రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభచాటాలి | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభచాటాలి

Published Thu, May 23 2024 4:30 AM

-

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభచాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి శరత్‌చంద్ర అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. శరత్‌చంద్ర క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. నిరంతరం సాధన చేస్తే క్రీడల్లో విజయం సాధించవచ్చన్నారు. హన్మకొండలో వచ్చే నెల 6, 7 తేదీల్లో రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల అథ్లెటిక్స్‌ పోటీలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్‌బాబు, కోచ్‌లు ఆనంద్‌, సునీల్‌, శ్రీనివాసులు, సీనియర్‌ పీఈటీలు సి.శ్రీనివాస్‌, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement