Published
Sat, Oct 21 2023 8:57 PM
| Last Updated on Sat, Oct 21 2023 9:16 PM
'పలాస' ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా 'నరకాసుర'. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
తాజాగా 'నరకాసుర' నుంచి 'గ్రీవము యందున' అనే లిరికల్ పాటని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశాడు. పాట చాలా బాగుందని మెచ్చుకున్నాడు. చిత్రబృందానికి బెస్ట్ విషెస్ చెప్పాడు. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను స్టార్ సింగర్ శంకర్ మహదేవన్ పాడారు. పరమ శివుడిని ప్రశ్నిస్తూ సాగుతుందీ పాట. శివభక్తుల గెటప్స్లో ఆధ్యాత్మిక భావన కలిగించేలా ఈ పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాట, సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టీమ్ భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment