సంతనూతలపాడు(చీమకుర్తి): వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు నాగార్జున అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని మంగమూరు, గుమ్మనంపాడు, ఎనికపాడు, బొడ్డువారిపాలెం, తక్కెళ్లపాడు, చిలకపాడు, మద్దూలూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేశారన్నారు. చంద్రబాబు మరోసారి మోసపూరిత వాగ్దానాలతో ముందుకు వస్తున్నారని, ఆ వాగ్దానాలను ఎవ్వరూ నమ్మవద్దన్నారు. జగనన్న ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు అమలు చేశారని కొనియాడారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి నన్ను, ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ను గెలిపించాలని కోరారు. తొలుత మంగమూరు నాయకుడు అబ్బూరి శంకరరావు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం గుమ్మలంపాడులో పర్యటించారు. సొసైటీ అధ్యక్షుడు బొక్కిసం శివరామయ్య ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జనసేన నుంచి 10 మంది మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, ఎంపీపీ విజయ, అబ్బూరి శంకర్రావు, సొసైటీ ప్రెసిడెంట్ దుంపా యలమందారెడ్డి, సీనియర్ నాయకులు బొల్లినేని కృష్ణయ్య, బొక్కిసం శివరామయ్య, తలారి కోటయ్య, సర్పంచ్ తలారి వెంకట్రావు, సర్పంచ్ ఆలూరు సుశీల, మద్దులూరు సర్పంచ్ శైలజ, అమరనాథ్ పాల్గొన్నారు.