సీఎం మార్పు ఉండదు | - | Sakshi
Sakshi News home page

సీఎం మార్పు ఉండదు

Published Mon, Aug 26 2024 11:26 AM | Last Updated on Mon, Aug 26 2024 11:26 AM

-

మంత్రి మహదేవప్ప

శివాజీనగర: రాజభవన్‌ను జేడీఎస్‌, బీజేపీ దుర్వినియోగం చేస్తున్నాయని మంత్రి హెచ్‌.సీ.మహదేవప్ప అన్నారు. ఆదివారం నగరంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి మార్పు ప్రశ్నే లేదు. పార్టీ హైకమాండ్‌, ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా ఉన్నారు, సీఎం ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పారు. అనేకమంది జేడీఎస్‌, బీజేపీ నేతలపై ప్రాసిక్యూషన్‌ డిమాండ్లు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి, వాటిని ఎందుకు ఆమోదించడం లేదని మండిపడ్డారు. ఎంతో ముఖ్యమైన 11 బిల్లులు వెనక్కి వచ్చాయి, ఏ గవర్నర్‌ కూడా ఇన్ని బిల్లులను వెనక్కి పంపలేదన్నారు. దళిత సీఎం అనేది ఇప్పుడు చర్చనీయాంశం కాదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement