గోవిందరావుపేట: ఎయిడ్స్పై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వైఆర్జీ కేర్ లింక్ స్కీం సంస్థ సీపీఎం జ్యోతి అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఎయిడ్స్పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఐవీ నాలుగు విధాలుగా మానవులకు సోకుతుందన్నారు. గర్భిణులు తప్పని సరిగా హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్ఐవీ పరీక్షలు ఉచితంగా చేసి రిపోర్టులను గోప్యంగా ఉంచుతారని వివరించారు. గర్భిణులకు హెచ్ఐవీ సోకితే పుట్టబోయే బిడ్డకు రాకుండా మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత, ఐసీటీసీ కౌన్సిలర్ కుమార్సింగ్, లింక్ వర్కర్ కిషన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment