దేశంలో మోదీ హవా నడుస్తోంది | Sakshi
Sakshi News home page

దేశంలో మోదీ హవా నడుస్తోంది

Published Wed, May 8 2024 9:55 AM

దేశంలో మోదీ హవా నడుస్తోంది

మీర్‌పేట: మీర్‌పేట కార్పొరేషన్‌ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ మమత ప్రవీణ్‌ తమ అనుచరులతో కలిసి మంగళవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం మోదీ హవా నడుస్తోందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు కాలం చెల్లిందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 12 నుంచి 15 ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. రెండు లక్షల మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరాములుయాదవ్‌, శంకర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ దేవేందర్‌రెడ్డి, నాయకులు నర్సింహ, నీలారవినాయక్‌, నాగరాజు పాల్గొన్నారు.

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement