మహబూబాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం బతుకమ్మ వేడుకలు జరగనుండగా.. అన్ని మండలాల్లో ఆలయాలు, చెరువుల వద్ద ఏర్పాట్లు చేశారు. మానుకోట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. పాత బజార్లోని నిజాం చెరువు, కొత్త బజారులోని బంధం చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు. కాగా బతుకమ్మ నిమజ్జన సయమంలో ట్రాఫిక్ కంట్రోల్కు జిల్లా పోలీస్ యంత్రాంగం బందోబస్తు నిర్వహించనుంది. చెరువుల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్, ఎమ్మెల్యే మురళీనాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారు.
కొనుగోళ్ల సందడి..
జిల్లా కేంద్రంలో బుధవారం కొనుగోళ్ల సందడి కనిపించింది. సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా ప్రజలు గునుగు, బంతి, చామంతి, తంగేడు పూలు కొనుగోలు చేస్తూ కనిపించారు.
నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు
ఏర్పాట్లు చేసిన అధికారులు
మానుకోటలో కొనుగోళ్ల సందడి
Comments
Please login to add a commentAdd a comment