అదనపు పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ | Sakshi
Sakshi News home page

అదనపు పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ

Published Tue, May 7 2024 6:20 PM

-

సంగారెడ్డి టౌన్‌: ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించిన అదనపు పోలింగ్‌ సిబ్బందికి ఈనెల 7, 8 తేదీలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ క్రాంతి వల్లూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జహీరాబాద్‌ లోక్‌సభ అన్ని నియోజకవర్గ కేంద్రాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీయూ(సర్క్యుట్‌ యూనిట్‌)లలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే అదనపు యూనిట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీ విజిల్‌, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1950కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పనితీరును పరిశీలించాలన్నారు.

జొన్నల కొనుగోలు కేంద్రం

ఏర్పాటు చేయాలి

సంగారెడ్డి టౌన్‌: జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి కోరారు. సోమవారం జిల్లా కార్యాలయంలో రైతులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎలాంటి పరిమితి లేకుండా జొన్నలు కొనాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు, పంట రుణమాఫీని వెంటనే అమలు చేయాలన్నారు. బ్యాంకుల ద్వారా పంట రుణాలను అందజేయాలన్నారు.

 
Advertisement
 
Advertisement