ఏటూరునాగారం: పౌష్టికాహారం తీసుకుంటేనే మహిళలు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారని ఏటూరునాగారం ఐసీడీఎస్ సీడీపీఓ ప్రేమలత అన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీపీఓ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్య రక్షణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గర్భిణులు బలమైన ఆహారం తీసుకున్నప్పుడే వారు ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిస్తారని తెలిపారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రేణుక మాట్లాడుతూ మహిళలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ ఫాతిమా, నవీన్, వెంకటయ్య, జ్యోతి, జీవవేణి, సుమలత, భావన పాల్గొన్నారు.
గర్భిణులు, బాలింతలు
పౌష్టికాహారం తీసుకోవాలి
కన్నాయిగూడెం: గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సీడీపీఓ ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో వైద్యులు గిరి ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తక్కువ బరువు ఉన్న పిల్లలకు, బాలింతలకు హెల్త్ చెకప్ చేశారు. అనంతరం ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాలింతలు, పిల్లలు, గర్భిణులు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చన్నారు. పౌష్టికాహారం తీసుకోకుంటే పిల్లల్లో ఎదుగుదల లోపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు పుష్పలత, శ్రీవిద్య, ఏఎన్ఎం కవిత, ఆశ వర్కర్లు, అంగన్ వాడీ టీచర్ర్లు పాల్గొన్నారు.
సీడీపీఓ ప్రేమలత
Comments
Please login to add a commentAdd a comment