కాంగ్రెస్‌ పాలనలోనే న్యాయం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలోనే న్యాయం

Published Fri, Aug 23 2024 10:48 AM | Last Updated on Fri, Aug 23 2024 10:48 AM

కాంగ్రెస్‌ పాలనలోనే న్యాయం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): కాంగ్రెస్‌ పాలనలోనే దళితులకు పూర్తి న్యాయం చేకూరుతుందని పార్టీ కౌన్సిలర్లు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్‌ కౌన్సిలర్లు విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో దళితులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. దళితులకు దళిత బంధు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా నిధులు నిర్వహించిన ఎర్రోళ్ల శ్రీనివాస్‌ దళితులకు ఏం చేశారని వారు ప్రశ్నించారు. సిద్దిపేటలో దళితులపై కేసులు నమోదైనప్పుడు కలెక్టర్‌తో మాట్లాడదామని పిలిస్తే.. నాటి మంత్రి హరీశ్‌రావు పర్మిషన్‌ లేకుండా సిద్దిపేటకు రానని శ్రీనివాస్‌ అన్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశారన్నారు. 2018లో కేసీఆర్‌ గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టి, కేవలం ఎన్నికల ముంగిట ప్రొసీడింగ్‌ కాపీలు మాత్రమే ఇచ్చారన్నారు. మూడెకరాల భూమిపై మాట తప్పిన పార్టీ బీఆర్‌ఎస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డబుల్‌ బెడ్రూంలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారాయన్నారు. ఇప్పటికి 700 వరకు డబల్‌ బెడ్రూంలు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులకు ఇవ్వకుండా కేవలం బీఆర్‌ఎస్‌ నాయకులకే కేటాయించడంతో, వీటిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్‌ డబుల్‌ బెడ్రూంలపై ప్రత్యేక దృష్టి సారించాలని వారు కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు రియాజ్‌, సాకి ఆనంద్‌, ఆలకుంట మహేందర్‌, ఎల్లం యాదవ్‌, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement