ములుగు రూరల్: వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని అటవీశాఖ డివిజనల్ అధికారి డోలి శంకర్ అన్నారు. మండల పరిధిలోని దేవగిరిపట్నంలో అడవి పందులకు విద్యుత్ తీగలు అమర్చి వేటాడిన వేటగాళ్లను గురువారం పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవగిరిపట్నంకు చెందిన కేలోత్ బాలు, భూక్య సురేష్లు పత్తి చేను చుట్టూ విద్యుత్ తీగలు అమర్చడంతో రెండు అడవి పందులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయని తెలిపారు. వాటిని గ్రామ శివా రులో కాలుస్తుండగా వెళ్లి పట్టుకున్నామన్నారు. వేట కు ఉపయోగించిన విద్యుత్ వైర్లు, బైండింగ్ వైరు, కత్తిని స్వాధీనం చేసుకొని వేటగాళ్లపై కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ జాన్, బీట్ ఆఫీసర్ శివకృష్ణ, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment