నీట్‌లో మెరిట్‌ రాదేమోనని ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

నీట్‌లో మెరిట్‌ రాదేమోనని ఆత్మహత్య

Published Tue, May 7 2024 12:20 AM

నీట్‌లో మెరిట్‌  రాదేమోనని ఆత్మహత్య

ఇంద్రవెల్లి: నీట్‌ పరీక్షలో మెరిట్‌ రాదేమోననే బెంగతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏ మాయికుంటలో చోటు చే సుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్సై దుబ్బాక సునీల్‌ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కాగ్నే డిగంబర్‌, గీత దంపతుల కుమారుడు సనత్‌కుమార్‌(17) ఆదివారం నీట్‌కు హాజరయ్యాడు. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తానో లేదోనని ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో తన గది లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన డిగంబర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement