విదేశీ పర్యటనకు చిన్నారి.. 'అభి తుమనిషా' | - | Sakshi
Sakshi News home page

విదేశీ పర్యటనకు చిన్నారి.. 'అభి తుమనిషా'

Published Fri, Sep 8 2023 1:02 AM | Last Updated on Fri, Sep 8 2023 10:57 AM

- - Sakshi

కర్ణాటక: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉపన్యాస పోటీల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సంపాదించి మలేషియా పర్యటనకెళ్లడం సంతోషకరమని హోసూరు కార్పొరేషన్‌ విద్యాకమిటీ అధ్యక్షుడు శ్రీధర్‌ తెలిపారు. హోసూరు పారిశ్రామికవాడ జూజువాడి ప్రభుత్వ ఉన్నతోన్నత పాఠశాలలో అభి తుమనిషా గత ఏడాది ప్లస్టూ చదువుతూ రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీల్లో మొదటి స్థానం సంపాదించుకొంది. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళితో కలిసి మలేషియా పర్యటనకు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement