మహబూబాబాద్: జిల్లాలోని నాలుగు మున్సిపాటీల్లో జరుగుతున్న అంతర్గత పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి, స్థ లాలను సందర్శించి నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వాలన్నారు.పన్నులను వంద శాతం వసూలు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, తొర్రూరు, మానుకోట, డోర్నకల్, మరిపెడ మున్సిపల్ కమిషనర్లు శాంతికుమార్, రవీందర్, నరేష్రెడ్డి, వెంకటస్వామి, జిల్లా పశువైద్యాధికారి కిరణ్కుమార్, డీఈ ఉపేందర్, టీపీఓ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ ఇవ్వాలి
జువైనల్ హోంలోని పిల్లలకు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు. బుధవారం మానుకోట పట్టణంలోని జువైనల్ హోం, అంగన్వాడీ కేంద్రం, ఏబీసీ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జువైనల్ హోంలోని 11మంది బాల నేరస్తుల్లో మార్పు తీసుకురావాలన్నారు.
కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment