నడిగడ్డలోని బంగ్లా రాజకీయాలు అందరికీ తెలుసు. పొద్దున చెరొకవైపు ఉన్న వారు.. రాత్రయ్యే సరికి ఒకచోటికి చేరుతారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయి. అదే బంగ్లా రాజకీయం ఈ ప్రాంతంలో నడుస్తోంది. అదే బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టాలి. కృష్ణా, తుంగభద్ర నది మధ్యలో ఉన్న నడిగడ్డ పౌరుషానికి, పోరాటానికి పెట్టింది పేరు. నడిగడ్డ బిడ్డలు ఎవరికై న మాట ఇస్తే తల తెగి కిందపడ్డా సరే ఆ మాట నుంచి ఒక్క అడుగు వెనుకేయరు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట కోసం నిలబడతారు. 70 ఏళ్ల తర్వాత మన పాలమూరుకు తెలంగాణకు నాయక్వతం వహించే అవకాశం వచ్చింది. మన ప్రాంతంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ప్రధానంగా గట్టు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్ ఆధునికీకరణ, ఎరవ్రల్లి చౌరస్తా నుంచి రాయచూరు వరకు నాలుగు లైన్లు, పాలమూరు–రంగారెడ్డి పూర్తి చేసుకోవడానికి మీరందరూ కాంగ్రెస్కు అండగా ఉండాలి. నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిని గెలిపించాలి. మీరందరూ డిసెంబర్లో కేసీఆర్ను ఓడించి పని అయిపోయిందని అనుకుంటున్నారు. డిసెంబర్లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్. ఈ నెల 13న ఫైనల్స్ తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య జరుగుతున్నాయి. గుజరాత్ను ఓడించి తెలంగాణను గెలిపించుకుందాం.
– రేవంత్రెడ్డి, ముఖ్యమంత్రి