పాలమూరులో ఆధ్యాత్మిక శోభ | Sakshi
Sakshi News home page

పాలమూరులో ఆధ్యాత్మిక శోభ

Published Thu, Apr 18 2024 9:40 AM

టీచర్స్‌కాలనీ రామాలయంలో సీతారాముల కల్యాణం తిలకిస్తున్న భక్తులు  - Sakshi

శ్రీరామ నవమిని పురస్కరించుకొని పాలమూరులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పలు ఆలయాలను సుందరంగా ముస్తాబు చేసి, సీతారాముల కల్యాణోత్సవాన్ని నయనానందంగా నిర్వహించారు. టీచర్స్‌కాలనీ సీతారామచంద్రాస్వామి ఆలయం, పంచముఖ ఆంజనేయస్వామి, శ్రీనివాసకాలనీ అభయాంజనేయస్వామి, అప్పన్నపల్లి, ఏనుగొండ, రాజేంద్రనగర్‌, శివశక్తినగర్‌ కాలనీ, భూలక్ష్మికాలనీ, అయోధ్యనగర్‌, హనుమాన్‌పూరల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీనివాస కాలనీ ఆంజనేయస్వామి, టీచర్స్‌కాలనీ రామాలయం, సంజయ్‌నగర్‌కాలనీ, టీడీగుట్ట, కుమ్మరివాడ వీరాంజనేయస్వామి తదితర ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొని తిలకించారు. అప్పన్నపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ప్రత్యేక అలంకరణలో ఉత్సవమూర్తులు
1/1

ప్రత్యేక అలంకరణలో ఉత్సవమూర్తులు

Advertisement
 
Advertisement