ఫ ఎంపీ అభ్యర్థి రాపాక,
ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి
ఫ బెల్లంపూడిలో 100 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరిక
పి.గన్నవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రోజు రోజుకూ ప్రజాబలం పెరుగుతుందని, దీంతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతోందని వైఎస్సార్ సీపీ అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు, పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. ఆ పార్టీ నాయకుడు మందపాటి కిరణ్కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బెల్లంపూడి గ్రామంలో టీడీపీ నుంచి బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన 100 కుటుంబాల వారు వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి ఎంపీ అభ్యర్థి రాపాక, ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వైఎస్సార్ సీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనకు ఆకర్షితులమై తాము వైఎస్సార్ సీపీలో చేరినట్టు తెలిపారు. రాపాక, విప్పర్తి మాట్లాడుతూ పార్టీలో చేరిన కార్యకర్తలు పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, మండల పార్టీ అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు, నాయకులు అడ్డగళ్ల వెంకట సాయిరామ్, దొమ్మేటి వెంకట శివరామన్, దొమ్మేటి దుర్గారావు, బండి రమేష్, బండి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.