‘కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలి’ | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలి’

Published Mon, May 6 2024 11:55 PM

‘కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలి’

మందమర్రిరూరల్‌: ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటువేసి గెలిపించాలని కనీస వేతనాల సలహా మండలి చైర్మన్‌, ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్‌ జనక్‌ ప్రసాద్‌ కోరారు. సోమవారం మందమర్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశీకృష్ణ ఎంపీగా గెలిస్తే సింగరేణిలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటు, కోలిండియాలో మాదిరిగా సింగరేణి కార్మికులకు పెర్క్స్‌పై ట్యాక్స్‌ యాజమాన్యమే చెల్లించే విధంగా కృషి చేస్తారన్నారు. సింగరేణి పరిసర ప్రాంతాల్లో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఐఎన్టీయూసీ నాయకులు సమ్మయ్య, దేవి భూమయ్య, నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement