నర్సాపూర్ రూరల్: మండల పరిధిలోని మాడాపూర్లో వారం రోజులుగా తీవ్ర తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామస్తులు గురువారం ఎంపీడీఓ కార్యాలయనికి వచ్చారు. ఎంపీడీఓ అందుబాటులో లేకపోవడంతో ఇతర అధికారులతో తాగునీటి సమస్యపై మొరపెట్టుకున్నారు. గ్రామంలో ఉన్న బోరు మోటార్ వారంరోజుల క్రితం పాడైపోయిందని చెప్పారు. ఆ విషయాన్ని పలుమార్లు ప్రత్యేక అధికారి, గ్రామ కార్యదర్శికి విన్నవించిన పట్టించుకోవడంలేదని తెలిపారు. ప్రతీరోజు తాగునీటి కోసం మహిళలు సుదూర ప్రాంతంలోని వ్యవసాయ బోర్ మోటార్లకు వద్దకు వెళ్లి తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి రవిని వివరణ కోరగా.. త్వరగా తాగునీటి సమస్య లేకున్నా కొంతమంది కావాలని సమస్యను సృష్టిస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్న బోరు మోటార్కు మరమ్మతులు చేయడం లేదని ఆరోపించడం విచారకరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment