సంగారెడ్డి రూరల్/జహీరాబాద్ టౌన్/సదాశివపేట(సంగారెడ్డి)/నారాయణఖేడ్: భారత స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ 94వ వర్ధంతి వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సంగారెడ్డిలోని భగత్సింగ్ విగ్రహానికి ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు, జహీరాబాద్ టౌన్లోని శ్రామిక్ భవనంలో భగత్సింగ్ చిత్రపటానికి, నారాయణఖేడ్లోని రాజీవ్చౌక్లోని భగత్సింగ్ విగ్రహానికి సీపీఎం నాయకులు, సదాశివపేటలోని సిద్దాపూర్ కాలనీలో భగత్సింగ్,రాజ్గురు, సుఖ్దేవ్ చిత్రపటాలకు డీవైఎఫ్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.