నిరుద్యోగ సమస్య తీరుస్తా | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ సమస్య తీరుస్తా

Published Tue, May 7 2024 12:15 AM

నిరుద్యోగ సమస్య తీరుస్తా

● పెద్దపల్లి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

నెన్నెల: పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గ ప్రాంతంలో ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేసి యువకుల నిరుద్యోగ సమస్య తీర్చే బాధ్యత తనదేనని పెద్దపల్లి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే తాను ఏర్పాటు చేసిన సంస్థలో సింగరేణి కార్మికుల బిడ్డలకు ఉపాధి కల్పించానని చెప్పారు. పోడు భూములకు పట్టాలు, బెల్లంపల్లిలో మామిడి మార్కెట్‌, పల్లెపల్లెకు రవాణా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన బీఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదన్నారు. కాకా వెంకటస్వామి, వినోద్‌, వివేక్‌లు ఈ ప్రాంతాన్ని ప్రగతిపథంలో నడిపించారని గుర్తు చేశారు. విశాఖ, కాకా చారిటబుల్‌ ట్రస్ట్‌ల ద్వారా పాఠశాలల అభివృద్ధి, గ్రామాల్లో మంచినీటి బోర్లు వేసినట్లు తెలిపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌ మాట్లాడుతూ బెల్లంపల్లి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. ఎంపీగా గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలచారి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గట్టు మల్లేష్‌, గొల్లపల్లి ఎంపీటీసీ హరీష్‌గౌడ్‌, గుండ్లసోమారం ఎంపీటీసీ దాగం రమేష్‌, నాయకులు తోట శ్రీనివాస్‌, చీర్ల కిషన్‌రెడ్డి, తారాచంద్‌, మల్లిక, గట్టు బానేష్‌, దుర్గంరవి, గోవింద్‌సింగ్‌ , మొహిద్‌ఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement