దర్శి: వడ్డెరుల మద్దతు వైఎస్సార్ సీపీకేనని సంఘం జాతీయ అధ్యక్షుడు తన్నీరు ధర్మరాజు పేర్కొన్నారు. స్థానికంగా మంగళవారం జరిగిన వడ్డెరల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2004లో వైఎస్సార్ సీఎం అయిన వడ్డెరులను ఎన్నో ఉన్నత పదవులు కేటాయించారన్నారు. వడ్డెరలకు ఫైనాన్స్ ఫెడరేషన్, ఎమ్మెల్యే సీటు, హస్తకళ చైర్మన్, నాలుగు మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల్లో అవకాశాలు కల్పించారన్నారు. వడ్డెరల సామాజిక స్థితి, జీవన విధానాలను గమనించిన వైఎస్సార్..ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేబినేటిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడిడ్ వడ్డెరులకు ఎమ్మెల్సీ సీటు, మిర్చి యార్డు చైర్మన్గా రెండు పర్యాయాలు చేశారన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు రాజకీయంగా వడ్డెరలకు ఎలాంటి పదవులు ఇవ్వలేదన్నారు. 2014లో మాచర్ల స్థానానికి నామినేషన్ వేసుకోమని హామీ ఇచ్చి మోసం చేశాడన్నారు. ఇప్పుడు కూడా పుటపర్తి అసెంబ్లీ, హిందూపురం ఎంపీ స్థానాలు కేటాయిస్తామని చెప్పి చివరకు మోసం చేశాడని విమర్శించారు. వడ్డెరలను ఆదరిస్తున్న వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ డైరెకటర్లు మల్లె విమల, రామకృష్ణ, యనమల మాధవి, చందవరం ఎంపీటీసీ రాజు, వడ్డెర సంఘం నాయకులు చల్లా నారాయణరాజు, దేవండ్ల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.