేలా చేయాలి. అందుకు సమాజంలో మార్పు రావాలి. -
భార్య సహా ముగ్గురిపై యాసిడ్ దాడి
టీ.నగర్: భార్య సహా ముగ్గురిపై యాసిడ్ దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తూత్తుకుడి అశోక్నగర్కు చెందిన రవి (50). సిప్కాట్లో లారీ వాటర్ సర్వీస్ నడుపుతున్నాడు. ఇతని భార్య మాల (49). ఈమెకు తూత్తుకుడి పీఅండ్టీ కాలనీకి చెందిన సూసై (48)తో పరిచయం ఏర్పడింది. దీంతో అనుమానించిన రవి ఇరువురిని మందలించాడు. ఇదిలావుండగా ఆదివారం రాత్రి సూసై అతని కుమారుడు కెల్విన్ (19) మాలను చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రవి ఆగ్రహంతో వారితో తగాదా పడ్డాడు. ఇంట్లో ఉన్న యాసిడ్ తీసుకుని మాల, సూసైపై పోసి పారిపోయాడు. అడ్డుకున్న కెల్విన్పై కూడా యాసిడ్ పడింది. సూసై, కెల్విన్ తీవ్రగాయాలతో నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాలా మదురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. తూత్తుకుడి సిప్కాట్ పోలీసులు రవిపై ఈమేరకు కేసు నమోదు చేసి.. అతని కోసం గాలింపు చేపట్టారు. చదవండి: కర్రతో తీవ్రంగా కొట్టడంతో ఇద్దరు చిన్నారుల మృతి -
యోగా మా అక్కను మనిషిని చేసింది...
మా అక్క 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు యాసిడ్ అటాక్ జరిగింది. ఒక కన్ను, వక్షం, చెవి దగ్ధమయ్యాయి. ఆమె బండరాయిగా మారిపోయింది. ఆమెను మళ్లీ మనిషిని చేయడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు యోగా ఆమెను కాపాడింది. నేను రోజూ ఆమెను యోగాకు తీసుకెళ్లడంతో ఆమె తిరిగి పూర్తి మామూలు మనిషయ్యింది... అని కంగనా రనౌత్ తన కుటుంబం యోగా వల్ల ఎంత లబ్ధి పొందిందో చెప్పుకొచ్చింది. ‘‘2006లో మా అక్క రంగోలికి 21 ఏళ్లు. అవినాష్ శర్మ అనే అతను ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. మా అక్క తిరస్కరించింది. ఒకరోజు అతను, మరో స్నేహితుడితో కలిసి మా అక్క మీద యాసిడ్ కుమ్మరించాడు. మా అక్క చెవి, చెంప, ఒక వక్షం పూర్తిగా దెబ్బ తిన్నాయి. కంటి చూపు పోయింది. ఆమెకు డాక్టర్లు 54 సార్లు కాస్మటిక్ సర్జరీ లు చేసి పూర్వపు ముఖం తేవడానికి ప్రయత్నించారు. ఆమెకు రెటినా రీప్లేస్మెంట్ అయ్యింది. వక్షాన్ని పూర్వరూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే ఒక సంబంధం మాట్లాడితే వచ్చిన కుర్రాడు మా అక్క ముఖం చూసి మళ్లీ రాలేదు. ఇవన్నీ జరిగాయి. అప్పుడు నాకు 18 ఏళ్లు. మా అక్క భౌతిక ఆరోగ్యం కంటే కూడా ఆ సమయంలో నేను ఎక్కువగా ఆలోచించింది మానసిక ఆరోగ్యం గురించే. ఆ ఆరోగ్యాన్ని ఆమె యోగా నుంచి పొందింది’ అని తన ఇన్స్టాగ్రామ్లో తెలియచేసింది కంగనా రనౌత్. ‘మా అక్క ఆ సమయంలో ఒక బండరాయిలా మారిపోయింది. ఏం మాట్లాడినా ఊరికే అలా చూసేది తప్ప స్పందించేది కాదు. మా జోక్స్కు నవ్వేది కాదు. అసలు తన మీద తాను విశ్వాసం ఉంచుకుందా లేదా అర్థమయ్యేది కాదు. ఆమెను నేను కాపాడుకోవాలనుకున్నాను. నేను ఎక్కడికి వెళితే అక్కడకు తీసుకువెళ్లేదాన్ని. అలాగే నా యోగా క్లాసులకు కూడా తీసుకెళ్లేదాన్ని. అక్కడకు వస్తూ ఉండటం వల్ల క్రమంగా ఆమెకు యోగా మీద ఆసక్తి ఏర్పడింది. ఆమె యోగా చేయసాగింది. ఆమెకు మెల్లమెల్లగా ఆత్మవిశ్వాసం పెరిగింది. జీవం వచ్చింది. చూపు మెరుగు అయ్యింది. ఆమె పూర్తిగా మామూలు మనిషి కావడంలో యోగా అద్భుతంగా పని చేసింది’ అని రాసింది కంగనా. ‘మా అమ్మకు ఒక దశలో కొలెస్ట్రాల్ పెరిగిందని, డయాబెటిస్ ఉందని ఓపెన్ హార్ట్ సర్జరీ వరకూ వెళ్లారు డాక్టర్లు. కాని నేను ఆమెను రెండు నెలలు ఆగు అని యోగాసనాలలోకి తెచ్చాను. ఆమె యోగా చేసింది. ఏ సర్జరీ అవసరం ఏర్పడలేదు. ఇవాళ మా ఇంట్లో అందరి కంటే ఆమే ఆరోగ్యంగా ఉంది’ అని రాసింది కంగనా. యోగా అంరత్గత శక్తులను వెలికి తీస్తుందన్న సంగతి తెలిసిందే. ఇలాంటి అనుభవాలు విన్నప్పుడు యోగాను స్వీకరించాల్సిన, సాధన చేయాల్సిన ఉత్సాహం కలిగితే అది చాలు కదా. -
ప్రియురాలి యాసిడ్ దాడి, ప్రియుడి మృతి
లక్నో: ఆగ్రాలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేసిన ఘటన శుక్రవారం కందరిలో వెలుగు చూసింది. ఈ ఘటనలో సదరు యువకుడి శరీరం తీవ్రంగా గాయాలతో ఆస్పత్రిలో చిక్సిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాధితుడి తల్లిదండ్రులు యువతిపై హరి పర్వత్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆగ్రా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఆగ్రాకు చెందిన దేవేంద్ర రాజ్పుత్(28), నిందితురాలు సోనమ్ ఓ ప్రైవేటు ల్యాబ్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతేగాక కొంతకాలంగా వారిద్దరూ ఓ అద్దె ఇంట్లో కలిసి ఉంటు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో మృతుడు దేవేంద్రకు అతడి కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. ఇదే విషయం అతడిని అడుగగా తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని తెల్చి చెప్పాడు. దీంతో బాయ్ఫ్రెండ్పై ఆగ్రహంతో ఉన్న సోనమ్ పథకం ప్రకారం సీలింగ్ ఫ్యాన్ రీపెర్ పేరుతో మృతుడు దేవేంద్రను ఇంటికి పిలిచింది. ఈ క్రమంలో సమయం చూసి ఒక్కసారిగా అతడిపై యాసిడ్ కుమ్మరించింది.ఈ ఘటనలో సోనమ్కు కూడా గాయాలయ్యాయి. అయితే తీవ్రంగా గాయపడ్డ దేవేంద్ర చికిత్స పొందుతూ శుక్రవారం మరణించినట్లు ఆగ్రా ఎస్పీ బీఆర్ ప్రమోద్ వెల్లడించారు. మృతుడి తల్లిదండ్రుల సోనమే తమ కుమారుడిపై యాసిడ్ దాడి చేసినట్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఆయన అన్నారు. ఈ మేరకు సదరు యువతిపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు జరగుతున్నట్లు ఏస్పీ తెలిపారు. చదవండి: తప్పులో కాలేసిన టెలీకాలర్, కట్చేస్తే న్యూడ్ వీడియో కాల్ సినిమా బ్యానర్ మార్చి ఓటీటీకి.. సహా నిర్మాతపై ఫిర్యాదు -
అరవింత్ సావంత్పై సంచలన ఆరోపణలు చేసిన నవనీత్ కౌర్
-
శివసేన ఎంపీ యాసిడ్ పోస్తానన్నాడు: నవనీత్ కౌర్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడితే తనపై యాసిడ్ పోస్తానని.. జైలుకు పంపుతామని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారని నటి, అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపు కాల్స్తో పాటు శివసేన పార్టీ లెటర్ హెడ్తో కూడిన లేఖలు వచ్చినట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నవనీత్ కౌర్ ఫిర్యాదు చేశారు. అయితే, నవనీత్ కౌర్ ఆరోపణలను ఎంపీ అరవింద్ సావంత్ ఖండించారు. అంతేకాదు, మహిళా సభ్యురాలిని ఎవరైనా బెదిరిస్తే.. తాను ఆమెకు మద్దతుగా నిలుస్తానని అన్నారు. తనకు రాసిన బెదిరింపు లేఖపై తేదీని మార్చి 22గా పేర్కొన్నారని నవనీత్ కౌర్ తెలిపారు. ‘శివసేన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ సావంత్ బెదిరించారు.. ఇది కేవలం నాకు జరిగిన అవమానం మాత్రమే కాదు, దేశంలోని మహిళలందరికీ జరిగిన అవమానం.. అరవింద్ సావంత్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని నవనీత్ కౌర్ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల గురించి పార్లమెంట్లో ప్రస్తావించడం పట్ల సావంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు నవనీత్ కౌర్ పేర్కొన్నారు. ‘నువ్వు మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా... నిన్ను జైల్లో వేసి నీ చేత ఊచలు లెక్కబెట్టిస్తాం’ అని అరవింద్ సావంత్ తనను లోక్సభ లాబీలో బెదిరించినట్లు తెలిపారు. ‘ఆయన మాటలకు నాకు మతిపోయినట్లయ్యింది. ఒక్కసారిగా సావంత్వైపు తిరిగాను.. నా పక్కనే మరో ఎంపీ ఉన్నారు.. ‘సావంత్ మాటలను మీరు విన్నారా’ అని ఆయనను అడిగితే.. ‘విన్నాను’ అని చెప్పారు’ అంటూ నవనీత్ తాను ఎదుర్కొన్న బెదిరింపుల ఘటనను వివరించారు. సావంత్ బెదిరించినప్పుడు నవనీత్ కౌర్ పక్కన రాజమండ్రి వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఉన్నట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. ‘పోలీసులు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడానికి ముందు శివసేన పేరుతో బెదిరింపులు లేఖలు వచ్చాయి. అంతేకాక ‘‘ఉద్ధవ్ ఠాక్రే గురించి మాట్లాడుతున్నావ్ కదా.. నీకు అందమైన ముఖం ఉందని మురిసిపోతున్నావు.. దానిపై యాసిడ్ పోస్తే ఎక్కడకీ తిరగలేవు అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేశారు’ అని నవనీత్ ఆరోపించారు. అరవింద్ సావంత్ నవనీత్ ఆరోపణలపై స్పందించారు. ‘నా జీవితంలో ఎవరినీ ఇప్పటి వరకూ బెదిరించలేదు.. అలాంటిది ఓ మహిళను నేను బెదిరించడం ఏంటి’ అన్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే నవనీత్ కౌర్ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని.. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపిన కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సచిన్ వజేని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై లోక్సభలో వాడీవేడి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో నవనీత్ కౌర్ రానా లోక్సభలో ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. అయితే సావంత్ నవనీత్ వ్యాఖ్యలని ఖండించారు. ఆమె చేసే ఆరోపణలన్ని అవాస్తవలన్నారు. అంతేకాక సీఎం ఠాక్రే గురించి మాట్లాడేటప్పుడు ఆమె అంత దూకుడుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. చదవండి: యాసిడ్ ఓడింది జంట కలిసింది వాజే టార్గెట్ వంద కోట్లు -
మెదక్ ఘటన: బాధితురాలు మృతి
సాక్షి, మెదక్ : అల్లాదుర్గం మండలం గడి పెద్దపూర్ వద్ద వితంతువు మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలోని బాధితురాలు మృతిచెందింది. 80 శాతం కాలిన గాయాలతో హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 3 గంటలకు చక్రి బాయ్ ప్రాణాలు విడిచారు. దీంతో గడిపెద్దాపూ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా పశువుల వ్యాపారి సాజిద్ను బాకీ డబ్బులు ఇవ్వాలని మహిళ అడిగినందుకే ఈ ఘాతుకం జరిగిందని అల్లాదుర్గం పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా టేక్మాల్ మండలం మల్కాపూర్ (అంతాయపల్లి) తండాకు చెందిన 42 ఏళ్ల మహిళ భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె తన ఇద్దరు కూతుళ్లతో కలసి తల్లి గారింటి వద్ద ఉంటూ కూలి పనులు చేసి జీవనం సాగిస్తోంది. ఈ వితంతు మహిళకు, పశువుల వ్యాపారం చేసే సాదత్తో డబ్బుకు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి తనకు చెల్లించాల్సిన డబ్బు గురించి చర్చించేందుకు ఆమె సాదత్ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. సాదత్ పెట్రోల్ లాంటి మండే పదార్థాన్ని ఆమెపై పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. 70 నుంచి 80 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను గమనించిన గ్రామస్తులు. 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను జోగిపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం అక్కడి నుంచి సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చదవండి: మహిళను చంపి, ముక్కలుగా నరికి.. ఆపై -
మహిళా దినోత్సవం రోజున దారుణం..
సాక్షి, మెదక్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే మెదక్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ కిరాతకుడు మహిళపై పెట్రోల్ లాంటి మండే పదార్థం పోసి నిప్పంటించాడు. అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గడిపెద్దాపూర్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టేక్మాల్ మండలం మల్కాపూర్ (అంతాయపల్లి) తండాకు చెందిన 42 ఏళ్ల మహిళ భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె తన ఇద్దరు కూతుళ్లతో కలసి తల్లి గారింటి వద్ద ఉంటూ కూలి పనులు చేసి జీవనం సాగిస్తోంది. ఈ వితంతు మహిళకు, పశువుల వ్యాపారం చేసే సాదత్తో డబ్బుకు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి తనకు చెల్లించాల్సిన డబ్బు గురించి చర్చించేందుకు ఆమె సాదత్ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. సాదత్ పెట్రోల్ లాంటి మండే పదార్థాన్ని ఆమెపై పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు. 70 నుంచి 80 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను గమనించిన గ్రామస్తులు. 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను జోగిపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం అక్కడి నుంచి సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో తేలిన అంశాల మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. చదవండి: ఎంత కర్కశం: తోబుట్టువులనే కనికరం లేకుండా.. -
యాసిడ్ ఓడింది జంట కలిసింది
ఒడిశాలో 28 ఏళ్ల ప్రమోదిని అందరికీ తెలుసు. మూర్ఖ ప్రేమికుడు 2009లో యాసిడ్ కుమ్మరిస్తే ఆమె రెండు కళ్లు పోయాయి. చర్మం ధ్వంసమైంది. జీవితం శాశ్వతంగా మారిపోయింది. ‘నన్ను పెళ్లి చేసుకుంటే క్షమిస్తా’ అన్లేదు ప్రమోదిని. వాణ్ణి జైలుకు పంపింది. పదేళ్ల పాటు శక్తిని కూడదీసుకుని జీవితాన్ని నిర్మించుకుంది. ఇవాళ ఆమెకు పరిచయమైన స్నేహితుణ్ణి భర్తగా స్వీకరించింది. ‘ఇది చాలామంచి రోజు’ అందామె. వెరవక నిలబడితే మంచిరోజు తప్పక వస్తుంది. ‘భారతదేశంలో పెళ్లి అంటే వధువు ముఖం చూస్తారు అంతా. నాకు ముఖం ఉందా? లేదు. కాని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇరువైపులా పెద్దలు అంగీకరించినప్పుడే చేసుకోవాలనుకున్నాను. మా పెద్దలు అంగీకరించారు. మా పెళ్లి జరిగింది.’ అంది ఒడిశా యాసిడ్ అటాక్ సర్వయివర్ ప్రమోదిని. రెండ్రోజుల క్రితం ఆమె వివాహం సాహూతో జగత్సింగ్పూర్ జిల్లాలో జరిగింది. ఒడిశా గవర్నర్ ప్రత్యేకంగా ఆ పెళ్లికి హాజరయి వధూవరులను ఆశీర్వదించారు. ప్రమోదిని పెళ్లి సందర్భంగా 20 మంది యాసిడ్ బాధిత స్త్రీలు వచ్చి ఆనందాన్ని పంచుకున్నారు. పాటలకు డాన్సులు చేశారు. ‘కాలింది ముఖమే. కలలు కావు’ అని వీరు నొక్కి చెప్పారు. 2009లో జరిగిన ఘటన ప్రమోదినికి ఆ సమయం లో పదిహేడు పద్దెనిమిదేళ్లు ఉంటాయి. ఆమెకు తండ్రి లేడు. ముగ్గురు అక్కచెల్లెళ్లలో పెద్దది తను. ‘బాగా చదువుకొని కుటుంబాన్ని చూసుకోవాలనుకున్నాను నేను’ అంది ప్రమోదిని. ఆ సమయంలోనే ఊళ్లోని ఆర్మీ జవాన్ సంతోష్ వేదాంత్ ఆమె వెంటపడ్డాడు. ప్రేమ అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. ప్రమోదిని కుటుంబానికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. అది భరించలేకపోయాడు సంతోష్. మే 4, 2009న కాలేజీ నుంచి వస్తుంటే ముఖంపై యాసిడ్ చల్లి పారిపోయాడు. వెంటనే ఆమెకు కళ్లు పోయాయి. చర్మం చాలామటుకు కాలిపోయింది. హాహాకారాల నడుమ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత కటక్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె బతుకుతో చావుతో ఐదేళ్లు పోరాడింది. మరోవైపు ‘సరైన ఆధారాలు’ లేవని పోలీసులు 2012లో కేసు క్లోజ్ చేసేశారు. ఈలోపు నిందితుడు పెళ్లి కూడా చేసుకున్నాడు. యాసిడ్ గాయం కంటే నిందితుడు తప్పించుకోవడం ఆమెకు ఇంకా కోపం తెప్పించింది. కోలుకొని.. పెళ్లి చేసుకుని ఆమెను వివాహం చేసుకున్న సాహూది భువనేశ్వర్. మెడికల్ రిప్రజెంటేటివ్. ఊళ్లు తిరుగుతున్నప్పుడు హాస్పిటల్లో ఉన్న ప్రమోదిని అతనికి పరిచయం అయ్యింది. సాహూ ఎలా ఉంటాడో ఆమెకు తెలియదు. చూడలేదు. కాని అతను వస్తే ఆమె సంతోషపడేది. ఆమె తల్లి కూడా ఊరడింపు పొందేది. ఒక రోజు మంచం మీద ప్రమోదిని పక్క తడిపేస్తే అతను ఏ మాత్రం సంశయించకుండా సాపు చేశాడు. ‘ఎందుకు ఇదంతా చేస్తున్నావు’ అనడిగితే కారణాలు ఉంటేనే చేయాలా అన్నాడు. అప్పుడు ప్రమోదిని అతణ్ణి పట్టుకుని ఏడ్చింది. 2016లో సాహు ఆమెకు కళ్లకు సంబంధించిన సర్జరీ చేయించాడు. చాలా కొద్దిగా చూపు వచ్చింది. ఆ రావడం రావడం ఆమె నిందితుడి వేట మొదలెట్టింది. ఆధారాలు సేకరించింది. మీడియాలో తనపై జరిగిన దాడిని ప్రచారం చేసింది. దాంతో ఏకంగా ఒరిస్సా సి.ఎం. విచారణకు ఆదేశించి కేసు రీ ఓపెన్ చేయించారు. 2017లో నిందితుడి అరెస్ట్ జరిగింది. ప్రస్తుతం జైలులో ఉన్నాడు. 2018లో సాహు, ప్రమోదినిల నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లి. నిలబెట్టుకున్న ఆశ ప్రమోదినిలో ఆశ ఉంది. కాని దానిని నిలబెట్టే వ్యక్తులు, వ్యవస్థ ఉన్నప్పుడు అది సజీవంగా ఉంటుంది. సాహు ఆమెకు ఆ బలం ఇచ్చాడు. అదీగాక లక్నోలో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘షీరోస్’ యాసిడ్ బాధితుల పునరావాసం కోసం పని చేస్తుండటంతో వారు ఒకరికొకరు బలం అయ్యారు. ప్రమోదిని కూడా వారితో కలిసే తన గొంతు వినిపించింది. సాహూ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం మానేసి ఇప్పుడు ఈ సంస్థ కోసం పని చేస్తున్నాడు. అబ్బాయిలు నిరాకరణ కూడా ఆశించడంలో ఒక భాగం అని అంగీకరించే విధంగా పెంపకం, చదువు, సామాజిక సంస్కారం ఉండాలి. నిరాకరణలో హుందాతనం ఉందని గ్రహించాలి. అబ్బాయి నిరాకరించినా అమ్మాయి నిరాకరించినా జీవితం ముగిసిపోదు. కాని ఆ నిరాకరణ ప్రతీకారంలోకి మారినప్పుడే ఇరుపక్షాల జీవి తానికీ ప్రమాదం. యాసిడ్ దాడిని జయించిన ప్రమోదిని ఇప్పుడు చిర్నవ్వు నవ్వుతోంది. యాసిడ్ దాడి చేసినవాడికి ఆ జీవన సౌలభ్యం ఉండదు. అదీ గ్రహించాల్సింది. – సాక్షి ఫ్యామిలీ -
మహిళపై యాసిడ్ దాడి.. కవిత దిగ్భ్రాంతి
మెట్పల్లి(కోరుట్ల) : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాలో బుధవారం రాత్రి భూక్య స్వాతి(25)పై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్తో దాడి చేశాడు. స్వాతి భర్త కొంత కాలం కింద మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో కలసి తిమ్మాపూర్ తండాలోని తల్లి గారింట్లో ఉంటోంది. ఇంట్లో జరిగే శుభకార్యానికి అవసరమైన వస్తువులు కొనేందుకు కుటుంబసభ్యులతో కలసి మెట్పల్లికి వెళ్లింది. తిరిగి రాత్రి బస్సులో తండాలోని బస్స్టాప్ వద్ద దిగారు. అదే సమయంలో అక్కడికి బైక్పై హెల్మెట్ ధరించి ఉన్న ఓ వ్యక్తి వచ్చి స్వాతి ముఖంపై యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ సంఘటనలో ఆమె కుడి వైపు చెంప, మెడ, భుజం వద్ద గాయాలయ్యాయి. వెంటనే ఆమెను వాహనంలో మెట్పల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీ సింధు శర్మకు ఫోన్ చేసి ఘాతుకానికి పాల్పడ్డ నిందితున్ని పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. -
విశాఖలో దారుణం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో దారుణం జరిగింది. ఓ అనుమానపు భర్త భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లిని కాపాడేందుకు వెళ్లిన కుమార్తె కూడా గాయపడింది. అదృష్టవశాత్తూ యాసిడ్ బాత్ రూం క్లీనింగ్కు ఉపయోగించేది కావడంతో గాయాల తీవ్రత తగ్గింది. వివరాల్లోకెళ్తే.. విశాఖలోని శివాజీ పాలెంలో ఈశ్వరరావు అనే వ్యక్తి భార్య దేవి, కుమార్తె గాయత్రి కలిసి జీవిస్తున్నాడు. కాగా ఈశ్వరరావుకు భార్యపై అనుమానం. దీంతో నిత్యం ఇంట్లో గొడవలు జరిగేవి. (మరదలితో రెండో పెళ్లి.. నిప్పంటించిన మొదటి భార్య) ఇదే తరుణంలో శనివారం ఉదయం భార్య దేవిపై ఈశ్వరరావు దాడికి పాల్పడ్డాడు. బాత్రూమ్ క్లీనింగ్కు ఉపయోగించే యాసిడ్ను భార్యపై పోశాడు. ఆ సమయంలో తల్లిని కాపాడేందుకు కుమార్తె గాయత్రి ప్రయత్నించగా ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాగా పెయింటింగ్ పని చేసే ఈశ్వరరావు మద్యానికి బానిసై 500 రూపాయలను అడిగారు. ఈ సందర్భంగా ఏర్పడిన వివాదంతో అప్పటికే భార్యపై అనుమానం ఉన్న ఈశ్వరరావు హత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై యాసిడ్ దాడి
అగర్తలా : వివాహం చేసుకోవడానికి నిరాకరించాడన్న కారణంతో ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడిన మహిళకు స్థానిక కోర్టు 14 రోజలు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వివరాల ప్రకారం..పెళ్లికి నిరాకరించాడని 27ఏళ్ల బినతా సంతల్ అనే మహిళ ప్రియుడిపై యాసిడ్ దాడికి తెగబడిన ఘటన త్రిపురలోని ఖోవాయి జిల్లాలో చోటచేసుకుంది. ఈ దాడిలో ప్రియుడికి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. (కూతురి హత్య.. తండ్రికి జీవిత ఖైదు ) కాగా ఎనిమిదేళ్లకు పైగా తనతో ప్రేమాయణం నడిపి ఇటీవలె మరో మహిళతో సన్నిహితంగా ఉండటంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితురాలు విచారణలో పేర్కొంది. పాఠశాల స్థాయి నుంచే ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నామని, అయితే తన ప్రియుడు ఇటీవలె మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ తనను పట్టించుకోవడం లేదని బినతా పేర్కొంది. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెళ్లిచేసుకోమని కోరగా ససేమిరా అన్నాడని, దీంతో యాసిడ్ దాడికి పాల్పడినట్లు నిందితురాలు నేరం అంగీకరించింది. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బినతాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. (ఆ వీడియో లేకపోతే... నిజం తెలిసేది కాదు!! ) -
దారుణం : ముగ్గురు అక్కాచెలెళ్లపై యాసిడ్ దాడి
లక్నో : ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన గోండాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్ బాలికలైన అక్కాచెల్లెళ్లలో ఇద్దరికి కాలిన గాయాలు కాగా, మరొక బాలికకు ముఖంపై గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ గోండా పోలీసులు ఎవరినీ అరెస్ట చేయలేదు. బాధితులను వరుసగా 8, 12, 17 సంవత్సరాల వయసు కలిగిన బాలికలుగా గుర్తించారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. కాగా, హత్రాస్లో దళిత యువతి హత్యాచార ఘటన కలకలం రేపిన నేపథ్యంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సెప్టెంబర్ 14న యువతి పంటపొలంలో పనిచేసుకుంటుండగా నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో బాధితరాలు ఢిల్లీలోని సఫ్ధర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 29న ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. మరోవైపు హత్రాస్ కేసు దర్యాప్తునకు సంబంధించి కేరళకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన నలుగురు కార్యకర్తలను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైంది. చదవండి : పెళ్లి చేసుకోకుంటే యాసిడ్ పోసి చంపేస్తా.. -
ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
సాక్షి, కర్నూలు: తనను కాదని మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడన్న కోపంతో ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిందో యువతి. ఈ సంఘటన జిల్లాలోని నంద్యాల మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన నాగేంద్ర, సుప్రియ మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరని, ప్రేమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని నాగేంద్ర ఆమెతో ప్రేమకు బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ప్రియుడి వివాహాన్ని జీర్ణించుకోలేకపోయింది సుప్రియ. అతడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. యాసిడ్ దాడిలో నాగేంద్ర ముఖం, చెయ్యి బాగా కాలిపోవటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందుకే యాసిడ్ పోశా: సుప్రియ తనను మోసం చేసింది కాక తిరిగి తనతో ప్రేమగా ఉండాలని వేధించడంతో యాసిడ్ దాడికి పాల్పడినట్టు సుప్రియ వెల్లడించింది. తనతో పెళ్లికి కులం పేరుతో అడ్డు చెప్పి మరో యువతిని పెళ్లి చేసుకొని మళ్లీ ఇప్పుడు ప్రేమ పేరుతో వేధిస్తుంటే తట్టుకోలేక ఇలా చేశానని ఆమె తెలిపారు. చదవండి : ప్రేయసి చితిలో పడి ప్రియుడి ఆత్మహత్య -
భార్య చేతిలో.. తాగుబోతు భర్త హతం
ప్రొద్దుటూరు క్రైం : తాగుబోతు భర్త రోజూ వేధించే వాడు. అయినా సహించింది. బుధవారం రాత్రి యాసిడ్ పోసే ప్రయత్నం చేశాడు. ప్రాణ రక్షణ కోసం ఆమె ప్రెషర్ కుక్కర్తో తలపై మోదింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ సంఘటన ప్రొద్దుటూరులోని రామేశ్వరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామేశ్వరానికి చెందిన దొర్నిపాటి నాగేశ్వరరావు (45), భార్య లక్ష్మీశ్రీదేవికి బాలసుబ్రమణ్యం, దుర్గాసాయి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేశ్వరరావుకు సొంత లారీ ఉంది. బాడుగలు ఒప్పుకొని అతనే డ్రైవర్గా వెళ్తుంటాడు. రోజూ మద్యం సేవించి భార్య, కుమారులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. రాత్రి పొద్దుపోయే వరకు భార్య, కుమారులతో గొడవ పడి వారిని కొట్టాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకొని.. వారిపై పోసే ప్రయత్నం చేశాడు. ప్రాణ రక్షణ కోసం ఆమె ప్రెషర్ కుక్కర్ తీసుకొని భర్త తలపై బలంగా కొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. రక్తస్రావం ఎక్కువై కొద్ది సేపటి తర్వాత మృతి చెందాడు. డీఎస్పీ సుధాకర్, సీఐ నాగరాజు గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి సోదరుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చెరువులో గుర్తుతెలియని మృతదేహం వేంపల్లె : నందిపల్లె సమీపంలోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. చెరువులో 35 ఏళ్ల యువకుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. గ్రామస్తులు పోలీ సులకు గురువారం సమాచారం అందించారు. ఆ చుట్టు పక్కల గ్రామాలకు సంబంధించిన యువకుడు కానందున ఎవరనేది తెలియడం లేదని ఎస్ఐ పేర్కొన్నారు. నలుపుగా ఉన్న మృతుని శరీరంపై కాఫీ రంగు దుస్తులున్నాయి. అతనే ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా చంపి పడేశారా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి దారుణ హత్య చింతకొమ్మదిన్నె : కడప నగర పరిధి 45వ డివిజన్లోని భగత్సింగ్ నగర్లో బుధవారం అర్ధరాత్రి నాగేంద్ర (40)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ సూర్యనారాయణ, తాలూకా సీఐ నాగభూషణం గురువారం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగేంద్ర కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వాడు. బుధవారం అర్ధరాత్రి తన ఇంటి వద్ద గల వసారాలో నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై రోకలిబండతో మోది, కత్తులతో దాడి చేసి హత మార్చారు. నిందితుల కోసం పోలీసులు జాగిలాలతో వెతికారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. వారిని పట్టుకుంటే ఎందుకు చేశారనే విషయం తెలుస్తుందని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. నాగేంద్రకు భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. డీఎస్పీ వెంట తాలూకా ఎస్ఐలు మహ్మద్ హుస్సేన్, రాఘవేంద్రారెడ్డి ఉన్నారు. -
పాతాళానికి టిక్ టాక్ రేటింగ్స్
బెంగళూరు: సోషల్ మీడియా దిగ్గజం టిక్టాక్ రేటింగ్స్ గూగుల్ ప్లేస్టోర్లో భారీగా పడిపోయాయి. టిక్టాక్ రేటింగ్ 4.6 నుంచి రెండుకు దిగిరాగా, టిక్ టాక్ లైట్ రేటింగ్ 1.1కి పడింది. యూట్యూబ్ లో ఫాలోయింగ్ ఉన్న కారీ మినాటి యూట్యూబ్ వర్సస్ టిక్ టాక్ ది ఎండ్ పేరుతో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనితోపాటు టిక్ టాక్ స్టార్ ఫైజల్ సిద్ధిఖి మహిళలను కించపర్చేలా ఉన్న ఓ వీడియో పోస్ట్ చేశారు. టిక్ టాక్ ను నిషేధించాలంటూ భారత యూజర్లు ట్విట్టర్లో ట్వీట్లుచేయడం టిక్టాక్కు నష్టం చేకూర్చాయి. టిక్ టాక్ను నిషేధించాలంటూ ప్రధానికి లేఖలు రాస్తామని జాతీయ మహిళా కమిషన్ ప్రకటించడమూ రేటింగ్స్ పడటానికి మరో కారణం. -
యాసిడ్ వీడియోపై మహిళా కమిషన్ ఫైర్
న్యూఢిల్లీ: ఏది చేసినా చెల్లుతుందనుకున్న టిక్టాక్ స్టార్కు గర్వభంగమైంది. అతని చేష్టలుడిగిన వీడియోలకు ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్ అతని టిక్టాక్ వీడియోతోపాటు అకౌంట్ను కూడా తొలగించాలని సదరు సంస్థను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. ఫైజల్ సిద్దిఖీ ఓ టిక్టాక్ స్టార్. అతనికి కోటి ముప్పై లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతను వీడియో అప్లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే లైక్స్ వేలు, లక్షలు దాటిపోతాయి. అయితే తాజాగా అతను చేసిన వీడియో వివాదాస్పదమైంది. ఇందులో తన ప్రేమకు యస్ చెప్పని అమ్మాయిపై యాసిడ్ పోస్తాడు. ఇది హింసను ప్రేరేపించే విధంగా ఉండటంతో ఈ టిక్టాక్ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (‘టిక్టాక్’ కలిపింది ) ఇలాంటి కంటెంట్ను అనుమతించినందుకు టిక్టాక్ సంస్థను ఏకిపారేస్తున్నారు. "ఇలా పిచ్చి వేషాలు వేసేవారికి లైకులు, ఫాలోవర్లు" అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ వీడియో గురించి తెలుసుకున్న జాతీయ మహిళా కమిషన్ మహిళలపై హింసను ప్రేరేపిస్తున్న ఫైజల్ సిద్దిఖీ యాసిడ్ వీడియో సహా, అతని అకౌంట్ను తొలగించాలని టిక్టాక్ సంస్థను ఆదేశించింది. కాగా గతంలోనూ మహిళల హక్కులకు భంగం కలిగించేవిధంగా యాసిడ్ దాడులకు సంబంధించిన వీడియోలు టిక్టాక్లో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. (ఇల్లునే థియేటర్గా మార్చేశాడు) -
పెళ్లి చేసుకోకుంటే యాసిడ్ పోసి చంపేస్తా..
అమీర్పేట: కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్త నుంచి విడిపోయి వేరు గా ఉంటున్న తనను వేధిస్తున్న యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగినికి పదేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావ టంతో భర్త నుంచి విడిపోయి చెన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తాను చెన్నైలో, పిల్లలు మరోచోట ఉంటుండటంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి నగరానికి వచ్చి ఎస్ఆర్నగర్లోని ఓ హాస్టల్లో పెయిడ్ గెస్ట్గా ఉంటోంది. ఈ నేపథ్యంలో సుశాంక్ అనే దూరపు బంధువుతో పరిచయం ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకున్న సుశాంక్ తనను పెళ్లి చేసుకోవాలని నిత్యం వేధిస్తున్నాడు. ఈ నెల 24న మాట్లాకుందామంటూ ఎస్ఆర్నగర్ సుప్రభాత్ హోటల్ వద్దకు ఆమెను పిలిపించాడు. మరోసారి పెళ్లి ప్రస్తావన తేవడంతో అందుకు నిరాకరించింది. దీంతో రెచ్చిపోయిన సుశాంక్ వెంట తెచ్చుకున్న ఎలక్ట్రికల్ పరికరంతో ఆమెపై దాడి చేశాడు. భయంతో పోలీసులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా ఆమె చేతిలోని ఫోన్ను లాక్కుని పగులగొట్టాడు. మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించాడు. వేధింపులు అధికం కావడంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సుశాంక్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
నిజం తెలుసుకొని షాకైన హీరోయిన్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తాజాగా నటించిన చిత్రం ఛపాక్. లక్ష్మీ అగ్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక యాసిడ్ బాధితురాలిగా నటించింది. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ఇక యాసిడ్ అమ్మకాలను నియంత్రిచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు అమలవుతున్నాయా? అని దీపికకు సందేహం తలెత్తింది. దీంతో దీపిక టీమ్ ఓ సామాజిక ప్రయోగానికి(సోషల్ ఎక్స్పర్మెంట్) పూనుకుంది. ఇందులో భాగంగా బృంద సభ్యులు ప్లంబర్, మెకానిక్, బిజినెస్మెన్, గృహిణి ఇలా రకరకాలుగా వేషాలు కట్టి ముంబైలోని పలు దుకాణాలకు వెళ్లి యాసిడ్ కావాలంటూ అడిగారు. దీనికి కొందరు షాపు యజమానులు అడగ్గానే సులువుగా ఇచ్చేయగా ఒకరిద్దరు మాత్రం ఎందుకు? ఏమిటి? ఆరా తీశారు. గుర్తింపు కార్డు చూపించని వారికి యాసిడ్ను అమ్మకూడదన్న నిబంధనలను సైతం దుకాణదారులు బేఖాతరు చేశారు. కేవలం ఒక్కరు మాత్రమే ఐడీ కార్డ్ అడిగి, చివరకు యాసిడ్ బాటిల్ను అతని చేతికందించాడు. ఇంత విచ్చలవిడిగా యాసిడ్ అమ్మకాలు జరుగుతున్నాయని తెలిసి దీపిక టీమ్ సభ్యులు ఆశ్చర్యపోయారు. దీన్నంతటినీ సీక్రెట్గా వీడియో తీస్తుండగా ఈ ప్రయోగాన్ని కారులో కూర్చొని పర్యవేక్షిస్తున్న దీపికకు నోట మాట రాలేదు. మన దేశంలో యాసిడ్ను ఇంత సులభంగా కొనుగోలు చేయవచ్చన్న విషయం తెలుసుకున్న ఆమె నిశ్చేష్టురాలైంది.(‘మాల్తీ’గా ముంబైలో దీపిక చక్కర్లు) దీనిపై దీపిక పదుకొనే స్పందిస్తూ ‘సుప్రీంకోర్టు యాసిడ్ అమ్మకాలపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అయినా కూడా మేము ఒక్కరోజులోనే 24 యాసిడ్ బాటిళ్లను కొనుగోలు చేశామంటే నమ్మలేకపోతున్నాను. దుకాణదారులతోపాటు ఎవరైనా చట్ట విరుద్ధంగా యాసిడ్ అమ్మినా, కొనుగోలు చేసినా ఆ విషయాన్ని పోలీసులకు చేరవేయాల్సిన బాధ్యత మనపై ఉంది. యాసిడ్ను కొనుగోలు చేయకండి, దాన్ని ఎవరూ అమ్మకండి’ అని పిలుపునిచ్చింది. కాగా గతంలోనూ దీపిక ఓ ఎక్స్పర్మెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఛపాక్ సినిమా షూటింగ్ సమయంలో మాలతి వేషంలో ఉన్న దీపిక పలు షాపులకు వెళ్లింది. యాసిడ్ బాధితురాలిగా ఉన్న దీపికను ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. పైగా ఆమెను చూడగానే కొందరు మొహం తిప్పుకుని వెళ్లిపోగా మరికొందరు చిరునవ్వుతో పలకరించారు. ఇలా ఆమెకు జరిగిన అనుభవాలను వీడియో తీసి పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
వారితో ప్రత్యేకంగా దీపికా పుట్టినరోజు
లక్నో : బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నిన్న(ఆదివారం) తన పుట్టినరోజును వేడుకగా జరుపుకున్నారు. ఈ రోజుతో దీపికా 34వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఇటు బాలీవుడ్ ఇండస్టీతోపాటు అటు ప్రముఖుల నుంచి దీపికాకు భర్త్డే విషెస్ హోరెత్తాయి. కత్రినా కైఫ్, అలియాభట్, మాధురి దీక్షిత్, తమన్నా బర్త్డే విషెస్ తెలిపారు. ఇంతటి ఆనంద రోజును దీపికా ఇంకా ప్రత్యేకం చేసుకున్నారు. తన పుట్టిన రోజును లక్నోలో యాసిడ్ దాడిలో గాయపడిన మహిళల సమక్షంలో జరుపుకున్నారు. ఈ వేడుకలో భర్త రణ్వీర్, విక్రాంత్ మాసే తప్ప బాలీవుడ్ తారలు ఎవ్వరూ లేకపోవడం విశేషం. భర్త రణ్వీర్, ఛపాక్ నటుడు విక్రాంత్ మాసే, లక్ష్మీ అగర్వాలోపాటు యాసిడ్ బాధితులతో కలిసి దీపికా కేక్ కట్ చేసి సంతోషంగా గడిపారు. బర్త్డేకు సంబంధించిన ఫోటోలు లక్ష్మీ అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే పార్టీలో దీపికా కేకు కట్ చేసిన వీడియోను ఓ అభిమాని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ వేడుకలో దీపికా తన రాబోయే చిత్రం ఛపాక్ను ప్రమోట్ చేసుకున్నారు. పుట్టినరోజు వేడుకలకు ఆదివారం ఉదయమే దీపికా, రణ్వీర్ లక్నోకు చేరుకున్నారు. దీనికి ముందు ముంబై ఎయిర్పోర్టులో అభిమానులు తీసుకు వచ్చిన కేకును దీపికా కట్ చేశారు. కాగా ప్రస్తుతం ఛపాక్ సినిమా ప్రమోషన్లలో దీపికా బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రేక్షకులను ఆకర్షించడానికి పలు ప్రోగ్రామ్స్లో, రియాల్టీ షోలో ఆమె పాల్గొంటున్నారు. ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది View this post on Instagram Best morning khas morning ❤️ Good morning ❤️ With my Loves @pihu_she @deepikapadukone ❣️ A post shared by Laxmi Agarwal (@thelaxmiagarwal) on Jan 5, 2020 at 5:44pm PST View this post on Instagram #deepikapadukone celeberates her birthday in Lucknow today with actual acid victim survivors. What a unique way to celebrate this special day ❤ #ranveersingh #laxmiagarwal #viralbhayani @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Jan 5, 2020 at 11:01am PST -
బాలికపై యాసిడ్ దాడి
ముంబై : పదిహనేళ్ల బాలికపై ముంబైలోని కంజుమార్గ్ ప్రాంతంలో స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయుడు, సిబ్బంది కలిసి యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. బాధితురాలు మార్నింగ్ వాక్కు బయటకు వచ్చిన క్రమంలో ఎల్బీఎస్ రోడ్డు వద్ద నిందితులు ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. బాధిత బాలిక గతంలో నషేమన్ ఉర్ధూ స్కూల్లో తొమ్మిదో తరగతి చదవగా ప్రస్తుతం మహీంలోని ఓ ఇనిస్టిట్యూట్ నుంచి ఎలక్ర్టానిక్ ఇంజనీరింగ్లో డిప్లమో చేస్తున్నారు. గతంలోనూ తనను అకారణంగా స్కూల్ సిబ్బంది, టీచర్లు శిక్షించేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. మార్నింగ్ వాక్కు వచ్చిన తనను అడ్డగించి స్కూల్ సిబ్బంది జావేద్, హషీం, అమన్లు తన చేతులను గట్టిగా పట్టుకోగా ప్రిన్సిపల్ హన్స్ అరా తనపై యాసిడ్ పోశారని చెప్పారు. అనంతరం తనను అక్కడే వదిలివేసి కారులో పారిపోయారని ఫిర్యాదులో తెలిపారు. బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేయగా ఆయన అక్కడకు చేరుకుని ఆమెను రాజ్వాది ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. -
‘ఛపక్’.. ధైర్య ప్రదాతలు
‘యాసిడ్ పడింది మా ముఖం మీద మాత్రమే, మా మనో ధైర్యం అలాగే ఉంది’.. యాసిడ్ బాధితులు ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాట ఇది. యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవితం ‘ఛపక్’ పేరుతో సినిమాగా వస్తోంది. చిన్నతనంలో భయంకరమైన యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ పెద్దయిన తర్వాత ప్రభుత్వం యాసిడ్ అమ్మకాల మీద నియంత్రణ విధించే వరకు పోరాటాన్ని కొనసాగించారు. ఆ పాత్రనే ఛపక్లో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. సినిమా జనవరి 10న విడుదల అవుతోంది. ఇప్పటికే ట్రెయిలర్ రిలీజ్ అయ్యి ప్రశంసలను అందుకుంటోంది. లక్ష్మిలా.. భస్మం నుంచి ఫీనిక్స్లా లేచిన ధీరలెందరో. వాళ్లు నేటి సమాజంలో పోరాడుతూ ఉన్నారు, సమాజంతో పోరాడుతూ ఉన్నారు. వారిలో ముగ్గురు... ప్రగ్యాసింగ్, దౌలత్ బీ ఖాన్, అన్మోల్ రోడ్రిగ్స్. ఈ ముగ్గురి గురించి క్లుప్తంగా. పెళ్లొద్దన్నందుకు ప్రగ్యా సింగ్ ప్రగ్యా సింగ్ 2006లో వారణాసి నుంచి ఢిల్లీ వస్తోంది. అప్పటికి ఆమెకు 23 ఏళ్లు, పెళ్లయి పన్నెండు రోజులైంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో, ఆమె రైల్లో గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఆమె ముఖం మీద యాసిడ్ చిమ్మింది. దాడి చేసిన వ్యక్తి గతంలో ఆమెను పెళ్లాడాలని అడిగి ఆమె నిరాకరించడంతో కోపం పెట్టుకున్నవాడు. అతడి ప్రకోపానికి గురయింది ప్రగ్యాసింగ్. ప్రాణాపాయం నుంచి కోలుకున్న తర్వాత ఆమె మామూలు కావడానికి పదిహేనుకు పైగా సర్జరీలయ్యాయి. ఇప్పుడామె.. భర్త, స్నేహితుల సహకారంతో ‘అతిజీవన్ ఫౌండేషన్’ అనే ఎన్జీవోను స్థాపించి, యాసిడ్ బాధితులకు ధైర్యాన్నిస్తోంది. ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తోంది. వాళ్లు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాపులు నిర్వహిస్తోంది. ఇద్దరు బిడ్డలతో సంతోషంగా జీవిస్తున్న తన జీవితాన్నే ఆదర్శంగా తీసుకోవలసిందిగా ఆమె బాధితుల్లో స్ఫూర్తిని పెంచుతోంది. గృహ హింస దౌలత్ దౌలత్ బీ ఖాన్ది ముంబయి. ఇరవై ఆరేళ్ల వయసులో తన పెద్దక్క, బావల నుంచే గృహహింసలో భాగంగా యాసిడ్ దాడికి గురైందామె! ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ 2016లో ‘సాహాస్ ఫౌండేషన్’ స్థాపించి యాసిడ్ దాడికి గురైన బాధితులకు భరోసాగా నిలుస్తోంది. వైద్య సహాయంతోపాటు వారికి న్యాయపరమైన సహాయం కూడా అందిస్తోంది. బాధితులు సౌకర్యంగా పని చేసుకోగలిగిన ఉద్యోగాలను గాలిస్తూ వారిని ఆ ఉద్యోగాల్లో చేరుస్తోంది దౌలత్. పాపాయిగా ఉన్నప్పుడే! అన్మోల్ అన్మోల్ పరిస్థితి మరీ ఘోరం. రెండు నెలల పాపాయిగా ఉన్నప్పుడు యాసిడ్ దాడికి గురైంది. ఆడపిల్ల పుట్టిందని భార్యాబిడ్డలను హతమార్చాలనుకున్నాడు ఆమె తండ్రి. బిడ్డకు పాలిస్తున్న భార్య మీద, పాలు తాగుతున్న బిడ్డ మీద యాసిడ్ కుమ్మరించాడు. అన్మోల్ తల్లి ప్రాణాలు కోల్పోయింది, అన్మోల్ బతకడం కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. ఆమె బాల్యమంతా హాస్పిటల్ బెడ్, ఆపరేషన్ థియేటర్లలో గడిచిపోయింది. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత అనాథ శరణాలయం ఆమె అడ్రస్ అయింది. బాల్యంలో తోటి పిల్లల ప్రశ్నార్థకపు చూపులను తట్టుకుని గట్టి పడిపోయిందామె. అదే ధైర్యంతో స్కూలు, కాలేజ్ చదువు పూర్తి చేసి ఫ్యాషన్రంగాన్ని కెరీర్గా మలుచుకుంది. ఇప్పుడామె సక్సెస్ఫుల్ మోడల్. తాను మోడలింగ్ చేస్తూ, మరో పక్క ఇరవై మంది యాసిడ్ సర్వైవర్స్కి సహాయం చేసింది. వారికి బతుకు మీద ధైర్యాన్ని కల్పించడం, బతుకుకు ఒక మార్గాన్ని చూపించడం అన్మోల్ చేస్తున్న సహాయం. నిజమే... యాసిడ్ పడింది వాళ్ల ముఖం మీద మాత్రమే. వాళ్ల మనోధైర్యం మీద కాదు. – మంజీర