ఎస్పీ బాలు గొంతు రీక్రియేట్‌.. మండిపడ్డ ఎస్పీ చరణ్‌ | SP Balu Son SP Charan Sends Legal Notice To Keedaa Cola Movie Makers, Know Reason Inside - Sakshi
Sakshi News home page

కీడాకోలా యూనిట్‌పై ఎస్పీ చరణ్‌ ఫైర్‌.. క్షమాపణ చెప్పాల్సిందేనంటూ..

Published Fri, Feb 16 2024 1:53 PM | Last Updated on Fri, Feb 16 2024 3:56 PM

SP Balu Son SP Charan Sends Legal Notice To Keedaa Cola Movie Makers, Know Reason Inside - Sakshi

కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి తీసుకోకుండా ఇలా ఆయన గొంతును రీక్రియేట్‌ చేయడం మాకు బాధ కలిగించింది. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చే

దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్‌ ఎస్పీ చరణ్‌ 'కీడా కోలా' చిత్రయూనిట్‌కు నోటీసులు పంపాడు. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాయంతో రీక్రియేట్‌ చేసినందుకుగానూ సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్‌తో పాటు సినిమా యూనిట్‌కు జనవరి 18న నోటీసులు పంపినట్లు తెలిపాడు. ఆయన గొంతును అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాలని, నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశాడు. 

కాగా తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించిన కీడాకోలా మూవీ గతేడాది రిలీజైంది. ఇందులో ఓ సన్నివేశంలో స్వాతిలో ముత్యమంత అనే పాట బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏఐ సాయంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును రీక్రియేట్‌ చేశారు. దీనిపై ఎస్పీ చరణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఆయన మాట్లాడుతూ.. 'నాన్న చనిపోయినా ఆయన గొంతుకు ఇంకా జీవం పోసిన టెక్నాలజీ శక్తి సామర్థ్యాలను మేము స్వాగతిస్తున్నాం. కానీ కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి తీసుకోకుండా ఇలా ఆయన గొంతును రీక్రియేట్‌ చేయడం మాకు బాధ కలిగించింది. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరి కాదు' అని ఎస్పీ చరణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చదవండి: ఇంటర్వ్యూ చేసింది.. ప్రేమలో పడింది.. త్వరలోనే ఏడడుగులు వేయనున్న హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement