తొర్రూరు: అనుమతి లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ గుండాల మురళీధర్ తెలిపారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేశారు. అర్హతలు లేకుండా నిర్వహిస్తున్న మాతృశ్రీ డయాగ్నస్టిక్ సెంటర్ను సీజ్ చేశారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. డయాగ్నస్టిక్ సెంటర్లో ధరల పట్టిక, సిబ్బంది వివరాలు, అర్హత ధ్రువపత్రాలు ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు వైద్యశాఖ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. వైద్యం ధరల వివరాలను ప్రదర్శించాలని తెలిపారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు జ్వలిత, మీరాజ్, మాస్ మీడియా అధికారి ప్రసాద్, ఎస్సై వెంకటకృష్ణారెడ్డి, ఆర్ఐ బషీర్, ఏఎస్ఐ హరిబ్రహ్మచారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment