రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి | Sakshi
Sakshi News home page

రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి

Published Thu, May 9 2024 6:35 AM

-

పెన్‌పహాడ్‌: రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని కేవీకే మృత్తిక శాస్త్రవేత్త ఎ.కిరణ్‌ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని లింగాల గ్రామంలో భూసార పరీక్షకు మట్టి నమూనా సేకరించే విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి ప్రతి రైతు తమ భూమి మట్టి నమూనాను సేకరించి భూసార పరీక్ష చేయించుకొని దానికి అనుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు. ఎండాకాలం తొలకరి వర్షాలకు లోతైన వేసవి దుక్కులు చేసుకొని పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే భూసారం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేవీకే సిబ్బంది బచ్చు వెంకటేశ్వర్లు, రైతులు జి.సుధాకర్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement