డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజవుతోన్న ఇన్‌స్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఎప్పటినుంచంటే? | The Latest Thriller Movie Rape D Directly Released In OTT From This Date | Sakshi
Sakshi News home page

నేరుగా ఓటీటీకి టాలీవుడ్ క్ర‍్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Mon, Aug 12 2024 6:55 AM | Last Updated on Mon, Aug 12 2024 8:34 AM

The Latest Thriller Movie Rape D Directly Released In OTT From This Date

విశ్వ కార్తికేయ, కారుణ్య చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన లేటేస్ట్‌ క్రైమ్ థ్రిల్లర్‌ మూవీ 'రేప్ డీ'. ఈ మూవీకి రవి శర్మ దర్శకత్వం వహించారు. టాలెంట్ కెఫె ప్రొడక్షన్ బ్యానర్‌పై దేవీ మేరేటీ నిర్మించారు. సాధ్వి, ప్రణవి సమర్పణలో వైవీ రమణ మూర్తి, యశ్వంత్ తోట సహ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రానికి.. వికాస్ కురిమెల్ల సంగీతాన్ని సమకూర్చారు.

ఈ చిత్రాన్ని పూర్తిగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్‌లో తెరకెక్కించారు. ఈ మూవీని నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఆగస్ట్ 10 నుంచే రెంటల్ విధానంలో బీసీఐనీట్‌ (BCI neet) అనే యాప్‌లో అందుబాటులో ఉంది.  అయితే ఈ చిత్రం ఆగస్ట్ 24 నుంచి మరో ఓటీటీ సంస్థలోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఏ ఓటీటీ అనేది మాత్రం వివరాలు తెలియరాలేదు. ఈ మూవీలో వంశీ ఆలూర్, నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, అమిక్ష పవార్, వశిష్ట చౌదరి, కిరిటీ దామరాజు, అనుపమ స్వాతి కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement