బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు | Sakshi
Sakshi News home page

బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు

Published Fri, Apr 19 2024 1:45 AM

మాట్లాడుతున్న కామారెడ్డి ఎమ్మెల్యే 
వెంకటరమణరెడ్డి  
 - Sakshi

గద్వాల రూరల్‌: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ పార్టీ గెలుపును ఆపలేరని నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాలులో ఆ పార్టీ గద్వాల, అలంపూర్‌, వనపర్తి నియోజకవర్గాల బూత్‌ ఏజెంట్లు, ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న వారు బీజేపీ పార్టీ గెలుపు కోసం చేయాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 12స్థానాలలో బీజేపీ పార్టీ గెలవబోతుందని అందులో నాగర్‌కర్నూల్‌ ఎంపీ స్థానం ఉందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే గెలుపు ఖాయమన్నారు. భరత్‌ప్రసాద్‌కు చిన్నవయసులోనే పార్టీ ఎంపీగా టికెట్‌ ఇవ్వడం జరిగిందని, 2లక్షల మెజారీటి తగ్గకుండా గెలిపించాలన్నారు. పదేళ్లకాలంలో కేంద్రప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలు ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు అబయ్‌పాటిల్‌, బంగారు శృతి, రాంచంద్రారెడ్డి, డీకే స్నిగ్ధారెడ్డి, అప్సర్‌పాష, అశోక్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జక్కా రఘునందన్‌రెడ్డి, రామాంజనేయులు, పద్మావతి, కృష్ణవేణి, జయశ్రీ, పాండు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement