సామాజిక బాధ్యత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

సామాజిక బాధ్యత తప్పనిసరి

Published Fri, Aug 23 2024 10:48 AM | Last Updated on Fri, Aug 23 2024 10:48 AM

-

సిద్దిపేటకమాన్‌: న్యాయవాదులు వృత్తితో పాటు సామాజిక బాధ్యతలో ముందుండాలని ఇండియన్‌ లీగల్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి సాంసన్‌ పిలుపునిచ్చారు. సిద్దిపేట బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మంతూరి సత్యనారాయణ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఐఎల్‌పీఏ ఓబీసీ న్యాయవాదుల రాష్ట్ర సదస్సు వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే బీసీ న్యాయవాదుల సదస్సులో జిల్లా న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు నరేందర్‌, మహేష్‌, శ్రీనివాస్‌, కనకయ్య, సాయిబాబ, బాలయ్య, శ్రీశైలం, దేవునూరి రవిందర్‌, సిరికొండ మణి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement