
AP Elections Political Latest Updates Telugu
07:14 PM, Mar 12th, 2024
ప.గో.జిల్లా:
భీమవరంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగింపు
- టీడీపీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ శివరామరాజు
- సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం
- టీడీపీ పార్టీ తనను గుర్తించలేదని ఆవేధన వ్యక్తం చేసిన శివరామరాజు.
- శివరామరాజు కార్యాలయం వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించిన అనుచరులు
06:42 PM, Mar 12th, 2024
గీతాంజలి చావు వెనక ఉన్నది లోకేష్: ఎంపీ నందిగాం సురేష్
- లోకేష్.. చంద్రబాబు డైరెక్షన్లో ఉన్నారు
- నా చిన్నప్పుడు మా చెల్లి చనిపోయింది
- ఇప్పటికి ఆ వయస్సు. వాళ్ళు ఎవరు కనిపించినా చెల్లి అని పిలుస్తాను
- ఒళ్ళు కొవ్వెక్కి, మదంతో వాగుతున్నారో అందరిని 24 ఎన్నికల లోపు మేము ఏంటో చూపిస్తాం
- కొంత మందికి గుర్తించాం.. మరికొంత మందిని గుర్తిస్తున్నాం.. అందరిని శిక్షిస్తాం
- గీతాంజలి చనిపోయి మంటల్లో కాలుతుంటే ఆ మంటల్లో చలి కాచుకొంటున్నరు
- మీరు నిజంగా మగాళ్ళు అయితే ఒరిజినల్ అకౌంట్లతో రండి
- మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు వున్నారు.. వాళ్ళు చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది
- గీతాంజలి ఆత్మ శాంతించాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం
- జై జగన్ అని ఒక్క కామెంట్ పెడితే.. వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు
- లోకేష్ మీ నాన్నకి 75 ఏళ్ళు.. తర్వాత నిన్ను ఎవరు కాపాడలేరు..
- ఐ టీడీపీ కుక్కలు పెదవాళ్ళ పై పడి హింసిస్తున్నరు
- ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం కూడా తెలీదు
- రానున్న రోజుల్లో అందరిపై చర్యలు ఉంటాయి
- లోకేష్ని ఎఫ్ఐఆర్లో పెడతాం
06:32 PM, Mar 12th, 2024
ఐ టీడీపీ వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు: ఎమ్మెల్సీ పోతుల సునీతా
- రాష్ట్రములో టీడీపీకి పుట్టగతులు ఉండవు..
- మహిళలు మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలి..
- గీతాంజలి చావుకు కారణమైనవారు సభ్య సమాజంలో తలదించాల్సిందే
- గీతాంజలి కుటుంబానికి మనం అందరం అండగా నిలవాలి
- మహిళల రక్షణకు పెద్దపీటవేసే జగన్మోహన్ రెడ్డి ప్రతి సచివాలయంలో ఒక మహిళ పోలీస్ని ఏర్పాటు చేశాం
05:15 PM, Mar 12th, 2024
విజయవాడ
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు
- పచ్చగా ఉండే టీడీపీ కొంప కూల్చడానికే బీజేపీ పొత్తు
- రెండో మూడో ఎంపీ సీట్లు ఇస్తా అన్న చంద్రబాబు ను ఎక్కువ సిట్లకు ఒప్పించారు
- తెలుగు ప్రజల మొట్టమొదటి ద్రోహి బీజేపీ
- అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిగా చంద్రబాబు బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు
- తెలుగు ప్రజలను ఖూనీ చేసిన బద్మాష్లు ఆ ముగ్గురు
04:30 PM, Mar 12th, 2024
జగన్ ప్రభుత్వంలో 14వేల కోట్లతో విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెచ్చారు: ఎంపీ కేశినేని నాని
- నాడు నేడు ద్వారా పాఠశాల రూపు రేఖలు మార్చారు
- ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్. మీడియం ప్రవేశ పెట్టిన ఘనత జగన్ కే దక్కుతుంది
- విద్య, వైద్యం కోసం ఎన్నో సంస్కరణలను జగన్ ప్రభుత్వంలో తీసుకువచ్చారు
- ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది:
- విద్యార్థుల దశ నుంచే స్టార్ట్ ఆప్ కంపెనీ లకు నాంది పలకాలి
04:20 PM, Mar 12th, 2024
నిండు ప్రాణాన్ని టీడీపీ, జనసేన మూకలు బలి తీసుకున్నాయి: ఎమ్మెల్సీ పోతుల సునీత
- తన కుటుంబానికి నాలుగు పథకాలు వచ్చాయని సంతోషంగా చెపితే.. టార్గెట్ చేసి చంపేశారు..
- సమాజంలో టీడీపీ, జనసేన వారిని మృగాలుగా చూడాలి.
- వారు సోషల్ మీడియాని నడిపేది అమాయకులని బలి తీసుకోవటానికా?
- దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
04:00 PM, Mar 12th, 2024
టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై మండలి బుద్ధప్రసాద్ ఆవేదన
- అవనిగడ్డ టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డ బుద్ధప్రసాద్.
- పొత్తులో సీటు జనసేనకు కేటాయించే అవకాశం.
- అవనిగడ్డ సీటు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న టీడీపీ.
- ఇప్పటికే చంద్రబాబుకు తీర్మానం చేసి పంపించిన అవనిగడ్డ టీడీపీ నాయకులు.
- బుద్ధప్రసాద్,టీడీపీ నాయకుల తీర్మానాన్ని పక్కన పెట్టేసిన చంద్రబాబు.
- అధిష్టానం తీరుపై బుద్ధప్రసాద్ అసహనం .
03:40 PM, Mar 12th, 2024
విజయవాడ
చంద్రబాబు పై ఒరిజినల్ బీజేపీ నేతల అసంతృప్తి
- చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి ఒరిజినల్ బీజేపీ నేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపాటు
- పొత్తుల పంచాయితీలో రెండుగా విడిపోయిన ఏపి బీజేపీ
- పొత్తులపై మరోసారి పునర్ సమీక్షించాలంటూ జాతీయ నాయకత్వం అపాయింట్మెంట్ కోరిన ఏపి బీజేపీ సీనియర్లు
- బీజేపీ కి వెన్నుపోటు పొడిచేలా సీట్ల పంపకాలు జరిగాయి అంటున్న జాతీయ ,రాష్ట్ర నేతలు
- కేంద్ర పెద్దలను కలిసే యోచనలో సత్య కుమార్,విష్ణు వర్ధన్ రెడ్డి, జివియల్ , సోము వీర్రాజు తొ పాటు 30 మంది బీజేపి అగ్ర నేతలు
- వలస నేతలకు టికెట్లు ఇచ్చి పార్టీ నేతలకు అన్యాయం చేయోద్దని కోరుతున్న బీజేపీ నేతలు
- ఓడిపోయిన నేతలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరుతున్న బీజేపీలో ఒక వర్గం నేతలు
- సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక లో బీజేపీ ఒరిజినల్ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని కోరనున్న నేతలు
03:39 PM, Mar 12th, 2024
విశాఖ:
పవన్ తీరుపై జనసేన నేతలు అసంతృప్తి
- 24 నుంచి 21 సీట్లుకు తగ్గడంపై ఆగ్రహం
- పవన్ స్వార్థం కోసం ఇంకా ఎంతమంది బలి కావాలని ఆవేదన
- నాయకుడు అనే వాడు సీట్లు ఆదనంగా అడగాలి
- ఉన్న సీట్లును వదులుకునే వాడిని నాయకుడు అనరు.
- పవన్ తీరుతో 25 మంది సీట్లను కోల్పోవలసి వచ్చింది
- చంద్రబాబును నాలుగైదు సీట్లు అదనంగా ఎందుకు అడగలేకపోతున్నారు
- మొదట టీడీపీ, ఇప్పుడు బీజేపీ కోసం జనసేన సీట్లు కోత పెడతారా
- పవన్ కళ్యాణ్ తీరుతో పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుంది
తాడేపల్లి :
03:09 PM, Mar 12th, 2024
ప్రభుత్వం సొంత ఇంటి కల నెరవేరింది అని గీతాంజలి చెప్పడం శాపంగా మారింది: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
- మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం
- గీతాంజలి మరణంతో ఆమె కుటుంబం రోడ్డున పడింది
- టీడీపీ,జనసేన సోషల్ మీడియా వేధింపులు కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చెసుకుంది..
- పవన్,లోకేష్, బాలకృష్ణ కు మహిళలంటే లోకువ
- టీడీపీ అంటేనే దుశ్శాసన పార్టీ, తెలుగు డెకాయిట్ పార్టీ..
- పేదలకు సొంత ఇల్లు ఇస్తుంటే దాన్ని శ్మశానం తో పోల్చింది టీడీపీ పార్టీనే.
- 79 లక్షల మహిళలకు జగన్ లబ్ది చేకూర్చారు..
- టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోలుగా మారాయి
- మహిళలు ఎవరూ భయపడవద్దు
- జగన్ అన్న తోడుగా ఉన్నాడు
- దిశ యాప్ను మహిళలంతా డౌన్లోడ్ చేసుకోవాలి
- ఎలాంటి ఇబ్బంది ఉన్నా దిశ యాప్ను వాడండి
- మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న టీడీపీ, జనసేన వాళ్ళని తరిమి కొట్టండి
- ఆ పార్టీలకు రాజకీయ మనుగడ లేకుండా చేయండి
02:35 PM, Mar 12th, 2024
తెనాలి:
గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల వెంకటలక్ష్మి..
- మేమున్నామంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన వెంకటలక్ష్మి
- పిల్లల భవిష్యత్తు కోసం అన్ని విధాలా చర్యలు తీసుకునే విధంగా సీఎం జగన్మోహన్రెడ్డితో మాట్లాడతామని హామీ
- మహిళ మీద ఎటువంటి ట్రోలింగ్లు అత్యంత హేయమైనవి
- ఎవరైతే ట్రోలింగ్స్ పాల్పడ్డారు వారిపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరాం - వెంకటలక్ష్మి
- ఏ ఒక్కరు గీతాంజలి లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు
- ఏ సమస్యలున్న కుటుంబ సభ్యుల తోటి లేదా పోలీస్ స్టేషన్లో లేదా మహిళా కమిషన్ దృష్టికి తీసుకుని రండి
- మహిళలపై ట్రోలింగ్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది
- మహిళలపై ట్రోల్లింగ్స్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాం
- ప్రభుత్వం వద్ద లబ్ధిపొందాం అని చెప్పడం ఐ టీడీపీ వాళ్ళు సహించలేకపోయారు
02:32 PM, Mar 12th, 2024
తాడేపల్లి :
గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణం: హోంమంత్రి తానేటి వనిత
- ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించాం
- కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా అక్కౌంట్స్ పై నిఘా పెట్టాం
- గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు
- జగన్ అన్న వలన తన కుటుంబానికి జరిగిన మేలు గురించే మాట్లాడింది
- అలాంటి సాధారణ గృహిణి మీద కూడా ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు
- ఇందుకు కారణమైన ఎవరినీ వదిలేదు
- ఇప్పటికే కేసు నమోదు చేశాం
- దోషుల సంగతి తేల్చుతాం
- మరో మహిళపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతాం
- గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ప్రకటిస్తున్నాం
01:51 PM, Mar 12th, 2024
చంద్రబాబు, పవన్, షర్మిలపై కొడాలి నాని ఫైర్
- నన్ను నమ్మి ఓటేయండని చెప్పిన పవన్.. చంద్రబాబును వదిలేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు
- మోదీని నానా బూతులు తిట్టింది చంద్రబాబు కాదా?
- ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా?
- పాచిపోయిన లడ్డూలిచ్చారన్నది పవన్ కాదా?
- నా తల్లిని దూషించారు.. టీడీపీ అంతం చూస్తానని పవన్ ప్రగల్భాలు పలికాడు
- రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయింది మీరంతా కలిశారు
- ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?
- పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?
- రైతులకు, మహిళలకు రుణమాఫీ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
- ఒకరిని ఒకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు
- సీఎం జగన్ను ఓడించడమే అన్ని పార్టీల ఆశయం
- పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు
- పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా
- ఈయన్ని నమ్ముకున్నవాళ్లందరికీ పవన్ ఏం చెప్తాడు
- జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు
- బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్
- చంద్రబాబుకు ఈ సారి 23 సీట్లు కూడా రావు
- షర్మిల ఎవరికోసం ప్రచారం చేస్తారు
- ఎవరు గెలవాలని షర్మిల కోరుకుంటున్నారు
- కాంగ్రెస్లో ఉండి బీజేపీలో ఉన్న చంద్రబాబును గెలిపించడానికి షర్మిల ప్రయత్నిస్తోంది
- మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్కు ఏం సంబంధం
- తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తుకురాలేదా?
- పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనీల్ మణిపూర్ వెళ్లాడా?
- రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మణిపూర్ వెళ్లారా?
- బీజేపీ క్రైస్తవులను ఊచకోత కోశారని మీరు చెబుతున్నారు
- నరేంద్రమోదీని ఏపీలో కాలు పెట్టనివ్వనన్నది చంద్రబాబు కాదా?
- బీజేపీతో కలిసి తప్పుచేశానన్న చంద్రబాబు సిగ్గులేకుండా మోదీతో ఎలా కలిశాడు?
- తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్టీఆర్ టీడీపీని పెట్టాడు
- చంద్రబాబు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టాడు
- ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకునేవాడు కూడా లేడు
- ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టింది
- ఆ పార్టీని హుస్సేన్ సాగర్లో కలిపేసి ఏపీకి వచ్చి సీఎం జగన్ని సాధించాలని చూస్తోంది
- కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు
- ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిస్పోజబుల్ పార్టీ
- డిపాజిట్లు కూడా రానోళ్లు 5 వేలు మహిళలకు ఇస్తారంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా..
01:34 PM, Mar 12th, 2024
పవన్ తన అన్న నాగబాబు కూడా సీటు ఇచ్చుకోలేకపోయారు: మంత్రి గుడివాడ అమర్నాథ్
- పవన్ కల్యాణ్ను అమాయకుడిని చేసి సీట్లు తగ్గించారు: మంత్రి గుడివాడ అమర్నాథ్
- కేఏ పాల్తో తప్ప అందరితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు
- రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయమని సీఎం జగన్ కోరుతున్నారు
- పొత్తులను చూసి ఓటేయమని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి
- ప్రజలే ఆలోచించాలి
- గతసారి కంటే ఈసారి ఇంకా అధికంగా సీట్లతో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ-టీడీపీ- జనసేన పార్టీలు ఏమి సమాధానం చెప్తాయి
01:32 PM, Mar 12th, 2024
గీతాంజలి మృతి చాలా దురదృష్టకరం: వాసిరెడ్డి పద్మ
- గీతాంజలి ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లా
- సోషల్ మీడియా సైకోలను విడిచిపెట్టకూడదు
- టీడీపీ, జనసేన కార్యకర్తల వేధింపులను ప్రభుత్వం, మహిళాలోకం సీరియస్గా తీసుకుంటుంది
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- ప్రభుత్వం నుంచి పొందిన మేలును చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా
- గీతాంజలి మృతి పై చంద్రబాబు, పవన్లు స్పందించాలి
- గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
11:47 AM, Mar 12th, 2024
గీతాంజలి కేసు: అజయ్పై చర్యలు తీసుకోవాల్సిందే
- ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో నారా లోకేష్ ప్రధాన అనుచరుడు సజ్జా అజయ్ దిష్టిబొమ్మ దహనం
- గీతాంజలిపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్ పెట్టిన అజయ్
- తీవ్ర మనోవేదనకు గురై బలవన్మరణ ప్రయత్నం చేసిన గీతాంజలి
- గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూత
- అజయ్పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగం
11:23 AM, Mar 12th, 2024
ఇంకా 73 రోజుల్లో మళ్లీ సీఎంగా జగన్: YSRCP
- తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటు
- 'జగన్ అనే నేను..' పేరుతో ఏర్పాటు చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం
- ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణస్వీకారం చేసే రోజును తెలియచేస్తూ కౌంట్ డౌన్
- మరో 73 రోజుల్లో సీఎంగా రెండోసారి జగన్ ప్రమాణస్వీకారం చేస్తారంటూ డిజిటల్ బోర్డు ఏర్పాటు
11:00 AM, Mar 12th, 2024
నిడదవోలులో జనసేనకు సహకరించం: టీడీపీ కార్యకర్తలు
- నిడదవోలు నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య రాజుకున్న చిచ్చు
- పొత్తులో భాగంగా జనసేన కందుల దుర్గేష్కు టికెట్ కేటాయింపు
- సోమవారం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
- దుర్గేష్ నిడదవోలు టికెట్ కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేషా రావు వర్గం ఆగ్రహం
- టికెట్ శేషారావుకే ఇవ్వాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్
- జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు సహకరించేది లేదని ప్రకటనలు
- ఉమ్మడి అభ్యర్థిగా నేడు నిడదవోలు వెళ్తున్న కందుల దుర్గేష్
- ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే రాజకీయ వర్గాల చర్చ
10:48 AM, Mar 12th, 2024
గీతాంజలి ఘటనపై మంత్రి రోజా ఆవేదన
- రాష్ట్రంలో నిన్న విషాద ఘటన చోటు చేసుకొంది
- ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాని చూపించి మీడియా ముందు సంతోషంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పా?
- టీడీపీ, జనసేన వాళ్లు ఆ మహిళపై దారణంగా మాట్లాడారు
- ఎవరైతే గీతాంజలి మరణానికి కారణం అయ్యారో వారిని కఠినంగా శిక్షించాలి.
- అమె పిల్లలు తల్లి లేని చిన్నారులుగా మారారు
- ఐ టీడీపీ, జనసేన హద్దుల్లో ఉంటే బాగుంటుంది,
- మహిళలను చులకనగా మాట్లాడటం.. వల్గర్ గా మాట్లాడటం మంచిది కాదు
- ఈ ఎన్నికలలో మహిళలపై అమానుషంగా మాట్లాడిన వాళ్లను శిక్షించాలి.. పచ్చపార్టీలను తరిమికొట్టాలి
- నారా లోకేష్ వార్డు మెంబర్ గా కూడా మాట్లాడలేరు..
- నారా లొకేష్ మాటలు పట్టించుకోం
- గెలవలేమన్న స్థాయికి వచ్చారు కావునే అందరితో పొత్తుకు తహతహలాడుతున్నారు.
మంత్రి ఆర్కే రోజా కామెంట్లు
10:02 AM, Mar 12th, 2024
జగన్కు అండగా జనం.. వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకల్లో నేతలు
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మండలి చిఫ్ విప్ మాట్లాడుతూ..
- చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ
- అంతేతప్ప ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం ప్రేమ లేదు
- ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని జగన్ అంటున్నారు
- నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదు
- తన పాదయాత్రలో జనం చెప్పినవన్నీ జగన్ నోట్ చేసుకున్నారు
- ప్రజా అవసరాల మీదనే జగన్ పాదయాత్ర చేశారు
- జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు
- ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్
- ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలి
లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్..
- జగన్ అంటేనే విశ్వసనీయత
- చెప్పిన మాట ప్రకారం మ్యానిఫెస్టో అమలు చేదిన ఘనత జగన్ ది
మంత్రి జోగి రమేష్ కామెంట్స్..
- జగన్ లాంటి సీఎం మాక్కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు
- చరిత్ర సృష్టించటం జగన్ కే సాధ్యం
- కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్ ని ఓడించి తీరుతాం
- గుంటనక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను వైసీపి కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
- ఈ ఐదేళ్లలో ఎన్నో మేళ్లు చేసినందునే ధైర్యంగా ఓటు అడగుతున్నాం
- అన్ని వర్గాల ప్రజలు మన వెంట నడుస్తున్నారు
- వారికి అండగా నిలవాలంటే మళ్ళీ జగన్ని సీఎం చేసుకోవాలి
- వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షరాలు కామెంట్స్..
- గత 13 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి జగన్
- రైతులు, కార్మికులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలకు జగన్ అండగా నిలిచారు
హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే కామెంట్స్
- జగన్ ఉంటేనే అందరికీ మేలు జరుగుతాయి
- ఆయన్ని అణచివేయాలని ఎంతోమంది చూశారు
- ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొని జగన్ విజేతగా నిలిచారు
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ..
- పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు
- అన్నిటినీ ఎదుర్కొని అధికారం సాధించారు
- ఈ ఐదేళ్లూ చెప్పిన అన్ని హామీలూ నెరవేర్చారు
- జగన్ కు ఉన్న ప్రజా బలం ముందు ప్రతిపక్షాలు కిందామీద పడుతున్నాయి
- అర్ధరాత్రి కూడా చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల ముందు పడిగాపులు కాశారు
- ఇలాంటి వారు ప్రజలకు ఏం చేస్తారు?
- మోసాలలో పుట్టి మోసాలు చేసే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు
08:49 AM, Mar 12th, 2024
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెలీలపై వేటు
- ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యపై వేటు
- జనసేనలో చేరిన వంశీకృష్ణ, టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్యపై వేటు
- వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికై.. ఆ రెండు పార్టీలోకి ఫిరాయించిన ఈ ఇద్దరు
- మండలి కార్యదర్శికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చి.. విచారించిన శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు
- సమగ్ర విచారణ అనంతరం వేటు వేసిన మండలి చైర్మన్ మోషేన్ రాజు
08:06 AM, Mar 12th, 2024
చంద్రబాబు జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు: కొడాలి నాని
- చంద్రబాబు తనపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు
- రానున్న ఎన్నికల్లో ఎలాగూ అధికారంలోకి రానని తెలుసుకున్న బాబు తనపై ఉన్న కేసుల్లో అరెస్టు కాకుండా తప్పించుకునేందుకే..
- ముందుగానే బీజేపీతో పొత్తు పెట్టుకుని కొత్త డ్రామాలకు తేరలేపారు
- సిగ్గు, శరం లేకుండా ఈ వయసులో కూడా చంద్రబాబు మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులు
- ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా అందుబాటులో లేకపోయినా వారి పీఏలతో పొత్తు కుదుర్చుకున్నారు
- అధికారం కోసం చంద్రబాబు ఎన్ని మోసాలైనా చేస్తారు
- ఎవరి బూట్లు అయినా నాకేందుకు వెనుకాడరు
- అధికారంలో ఉన్నప్పుడు నల్లచొక్కా వేసుకుని రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని పోరాటాలు చేసిన వ్యక్తి చంద్రబాబు కాదా..
- భార్య, పిల్లలు లేని మోదీ దేశాన్ని ఏం ఉద్దరిస్తాడని, బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్తో కలసి పోటీ చేస్తున్నానని 2019 ఎన్నికల్లో చెప్పింది నిజం కాదా?
- మళ్లీ ఇప్పుడు మోదీ గొప్పవాడు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని బాబు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు
- వెయ్యిమంది మోదీలు, లక్షమంది బాబులు, కోటి మంది పవన్కళ్యాణ్లు కలిసి వచ్చిన ఉపయోగం ఉండదు
- దేవుడి ఆశీస్సులు, ప్రజాబలంతో సీఎం వైఎస్ జగన్ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసి మరోసారి సీఎం కావడం తథ్యం
07:37 AM, Mar 12th, 2024
నేడు వైఎస్సార్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవం
- పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండావిష్కరించనున్న పార్టీ నేతలు
- అనంతరం సేవా కార్యక్రమాలు నిర్వహణ
- రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
07:33 AM, Mar 12th, 2024
ఈ ఎన్నికలు.. టీడీపీకి చావుబతుకుల సమస్య: వసంత కృష్ణప్రసాద్
- మైలవరం టీడీపీ సీటు పై వీడని సందిగ్ధత
- కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన వసంత కృష్ణప్రసాద్
- ఉమా సైలెంట్ అయినా.. టిక్కెట్ కోసం ట్రై చేస్తున్న బొమ్మసాని సుబ్బారావు
- తాజాగా చర్చనీయాంశంగా మారిన కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు
- నేనే మైలవరం అభ్యర్ధి అనుకోవద్దు: వసంత కృష్ణప్రసాద్
- నాకు మద్దతివ్వండి...నాకు టిక్కెట్ ఇస్తేనే సహకరించండని నేను అనడం లేదు : వసంత కృష్ణప్రసాద్
- నేను,దేవినేని ఉమా కాకుండా మూడో వ్యక్తి వచ్చినా అంతా కలిసి పనిచేద్దాం : వసంత కృష్ణప్రసాద్
- అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా రేపు ప్రచార వాహనం పై అంతే ధీటుగా పని చేస్తా: వసంత కృష్ణప్రసాద్
- నేను తెలుగుదేశం పార్టీ లో చేరి మీలో ఒకడిగా మీతో కలిసి నడవడానికి మీ దగ్గరకు వచ్చాను: వసంత కృష్ణప్రసాద్
- నాకు, దేవినేని ఉమాకు మధ్య 20 సంవత్సరాల నుండి రాజకీయ విభేదాలు ఉన్నాయి: వసంత కృష్ణప్రసాద్
- 2024 ఎన్నికలు చాలా కీలకం, తెలుగుదేశం పార్టీకి చావు బ్రతుకుల సమస్య: వసంత కృష్ణప్రసాద్
07:24 AM, Mar 12th, 2024
వీరమహిళపై టీడీపీ నేతల దాడి.. పవన్ స్పందన నిల్
- జనసేన మహిళా నేతపై దాడి
- జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై దాడికి పాల్పడ్డ పచ్చ తమ్ముళ్లు
- ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరివారిపాలెం కనపర్తిల వద్ద ఘటన
- దాడికి పాల్పడింది ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ అనుచరులే
- కులంపేరుతో దూషించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు అరుణ
- ఛాతీ మీద చెయ్యేసి గుండెల మీద బలంగా గుద్దినట్లు చెబుతున్న బాధితురాలు
- దాడిని అడ్డుకోబోయిన మరో జనసేన నేతపైనా తల పగిలేలా దాడి
- పార్టీ అధినేత పవన్కళ్యాణ్కు ఫిర్యాదు చేసినా స్పందన నిల్
- ఎన్నికలయ్యాక చూద్దాంలే పార్టీ నేతలతో కబురు పంపినట్లు సమాచారం!
07:24 AM, Mar 12th, 2024
మరోసారి చంద్రబాబుకి పవన్ దాసోహం
- 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ
- బీజేపీకి సీట్ల సర్దుబాటుకు జనసేన అసెంబ్లీ స్థానాల్లో 3 తగ్గించిన బాబు
- బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు
- టీడీపీకి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు
07:03 AM, Mar 12th, 2024
‘సిద్ధం’ సభలతో విపక్షాల్లో వణుకు
- మేదరమెట్ల సభ జనసంద్రాన్ని ముందే ఊహించి చీప్ట్రిక్స్కు బరితెగించిన పచ్చ ముఠా
- ఉదయం ఫొటోలు తీసుకుని జనం మొహం చాటేశారంటూ పైశాచికానందం
- అందుకే 45 నిముషాల ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్నారంటూ విచిత్ర విమర్శలు
- వాటిని అందిపుచ్చుకుని ఊగిపోయిన ఎల్లో మీడియా
- ఈ సభను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించిన 1.50 కోట్ల మంది
- ఘోర పరాజయం భయంతోనే చౌకబారు ఆరోపణలంటూ ఏకిపారేస్తున్న రాజకీయ విశ్లేషకులు
6:59 AM, Mar 12th, 2024
టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మ బలి
- జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంతో చెప్పటమే ఆమె నేరం
- అమ్మ ఒడి, చేయూత, పింఛన్తో కుటుంబం బాగుపడిందనటమే తప్పయ్యింది
- ఓ యూట్యూబ్ చానల్కు సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి
- సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ, జనసేన మూకలు
- ఆమెను దూషిస్తూ... వేషభాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్
- మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం.. ఆనక ఆస్పత్రిలో మృతి
- సీఎం సూచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే
- బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలను ఆదుకుంటామని భరోసా
- సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ గీతాంజలి ట్రెండింగ్
జగనన్న నా సొంతింటి కల నెరవేర్చారు అని చెప్పడమే గీతాంజలి చేసిన పాపమా? @JaiTDP, @JanaSenaParty ట్రోలింగ్తో చంపేశారు..!#JusticeForGeethanjali pic.twitter.com/NcOJ3pdL3d
— YSR Congress Party (@YSRCParty) March 11, 2024
6:42 AM, Mar 12th, 2024
చంద్రబాబు ట్వీట్.. రగిలిపోతున్న జనసేన
- బీజేపీ-టీడీపీ-జేఎస్పీ(జనసేన) పొత్తుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్
- టీడీపీకి 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్, జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్, బీజేపీకి 10 అసెంబ్లీ 2 పార్లమెంట్
- సీట్లను ఆయా పార్టీలే ప్రకటిస్తాయన్న బాబు
- జనసేనకు 24 సీట్లు అని ఇంతకు ముందు సంయుక్తంగా ప్రకటించిన చంద్రబాబు-పవన్
- పవన్ను మళ్లీ మోసం చేసిన బాబు!
- రగిలిపోతున్న జనసేన శ్రేణులు
- జనసేనలో అసంతృప్తి బయటపడే అవకాశం
విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్లింది 24తోనే, గాయత్రి మంత్రం 24 అక్షరాలు, అందుకే 24 సీట్లకు ఒప్పుకున్నా అని కాకమ్మ కధలు చెప్పి జనసైనికుల చెవిలో పువ్వులు పెట్టిన @PawanKalyan, ఇప్పుడు చంద్రబాబు 21 సీట్లు ముష్టేసాక ఏ కహాని చెబుతాడో? 🤭#PackageStarPK #TDPJSPCollapse https://t.co/M6wAM6VuSz
— YSR Congress Party (@YSRCParty) March 11, 2024
Comments
Please login to add a commentAdd a comment