నేటి నుంచి ఇంటింటి ఫీవర్‌ సర్వే | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటింటి ఫీవర్‌ సర్వే

Published Mon, Aug 26 2024 10:26 AM | Last Updated on Mon, Aug 26 2024 10:26 AM

-

జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్‌

సిద్దిపేటకమాన్‌: సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు జిల్లాలో సోమవారం నుంచి ఇంటింటి ఫీవర్‌ సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30వ తేదీ వరకు వైద్య సిబ్బంది ఇంటింటి ఫీవర్‌ సర్వే చేపడతారన్నారు. జ్వరం, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారిని గుర్తించి అవసరమైన మందులు అందజేస్తారన్నారు. వైద్య చికిత్స అవసరమైన వారికి ప్రభుత్వ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తామన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఫీవర్‌ సర్వే నిర్వహించి రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. సీజనల్‌ వ్యాధల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement