No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 7 2024 6:20 PM

-

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే సార్వత్రిక ఎన్నికలను కూడా ప్రశాంతంగా.. పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ చెన్నూరి రూపేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో గీత దాటితే వేటు తప్పదని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు, చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రెవెన్యూశాఖతో సమన్వయం చేసుకుని క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలను గుర్తిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు.

– సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

 
Advertisement
 
Advertisement